travellingwithKrishna

travellingwithKrishna spiritual content available here
like chaganti , and other gurus words and
life facts ,

🎻🌹🙏కలియుగ వరదుడు అయ్యప్ప....!!🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌿ఈ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయకపోయినా భగవంతుని నామస్మరణ చేసి తరించవచ్చని మన పెద...
04/12/2022

🎻🌹🙏కలియుగ వరదుడు అయ్యప్ప....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఈ కలియుగంలో యజ్ఞయాగాదులు చేయకపోయినా భగవంతుని నామస్మరణ చేసి తరించవచ్చని మన పెద్దలు చెప్పేరు.

🌸భగవన్నామ స్మరణ చేయమని చెప్పడం సులువే కానీ ఏకాగ్రతతో, భక్తి తన్మయత్వంతో చేయడం అంత సులువైన పనికాదు.

🌿 మానవాళిలో భక్తితత్పరతను పెంచడానికి మన మహర్షులు పూజలు, భజనలు చేయమని, తరచు దేవాలయాలకు, పుణ్యతీర్ధాలకు వెళ్ళమని ఆదేశించారు.

🌸 దైవభక్తిని పెంపొదించడానికి కొన్ని రకాల దీక్షలను ప్రతిపాదించి, భక్తితో దీక్ష చేసి యాత్రలకు వెళ్ళమన్నారు.

🌿 దీక్షాకాలంలో పాటించవలసిన కొన్ని నియమాలను చెప్పి భక్తి శ్రద్ధలతో కనీసం మండలకాలం (41 రోజులు) దీక్ష చేసి యాత్రకు వెళ్ళి రమ్మన్నారు.

🌸దీక్షలన్నిటిలో స్వామి అయ్యప్ప దీక్ష తలమానికమైనది. దీక్షా నియమావళి ఎంతో పవిత్రమైనదే కాకుండా ఆరోగ్యదాయకమైనది.

🌿 భక్తిచింతనతో పరవశించిపోతారు. అయ్యప్ప స్వామి దీక్ష చేయదలచిన వారు ముందుగా గురుస్వామి ద్వారా మెడలో తులసీమాలను కానీ రుద్రాక్ష మాలను కానీ ధరిస్తారు.

🌸 మాలకు అయ్యప్పస్వామి ప్రతిమ వున్న బిళ్ల తగిలించడం వలన దీనిని ముద్రమాలగా వ్యవహరిస్తారు. నలుపు లేక కాషాయం రంగు దుస్తులను దీక్షా వస్త్రాలుగా స్వీకరించి

🌿 స్వామివారి ఎదుట దీక్షాకాలం 41 రోజులు నియమ నిష్టలు భక్తిశ్రద్ధలతో పాటించి ఇరుముడితో శబరిమల యాత్రకు వస్తామని ప్రతిజ్ఞచేసి మొక్కుకుంటారు.

🌸 మాలా ధారణ జరిగినది లగాయతూ ముఖ క్షవరం చేసుకోరు. తెల్లవారుజామున, సాయంత్రం పూట చన్నీటితో స్నానం చేసి నుదుట విభూది, చందనం, కుంకుమ అలంకరించుకొని దీపారాధన చేసి స్వామివారికి పూజ చేసి శరణాలు చెప్పుకుంటారు.

🌿 కాళ్ళకు చెప్పులు ధరించరు. పూజానంతరం ఏదో ఒక దేవాలయాన్ని దర్శిస్తారు. లేకుంటే భజన కార్యక్రమాలెక్కడున్నా వెళ్ళి భజనలో పాల్గొంటారు.

🌸స్వామి దీక్ష చేసేవారు అసలిత బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై దిండులేకుండా చాపపైనే నిద్రిస్తారు. ఒక పూట భోజనం, రాత్రివేళ అల్పాహారం స్వీకరించి నిత్యం దైవనామ స్మరణం చేస్తూ వ్యావహారిక విషయాలకు దూరంగా ఉంటారు.

🌿శుచిశుభ్రత పాటిస్తూ కాళ్ళు, చేతులు కడగనిదే ఇంట్లోకి కానీ. దేవాలయానికి కానీ వెళ్ళరు. దానధర్మాలు విరివిగా చేస్తారు.. అసత్యం పలుకరు. స్త్రీలనందర్నీ దేవతా స్వరూపులుగా భావించి గౌరవిస్తారు.

