29/08/2026
మనుషులు మనల్ని లెక్కలోనుండి తీసివేయొచ్చు, మన ఉనికినే గుర్తించకపోవచ్చు. అయితే దేవుడు ఎవరినీ మరిచిపోడు. మనుషుల దృష్టిలో మనం లెక్కలో లేకపోయినా, ఆయన దృష్టిలో మనం ఎప్పటికీ గుర్తింపు పొందినవాళ్లమే.ఆయన మనలను ఆశీర్వదించాలనుకుంటే, ఎవరి అంగీకారం, ఎవరి సహాయం, ఎవరి గుర్తింపూ అవసరం లేదు. ఆయన కృప ఒక్కటే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నేనంటూ ఉన్నానని కనీసం గుర్తించలేదు అని మనుషుల గుర్తింపుపై ఆధారపడవద్దు. దేవుడు మన పక్కన ఉన్నాడు ఆయన నన్ను మరచిపోలేదు అని గుర్తు పెట్టుకుంటే చాలు ❤️🙌
నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను హెబ్రీ13:5