Sri Sathya Sai-Shirdi Sai- Lalitha Devi Temple

Sri Sathya Sai-Shirdi Sai- Lalitha Devi Temple All types of poojas are done to Sri Sathya sai, Shirdi sai and very beautiful Sri Lalitha devi. All major Hindu festivals are celebrated with special puja.

Special Activities

Temple celebrates Vijayadasami, Guru Purnima, Sri Ramanavami, and temple anniversary with special activities. Sai Satya Vratalu are conducted during Guru Purnima, Vijayadasami and during temple anniversary. Annadanam (food offering) is organized during auspicious occasions like Guru Purnima, Vijayadasami and temple anniversary. Palabhishekam (holy bath with milk) using 108 lite

rs of fresh milk is offered to Baba on Guru Purnima, Vijayadasami and on temple anniversary. Satyanarayana Swami Vratalu, Rama Kalyanam, Siva Kalyanam and Venkateswara Swami Kalyanam are also organized in the temple premises.

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…నడిచే దేవుడు…పరమాచార్య పావన గాధలు…                   *భార్య - భర్త!*                    భార్య...
27/08/2026

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

నడిచే దేవుడు…
పరమాచార్య పావన గాధలు…

*భార్య - భర్త!*

భార్య గురించి,భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు...

వేదము ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసితీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే.

ఆ సహాయకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికి నీనుండి విడదీయలేని ఆస్తి.

ఆమె ఉపయోగం నీకు కేవలం వండిపెట్టడానికి, నీఇంద్రియాలకు తృప్తి నివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను “ధర్మ-పత్ని”, “యజ్ఞ-పత్ని” అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం.

ధర్మపత్నిగా ధర్మాచరణయందు ఆయన పక్కన ఉండాలి.మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి.

ఆమె తన భర్తకు కేవలం వంట చేసి, అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్టే! అది ఎలాగంటే ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్ష్యాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల ‘అతిథిసేవ’ ‘వైశ్వేదేవము’ కూడా జరుపబడతాయి.

ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు. ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాలకోసమే. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు.

మన సనాతన ధర్మంలో స్త్రీపురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాలకోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి.

వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి కాని మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది.

మన సనాతన ధర్మంలో వివాహం, భర్తను ఉత్తమ స్థితికి తీసుకునివెళ్ళి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే.

ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సామాజిక ఒప్పందం మాత్రమే.

కాని ఇక్కడ మనవారిది ఆత్మ సంబంధం. కాని ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాలనుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావు లేదు. అది తలవడం కూడా పాపమే.

మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిసి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది.

1.మొదటిది: వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు,సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదికధర్మాచరణకు తోడ్పాటునివ్వడం.

2.రెండవది: మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదికసంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలుచేసే సంతానం అవుతారు.

3. మూడవది: స్త్రీకి ప్రాపంచిక ఉనికినుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతనికంటే పైస్థాయిని పొందుతుంది.

4. నాలుగవది: పైమూడు విషయాలకోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం.

కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే- శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపచేయడం.

మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాలకొరకు సశాస్త్రీయ వివాహము చేసుకొన్నచో ఆత్మోన్నతి తప్పక పొందెదరు. చంద్రమౌళీశ్వరుడు మిమ్ము కాపాడుగాక!!!
`”బాలస్థావత్క్రీడాసక్తః తరుణస్థావత్తరుణీసక్తః వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః॥”
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

_*శ్రావణమాస మహాత్మ్యము-14*_     _*చతుర్దశాధ్యాయము*_బ్రహ్మశ్రీ చల్లా లక్ష్మీనృసింహ శాస్త్రిగారు(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో...
27/08/2026

_*శ్రావణమాస మహాత్మ్యము-14*_
_*చతుర్దశాధ్యాయము*_
బ్రహ్మశ్రీ చల్లా లక్ష్మీనృసింహ శాస్త్రిగారు
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

_*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం!*_
_*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్!!*_
🙏

_*ఈశ్వర ఉవాచ!*_

🪷 సాంబమూర్తి చెప్పుచున్నాడు♪...,

🪷 ఓ మునీశ్వరా! యిక ముందు శ్రావణ శుద్ధ పంచమి దినంబున చేయతగిన వ్రతం చెప్పెదను♪.

🪷 చవితియందు ఒక్కసారి భుజించి, పంచమి దినమున రాత్రి భుజించవలయును♪. బంగారంతో గాని, వెండితో గాని, కొయ్యతో గాని, మట్టితో గాని ఐదు పడగలు గల సర్పం ఏర్పరచి దానిని పంచమి దినమున పూజింపవలయును♪. మరియు ద్వారమునకు రెండు ప్రక్కలను విషముతో అధికంగా నుండు సర్పములను గోమయంతో లిఖించి, గరిక చిగుళ్లు, కరవీర పుష్పములు, గన్నేరు పుష్పములు, జాజిపువ్వులు, సంపంగి పువ్వులు, గంధం, అక్షతలు, మొదలగు వానిచే పూజించి ధూపదీపాదులను ఇవ్వవలయును♪.

🪷 అనంతరము నెయ్యి, పరమాన్నము, కుడుములు, మొదలగువానిచే బ్రాహ్మణులను భుజింపచేయవలయును మఱియు అనంతరము వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కంబలుడు, కర్కోటకుడు, నాగుడు, ధృతరాష్ట్రుడు, శంఖపాలుడు, కాళీయుడు, తక్షకుడు, మొదలగు సర్పరాట్టులను మఱియు ఇతర సర్పములను గోడయందు పసుపుతోటి, మంచిగంధముతోటి, ఆకారములను లిఖియించి పుష్పములు మొదలగు వానిచే పూజింపవలయును♪.

🪷 పుట్టయందు పూజచేసి దానిలోనుండు సర్పములు తాగుటకు పాలు పోయవలయును♪. మఱియు నేతితో మిళితమైన పంచదార మొదలగు మధురపదార్ధములను ఇష్టమైనట్లు ఉంచవలయును♪. ఆ దినంబున పోళీలు మొదలగునవి చేయగూడదు♪. ఇనుము పాత్రను వాడగూడదు♪. నివేదనకు పరమాన్నమును భక్తితో ఉంచవలయును♪. వేయించిన శనగలును బియ్యమును జొన్నలును సర్పములకు నివేదన చేయవలయును♪. వానినే తాను భుజింపవలయును♪.

🪷 ఆ నివేదన చేయబడిన శనగలు మొదలగువానిని పిల్లలకు పెట్టవలెను♪. వానిని భుజించిన పిల్లలు దంతపుష్టి గలవారగుదురు, మఱియు స్త్రీలు అలంకరించుకొని పుట్టవద్ద సంగీతము పాడుటయు, వాద్యములను వాయించుటయు, విశేషమహో త్సవములను జరుపుటయు చేయవలయును♪. యిట్లు చేసిన యెడల, వానికి ఎప్పటికిని సర్పముల వలన భయము కలుగబోదు♪.

