Sri Lakshmi Narasimha Swamy vari Devasthanam, Perumallapalli

Sri Lakshmi Narasimha Swamy vari Devasthanam, Perumallapalli An Ancient Temple which was said to be built in 14th Century and was destroyed by HyderAli in his In

తేది : 02-01-2023వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు వైకుంఠ వాకిలి ఏర్పాటు చేయడం అ...
02/01/2023

తేది : 02-01-2023

వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు వైకుంఠ వాకిలి ఏర్పాటు చేయడం అయినది.

అలాగే చిత్తూరు కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు శ్రీ అమాస రాజశేఖర్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరియు అమ్మవార్లకు వారికి సుమారు 7 కేజీల వెండి తో ' వెండి కవచం ' చేయించి ఇవ్వగా స్వామి వార్లకు అలంకరించడం జరిగినది.

వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి కృప కటాక్షాలు కలగాలని కోరుకుంటూ భక్తులు స్వామి వారిని దర్శించి ఆశీసులు పొందవలసినదిగా కోరుచున్నాము.

తేది: 06-12-2022, మంగళవారం  కార్తీక దీపోత్సవం సందర్భంగా మన ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ సుందరేశ్వర స్వామి(మహా శివుడు) ...
05/12/2022

తేది: 06-12-2022, మంగళవారం

కార్తీక దీపోత్సవం సందర్భంగా మన ఆలయ ప్రాంగణంలో వెలసి ఉన్న శ్రీ సుందరేశ్వర స్వామి(మహా శివుడు) వారికి ఉదయం 7 గంటలకు ప్రత్యేక అభిషేకం తో మొదలుకొని సాయంత్రం 5:30గంటలకు ఆకాశ దీపం కార్యక్రమం జరుగును

కావున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి

|| ఓం శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరవలంబం ||నరసింహ స్వామి జయంతి సందర్భంగా ప్రజలు అందరు సుఖసౌఖ్యలు మరియు ఆయురారోగ్యాలతో ఉం...
25/05/2021

|| ఓం శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరవలంబం ||

నరసింహ స్వామి జయంతి సందర్భంగా ప్రజలు అందరు సుఖసౌఖ్యలు మరియు ఆయురారోగ్యాలతో ఉండాలని మన పెరుమాళ్ళపల్లె శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు ఏకాంతంగా స్వామి వారికి అభిషేఖం మరియు కల్యాణోత్సవం కార్యక్రమాలు చేయడం ఐనది.

10/05/2021
తేది 04-02-2021న కృష్ణశిలతో(నల్ల రాతి) చేయబడిన శంకు, చక్రం మరియు నామములు మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి తాటితోపు గ...
11/02/2021

తేది 04-02-2021న కృష్ణశిలతో(నల్ల రాతి) చేయబడిన శంకు, చక్రం మరియు నామములు మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి తాటితోపు గ్రామానికి చెందిన M.K.Thyagaraju గారు విరాళంగా ఇచ్చారు, వీటితోపాటు స్వామి వారి పాదాలు కూడా ఉంటే సహేతుకంగా ఉంటుంది అని తలచి పెరుమాళ్ళపల్లె గ్రామానికి చెందిన టి.టి.డి విశ్రాంత ఉద్యోగి K.Muni Reddy గారు ముందుకు వచ్చారు, త్వరలో స్వామి వారి పాదాలతో కూడిన శంకు, చక్రం మరియు నామము మన ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.

శివరాత్రి సందర్భంగా చేసిన అన్నాభిషేకం లో "శ్రీ సుందరేశ్వర స్వామి" వారు
21/02/2020

శివరాత్రి సందర్భంగా చేసిన అన్నాభిషేకం లో "శ్రీ సుందరేశ్వర స్వామి" వారు

పెరుమాళ్ళ పల్లె శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న "శ్రీ సుందరేశ్వర శివాలయం" నందు శివరాత్రి ఉత్సవాలు...
21/02/2020

పెరుమాళ్ళ పల్లె శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న "శ్రీ సుందరేశ్వర శివాలయం" నందు శివరాత్రి ఉత్సవాలు మొదలైనవి.

