Sri Sathya Sai-Shirdi Sai- Lalitha Devi Temple

Sri Sathya Sai-Shirdi Sai- Lalitha Devi Temple All types of poojas are done to Sri Sathya sai, Shirdi sai and very beautiful Sri Lalitha devi. All major Hindu festivals are celebrated with special puja.

Special Activities

Temple celebrates Vijayadasami, Guru Purnima, Sri Ramanavami, and temple anniversary with special activities. Sai Satya Vratalu are conducted during Guru Purnima, Vijayadasami and during temple anniversary. Annadanam (food offering) is organized during auspicious occasions like Guru Purnima, Vijayadasami and temple anniversary. Palabhishekam (holy bath with milk) using 108 lite

rs of fresh milk is offered to Baba on Guru Purnima, Vijayadasami and on temple anniversary. Satyanarayana Swami Vratalu, Rama Kalyanam, Siva Kalyanam and Venkateswara Swami Kalyanam are also organized in the temple premises.

*🙏🏹 శ్రీ రామనామ మహత్యం 🏹🙏* 🚩🏹 శ్రీ రాముడు లంకకు వెళ్ళటానికి రామసేతువు నిర్మాణం జరుగుతోంది. వానరులు రాళ్ళమీద రామనామం వ్రా...
25/05/2026

*🙏🏹 శ్రీ రామనామ మహత్యం 🏹🙏*

🚩🏹 శ్రీ రాముడు లంకకు వెళ్ళటానికి రామసేతువు నిర్మాణం జరుగుతోంది. వానరులు రాళ్ళమీద రామనామం వ్రాసి సముద్రంలో వేస్తున్నారు. అవి తెలుతున్నాయి.

🚩🏹ఇదంతా చూస్తున్న శ్రీరాముడు కూడా కొన్నిరాళ్లు వేద్దామని సముద్రంలో రాయిని వదిలాడు. విచిత్రంగా ఆ రాయి మునిగి పోయింది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయింది. ఇదేంటి! వానరులు వేస్తే తేలుతున్నాయి. నేను వేస్తే మునిగి పోతున్నాయి. అయినా చూద్దాం అని మరో రాయి విడిచాడు. అది కూడా మునిగి పోయిందట.

🚩🏹 ఇదేంటని శ్రీరాముడు హనుమను జాంబవంతుడను మరి కొందరిని అడిగాడు. అపుడు వారు....స్వామి! మేము వేసే రాళ్ళ మీద మీ నామం రాస్తున్నాం. మీరు రాయలేదు కదా అన్నారు.

🚩🏹 అదేంటి. నేను స్వయంగా వేస్తున్నాను కదా. నా నామం రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవటం ఏమిటి? ఎందుకలా? అన్నారు స్వామి.

🚩 🏹 అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పారు.
స్వామి! మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని పూజించటం వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. అదే జరుగుతోంది స్వామి అని అన్నాడు.

🚩🏹 అందుకే రామబాణం కన్నా రామ నామం గొప్పది అంటారు.

🚩🏹 అందుకే.....రామ నామాన్ని జపించండి. రాముడి అనుగ్రహం పొందండి. ధర్మంగా జీవించండి.
జై శ్రీరాం.

🚩 శ్రీ రామ జయ రామ... జయ జయ రామ 🚩

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸*శ్రీ మూకశంకర విరచిత**మూక పంచశతి**పాదారవింద శతకం - 2**శ్లోకము - 36**మహామంత్రం కించిన్మణికటకనాదైర్మృదు జపన్**...
25/05/2026

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*పాదారవింద శతకం - 2*

*శ్లోకము - 36*

*మహామంత్రం కించిన్మణికటకనాదైర్మృదు జపన్*
*క్షిపందిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మనరజః ।*
*నతానాం కామాక్షి ప్రకృతిపటురచ్చాట్య మమతా-*
*పిశాచీం పాదోఽయం ప్రకటయతి తే మాంత్రికదశామ్ ॥*

*భావము 😗

*అమ్మా! నీ పాదుమలు ఒక మహా మాంత్రికుడు. ఆ పాదముల అందెల ధ్వనులు మహా మంత్రములుగా, ఆ మాంత్రికుడు, నీ పాదనఖముల తెల్లని భస్మముతో, మమత్వము అనే పిశాచమును తొలగిస్తాడు. దుష్టశక్తులనుండి రక్షణకు నీ పాదములే శరణము.*

🌸 *శ్రీమాత్రే నమః* 🙏

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸*గోవింద భగవత్పాదుల దర్శనం*తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దక...
25/05/2026

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*గోవింద భగవత్పాదుల దర్శనం*

తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు 'ఎవరు నువ్వు?' అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.

న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.

ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు)

శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ప్రతిరోజూ…శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…నడిచే దేవుడు…పరమాచార్య పావన గాధలు…                 *వాది – ప్రతివాది!*             ...
25/05/2026

ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…
నడిచే దేవుడు…
పరమాచార్య పావన గాధలు…

*వాది – ప్రతివాది!*

ఒక ఊళ్ళో ఇద్దరు దగ్గరి బంధువుల మధ్య ఆస్తి విషయమై విభేదాలు పెరిగి శత్రువులయ్యారు.
అది చివరికి న్యాయస్థానంలో వాజ్యం వేసుకునేదాకా వెళ్ళింది.

వాళ్ళిద్దరి మధ్య వైరం వాళ్ళని కనీసం పలకరించుకోకుండా చేసింది.
ఆ ప్రతివాది యొక్క కొడుకు పెళ్ళి కుదిరింది. అతను పెళ్ళి పత్రికను శ్రీమఠానికి తీసుకుని వచ్చి పరమాచార్య స్వామి వారి ముందు ఉంచాడు.