🪷ఓ మునీశ్వరుడా♪! ప్రపంచమునకు మేలు కొఱకు మఱియొక సంగతిని నీకు తెలియ పరచెదను దానిని వినుము♪.

🪷 ఓ చిన్నవాడా♪! సర్పముచే కరవబడినవాడు, మృత్యువునొంది, అధోగతుడై తిరిగి సర్పముగా బుట్టును♪. కాఁబట్టి, అట్టి దోషములేమియు పొందకుండా ఉండుటకుగాను, నాగపంచమీ వ్రతమును చేయవలెను♪.

🪷 కాఁబట్టి, పూర్వము జెప్పిన రీతిగా ఒక్కసారి భుజించుటయు, బ్రాహ్మణులతో గూడ సర్పపూజ గావించుటయు చేయవలెను♪.

🪷 ఈ ప్రకారము పండ్రెండు మాసములలో ప్రతి మాసమునందును వ్రతము ఆచరించవలయును♪. సంవత్సరము పూర్తికాగానే శుక్ల పక్ష పంచమి దినంబున సర్పముల తృప్తికొఱకు బ్రాహ్మణులను, యతీశ్వరులను భుజింపచేయవలెను♪. కథలను వినిపించిన వానికి రత్నములతో గూర్చబడిన బంగారపు నాగప్రతిమను, దూడ గలదియు, బంగారపు కొమ్ములు గలదియు, వెండి డెక్కలు గలదియు విశేషముగా పాలు ఇచ్చునదియు ఐన గోవును దానమివ్వవలయును♪.

🪷 దానమిచ్చు సమయమున - సమస్తమును వ్యాపించినవాడును, సమస్తమును ఇచ్చువాడును, ఎవనిచే జయింపబడని వాడును అగు భగవంతుని స్మరింపుచు, నిట్లు చెప్పవలెను♪...

🪷 *ఓ భగవంతుడా! నా వంశంబున సర్పదష్టులై మృతినొంది, అధోగతులు అయియుండిరేని వారందరు ఇప్పుడు నేను జేసిన వ్రాత ప్రభావముచే ముక్తి నొందుదురు గాక! అని చెప్పి మంచి గంధముతో కలిపిన అక్షతలను ఉదకముతో గూడ భక్తి పూర్వకముగా భగవంతుని ఎదుట ఉదకముతో విడువవలెను♪.

💐 ఈ ప్రకారము వ్రతమాచరించిన యెడల ఇదివరలో మృతినొందిన వారు, ఇకముందు మృతినొందెడి వారును సర్పముల వలన భయమునొందక స్వర్గమును పొందగలరు♪.

🪷 ఓ మునీశ్వరుడా♪.! ఈ ప్రకారము తన వంశస్తులనందరిని తరింపజేసి తానును అప్సర స్త్రీలచే సేవింపబడును♪. శివలోకమును పొందును♪. తనకు శక్తి కొలది లోభింపక వ్రతమును చేసినవాడు పూర్వం చెప్పబడిన ఫలమును పొందును♪.

🪷 భక్తి కలవారై శుక్ల పక్ష పంచమి యందు సర్పములను పుష్పముల చే పూజింపుచు నక్తభోజనము చేసిన వారి యొక్క గృహముల యందు భయము ఎంత మాత్రము కలగనీయక సర్పములు మణుల కాంతులతో ప్రకాశింపుచు సంతోషముతో తిరుగుచుండును♪.

🪷 ఈ వ్రతమును ఆచరింపని బ్రాహ్మణులు గృహదానమును స్వీకరించినయెడల విశేష నరకమును అనుభవించి సర్పరూపులగుదురు♪.

🪷 ఎవరైనను సర్పములను చంపినచో వారు మృతినొందిన పిమ్మట రెండవ జన్మమునందు పుట్టిన సంతావము నశించువారుగాని పుత్రులు లేని వారుగాని కాగలరు♪. స్త్రీల యందు కార్పణ్యముగా ఉన్నట్టివారును, ఆక్షేపణలను చేసిన వారును, అబద్ధము పలికినవారును సర్పములుగా పుట్టుదురు♪. మఱియు ఇతరములగు అనేక కారణముల వలన సర్ప స్వరూపములుగా పుట్టెదరు, కాఁబట్టి, అట్టి సమస్త దోషములకును ఈ చెప్పబడిన వ్రతము మిక్కిలి ప్రాయశ్చిత్తముగా చెప్పబడెను♪.

🪷 ద్రవ్యలోపం లేకుండా నాగపంచమీ వ్రతమును చేసినయెడల సమస్త సర్పములకు అధిపతులగు శేషుడును, వాసుకియు సంతృప్తులై వ్రతము చేసిన వానికి మేలు చేయుట కొఱకు దోసిలి పట్టుకొని ప్రభువులగు విష్ణుమూర్తిని సాంబమూర్తిని ప్రార్థించెదరు♪. సర్వదేవతా సార్వభౌములగు శివకేశవులు - శేషవాసుకుల విజ్ఞాపనచే సంతుష్టాంతరంగులై సమస్త కోరికలనొసగుచున్నారు♪. ఇట్లు వారు ఒసగిన సమస్త కోరికలను ఇహలోకంబున అనుభవించిన పిమ్మట నాగలోకమునకేగి అచ్చట సంభవించిన సమస్త భోగములను అనుభవించి, అనంతరం మంగళపదములగు వైకుంఠము, కైలాసము లోకములకేగి అచ్చట శివవిష్ణువులకు భృత్యగణములతో చేరి, సేవ చేయుచు, అనంతరం పరమసుఖకరమగు ముక్తినొందెదరు♪.

🪷 ఓ చిన్నవాడా♪.! ఇట్టి శ్రేయస్కరముగు నాగపంచమి వ్రతమును జెప్పితిని, మఱియు ఇంతకంటే మఱియొక వ్రతం ఏదియైనను నీవు వినదలచినచో దానిని గూర్చి అడుగుము చెప్పెదను,♪.. అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను♪.


_*||ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే - "నాగపంచమీ" వ్రత కథనం నామ చతుర్దశోధ్యాయస్సమాప్తః|*
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

ఓం నమః శివాయ భాగం:6327. నామినందిఅడిగళ్చోళరాజ్యంలో ఏమాపెరూరు (ఇప్పుడు తిరుమప్పత్రు లేక నైప్పెరు) గ్రామంలో ఒక బ్రాహ్మణ కుట...
27/08/2026

ఓం నమః శివాయ

భాగం:63

27. నామినందిఅడిగళ్

చోళరాజ్యంలో ఏమాపెరూరు (ఇప్పుడు తిరుమప్పత్రు లేక నైప్పెరు) గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబములో నామినంది ఆడిగళ్ జనన మొందాడు.

