14/05/2026
.*చాలా రోజుల తర్వాత శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారి దర్శనం.*
--పట్టెం పట్టుదల
రాష్ట్రంలోనే ప్రఖ్యాత ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారి దర్శనం నాలుగేళ్ల అనంతరం భక్తులకు కలిగింది. ఇటీవలే మహా కుంభాభిషేకాలు ,పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ముఖ్యంగా స్వామివారి దర్శనం కొరకు ఎంతో కృషి చేసిన ఎండోమెంట్ అధికారి, డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్ ని సందర్భంగా ఎంతో అభినందించవలసింది. ఎందుకంటే రాజకీయ నాయకులు తమ రాజకీయాల కోసం ఈ ఆలయాన్ని ఉపయోగించుకున్నారు తప్పితే ఈ ఆలయ పరిస్థితులను పట్టించుకోలేదు. మొత్తానికి ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్న పట్టెం గురు ప్రసాద్ పట్టు పట్టి స్వామివారి దర్శనాన్ని భక్తులకు కలిగించడం వల్ల ఆయన హీరోగా మారిపోయారు. ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నా కూడా జీరోలు అయ్యారు.
జైశ్రీరామ్... జై వీరాంజనేయ.