మహాస్వామి వారు దగ్గర నిలబడిఉన్న సేవకుణ్ణి చూసి, “బంధువులందరి ఇళ్ళకు వెళ్ళి పెళ్ళికి పిలుస్తాడేమో అతన్ని అడుగు?” అని చెప్పారు.

“అవును పెరియవ మేము బంధువులందరి ఇళ్ళకు వెళ్ళి పెళ్ళికి ఆహ్వానిస్తాము” అని చెప్పాడు.

స్వామివారు ఒక్కక్షణం మౌనం వహించి “అతని పై కేసు వేసిన వాది ఇంటికి వెళ్ళి పిలుస్తాడేమో అడుగు” అని అన్నారు.

ఆ పెద్దమనిషి కొద్దిసేపు సంశయిస్తూ, “నేను అక్కడికి వెళ్ళి అవమాన పడితే అది చాలా బాధగా ఉంటుంది పెరియవ” అని బదులిచ్చాడు.

“అలాంటిదేమి జరగదు. అతనికి పెళ్ళి శుభలేఖ ఇచ్చి ఖచ్చితంగా పెళ్ళికి రావాల్సిందని చెప్పు” అని చెప్పారు స్వామివారు.

అతను అన్యమనస్కంగానే తన వాది ఇంటికి వెళ్ళాడు.
పరమాచార్య స్వామివారి మాటలు గుర్తుతెచ్చుకున్నాడు. “అతిథులను అగౌరవించడం మన సంప్రదాయం కాదు. ప్రతిఒక్కరిలోను మంచితనం ఉంటుంది”

బద్ధశత్రువైన ఇతను ఇలా తన ఇంటికి వస్తాడని అతను అనుకోలేదు. ఇతణ్ణి చూడగానే వెంటనే గట్టిగా మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. “స్వాగతం స్వాగతం” అని సంతోషంతో పలకరించి శుభలేఖ తీసుకున్నాడు. “మన శత్రుత్వాన్ని మరచి నా ఇంటికి వచ్చి మరీ నన్ను ఆహ్వానించావు. నేను ఖచ్చితంగా పెళ్ళి వేడుకకు వస్తాను” అని హామీ ఇచ్చాడు.

ఆహ్వానించడానికి వెళ్ళిన ఆ వ్యక్తి మనసు మార్చుకున్నాడు. “ఎంత మంచి సంస్కారమున్న వ్యక్తి. నేను అనవసరంగా ఇతనితో గొడవ పెట్టుకుని శత్రుత్వం పెంచుకున్నాను” అని అనుకున్నాడు. అతనితో ఇలా అన్నాడు. “అన్నా! కేసు, కోర్ట్ లు గురించి మరచిపోదాం. ఆ విషయాన్ని సావకాశంగా మనమే పరిష్కరించుకుందాం” అని ఇద్దరు పరమాచార్య స్వామికి నమస్కారం చేసారు.
--- ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ పరమాచార్య అనుభవాల సంగ్రహం.
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

*శ్రీ మహావిష్ణు పురాణం*                              98 వ భాగం *శ్రీకృష్ణావతారం 1. *కథ ప్రారంభం - *కంసుడు అశరీరవాణి మాట ...
25/05/2026

*శ్రీ మహావిష్ణు పురాణం*

98 వ భాగం

*శ్రీకృష్ణావతారం 1.
*కథ ప్రారంభం -
*కంసుడు అశరీరవాణి మాట విని దేవకి వసుదేవులను కారాగారంలో ఉంచుట:
త్రేతాయుగంలో అంతరించిన దానవులు, రాక్షసులు ద్వాపర యుగంలో దానవాంశ గల రాజులుగా జన్మించి ఆరాచకాలు, అన్యాయాలు చేయసాగారు. భూమికి, భూమి పైగల ప్రజలకు అంతులేని కష్టాలు కలిగాయి. భూమి పై జనాభా కూడ అధికమై భూభారం భూదేవికి మోయలేనంతగా పెరిగింది, ప్రజల ఆక్రందనలు, భూభారం భరించలేక భూదేవి బ్రహ్మలోకము వెళ్లింది.

ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలు, మహర్షులతో సభ నిర్వహిస్తున్నాడు.

విచారవదనంతో వచ్చిన భూదేవిని చూసి “వసుంధరా! ఏమైంది ఇంత దుఃఖంగాఉన్నావు" అని అడిగాడు.

భూదేవిదుఖము నిగ్రహించుకుంటూ "పితామహా! మీరందరూ శ్రీమహావిష్ణువు దయతో సుఖసంతోషాలతో ఉన్నారు. భూమి మీద పాపభారంతో నేను నలిగిపోతున్నాను. నేను శ్రీహరి భార్యనని చెప్పుకోటానికే ఉన్నాను. కష్టాలు మాత్రమే నాకు ఉన్నాయి. సంపదల అధినేత్రి మహాలక్ష్మి శ్రీహరితో వైకుంఠంలో సుఖంగా ఉంది.