ఈవూరు నుంచి తిరువారూరునకు 2 గంటల నడకదూరముంది. పరమశివుడే నామినంది రక్షకుడు.

ప్రతిదినము తిరువారూరు వెళ్లి శివుని అర్చించి వచ్చేవాడు. మనుష్యునకు పరమశివుని పాదకమలముల పూజయే సార్థకత నిస్తుందని తలచేవాడు.

ఒక రోజున తిరువారూరు శివునికి ఏ విధమైన అర్చన చేసిన బాగుండునో నని ఆలోచిస్తే దేవునికి దీపారాధన ఉత్కృష్టమైన దనిపించింది.

సూర్యుడస్తమించబోతున్నాడు. పట్టణంలోనికి వెళ్లి దీపారాధనకు నెయ్యి తీసుకు రావటానికి జాగవుతుందని తోచింది.

అందుకని దగ్గరలో నున్న ఇంటికి వెళ్లి శివునికి దీపారాధనకు కొంచెం నేయి ఇమ్మని ప్రార్థించాడు. అతనికి తెలియదు అది శివారాధన కువ్యతిరేకులయిన జైనుల ఇల్లని.

వారు ఇతనిని హేళన చేశారు. చేతిలో అగ్నివుంచు కొన్న పరమశివునికి దీపం సూర్యుని ముందు దివిటీ అని వెక్కిరించి, నీవు దీపాలు వెలిగించదలుచుకుంటే నీళ్లతో దీపాలను వెలిగించమని మొరటుగా జవాబిచ్చారు.

ఈ మాటలువినగానే నంది అడిగళ్కు చిన్నతనమనిపించింది. హృదయావేదన కలి గింది. దు:ఖిస్తూ గుడిలోనికి వెళ్లి దేవుని పాదాలమీద పడ్డాడు.

దేవుని హృదయ విదార కంగా ప్రార్థించాడు. ఇంతలో ఒక వాణి వినిపించింది. నీరు తెచ్చి ఆ నీటితో దీపాలు వెలి గించుఅన్న మాటలు వినబడ్డాయి.

పరమానంద భరితుడై నామినంది అడిగళ్, నీళ్లతో దీపాలన్నీవెలిగించాడు.

ఈ అద్భుతాన్ని చూచి వెక్కిరించిన జైనులందరూ ఆశ్చర్య చకితుల య్యారు.నంది అడికళ్ - ఇలా చాలరోజులు దీపాలను వెలిగించాడు. ఈ అద్భుతాలతో చాలమంది జైనులు శైవులయ్యారు.

చోళరాజు నంది అదిగళ్ గూర్చి చాలగొప్పగా విన్నాడు. విని అతనిని ఆ ఆలయానికి అధికారిగా నియమించాడు.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌞 ఆగష్టు 27, 2026 🌝*శ్రీ పరాభవ నామ సంవత్సరం**దక్షిణాయనం*వర్ష ఋతువు *శ్రావణ మాసం*శుక్ల పక్షం తిథి:...
27/08/2026

🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌞 ఆగష్టు 27, 2026 🌝
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*దక్షిణాయనం*వర్ష ఋతువు

*శ్రావణ మాసం*శుక్ల పక్షం
తిథి: *చతుర్దశి* ఉ.8.27 వరకు
తదుపరి : పౌర్ణమి
వారం: *బృహస్పతివాసరే*
(గురువారం)
నక్షత్రం: *ధనిష్ఠ* రా.2.49
యోగం: *శోభన* ఉ.9.33
కరణం: *వణిజ* ఉ.8.27
*&*
*భద్ర* రా.8.51
వర్జ్యం: *ఉ.శే.వ 7.12 వరకు
దుర్ముహూర్తము:ఉ.*9.57-10.47*
*&*
*మ.2.57-3.47*
అమృతకాలం:మ.3.43-5.26
రాహుకాలం:మ.1.30-3.00
యమగండం:ఉ.6.00-7.30
సూర్యరాశి: *సింహం*
చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *ఉ.5.48*
సూర్యాస్తమయం: సా.6.17

సర్వే జనాః సుఖినోభవంతు
🕉 *_శుభమస్తు_* 🕉

*విష్ణువు అనుగ్రహానికి రెండు మార్గాలు* 🙏\|/🪷 లోకంలోని ప్రజానీకమంతా అనేకానేక క్రతువ్రత దానాలచేత ఆ కమలనాభుని (విష్ణుమూర్తి...
26/08/2026

*విష్ణువు అనుగ్రహానికి రెండు మార్గాలు*

🙏\|/🪷 లోకంలోని ప్రజానీకమంతా అనేకానేక క్రతువ్రత దానాలచేత ఆ కమలనాభుని (విష్ణుమూర్తిని) సేవించుకుంటూ వుంటారుకదా. వాటిలో దేన్ని ఆచరించడంవల్ల విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో, దేనివల్ల విష్ణు సాక్షాత్కారం లభించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందో తెలుసా! దాని గురించి ఈ వృత్తాంతం తెలుసుకోండి.

🙏\|/🪷పూర్వం కాంచీపురాన్ని ''చోళుడు'' అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరుమీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి చెందాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. యజ్ఞాలకోసం నిర్మించిన బంగారు యూపస్తంభాలతో తామ్రపర్ణీ నది రెండు తీరాలు కుబేర ఉద్యానవనాలైన ''చైత్రరథాల'' వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకనాడు ''అనంతశయన'' పేర యోగనిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయనికి వెళ్ళి మణి మౌక్తిక సువర్ణ పుష్పాలతో శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి స్థిమితంగా శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు.

🙏\|/🪷అంతలోనే ''విష్ణుదాసు'' అనే బ్రాహ్మణుడు విష్ణువును పూజించేందుకు ఆలయానికి వచ్చాడు. విష్ణుసూక్తాన్ని పఠిస్తూ, అభిషేకం చేసి తులసిదళాలతోనూ గుత్తులతోనూ విష్ణుపూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణ అభిజాత్యాన్ని విస్మరించి ''ఓరి విష్ణుదాసుడా! నేను మాణిక్యాలతోనూ, బంగారు పూలతోనూ చేసిన నా పూజవల్ల ప్రకాశమానుడైన ఆ ప్రభువును తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావు? నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడుచేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా?'' అన్నాడు.