🌸 అర్ధాంగిని కూడా దీక్షా సమయంలో జగన్మాతగా తలచి ఆమె భక్తితో చేసే సేవలను స్వీకరిస్తారు. బ్రహ్మచర్య వ్రతం పాటించడం వలన వేరే గదిలో నిద్రిస్తూ, సజ్జన సాంగత్యంతో భక్తిని పెంపొందించుకొని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ కాలక్షేపం చేస్తారు.

🌿 మద్యమాంసాదులు సేవించడం, పొగత్రాగడం, తాంబూలం కూడా దీక్షాకాలంలో నిషేదమే.

🌸దీక్షా నియమావళిని భక్తిశ్రద్ధలతో పాటించడం వలన మంచి క్రమశిక్షణ అలవడి, ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఒక సన్యాసి జీవితంలా గడపడం వలన.

🌿 తెలియకుండానే శరీరంపై మమకారం తగ్గుతుంది. దీక్షలతో అంతస్తు, హెూదా అన్నీ మరచి లక్షాధికారులు, బిక్షాధికారులు కూడా కలసి ఒకేరకం దుస్తులు (నలుపు, కాషాయం) ధరించి భజనలు, పూజలు చేస్తూ సహపంక్తి భోజనాలు చేస్తారు.

🌸 గొప్ప, బీద తారతమ్యం కనిపించదు. స్వాములు ఒకరినొకరు ఎదురైనప్పుడు 'స్వామిశరణం' అని నమస్కరించుకొని పలుకరించు కుంటారు. కొందరు పాదాభివందనం కూడా చేయడానికి వెనుకాడరు.

🌿మాల ధరించి దీక్ష చేస్తున్న స్వాము లందరూ అయ్యప్ప స్వామితో సమానంగా భావిస్తారు. తత్వమసి సిద్ధాంతం అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్మ.

🌸 తనలో అయ్యప్పస్వామిని దర్శిస్తూ ఎదుటివారిలో కూడా అయ్యప్పస్వామిని దర్శించడం ఈ దీక్షలో గొప్పతనం.

🌿స్త్రీలకు 10 నుండి 50 సంవత్సరముల వయసు ఉన్నవారికి శబరిమల యాత్రకు అనుమతించరు. పది సంవత్సరముల లోపు బాలికలు, యాభై పైపడి బహిష్టు ఆగిన స్త్రీలకే అయ్యప్ప దీక్ష, శబరిమల యాత్ర చేయడానికి అర్హత ఉంది.

🌸కఠిన బ్రహ్మచర్యం, స్త్రీలకు బహిష్టు ఆటంకం వలన మండల కాలం దీక్ష సాగదని, అడవులలో, కొండలలో నడచి వెళ్ళే కష్టతరమైన యాత్రని స్త్రీలకు యాత్ర నిషేధించినట్లు కనిపిస్తుంది.

🌿స్త్రీలు పవిత్రంగా శుచి శుభ్రత పాటిస్తూ పూజలు, భజనలలో పాల్గొని భక్తితో సేవలు చేసి తరించవచ్చు.
41 రోజులు దీక్ష పూర్తయ్యాక గురుస్వామి ఇరుముడి కట్టి తన వెంట శబరిమల యాత్రకు తీసుకువెళ్తారు.

🌸 ఇరుముడి అంటే రెండు గల సంచిలో ముందు భాగంలో స్వామివారికి పూజాద్రవ్యాలు, నెయ్యి నింపిన కొబ్బరికాయ (మకాయ)ను ఉంచుతారు.

🌿సంచి వెనక భాగంలో ఆహారం పదార్థాలతో నింపి కట్టిన మూటనే ఇరుముడి అంటారు. ఇరుముడి తలపై లేనిదే శబరిమలలో 18 మెట్లు ఎక్కనివ్వరు.

🌸 మండల దీక్ష చేసి ఇరుముడితో వచ్చినవారికే 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకొనే భాగ్యం కలుగుతుంది.