త్రేతాయుగంలో అంతరించిన దానవులు, రాక్షసులు ద్వాపర యుగంలో రాక్షసాంశ రాజులుగా జన్మించి పాలిస్తూ సాధు జనులను హింసిస్తున్నారు. ధర్మానికి హాని కలిగించే వీరి సంతతి అమితం గా పెరిగి మోయలేని భారం అయింది. కాలనేమి కంసుడిగా జన్మించి భరించరాని అరాచకాలు చేస్తున్నాడు. జరాసంధ, నరకాసుర, అరిష్ట, ధేనుక, శిశుపాలాది అనేకులు దానవాంశతో జన్మించి అనేక దురాగతాలు చేస్తున్నారు. ఈ పాపభారం నుండి నన్నుకాపాడండి" అని దుఖించసాగింది.

బ్రహ్మదేవుడు భూదేవిని ఓదారుస్తూ "తల్లీ! దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేవాడు నారాయణుడు. పదమ్మా! మనమందరం వైకుంఠం వెళ్లి దేవదేవునికి విషయం విన్నవించి రక్షించమని ప్రార్ధించుదాము” అని భూదేవిని తీసుకుని, దేవతలు మహర్షులు వెంట రాగా వైకుంఠం వెళ్లాడు.

లక్ష్మీదేవి నారాయణులు శేషతల్పం పై ఉండగా సనకస నందాదులు ఒకవైపు, నారద తుంబురులు మరో పక్క ఉండి స్తుతిస్తోత్రాలు చేస్తున్నారు. మంచి సమయానికి వచ్చాము అని ఆనందించి బ్రహ్మదేవుడు భూదేవి, దేవతలు, మహర్షులుతో కలసి శ్రీహరిని కీర్తిస్తూ "విష్ణు స్తవం" పఠించాడు.

ఆ స్తవము బ్రహ్మదేవ కృతమైన శ్రీమహావిష్ణుస్తవముగా ప్రసిద్ధి చెంది పఠించువారి కష్టాలు తీర్చేదిగా అయ్యింది.

శ్రీహరి ప్రసన్నుడై తన కరుణా వీక్షణాలు ప్రసరించి రాకకు కారణం అడిగాడు. బ్రహ్మదేవుడు నమస్కరించి "నారాయణా! దుష్టులు అధికంగా అవ్వడంతో పాపాలు, జనాభా పెరగడంతో భూభారం భూదేవి మోయలేక పోతోంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై భూమి పై తమరు అవతరించే సమయం ఆసన్నమైంది. అవతారమెత్తి భూదేవిని రక్షించండి" అని ప్రార్ధించాడు.

భూదేవి, బ్రహ్మాది దేవతల ప్రార్ధనలు ఆలకించిన మహావిష్ణువు తన శరీరం నుండి రెండు కేశములు తీసి భూభాగం పై వదిలాడు. "ఈ సీతావర్ణ కేశము ఆదిశేషుడి అంశంతో దేవకి సప్తమ గర్భంలో ప్రవేశిస్తుంది. యోగమాయ నా ఆదేశం ప్రకారం ఆ శిశువును దేవకి గర్భం నుంచి తీసి రోహిణి గర్భంలో ప్రవేశ పెడుతోంది. సంకర్షణుడు అనే పేరుతో ఆదిశేషుడు జన్మించి బలరామునిగా ప్రసిద్ది చెందుతాడు.

ఈ నీలవర్ణము కేశము నా అంశతో దేవకికి అష్టమ సంతానంగా జన్మించి నందగ్రామంలోని యశోదమ్మ చెంతకు చేరి శ్రీకృష్ణుడు అనే నామం పొందుతుంది. నేను సంపూర్ణ అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడిగా దుష్టులను సంహరించి భూభారం తగ్గించుతాను. శిష్టులను రక్షిస్తాను. దేవతలందరు తమ తమ అంశలతో కురు పాండవ వంశాలలో జన్మించి నా దుష్ట సంహారంలో సహకరించండి.

భవిష్యత్తులో భూమిపై జరగబోయే మహాయుద్ధంలో జన సంహారం జరిగి భూభారం తగ్గుతుంది" అని అభయం ఇచ్చాడు.

బ్రహ్మాది దేవతలు,భూదేవి,మహర్షులు మహావిష్ణువుకి ప్రణమిల్లి తమ తమ నెలవులకు వెళ్లి శ్రీహరి భూమి పై అవతరించే శుభ తరుణం కోసం ఎదురు చూడసాగారు.

మధురానగర రాజైనఉగ్రసేనుడికి పదిమంది కుమారులు జన్మించారు. జేష్ఠుడైన కంసుడు తనతొమ్మిది మంది సోదరులతో మధురకు యువరాజుగా ఉండేవాడు. ఉగ్రసేనుని సోదరుడు దేవకునికి ఏడు మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో కనిష్ట పుత్రిక దేవకీదేవి అంటే కంసుడికి అమితమైన ప్రేమ.

యదువంశ రాజైన శూరుడికి పదిమంది కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగారు. పెద్దవాడైన వసుదేవుడు రోహిణీదేవిని వివాహం చేసుకున్నాడు. సంతానం కలుగకపోవడంతో వసుదేవుడు దేవకీదేవితో సహా దేవకుని ఏడుగురు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కంసుడు తన అభిమాన సోదరియైన దేవకిదేవి వివాహం వసుదేవునితో స్వయంగా దగ్గరుండి ఆడంబరంగా జరిపించాడు.

అత్తగారింట దింపడానికి వసుదేవుడు దేవకీదేవిని రథంలో కూర్చోబెట్టి మేళతాళాల మధ్య తానే రథసారథియై రథం నడుపుతూ తీసుకువెళ్లసాగాడు. మార్గ మధ్యంలో అశరీరవాణి కంసుడిని ఉద్దేశించి "కంసా! నీదురాగతాలు అంతమయ్యే రోజు దగ్గరకు వచ్చింది. నిన్ను చంపబోయేవాడు నీ ప్రియసోదరి అష్టమపుత్రుడిగా జన్మించబోతున్నాడు! జాగ్రత్త! రాబోయే మృత్యువు తప్పాలంటే సరైన నడవడిక కలిగి ఉండుము" అని హెచ్చరించింది.