🙏\|/🪷ఆ మాటలకు బ్రాహ్మణునికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి ''రాజు'' అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ''ఓ రాజా! నీకు దైవభక్తి లేదు సరికదా, ఐశ్వర్యమత్తుడివై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నువ్వు ఆచరించిన యజ్ఞం ఏదైనా ఒక్కటుంటే చెప్పు'' అనడిగాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ ''నీ మాటలవల్ల నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది. ధనహీనుడివి, దరిద్రుడివి అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నువ్వు ఎప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడివి.. నీకు భక్తుడివి అనే అహంకారం మాత్రం ఉంది. ఓ సదస్యులారా! సద్బ్రాహ్మణులారా! శ్రద్ధగా వినండి.. నేను విష్ణు సాక్షాత్కారం పొందుతానో, ఈ బ్రాహ్మణుడు పొందుతాడో చూడండి. అంతటితో మా ఇద్దరి భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది'' అని ప్రతిజ్ఞా పూర్వకంగా పలికి, చోళుడు స్వగృహానికి వెళ్ళి ''ముద్గలుడు'' అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు యాగానికి పూనుకున్నాడు.

🙏\|/🪷బహుకాల పూర్వం గయ క్షేత్రంలో ఋషి సముదాయాలు చేసిన, అన్నదానాలు, అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించసాధ్యం కానిది సర్వ సమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు

🙏\|/🪷పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ, కార్తీక వ్రతాచరణలూ, తులసివన సంరక్షణలు, ఏకాదశినాడు ద్వాదశాక్షరీ యుత విష్ణుజపం, షోడశోపచార విధిని నిత్యపూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ తన శక్తిమేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యం సర్వ వేళల్లోనూ భోజనాది సమయాల్లో సంచారమందు, తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ, కార్తీక మాసాల్లో విశేష నియమపాలన చేస్తున్నాడు.

🙏\|/🪷 ఇలా భక్తులైన చోళ, విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రత నిష్ఠలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలాకాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు.

🙏\|/🪷కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసి వెళ్ళిపోయారు. దాని గురించి విష్ణుదాసు విచారణ చేయలేదు. కానీ తిరిగి వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండటంవల్ల ఆరోజు భోజనం లేకుండానే విష్ణుపూజలో గడిపేశాడు. మర్నాడు కూడా వంటచేసుకుని శ్రీహరికి నివేదించేలోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు.

🙏\|/🪷విష్ణు పూజకు వేళ మించకూడదని ఆరోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తున్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారంరోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలి అనిపించింది.

🙏\|/🪷అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే వంటకాలను పూర్వస్థానంలోనే ఉంచి తాను చాటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం దీనంగా ఉంది. ఎముకల గూడులా ఉన్నాడు. అతన్ని చూసి జాలిపడిన బ్రాహ్మణుడు ''ఓ మహాత్మా! కాసేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకు వెళ్ళు'' అంటూ నేతిగిన్నెతో అతని వెంటపడ్డాడు.

🙏\|/🪷ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించడానికే అనే భయంతో చండాలుడు పరుగుతీయసాగాడు. విప్రుడేమో ''అయ్యా! నేతితో కలుపుకుని తినవయ్యా'' అంటూ వెంబడిస్తూనే ఉన్నాడు. చివరికి చండాలుడు కిందపడి మూర్ఛపోయాడు.

🙏\|/🪷వెనకే వచ్చిన బ్రాహ్మణుడు ''అయ్యో, మూర్ఛపోయావా?'' అంటూ తనపై వస్త్రపు చెంగుతో చండాలునికి విసరసాగాడు. ఆ సేవవల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్ళకు శంఖచక్ర గదాదారి, పీతాంబరుడు, చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతను అవాక్కయ్యాడు.

🙏\|/🪷ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదిదేవతలు విమానరూఢులై అక్కడికి వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసునిమీద కూడా పూలవాన కురిపించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. ఆదినారాయణుడు విష్ణుదాసుని ప్రేమగా కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతోబాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయల్దేరాడు.

🙏\|/🪷 యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి ''ఓ ముద్గరమునీ! నాతో జగడమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్తున్నాడు.

🙏\|/🪷ఇంత ఐశ్వర్యవంతుని అయ్యుండీ, కఠినమైన యజ్ఞదానాలు చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారం పొందలేక పోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా! నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నామీద లేశమైనా కృప కలిగినట్లు లేదు. దీన్నిబట్టి మహా భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గంలేదు. ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను'' - అని చెప్పాడు.

🙏\|/🪷బాల్యం నుంచీ యజ్ఞదీక్షలోనే ఉండటంవల్ల నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.

🙏\|/🪷ఆ కారణంచేతనే చోళ దేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్ళే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరికి చేరి ''ఓ శ్రీహరీ త్రికరణ శుద్ధిగా నీపట్ల భక్తిని సుస్థిరం చేయి తండ్రీ!'' అని ప్రార్ధించి సమస్త సదస్యులూ చూస్తుండగానే అగ్నిప్రవేశం చేశాడు.

🙏\|/🪷 అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికేసుకున్నాడు. అది మొదలు వారి గోత్రము ఈనాటికీ ''విశిఖ''గానే వర్ధిల్లుతోంది.

🙏\|/🪷 హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో పాటు వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు.

🙏\|/🪷 ఈవిధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని, ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు.

🙏\|/🪷అందువలన విష్ణు అనుగ్రహానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం, రెండోది ఆత్మార్పణం.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

*🏹 మాయలేడి - సీతాపహరణం 🏹* *🙏🏹సీతారామలక్ష్మణులు వనవాసకాలంలో రావణాసురుడి చెల్లెలు సూర్పణఖ వచ్చి రామలక్ష్మణులును చూసి వారిన...
26/08/2026

*🏹 మాయలేడి - సీతాపహరణం 🏹*

*🙏🏹సీతారామలక్ష్మణులు వనవాసకాలంలో రావణాసురుడి చెల్లెలు సూర్పణఖ వచ్చి రామలక్ష్మణులును చూసి వారిని మోహించి తనను పెళ్లిచేసుకోమంటుంది.దానికి కోపించిన లక్ష్మణుడు సూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపుతాడు. రావణుడి దగ్గరకు వెళ్లిన సూర్పణఖ జరిగిన విషయం చెప్పి సీతాదేవి అందచందాలు పొగిడి సీతాదేవిని ఎలాగైనా ఇక్కడకు తీసుకువచ్చి పెళ్లి చేసుకోమని చెబుతుంది.*

*🙏🏹రావణుడు వెంటనే గోకర్ణం వెళ్ళి మారీచుని చూసి కలిసాడు. మారీచుడు రాముని చేతిలో పరాభవం చెంది శివుని గురించి తపస్సు చేసుకుంటున్నాడు. ఒకప్పుడు రావణునికి మంత్రిగా పనిచేసిన మారీచుడు రావణుని ఆహ్వానించాడు. రావణుడు "మారీచా! రాముడనే వాడు మన ఖరదూషణులను సంహరించి నాచెల్లెలును అవమానించాడు. వాడిని పరాభవించటానికి నీవు సహకరించాలి!" అన్నాడు.*