ఉదయం 4 గంటలకు మొదలైన విశేష పూజలు అభిషేకంతో ముగిసినవి తిరిగి
మధ్యాహ్నం 12 గంటలకు "అన్నాభిషెకం"
మధ్యాహ్నం 3 గంటలకు "యమ గండ కాల అభిషేఖం"
సాయంత్రం 7 గంటల నుండి భజన కార్యక్రమం
అర్ధరాత్రి 12 గంటల నుండి "లింగోద్భవ పూజ మరియు శత కలశ అభిషేఖం అన్ని కలిపి శనివారం ఉదయం 3 గంటల వరకు వివిధ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పరమేశ్వర కృపకు పత్రులుకాగలరు అని మనవి

శ్రీనివాస మంగపురం లో శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే "గరుడ సేవ"కు గోవిందరాజ స్వామి వారి ఆలయం నుండి శాస్త్రోక్తంగా...
18/02/2020

శ్రీనివాస మంగపురం లో శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే "గరుడ సేవ"కు గోవిందరాజ స్వామి వారి ఆలయం నుండి శాస్త్రోక్తంగా వచ్చే పట్టువస్త్రాలు, సారెను పెరుమాళ్ళ పల్లె శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వద్ద స్వాగతించి ఊరేగింపుగా వచ్చిన భక్తులకు మరియు సిబ్బందికి ప్రసాదములు మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది.

అలాగే ప్రతి సంవత్సరం గారుడసేవకు చంద్రగిరి MLA శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సమర్పించే వస్త్రాలు, పండ్లు మరియు పూలకు కూడా ఆలయం వద్ద ఆలయ కమిటీ వారు పూర్ణకుంభంతో స్వాగతించి పూజలు చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారితో పాటు చెర్లోపల్లి జూ పార్క్ రోడ్డులోని డెక్కన్ డెలీషియస్ హోటల్ వారు ప్రసాద వితరణ చేయడం జరిగింది.

ఈరోజు అనగా 15-02-2020 శనివారం ఉదయం  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ శ్రీ పులిగోరు ముర...
15/02/2020

ఈరోజు అనగా 15-02-2020 శనివారం ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ శ్రీ పులిగోరు మురళీకృష్ణ గారు "బంగారు తాళి బొట్టు, వెండి నామము, వెండి మీసాలు, వెండి కళ్ళు మరియు వెండి తిలకం" విరాళంగా అందించారు.

స్వామి మరియు అమ్మవార్లకు కల్యాణోత్సవం జరిపించి పైన తెలిపిన వస్తువులు స్వామి మరియు అమ్మ వార్లకు అలంకరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ రఘునాథ రెడ్డి గారు, ఆలయ ధర్మకర్త చెంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఎన్. చంద్రమౌళి రెడ్డి, వై.సోమశేఖర్ రెడ్డి, మహేష్ రెడ్డి.వై, సి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, కుందనం జీవన్ కుమార్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రథసప్తమి సందర్భంగా పెరుమాళ్ళపల్లె శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు సూర్యభగవణునికి ప్రత్యేక పూజలు జరిగినవి.
01/02/2020

రథసప్తమి సందర్భంగా పెరుమాళ్ళపల్లె శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు సూర్యభగవణునికి ప్రత్యేక పూజలు జరిగినవి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెరుమాళ్ళపల్లె శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు వైకుంఠ వాకిలి ఏర్పాటు చేయడం ఐనది అలాగే ...
06/01/2020

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెరుమాళ్ళపల్లె శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నందు వైకుంఠ వాకిలి ఏర్పాటు చేయడం ఐనది అలాగే స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేయడం ఐనది.

కావున భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించి స్వామి వారి కృపకు పాత్రులుకాగలరు అని మనవి....,

Address

Perumallapalli(V&P), Tirupathi Rural
Tirumala
517505

Opening Hours

Monday 6am - 10am
5pm - 7:30pm
Tuesday 6am - 10am
5pm - 7:30pm
Wednesday 6am - 10am
5pm - 7:30pm
Thursday 6am - 10am
5pm - 7:30pm
Friday 6am - 10:30am
5pm - 7:45pm
Saturday 6am - 10:30am
5pm - 7:30pm
Sunday 6am - 9:30am
5pm - 7:30pm

Telephone

+919985694722

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Lakshmi Narasimha Swamy vari Devasthanam, Perumallapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share