కంసుడిలోని రాక్షసత్వం అశరీరవాణి చెప్పిన హెచ్చరిక వినకుండా దేవకిని ఇప్పుడే చంపేస్తే పుత్రుడనేవాడే జన్మించడు కదా! చంపేవాడే ఉండడు కనుక దేవకిని వెంటనే చంపేయి! అని ప్రేరేపించింది.

కంసుడు రథం ఆపి దేవకిని జుట్టు పట్టుకుని కిందకు లాగి కత్తితో తల నరికి చంపబోయాడు. వసుదేవుడు కంసుడి చేయి పట్టుకుని ఆపుతూ
"బావా! అశరీరవాణి చెప్పిందని ప్రేమగా చూసుకుంటూ పెంచిన ప్రియ సోదరిని చంపడం న్యాయమా? స్త్రీ హత్య మహాపాతకం. అశరీరవాణి మాటలు నిజమని నీవు నమ్మితే, నేను చెప్పేది వినుము. నిన్ను చంపేవాడు దేవకి గర్భాన పుడతాడు. కావున నీ శత్రువు దేవకి కాదు. దేవకికి పుట్టబోయే బిడ్డ! పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేవకి పుట్టబోయే ప్రతి శిశువుని పుట్టిన మరుక్షణమే నీకు తెచ్చి అప్ప గిస్తాను. నవ వధువైన దేవకిని చంపకుండా వదిలివేయుము" అని ప్రార్ధించాడు.

కంసుడు ఆలోచించాడు. "దేవకిని చంపితే తనను చంపేవాడు తనకు తెలియకుండా మరొక చోట జన్మించ వచ్చును. అదే దేవకిని బంధించి తన దగ్గరే వుంచుకుంటే, చంపబోయేవాడిని తనే పుట్టిన వెంటనే సంహరించి శత్రుశేషం లేకుండా చేసుకోవచ్చు.

కంసుడు దేవకిని వదలి పెట్టి "వసుదేవా! నీ మాట మీద దేవకిని చంపకుండా వదిలి పెడుతున్నాను. మీరిరువురు నా వద్దనే కారాగారంలో బందీలుగా ఉంటారు. అన్నమాట ప్రకారం దేవకి సంతానాన్ని పుట్టిన వెంటనే నాకు అప్పగించాలి" అని వారిని బంధించి మధుర తీసుకెళ్లి చెఱశాలలో ఉంచాడు. అడ్డుపడిన తండ్రి ఉగ్రసేనుని కూడా కంసుడు బంధించి చెఱశాలలో పడవేసి తానే మధురకు రాజుగా ప్రకటించుకున్నాడు. వసుదేవుడు,దేవకిలను కారాగారంలో బంధించారని తెలిసిన వసుదేవుని భార్యలు రోహిణి మొదలైనవారు రహస్యంగా గోకులం చేరి వసుదేవుని మిత్రుడైన నందుని ఇంట ఆశ్రయం పొందారు.

“శ్రీకృష్ణ చరితం జన్మించిన దగ్గరి నుంచి నిర్యాణం వరకు వివరంగా వినాలని ఉంది.
శ్రీకృష్ణావతార లీలలను విని ధన్యులం అవుతాము" అని కోరగానే శ్రీకృష్ణ చరిత్ర సూత మహర్షి సరేనని చెప్పసాగాడు.
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺*భాగవతం -76 వ భాగం:**ధేనుకాసుర వధ:*ఒకనాడు కృష్ణభగవానుడు బలరామునితో కలిసి ఆవులను, దూడలని తీసుకుని బృందావన...
25/05/2026

🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺

*భాగవతం -76 వ భాగం:*

*ధేనుకాసుర వధ:*

ఒకనాడు కృష్ణభగవానుడు బలరామునితో కలిసి ఆవులను, దూడలని తీసుకుని బృందావనం లోనికి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజూ ఆ ఆవులను, దూడలను తీసుకువెళ్ళి కాపాడే ఆ పరయట్నంలో ఉన్నారు.

మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది. కానీ ఈ ఘట్టం జరిగేరోజున కథను బలరామునితో అనుసంధానం చేశారు.

కృష్ణభగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. ‘అన్నయ్యా, ఈవేళ చెట్లన్నీ వంగి వున్నాయి. మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళనన్నిటిని కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని అవి కోరుకుంటున్నాయి.

ఈ భూమి అంతా కూడా మీ పాదఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్యా, మీరు మహాపురుషులు’ అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే, బలరాముని శిరస్సును ఒక గోపాల బాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు.

బలరాముని పాదములను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.

కొన్ని ఆవులు కనపడలేదు. వారి ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు.

ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమి ఉంటుంది? పిల్లలందరూ పరుగుపరుగున వచ్చి ఒకమాట చెప్పారు. ‘బాలరామా, ఇక్కడకు దగ్గరలో తాటికోట ఒకటి ఉన్నది. అక్కడి తాటిచెట్లకు పెద్దపెద్ద తాటిపళ్ళు ఉన్నాయి.

అవి ముగ్గి చెట్టునుండి క్రిందపడ్డాయి. పిల్లలందరికీ ఆ పండ్లు తినాలని కోరిక. కానీ అక్కడ ధేనుకాసురుడని పిలువబడే గార్దభాసురుడు ఉండేవాడు.