*🙏🏹ఆ మాటలు విన్న మారీచుడు వణుకుతూ… "యుద్ధంలో రాముని పరాక్రమం నీవు వినలేదేమో! శివుడు కూడా రాముని బాణానికి ఎదురు నిలువ లేడు. నీకు చేటు కాలం దాపురించి ఈ కార్యానికి పూనుకున్నావు. నేను రాముని చేతిలో ఓడిపోయి ఇలా శివుని గురించి తపస్సు చేస్తున్నాను." అన్నాడు.*

*🙏🏹"మారీచా! నా మాట వినకున్న నేను నిన్ను సంహరిస్తాను." అన్నాడు.*

*🙏🏹ఇక రావణుడు వినడని తెలుసుకుని మారీచుడు రావణుని చేతిలో మరణించే కంటే ధర్మాత్ముడైన రాముని చేతిలో మరణించడం మేలని తలిచాడు.*

*🙏🏹రావణుడు "మారీచా నీవు మాయలేడి రూపం ధరించి సీతను ప్రలోభ పెట్టు. సీత ఆ లేడిని కావాలని కోరుతుంది. రాముడు బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో రాముడు పరితపిస్తాడు" అన్నాడు.*

*🙏🏹రావణాసురుని ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడి రూపంలో ఆశ్రమ సమీపంలో తిరుగుతున్నాడు.*

*🙏🏹విధి ప్రేరితయై సీత బంగారు లేడిని తెమ్మని రాముని కోరింది. రాముడు సీత రక్షణను లక్ష్మణునుకి అందించి బంగారు లేడి కోసం వెళ్ళాడు. అందినట్లే అందుతూ ఆలేడి రాముని అడవిలో చాలా దూరం తీసుకు వెళ్ళింది. అప్పటికి రాముడు యదార్ధం గ్రహించి శరం సంధించి మారీచుని కొట్టాడు.*

*🙏🏹మారీచుడు "హా సీతా, హా లక్ష్మణా" అని రాముని కంఠాన్ని అనుకరిస్తూ ప్రాణాలు వదిలాడు.*

*🙏🌹ఆ అరుపులు విన్న సీత.. "లక్ష్మణా! మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్లున్నాడు. నీవు వెళ్ళి రక్షించు!" అన్నది.*

*🙏🌹లక్ష్మణుడు "అమ్మా! సీతా మా అన్నయ్య పరాక్రమ వంతుడు. భయపడకుము మా అన్నయ్య శత్రుసంహారం చేసి రాగలడు" అన్నాడు.*

*🙏🌹సీతకు కోపం వచ్చింది. ఆ ఆవేశంలో లక్ష్మణుని పై అనుమానం వచ్చింది. "లక్ష్మణా! నీ తలపు అర్ధం అయింది నీకు నా మీద ఆశ ఉంది. నేను చావనైనా చస్తాను కాని నీకు దక్కను" అని కఠోరంగా పలికింది.*

*🙏🏹ఆ మాటలు భరించలేని లక్ష్మణుడు విల్లంబులు పట్టుకుని లక్ష్మణరేఖ గీచి ఎట్టి పరిస్థితిలో ఈరేఖ దాటి రావద్దని సీతమ్మకు చెప్పి రాముడు వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు.*

*🙏🏹అవకాశం కోసం చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. మార్గాయాసంతో అలసినట్లు కనిపిస్తున్న రావణుని చూసి సీతమ్మ లక్ష్మణరేఖ దాటి వచ్చి అతిథి సత్కారాలు చేసింది. సీతను చూసిన రావణుడు మోహవివశుడై "సుందరీ! నా పేరు రావణుడు, దానవ నాయకుడను, నా రాజధాని లంక. నీవు నన్ను భర్తగా వరించి భోగాలు అనుభవించు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట తిరుగుతున్న రామునితో ఏమి సుఖపడతావు. వేరు ఆలోచించక నన్ను వరించు" అన్నాడు.*

*🙏🌹సీత… "అయ్యా! మీరు ఇలా మాట్లాడటం తగునా? సూర్యచంద్రులు తేజం కోల్పోయినా, ఆకాశం నేల కూలినా, సముద్రములు ఇంకి పోయినా, భూమి బద్దలు అయినా నేను నా భర్త రాముని తప్ప అన్యుని తలవను" అన్నది.*

*🙏🏹రావణుడు భూమిని పెకళించుకొని సీతను ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు సీత పెద్దగా కేకలు వేస్తూ " దేవతలారా ! నేను జనక మహారాజు కూతురిని, రాముని భార్యను. ఈ రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకు పోతున్నాడు. మీకు నమస్కరిస్తాను నన్ను కాపాడండి" అని రోదించింది.*

*🙏🦅ఆ అరుపులు జటాయువు అనే పక్షి విని రావణుని అడ్డగించాడు… "ఓరి రావణా! ఈమెను ఎందుకు బలవంతంగా ఎత్తుకుపోతున్నావు? ఈమెను విడవకున్న నిన్ను సంహరిస్తున్నాను" అన్నాడు.*

*🙏🦅జటాయువుకు రావణునికి మధ్య పోరు ఘోరంగా జరిగింది. జటాయువు తన ముక్కుతో, గోళ్ళతో రావణుని గాయ పరచింది. రావణుడు జటాయువు రెక్కలు ఖండించాడు. జటాయువు నేల కూలాడు. రావణుడు సీతను ఎత్తుకు పోతున్నాడు. సీత ఇక తనను రక్షించే వారు లేరని అనుకుంటున్న సమయంలో ఋష్యమూక పర్వతంపై ఉన్న వానరములను చూసి తన ఆభరణములు చీర కొంగున మూటకట్టి పడవేసింది. రావణుడు సీతను లంకకు తీసుకు వెళ్ళాడు. సీతను అశోకవనంలో ఉంచి రక్షణగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచారు.*

*🙏సీతాన్వేషణ🙏*

*🙏🏹దండ కారణ్యంలో మారీచుని సంహరించి రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు ఎదురు వచ్చాడు. రాముడు… "లక్ష్మణా! రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు?”అని మందలించాడు.*

*🙏🏹లక్ష్మణుడు సీత తనను ఆక్షేపించిన విషయం వివరించాడు.*

*🙏🦅రాముడు జరిగిన దానికి చింతించాడు. రామునికి దుశ్శకునాలు గోచరించాయి. సీతకు ఏదో ఆపద వచ్చిందని మనస్సు శంకించింది. కుటీరంలో సీత కనపడ లేదు. అక్కడ కనిపించిన సంకేతాలు చూసి సీత అపహరణకు గురి అయినట్లు గ్రహించి వేదన పడ్డారు. సీత కోసం అన్వేషించటం మొదలు పెట్టారు. దారిలో కొన ఊపిరితో ఉన్న జటాయువు కనపడి.. "రామా! నా పేరు జటాయువు. నేను నీ తండ్రి దశరధునికి మిత్రుడను. నీ భార్య సీతను రావణుడు అపహరించి దక్షిణ దిక్కుగా పోయాడు. నేను అడ్డగించినందుకు నా రెక్కలు ఖండించాడు." అని చెప్పి ప్రాణాలు విడిచాడు.*

