15/03/2026
తెలంగాణ బ్రాహ్మణ అఫిషియల్ మరియు వృత్తి నిపుణుల సంక్షేమ అసోసియేషన్, హైదరాబాద్ వారు మిక్కిలి భక్తిభావంతో సిద్ధి పొందిన పరమహంస పరివ్రా జకచార్య శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి, ధర్మపురి, తుని పీఠాధిపతుల దివ్య ఆశీస్సులందిస్తున్న చిత్రంతో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం మనోహరంగా ప్రచురించారు.
ఈ పుస్తకాన్ని 14.3.2026 న స్వామివారి ప్రథమ మాసోత్స్వం సందర్భంగా రిటైర్డ్ ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శర్మ గారు తపోవనం లో ఆవిష్కరించారు.
శ్రీ స్వామి వారి పట్ల అసోసియేషన్ అధ్యక్షులు సుశీల్ కుమార్, కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తదితర సభ్యులు చూపిన భక్తి భావం ప్రశంసనీయం అన్నారు.
స్వామి వారు సిద్ధి పొందినా ఆయన ఆశీస్సులు సదా ఉంటాయని, ఆశయాలు కొనసాగిస్తామన్నారు.