అతడు గాడిద రూపంలో వున్నా రాక్షసుడు. గాడిద తాటిపండు తినదు. తాటిపండు వాసన తెలియదు. కానీ అది ఎవ్వరినీ తోటలోనికి రానివ్వదు. ఎవ్వరినీ ఆ తాటిపండ్లు తిననివ్వదు. ఒకవేళ ఎవరయినా ఆ తాటిపండు తినడానికి లోపలికి వచ్చినట్లయితే యిది గబగబా వెళ్ళి వెనకకాళ్ళు ఎత్తి అవతలా వాడి గుండెల మీద తన్ని వాడు మరణించేటట్లు చేస్తుంది.

కాబట్టి ఎవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఈమాట చెప్పి వాళ్ళు అన్నారు – మాకు ఎప్పటినుంచో ఆ తాటిపళ్ళు తినాలని ఉంది. బలరామా, మాకు ఆ తాటిపళ్ళు తినే అద్రుస్తమును కల్పించవా’ అని అడిగారు.

అపుడు బలరాముడు ‘మీకేమీ భయం లేదు. నా వెంట రండి’ అన్నాడు. బలరాముడు అపారమయిన బలశాలి. గోపబాలురనందరినీ ఆ తాటి వనంలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడకు వెళ్ళి ఒక తాటి చెట్టును పట్టుకుని ఊపాడు. తాటిపళ్ళు గలగల క్రింద రాలాయి. పిల్లలందరూ బలరాముడు తాటిపళ్ళను ఇప్పించాడని ఎంతో సంతోషంగా వాటిని తింటున్నారు.

దానిని గార్దాభాసురుడు చూశాడు. ‘ఇన్నాళ్ళ నుంచి ఈ తాటిపళ్ళు ఎవరు తినకుండా కాపాడాను. ఈవేళ ఈ పిల్లలు వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారు’ అని వాడు వెంటనే గాడిదరూపంలో వచ్చి బలరాముడి గుండెలమీద తన వెనక కాళ్ళతో తన్నబోయాడు. అపుడు బలరాముడు గార్దభాసురుని రెండుకాళ్ళు ఒడిసిపట్టుకుని వాడిని గిరగిర త్రిప్పి ఒక తాటిచెట్టు మీదికి విసిరాడు.

అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఆ గాడిద దెబ్బకు ఆ తాటిచెట్టు వెళ్ళి ఇనొక తాటిచెట్టు మీద పడింది. దాని విసురుకి ఆ తాటిచెట్టు వెళ్ళి మరొక తాటిచెట్టు మీద పడింది. పెద్దగాలి వస్తే ఎలా పడిపోతాయో అలా అక్కడి తాటిచెట్లన్నీ కూలిపోయాయి.

హాయిగా పిల్లలందరూ ఆ తాటిపళ్ళు తినేశారు. గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు మరణించాడు. ఆ గాడిదకు బోలెడు పిల్లలు ఉన్నాయి. ‘మా నాన్నగారిని ఎవరో సంహరించారు’ అని పిల్ల గాడిదలు అన్నీ కృష్ణుడు మీదకి, బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. బలరాముడు ఆ గాడిదలన్నింటినీ అవలీలగా చంపివేశాడు.

పుట్టుకతో మీ అంతటమీరు ప్రయత్నం చేయకుండా అలవాడే గుణం ఒకటి ఉంటుంది. దాని పేరే లోభము.

అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది మామిడికాయలను ఇస్తుంది. కానీ తను కాయించిన కాయలలో ఒక్క కాయనయినా మామిడి చెట్టు తినదు. నది రాత్రనక, పగలనక ప్రవహిస్తూ ఉంటుంది. కానీ దాహం వేస్తోందని నది తన నీళ్ళు తాను ఒక్క చుక్క త్రాగదు.

ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారుచేస్తుంది. తన పాలను తీసుకువెళ్ళి ఆవుదగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుందే తప్ప ఒక్క చుక్క పాలను త్రాగదు.

ఈ ప్రపంచంలో తనవి కానివి అన్నీ తెచ్చుకుని దాచుకునే దుర్మార్గుడు మనుష్యుడు ఒక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ యితరుల కోసమే జీవిస్తాయి. తమకి అని వాటికి దాచుకోవడం చేతకాదు.

కానీ మనిషికి మాత్రం పుట్టుకతో లోభగుణం వస్తుంది. ఈ లోభమును మీరు ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే డానికి అంతు ఉండదు. తృప్తి అనేది మనస్సులో కలగాలి. చితి ఒక్కసారి కాలుస్తుంది. చింత నిరంతరం కాలుస్తుంది. అది ఎక్కువయిపోకుండా ఉంటాలంటే మనిషి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపు తిరగాలి.

అలా తిరగకపోతే మనస్సుకి ఆలంబనమును మనస్సు వెతికేసుకుంటుంది. ఎప్పుడూ ఐశ్వర్యం గురించో, పిల్ల గురించో, మరియొక దాని గురించో ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. దానివలన ఎప్పుడూ బాదే.

ఇటువంటి లోభ గుణం చేత నరకము వస్తుంది. భార్యా బిడ్డలని పోషించడానికి ధనార్జన చెయ్యాలి. దానిలో కొంత నిలవ చేయాలి. దానిని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టలేదు. మనిషి సంపాదించిన పుణ్యఫలమును భార్య, పిల్లలు అందరూ పంచుకుంటారు.