*🙏🏹రాముడు జటాయువుకు అంతిమ సంస్కారములు చేసాడు.*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…నడిచే దేవుడు…పరమాచార్య పావన గాధలు…*వేదమార్గ ప్రమాణత్వఖ్యాపకాయ*               హోమం ఎంతో వైభవంగ...
26/08/2026

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

నడిచే దేవుడు…
పరమాచార్య పావన గాధలు…

*వేదమార్గ ప్రమాణత్వఖ్యాపకాయ*

హోమం ఎంతో వైభవంగా, వైదిక మర్యాదతో జరుగుతోంది. ఇక పూర్ణాహుతి జరగాల్సిన చివరి సమయం. భక్తులు పరమాచార్య స్వామివారిని యాగశాలకు తీసుకునివచ్చారు.

స్వామివారు యాగశాల చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళి, కలశ కుండాలను దర్శించుకున్నారు. పూర్ణాహుతి చెయ్యడానికి స్వామివారి అనుమతి తీసుకోవాల్సిన సమయంలో, “పూర్ణాహుతి ఇప్పుడు వద్దు; కొద్దిసేపు అయిన తరువాత చెయ్యొచ్చు” అని స్వామివారు ఆదేశించారు.

అందరూ కలవరానికి గురయ్యారు. ఇది సరైన సమయమే కదా; మరి ఎందుకు చేయకూడదు? స్వామివారు లోపలకు వెళ్ళిన తరువాత, సేవకుడొకడిని లోపలకు పిలిచారు.

“పూర్ణాహుతికి ఉంచిన నెయ్యి మంచిది కాదు; అది హోమయోగ్యమైనది కాదు. మరలా మంచి నెయ్యిని తెప్పించమని వారికి చెప్పు”

స్వామివారి ఆదేశం ప్రకారం ఆ ఏర్పాట్లు చేసిన తరువాత, ఆ సేవకుడు నెయ్యి డబ్బాని పరిశీలించాడు. మందంగా కందెనలాంటి పదార్థంతో, ఆరేడు పురుగులతో ఉంది. ఎక్కడో మూలలో ఉంచిన సగం డబ్బాలో ఉన్న నెయ్యి మలినమైపోయిందన్న విషయం స్వామివారికి ఎలా తెలిసింది? స్వామివారివి ఎక్సరే కళ్ళా? కాదు, కాదు, వెలుగురేఖలకే వెలుగు పంచే స్వయంప్రకాశమైన కళ్ళు అవి.
********

వేదపండితుడు, నిత్యాగ్నిహోత్రి, అనుష్టానపరాయణుడు అయిన ఒక వైదికుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతడి వివరాలు కనుక్కున్న తరువాత స్వామివారు అతనితో మాట్లాడారు. ఆ పండితుని వైదిక అనుష్టానాన్ని స్వామివారు ఎంతగానో మెచ్చుకున్నారు.

“నేను ఒక యాగం చేయబోతున్నాను. అంతా సిద్ధం అయ్యింది. ఎంతోమంది సహాయం చేశారు. నేను యాగ పశువును కొనాలి. దానికి చాలా వ్యయం అవుతుంది. పరమాచార్య స్వామివారు అనుగ్రహం చూపాలి. యాగపశువును కొనడానికి శ్రీమఠం నుండి ద్రవ్య సహాయం చెయ్యాలి” అని అగ్నిహోత్రి అడిగాడు.

స్వామివారు యాగానికి ఆశీస్సులను అందించారు, “మంచి కార్యం. చాలా చక్కగా జరుగుతుంది. యాగంలో జరిగే పశుహింస అహింసయే. అది ధర్మ సమ్మతం. నేను సన్యాసిని. ‘అహింసో పరమ ధర్మః’ అన్నది నా ధర్మం. కనుక యాగపశువు కొనడానికి సహాయం చెయ్యడం నాకు ధర్మం కాదు. ద్రవ్య సహాయం కోసం ఎవరైనా గృహస్థుణ్ణి అర్థించి నీ యాగం పూర్తి చెయ్యి”.

ఆ వచ్చిన పండితుడు చాలా మొండివాడు. ఎలాగైనా మహాస్వామి వారి వద్ద ధనం తీసుకోవాలని అతని ఆశ. మహాస్వామి వారిని మాటలతో స్తుతించడం మొదలుపెట్టాడు, “ఆ... హ... హ... యజ్ఞేశ్వరుడు వైకుంఠంలో లేడు. సాక్షాత్తుగా ఇక్కడే ఉన్నాడు! పరమాచార్య స్వామియే యజ్ఞేశ్వరుడు . . .”

“శాస్త్రిగారూ! మీకు కుదిరితే యాగం చెయ్యండి. పశువును కొనడానికి శ్రీమఠం నుండి ఒక్క పైసా కూడా దొరకదు. యజ్ఞం గురించిన విషయం మాకు ముందుగానే తెలిపి వుంటే, ఉచితమైన సహాయం చేసేవాడిని. కానీ మీరు అడుగుతున్న కార్యం కోసం సహాయం చెయ్యడం సన్యాస ధర్మానికి విరుద్ధం” అని కాస్త నిష్కర్షగా చెప్పారు స్వామివారు.

ఆ వచ్చిన వ్యక్తికి కాస్త నిరాశ కలిగినా, తప్పు తనవైపు ఉంది కాబట్టి కాస్త శాంతించి వెళ్లిపోవడాన్ని శిష్యులు గమనించారు.
--- శ్రీమఠం బాలు మామ.
మహా పెరియవాళ్ -
దరిశన అనుభవంగళ్ 1.
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

శ్రావణమాస మహాత్మ్యము – 13(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం!ద...
26/08/2026

శ్రావణమాస మహాత్మ్యము – 13

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం!
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!

ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు.

ఓ మునీశ్వరా! ఇకముందు "శ్రావణ మాసములో రెండు పక్షములయందు వచ్చునటువంటి ఏకాదశుల ముందు చేయతగిన కృత్యమును" చెప్పెదను. సావధాన మనస్సు గలవాడవై వినుము.

ఓ చిన్నవాడా! శ్రేష్ఠమైన ఈ ఏకాదశీ వ్రతమును ఇదివరకు ఎవరికిని నేను చెప్పియుండలేదు. రహస్యముగా ఉన్నది. కాబట్టి, ఈ ఏకాదశీ వ్రతము విశేషమగు పుణ్యమును ఇచ్చునదిగాను, మహాపాతకములను నశింపజేయునదిగాను, మనుష్యులకు కోరిన కోరికలను ఇచ్చునదిగాను, ఉపపాతకములను అన్నింటిని నశింపజేయునదిగాను, శ్రేష్ఠమైన వ్రతములన్నింటిలోను గొప్పదిగాను, శుభములను ఒసగునదిగాను, సమస్తమైన మహామునులచేతను చెప్పబడెను.