🌿 అడవులలో కొండలపై తలపై ఇరుముడితో నడచి అయ్యప్పస్వామి దర్శించుకున్న వారి జన్మ తరిస్తుంది. స్వామి శరణం! స్వామియే శరణమయ్యప్ప....స్వస్తీ..
🚩🌞🌹🙏🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

03/12/2022

కోరికలను అదుపులో పెట్టుకోండి

19/11/2022

🌹పరోపకారం🌹

అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. "ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి" అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు. ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. "స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా?" అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ.

శివుడు నవ్వి, "దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది" అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. "ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి" అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు.

మొదట 'ఇదేదో అద్భుతమైన కల' అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఓ మట్టిపాత్ర కనిపించింది శంకరశాస్త్రికి. ఆయన చాలా భక్తిగా ఆ మట్టిపాత్రను తాకి చూసాడు: అది రంగు మారలేదు! అయితే స్వతహాగా మంచివాడైన శంకరశాస్త్రి అందుకు బాధపడలేదు. "నేను ఇంకా పుణ్యం‌ సాధించాలి అని తెలియజేసేందుకుగాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది! ఇప్పుడిక దీన్ని కొలమానంగా వాడి, ఆలయానికి వచ్చేవాళ్ళలో అసలైన పుణ్యాత్ములెవరో గుర్తిస్తాను. వాళ్ళ అడుగుజాడల్లో నడచి, నేనూ పవిత్రుడినౌతాను" అనుకున్నాడు.

ఆ రోజునుండీ గుడికి వచ్చే భక్తులందరిచేతా ఆ మట్టి పాత్రను తాకించేవాడు ఆయన. చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెన్నిక గన్న భక్తులు ఎందరో వచ్చి మట్టిపాత్రను తాకారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండింది తప్ప, రంగు ఏ కొంచెం కూడా తిరగలేదు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి, మహా శివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో, ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు- మాసిన గడ్డంతో, మురికి పట్టిన వస్త్రాలతో- దైవదర్శనం కోరి వచ్చాడు. చలి బాగా ఉన్న ఆ సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటూన్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవటం మొదలెట్టాడు. భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉడ్న్నారు- అతన్ని ఎవరూ గమనించలేదు; గమనించినా పట్టించుకోలేదు.

పూజారి శంకరశాస్త్రి కూడా ముసలాయన్ని చూసి; జాలి పడ్డాడు- కానీ "ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను?" అనుకొని ఊరుకున్నాడు. అయితే వచ్చిన ఆ బాటసారి మటుకు ముసలాయన దగ్గర ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబళిని తీసి అతనికి కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు. బయటికి వెళ్ళి, వేడి వేడి టీ తెచ్చి అతని చేత త్రాగించాడు. భగవంతుడికి అర్పించేందుకుగాను తను తెచ్చిన పండును కూడా ముసలాయనకు ఇచ్చివేసాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడిలోకి వచ్చాడు.

గమనించిన శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. "ఈ ముసలతన్ని నేను రోజూ చూస్తుంటాను; పలకరిస్తుంటాను- అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు. ఈ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు- తను కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేసాడు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటంలేదా? నేను నా ధర్మాన్ని విస్మరించాను. ఇక ఎప్పుడూ అలా చేయను. ఇతరుల కష్టాల్ని తీర్చేందుకు నావంతుగా కృషి చేస్తాను!" అనుకుంటూ సిగ్గుపడ్డాడు.

ఇన్నాళ్ళుగా లేనిది, ఆ రోజున ఆయన చేయి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోకి మారినట్లు తోచింది- బాటసారి చేయి సోకే సరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది! ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసే సరికి ఎదురుగా బాటసారి లేడు! 'సాక్షాత్తూ శివుడే ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు' అనిపించింది, ఆశ్చర్యంతో నోరు తెరిచిన శంకరశాస్త్రికి. అటుపైన "ఏలాంటి ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం- అదే పుణ్యం అంటే!" అని ఆచరణలో చూపిస్తూ చరితార్థుడైనాడాయన.
🌹🙏🌹ఓం నమః శివాయ గౌరీ నమః శివాయ నమః 🌹🙏🌹

కామెంట్స్ లో చెప్పండి .. గోవిందా ... గోవింద 🙏
05/11/2022

కామెంట్స్ లో చెప్పండి ..

గోవిందా ... గోవింద 🙏

Address

Vizianagaram

Alerts

Be the first to know and let us send you an email when travellingwithKrishna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category