కానీ పాప ఫలమును మాత్రం ఎవరూ పంచుకోరు. దానిని వాడే అనుభవించాలి. అటువంటి పాప ఫలితమును పొందకుండా ఉండాలంటే పుణ్య కార్యములను చేయాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులయిన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి.

మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఉదారముగా దానం చేయాలి. ఈ లోభ గుణమును విరుచుకోవడం మీ అంతటా మీకు రాదు. మహా పురుషుల జీవితములను ప్రయత్నపూర్వకంగా చూడాలి. పదిమందికి సేవచేయడానికి ఎవడు ముందుకు వస్తున్నాడో వానిని స్వార్థం లేకుండా పొగడడంలో వెనుకంజ వేయకూడదు.

అందుకే కృష్ణ భగవానుడు బలరాముడిని స్తోత్రం చేశాడు. మహాపురుషులను సేవిస్తే, మహాపురుషుల జీవితములను తెలుసుకుంటే మీలోవున్న లోభగుణము విరిగిపోతుంది. పదిమంది కోసం బ్రతకడం అలవాటవుతుంది.

కాళియ మర్దనము:

ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ నాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది.

అపుడు వారు కాళిందిలో వున్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. అపుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు.

ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీల్లి ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ‘ఈ నీళ్ళు ఎందుకు యిలా వున్నాయి?’ అని వాళ్ళని అడిగాడు.

డానికి కారణం – ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. డానికి అనేక భార్యలు. ఎందఱో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది.

అందువలన ఆ నీరంతా విషపూరితం అయింది అని తెలుసుకున్నాడు. కృష్ణుడు ‘మీరు అందరూ మరణించడానికి యిది కారణం. కాబట్టి యిప్పుడు నేను ఏమి చేస్తానో చూడండి’ అని తాను కట్టుకున్న పంచెను మోకాళ్ళ మీదవరకు తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలి ఈకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు. రెండు పాదములను నేలపై గట్టిగా తాటించి ఒకసారి ఊగాడు.

అక్కడ ఒక కడిమిచెట్టు ఉంది. కృష్ణుడు ఆ చెట్టును ఎక్కాడు. నాటితో తన జన్మ ధన్యమయి పోయిందని, తనంత ప్రాణి మరొకటి లేదని ఆ చెట్టు అనుకుంది. క్రింద వున్న మడుగు కూడా ఈవేళ సుకృతం అవుతోంది. గోపాలబాలుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఆ మడుగు నీళ్ళల్లోకి సింహము దూకినట్లు దూకాడు.

ఆయన నీళ్ళల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. అసలు ఈ మదుగును చూసేసరికే అందరూ భయపడతారు. అలాంటిది ఇలాంటి మడుగులోనికి దూకడానికి ధైర్యం ఎవరికీ వున్నది?” అని సాక్షాత్తు కాళియుడే చూశాడు. అందులో ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్ని కృష్ణుడిని చూశాడు. ‘ఎంత ధైర్యం ఈ పిల్లాడికి.

నేను ఉన్న మడుగులోకి దూకుతాడా?’ అనుకుని పడగలు విప్పి కాటువేశాడు. కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. అపుడు కాళియుడు తన దీర్ఘమయిన శరీరంతో కృష్ణ పరమాత్మను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఒడ్డున ఉన్న గోపాల బాలురు భయంతో పరుగుపరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు.

ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఏమి జరిగిందోనని భయపడుతున్నారు. కృష్ణుడు కనపడడం లేదు. కాళియమడుగులోని నీటిలో దూకాడు అన్నారు. అందరూ వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాముచేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు.

ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిస్తే మేము చచ్చిపోయినా గొడవలేకపోను. ఎందుకంటే మేము చచ్చిపోతే నీవు బ్రతికిస్తావు. నీవు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము. నీవు చనిపోయిన తరువాత అయ్యో ఏమి చేస్తాము అని వెనక్కి వెడతామని అనుకుంటున్నావేమో నువ్వు అలా మరణిస్తుండగా మేము అలా చూస్తూ బ్రతికి ఉండము.

కాబట్టి మేమూ కాళింది మడుగులో దూకేస్తాము. మేమూ ఆ పాము విషంతో చచ్చిపోతాము’ అని యశోద కొంగు బిగించుకుని కాళింది మడుగులోకి దూకేయబోయింది. యశోద వెనుక గోపకాంతలందరూ దూకే ప్రయత్నంలో ఉన్నారు. గోపాల బాలురు కూడా అదేప్రయట్నంలో ఉన్నారు.

ఇపుడు పరమాత్మ దీనిని చూశాడు. తనను గురించి ఆర్తి చెందేవారున్నారు. ‘నేను వీళ్ళకి దక్కాలి’ అనుకున్నాడు. ఒక్కసారి తన శరీరమును వెడల్పుగా, పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో వున్నశరీరం పెరిగిపోతే, కాళియుని శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది.

ఆ పిల్లవాడు ఒక్కసారి పైకెగిరి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రముల నుండి నెత్తురు కక్కేసింది. పట్టు వదిలేసి కిందపడిపోయింది. దానిని కృష్ణుడు చూశాడు.

కాళియుని తోకపట్టుకుని ఎగిరి పడగల మీదకి ఎక్కాడు. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దానిని తొక్కుతూ ఉండేవాడు. మణులతో కూడిన ఆ కాళియుని పడగలు ఆయన నాట్యం చేసే రంగస్థల మంటపం అయింది. గోపకులు, గోపకాంతలు అందరూ ఆయమున ఒడ్డున సంతోషంతో ‘శభాష్ కృష్ణా’ అని సంతోషంతో అరుస్తున్నారు.