కాబట్టి, ఓ మునీశ్వరా! ఈ ఏకాదశీ వ్రతమును నీకు చెప్పెదను. సావధానచిత్తము గలవాడవై వినుము. దశమి దినంబున ప్రాతఃకాలంబున స్నానము చేసి, పరిశుద్ధుడై, సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చుకొని, వేదమును చదివినవారు, పురాణమును తెలిసినవారు, ఇంద్రియములను జయించినవారు మొదలగు సత్పురుషుల వలన అనుజ్ఞ గైకొని, దేవదేవుడగు భగవంతుని షోడశోపచారములచేత పూజించి, “పద్మములవంటి నేత్రములు గల ఓ నారాయణమూర్తీ! ఈ దినంబున ఏకభుక్తమును, ఏకాదశీ దినంబున ఉపవాసమును చేసి, ద్వాదశీ దినంబున భుజించెదను. ఓ భగవంతుడా! నన్ను రక్షింపుము” అని ప్రార్థించవలెను.

ఓ చిన్నవాడా! ఈ మూడు దినములయందు నియమముగా ఉండి, గురువులు, దేవతలు, అగ్నిహోత్రము వీరి సన్నిధానమునందే నివసించుచు, కామక్రోధాది దుష్టగుణములను విడిచి, శాంతస్వభావము గలవాడై, ఈ మూడు దినములయందును భూమియందే పరుండవలయును.

ఓ చిన్నవాడా! అనంతరము ఏకాదశి నాడు ఉదయముననే లేచి, విష్ణువునందు చిత్తము గలవాడై, తుమ్మినను, దగ్గినను “శ్రీధర! శ్రీధర!” అని స్మరణ చేయుచు, పాషండులు మొదలగు వారిని చూచుట, వారితో సంభాషించుట, వారి మాటలను వినుట మొదలగువాటిని మూడు దినములు విడిచి, ముక్తికి కారణమగు ఏకాదశీ వ్రతమును చేయవలయును.

అనంతరము మధ్యాహ్నకాలంబున నదులు మొదలగు పవిత్రములగు జలంబున స్నానము చేసి, క్రోధాది దుర్గుణములను విడిచి, పంచగవ్య ప్రాశనము చేసి, సూర్యునకు నమస్కారము చేసి, భగవంతుని శరణును పొంది, తన కులాచార సంబంధమగు కృత్యములను నెరవేర్చి యింటికి రావలెను.

అనంతరము శ్రద్ధాభక్తులతో కూడినవాడై, పుష్పములు, ధూపములు, దీపములు, అనేక విధములగు నైవేద్యములు మొదలగువానిచే శ్రీధరుని పూజించవలయును.

ఒక కలశమునకు మంచి గంధము పూసి, దానికి నూతనమగు రెండు వస్త్రములను చుట్టి, దానిలో రత్నములు, బంగారము ఉంచి, శంఖము, చక్రము, గద మొదలగు ఆయుధములచే ఒప్పబడుచుండెడి విష్ణుమూర్తి ప్రతిమను పూర్వమందు చెప్పబడిన కలశమునందుంచి, యథావిధిగా పూజించి, ఆ రాత్రియంతయు సంగీతము, వాద్యములు, హరికథా కాలక్షేపములు మొదలగువానిచే వెళ్లబుచ్చి, ద్వాదశి నాడు తెల్లవారగానే లేచి, స్నానసంధ్యావందనాది నిత్యకృత్యములు నెరవేర్చి, శ్రీధరునియందే చిత్తము గలవాడై, ఆ ప్రతిమను తిరిగి పూజించి, దక్షిణతో కూడ ఆ కలశమును, ప్రతిమను ఆచార్యునకు దానమియ్యవలయును.

ఓ మునీశ్వరా! “శ్రీధరుడు సంతోషించుగాక, నాకు విశేషమగు ఐశ్వర్యమును ఇచ్చుగాక” అని ప్రార్థించి, జగత్ప్రభువగు విష్ణుమూర్తిని పూజించి, నవనీతము మొదలగునవన్నియు బ్రాహ్మణునకు ఇచ్చి, మరియు ఇతరులగు బ్రాహ్మణులకు కూడ భోజనము పెట్టి, తన శక్తికొలది దక్షిణను ఇయ్యవలయును.

అనంతరము భృత్యులు మొదలగు వారికిని భోజనము పెట్టి, గోవులకు పచ్చిక మొదలగు మేత వేసి, అనంతరము స్నేహితులు, బంధువులు మొదలగు వారితో కూడి తాను భుజింపవలెను.

ఓ సనత్కుమారా! ఈ ప్రకారము శ్రావణ శుక్ల ఏకాదశీ వ్రతము చెప్పబడినది. ఈ ప్రకారముగానే శ్రావణ మాసములో బహుళ ఏకాదశి యందును వ్రతము చేయవలయును.

రెండు ఏకాదశుల యందును కృత్యములు సమానమే గాని, నామములు మాత్రము వేరు. అది ఏవిధముగా అనగా, శుక్లపక్ష ఏకాదశి యందు పూజించినప్పుడు శ్రీధరుడు అనియు, బహుళపక్ష ఏకాదశి యందు పూజించునప్పుడు జనార్దనుడు అనియు పూజింపవలయును.

శుక్లపక్షంబున శ్రీధరుడనియును, బహుళపక్షంబున జనార్దనుడనియు విష్ణుమూర్తి వేరువేరు నామముల చెప్పబడుచున్నాడు. కాబట్టి ఈ విధమగు రెండు ఏకాదశీ వ్రతములను నీకు చక్కగా వివరించి చెప్పితిని.

దీనితో సమానమగు పుణ్యవ్రతము ఇదివరకు ఎక్కడను లేదు, ఇక ముందును కలుగబోదు. కావున, ఇది నీవు రహస్యముగా నుంచుము, దుష్టస్వభావులకు చెప్పగూడదు.

ఈశ్వర ఉవాచ:

ఓ మునీశ్వరుడా! ఇకముందు, “ద్వాదశి యందు విష్ణువును గూర్చి పవిత్రారోపణ వ్రతమును” చెప్పెదను, వినుము. ఈ పవిత్రారోపణ విషయమై ఇదివరకు దేవీసంబంధమగు పవిత్రారోపణమునకు చెప్పబడినట్లుగానే కృత్యములన్నియును సమానము. దీనియందు గల విశేషములు మాత్రము చెప్పెదను. సావధానమనస్సు గలవాడవై వినుము. దీనియందు వ్రతము చేయుటకు తగిన అధికారి విషయమును గూర్చి చెప్పబడినది కావున, దానిని గూర్చి చెప్పెదను.

బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, స్త్రీలు, శూద్రులు అందరును తమ ధర్మములయందు ఉండువారలై, భక్తితో కూడుకొని ఈ పవిత్రారోపణ వ్రతమును చేయవచ్చును.

విష్ణువును గురించి పవిత్రమును అర్పించునప్పుడు బ్రాహ్మణుడు “ఆతో దేవీ” అను మంత్రమును జెప్పుచు అర్పింపవలయును. స్త్రీలు, శూద్రులు విష్ణువు యొక్క పేరును చెప్పుచు పవిత్రమును అర్పింపవలయును.

శివుని గురించి పవిత్రారోపణ వ్రత విషయములో “కద్రుద్రాయ” అను మంత్రమును చెప్పి బ్రాహ్మణుడు పవిత్రమును అర్పించవలయును. శివుని నామములను చెప్పి స్త్రీలు, శూద్రులు పవిత్రమును అర్పించవలయును.

కృతయుగములో మణులతో కూడిన పవిత్రమును, త్రేతాయుగములో బంగారపు పవిత్రమును, ద్వాపరయుగములో పట్టుపవిత్రమును, కలియుగములో ప్రత్తి సంబంధమగు పవిత్రమును అర్పణ చేయవలెను.

ఈ పవిత్రారోపణమును యతీశ్వరులు మనస్సునందే చేయవలయును. ఈ పవిత్రములను వెదురు పాత్రయందుంచి, శుభ్రమగు నూతన వస్త్రములచే కప్పి, “ఓ ప్రభువా! నేను పాత్రను వస్త్రముచే కప్పిన రీతిగానే నా వ్రతలోపములు అన్నియును కప్పివేయుము. నీవు సంతసించుటకు ఈ పవిత్రారోపణ వ్రతమును చేసితిని. ఓ స్వామీ! నా యందు దయగలవాడవై, నేను చేయు వ్రతమునకు విఘ్నము కలిగింపకుము” అని ప్రార్థించవలెను.

ఓ దేవా! ఎల్లప్పుడు సమస్త విధములచే నీవే నాకు దిక్కు. ఓ స్వామీ! నేను ఈ పవిత్రస్వరూపుడనై నిన్ను సంతోషింపజేయువాడనగుదును.

ఓ స్వామీ! వ్రతమునకు విఘ్నమును కలిగించెడి కామము, క్రోధము మొదలగు దుర్గుణములు నాకు కలుగనీయకుము. ఇది మొదలు సంవత్సరము పూర్తి అగుపర్యంతము నీవు నన్ను రక్షింపుము. నీకు నమస్కారము చేసెదను.

ఈ ప్రకారము దేవతను ప్రార్థించి, వెదురుచే నిర్మింపబడిన శోభస్కరమగు పాత్రయందుంచబడిన పవిత్రమును ఇట్లు ప్రార్థించవలెను.

“ఓ పవిత్రమా! నేను సంవత్సర పర్యంతము చేసిన పూజను పవిత్రము చేయుట కొఱకు ఇప్పుడు విష్ణులోకము నుండి వచ్చితివి. నీకు నమస్కారము.

ఓ స్వామీ! విష్ణుతేజస్సు వలన కలిగినదియు, మనోహరమైనదియు, సమస్త పాపములను పోగొట్టునదియు, సమస్త కోరికలనొసగునదియు అయిన ఈ పవిత్రమును నీ శరీరమందుంచెదను.

ఓ స్వామీ! నారాయణమూర్తీ! నిన్ను పూజించుట కొఱకు ఆవాహన చేసితిని. కావున నీకు నమస్కారము చేసెదను. నాకు ప్రత్యక్షమగుము. ప్రాతఃకాలంబున ఈ పవిత్రమును నీకు అర్పణ చేసెదను.”

అనంతరం పుష్పాంజలినిచ్చి ఆ రాత్రి జాగరణ చేయవలయును. ఇట్లు ఏకాదశి నాడు ఆవాహన చేసి, ద్వాదశి నాడు ఉదయంబున తిరిగి పూజింపవలెను.

గంధం, గరికెలు, అక్షతలు మొదలగువానితో అలంకరింపబడిన పవిత్రమును పుచ్చుకొని, “ఓ స్వామీ! నన్ను పవిత్రమును చేయుటకును, సంవత్సర పర్యంతము నే చేసిన పూజ సఫలమగుటకును, నేను అర్పణచేయునటువంటి పవిత్రమును గ్రహింపుము” అని ప్రార్థించవలెను.

“ఓ స్వామీ! నేను చేసిన పాపమును పోగొట్టి నన్ను పవిత్రునిగా చేయుము. ఓ దేవతా సార్వభౌమా! నీ అనుగ్రహము వలన పరిశుద్ధుడనగుదును” అని ప్రార్థించి, మూలబీజాక్షరములతో సంపుటి చేయబడిన మంత్రములతో పవిత్రమును స్వామికి అర్పణచేయవలెను.

మహానైవేద్యము, నీరాజనము మొదలగునవి జరిపి, పిమ్మట అగ్నిహోత్రమునందు మూలమంత్రముతో నెయ్యి, పరమాన్నము మొదలగు వానిని హోమము చేయవలయును.

ఈ మూలమంత్రంతోనే పవిత్రమునకు ఉద్వాసన చెప్పి, “ఓ పవిత్రమా! సంవత్సర పర్యంతము నే చేసిన పూజను సఫలమగునట్లు చేసితివి. నీవు ఇప్పుడు విష్ణులోకమునకు వెళ్లుము” అని చెప్పి, ఆ పవిత్రమును తీసి బ్రాహ్మణునికై ఇయ్యవలయును, లేక ఉదకంలోనైనా విడువవలయును.

ఈ విధమగు విష్ణువును గూర్చిన పవిత్రారోపణ వ్రతమును నీకు చెప్పితిని. ఈ వ్రతమును చేసినవారు ఇహలోకమున సుఖములనొంది, అనంతరం మోక్షమునొందుదురు అని సనత్కుమార మునీశ్వరునితో సాంబమూర్తి చెప్పెను.

|| ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర-సనత్కుమార సంవాదే — “ఉభయైకాదశీ వ్రతకథనం” మరియు “ద్వాదశీ వ్రతకథనం” నామోధ్యాయః సమాప్తః ||
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Address

Street No: 23, Anand Bagh
Secunderabad
500047

Opening Hours

Monday 6am - 12pm
6pm - 8pm
Tuesday 6am - 12pm
6pm - 8pm
Wednesday 6am - 12pm
6pm - 8pm
Thursday 6am - 12pm
6pm - 8pm
Friday 6am - 12pm
6pm - 8pm
Saturday 6am - 12pm
6pm - 8pm
Sunday 6am - 12pm
6pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sathya Sai-Shirdi Sai- Lalitha Devi Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share