ప్రేక్షకులుగా దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలల పగిలిపోయి, లోపల వున్న మణులు చెల్లాచదరయి పోయాయి. దాని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతోంది. అప్పటివరకు విషముతో నల్లగా వున్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టింది. కాళియుడు శోషించి పోయి నీటిలో పడిపోయే స్థితి వచ్చింది.

🙇‍♀️🙏🙇‍♀️🙏🙇‍♀️🙏🙇‍♀️🙏🙇‍♀️🙏🙇‍♀️

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻సోమవారం,మే.25,2026శ్రీ పరాభవ నామ సంవత్సరంఉత్తరాయణం - గ్రీష్మ ఋతువుఅధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షంతి...
25/05/2026

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం,మే.25,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం
తిథి:నవమి ఉ8.12 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పుబ్బ ఉ6.39 వరకు
యోగం:హర్షణం ఉ7.35 వరకు
కరణం:కౌలువ ఉ8.12 వరకు
తదుపరి తైతుల రా8.00 వరకు
వర్జ్యం:మ1.56 - 3.33
దుర్ముహూర్తము:మ12.22 - 1.13
మరల మ2.57 - 3.48
అమృతకాలం:రా11.39 - 1.16
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.24
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

*ఈ సూర్యాలయం నుంచే ముల్తానిమట్టి వచ్చేది*🙏🌞హైందవమతంలో సూర్యారాధనకి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మనం నిత్యం జపించుకునే ...
24/05/2026

*ఈ సూర్యాలయం నుంచే ముల్తానిమట్టి వచ్చేది*

🙏🌞హైందవమతంలో సూర్యారాధనకి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. మనం నిత్యం జపించుకునే గాయత్రి సైతం సూర్యుని స్తుతించే మంత్రమే అన్న వాదనలు లేకపోలేదు. అలాంటి సూర్యుని కొలుచుకునేందుకు వేల ఏళ్ల క్రితమే ఓ ఆలయాన్ని నిర్మించారు. అదే పాకిస్తాన్లోని ముల్తాన్ సూర్యదేవాలయం! దాదాపు రెండువేల సంవత్సరాలకు పూర్వమే పాకిస్తాన్లోని కశ్యపపురం అనే నగరంలో ఓ సూర్యదేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

🙏🌞 ఆ నగరానికంతటికీ ఆ సూర్యదేవాలయమే ముఖ్య ఆకర్షణగా ఉండేదట. ఆ ఆలయాన్ని దర్శించుకుని, తమ మొక్కులను చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు వేలాదిగా తరలివచ్చేవారట. అందుకే ఆ నగరాన్ని మూలస్థానం అని పిలుచుకోసాగారు. క్రమేపీ ఆ పేరు ‘ముల్తాన్’గా మారిపోయింది.

🙏🌞ముల్తాన్లోని సూర్యదేవాలయాన్ని కృష్ణుని కుమారుడైన సాంబుడు నిర్మించినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. అనుకోకుండా ఒక పాపకార్యం చేసిన సాంబుడిని, కుష్టు వ్యాధితో బాధపడమని కృష్ణుడు శపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు సాంబుడు ముల్తాన్లో గొప్ప సూర్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

🙏🌞అప్పటి నుండి మీదట ప్రజలంతా కూడా తమ రోగాలు, కష్టాల నుంచి విముక్తి పొందేందుకు ఈ ఆలయాన్ని దర్శించసాగారు. అక్కడి మట్టికి సైతం రోగాలను నయం చేసే మహిమ ఉందని నమ్మేవారు. ఆ మట్టిని తమతో పాటుగా తీసుకువెళ్లేవారు. అలా ఒంటికి రాసుకునే ఏ మట్టికైనా ముల్తానీ మట్టి అన్న పేరు స్థిరపడిపోయింది.

🙏🌞అప్పట్లో ఈ దేవాలయాన్ని దర్శించిన చరిత్రకారుల ప్రకారం ఇక్కడి ఆలయంలోని విగ్రహాలు, తలుపులు, స్తంభాలు, శిఖరాలు... అన్నీ కూడా వెండి, బంగారాలతో ధగధగలాడిపోతుండేవి. ఆలయాన్ని సందర్శించే భక్తులు సమర్పించుకునే కానుకలు రాజ్యానికి ముఖ్య ఆదాయంగా ఉండేవి. ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద ముస్లిం పాలకుల ఆధిపత్యం మొదలయినా కూడా ఆలయానికి ఏమాత్రం ఢోకా రాలేదు. క్రమేపీ ఆ పాలకుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఆ పోరులో ముల్తాను మీద పైచేయి సాధించినవారు తమ కసినంతా సూర్యదేవాలయం మీద చూపించారు. పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద దండెత్తిన గజనీ మహమ్మద్ ఆ ధ్వంసాన్ని పరిపూర్ణం చేశాడు. ఇప్పుడైతే ఈ సూర్యదేవాలయం ఎక్కడుందో కూడా ఆనవాళ్లు లేవు.

🙏🌞ముల్తాన్లో సూర్యదేవాలయంతో పాటుగా మరో విశిష్టమైన దేవాలయం కూడా ఉండేది. అదే నరసింహస్వామి ఆలయం. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు పాలించిన రాజ్యం ఈ ప్రాంతమే అని భక్తుల నమ్మకం. అందుకనే ఈ ఊరికి హిరణ్యకశిపుని పేరు మీదుగా కశ్యపపురం అనే పేరు కూడా ఉంది.

🙏🌞హిరణ్యకశిపుని వధ తర్వాత, స్వయంగా ప్రహ్లాదుడే ఇక్కడ నరసింహస్వామికి ఓ ఆలయాన్ని నిర్మించాడట. ఈ ఆలయాన్ని కూడా ఎప్పటికప్పుడు అల్లరిమూకలు ధ్వంసం చేస్తూ వచ్చాయి. అయినా కూడా స్థానిక హిందువులు ఆలయాన్ని పునర్నిర్మించుకునేవారు. 1992లో మన దేశంలో బాబ్రీ మసీదుని కూల్చివేసినందుకు నిరసనగా, ఈ ఆలయాన్ని దాదాపుగా నేలమట్టం చేసేశారు. ప్రస్తుతానికి ఆ ఆలయం తాలూకు మొండి గోడలు మాత్రమే మిగిలాయి.
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅

రెండు గంటల నిరీక్షణనాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు ...
24/05/2026

రెండు గంటల నిరీక్షణ

నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి, “సంపూర్ణంగా విశ్రాంతి అవసరం. మంచం నుండి కదలడానికి వీల్లేదు” అని చెప్పి వెళ్ళిపోయారు.

ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. “పరమాచార్య స్వామివారి దర్శనానికి హింది పంతుల్ని ( మానాన్న) రమ్మంటున్నారు” అని.

అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనస్సు సిద్ధమయ్యింది కాని వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి, అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తరువాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హింది పండితుడు ఉండాలి అని మహాస్వామి వారు అనుకుని ఉంటారు.

నాన్నగారు వెళ్ళాల్సిందే. నాలుగైదు రోజులుగా నాన్న అన్నంగంజి తప్ప ఏమి తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టరు గారు ఖండితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. అ సేవకుని సహాయంతో మహాస్వామివారి వద్దకు వెళ్ళారు.

నాన్నని కూచోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు, పత్రాలను చదివి పంపారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు;

అలా రెండుగంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తనే, “స్వామివారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నాకు ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏమిటి?” అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు.

వెంటనే అతను, “హింది పండితునికి ఆరోగ్యం బాగోలేదు. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు” అని చెప్పాడు.

మరునిముషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చెయ్యడానికి రాగా, ”అవసరం లేదు. నేను నడవగలను” అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు.

ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, “నాకు ఆకలేస్తోంది. చాలా ఆకలేస్తోంది. ఏమి చేశారు ఇంట్లో?” అని అడిగారు. “డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు” అని అన్నాము.

“అతను చెప్పనీ. . . నాకు భోజనం పెట్టండి” అన్నారు. నాన్న ఆరోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయింత్రం నాన్నని పరీక్షీంచడానికి డాక్టర్ వచ్చారు. “అసలు జ్వరం లేదు. నేను ఇచ్చినది కాక ఇంకే ఔషధం తీసుకున్నారు?” అని అడిగారు.

“మీరు ఇచ్చినదే తీసుకున్నాను”

“లేదు.. లేదు.. మీరు ఏదో వేరే చేశారు”

అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండుగంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగినదంతా డాక్టరుకు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ,

“అది సంగతి. నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని.. నేను సరిగ్గానే ఊహించాను. రెండుగంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీమీద పడి, మొత్తం మీ ఆనారోగ్యాన్ని పారద్రోలింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి, వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీమీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు” అని చెప్పారు.

ఏమి కరుణ!! ఎంతటి కరుణాసముద్రులు!!

మహాస్వామివారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరమూ చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము.

--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 7

- #కంచిపరమాచార్యవైభవం

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸*శ్రీ మూకశంకర విరచిత**మూక పంచశతి**పాదారవింద శతకం - 2**శ్లోకము - 35**వషట్కుర్వన్మాంజీరకలకలైః కర్మలహరీ-**హవీంష...
24/05/2026

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*పాదారవింద శతకం - 2*

*శ్లోకము - 35*

*వషట్కుర్వన్మాంజీరకలకలైః కర్మలహరీ-*
*హవీంషి ప్రౌద్దండం జ్వలతి పరమజ్ఞానదహనే ।*
*మహీయాన్కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం*
*మనోవేద్యాం మాతస్తవ చరణయజ్వా గిరిసుతే ॥*

*భావము 😗

*జగన్మాతా! నీ పాదములు యజ్ఞ కుండములో హోమమును ఆచరించే కర్త అయితే, నీ పాదముల అందియల స్వరములు వేదమంత్రములు. జీవుల కర్మములే యజ్ఞములో వేసే హవిర్భాగములు. మండుతున్న అగ్ని జ్ఞానము. సద్గుణుల హృదయమే హోమవేదిక. యజ్ఞకర్త సాక్షాత్తు నీ రూపమే.*

🌸 *శ్రీమాత్రే నమః* 🙏

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸*సన్యాస స్వీకారము*సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను...
24/05/2026

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*సన్యాస స్వీకారము*

సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Address

Street No: 23, Anand Bagh
Secunderabad
500047

Opening Hours

Monday 6am - 12pm
6pm - 8pm
Tuesday 6am - 12pm
6pm - 8pm
Wednesday 6am - 12pm
6pm - 8pm
Thursday 6am - 12pm
6pm - 8pm
Friday 6am - 12pm
6pm - 8pm
Saturday 6am - 12pm
6pm - 8pm
Sunday 6am - 12pm
6pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sathya Sai-Shirdi Sai- Lalitha Devi Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share