శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం

  • Home
  • India
  • Razole
  • శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం

శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం This temple is having a 350 years of history. Katikireddy Geddayya Brothers
2. On the last day of the festival they celebrate a festival known as “Nela pandaga”.

#సనాతనధర్మం - #హిందూధర్మం
, , ,

🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏
#శ్రీనూకాలమ్మ అమ్మవారి #దేవస్థానం,
#గూడపల్లి గ్రామం, #మల్కీపురం మండలం. 🙏శ్రీ నూకాలమ్మ వారి దయ వుంటే ఆన్ని వున్నట్లే🙏
💐మంగల ప్రదాయణి నూకాలమ్మ వారిని 3 మంగలవారం లు దర్సించండి..అమ్మవారి కృపకు పాత్రులుకండి. 5శుక్రవారంలు దర్శిచండి కొరికలు తీరి శుభములు కలుగును💐
🙏జై నూకాలమ్మ తల్ల

ి 🙏.
హిందు సంప్రాదయ భక్తి సమచారం- అది మన ఆచారం ...
https://www.fb.com/SriNukalammaAmmaVaru/

Gudapalli is a mighty deity in East Godavari. Sri is having alias names as In 1953 the temple was under taken by the government
Temple Founders :
1. Sagi Ramabhadra raju Brothers
Gudapalli Jatara (festival) is the temple fair starts on “Kothamavasya” the eve of the Year day and it continues for a period of one month. The jatara festival will be celebrated in the month of March or April every year according to telugu New years day ( ). People from other countries such as Malaysia and Singapore also visit the temple in the large number to have the Darshan and blessings of the diety. Devotees visit the temple in large groups for nearly two to three months starting from the Kothamavasya day. Seva Details:-
Day -1 (Ugadi) : Sagi's Families
Day- 2 Dantuluri's & Uddaraju's (Sagi's)
Day -3 Katikireddy Peda Geddayya's Family
Day -4 Katikireddy China Geddayya's Family
Day -5 Dudi VenkataSwamy's Family
Day -6 Sundara's and Bonam Families
Day -7 Vijjina's Family
Day -8 Koppidi''s family
Day -9 Palacholla's Family
Day -10 Talamoru Settibalija's
Day- 11 Adabala's Family's (Mulikipalli)
Day -12 Gudapalli's Family
Day -13 Gubbala's Family
Day -14 Ammavari Jatara (Radhothsavam)

Sevas will come by heriditory...
శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్తానం 350 సంవత్సరాల క్రితం అమ్మవారు గూడపల్లి లొకి రావడం జరిగింది ...అత్రి,,ఘర్గా,, అంగీరస ,,మహా ఋషుల చేత ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం.. అమ్మవారి కి మెట్టినిల్లు కట్టికిరెడ్డి వారు (కాపులు) మరియు పుట్టినిల్లు సాగి వారు (క్షత్రియులు) మరియు ..అమ్మవారి రధొథ్సవం మరియు జతర మెట్టీనిల్లు వారు ఐన కటికిరెడ్డి వారి ఆద్వర్యం లొ జరప బడును .. అలగే అమ్మవారి ఉయ్యల ఉపే కర్యక్రమం , బుక్క (రంగులు చల్లె ఆట) కార్యక్రమాలు కటికిరెడ్డీ వారిచె అనువంశికము గా జరప బడుతున్నాయి..

🕉️మన భారత దేశంలో దత్త క్షేత్రములు🕉️దత్తావతారం..🕉️1.పిఠాపురం.దత్తుని ప్రదమ దత్తావతారం  శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్...
30/04/2026

🕉️మన భారత దేశంలో దత్త క్షేత్రములు🕉️
దత్తావతారం..

🕉️1.పిఠాపురం.
దత్తుని ప్రదమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది.

🕉️2.కురువపురం.
ప్రదమ దత్తావతారులైన శ్రీపాదవల్లబులు తపసు చేసిన స్థలం.
ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.

🕉️3.గోకర్ణము
ప్రదమ దత్తావతారు లైన శ్రీపాద వల్లబులు తపసు చేసిన స్థలం... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.

🕉️4.కరంజా
రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం ఇది.. మహరాష్ట్రఅమరావతి జిల్లాలో ఉన్నది.

🕉️5.నర్సో బావాడి
శ్రీ గురుడు 12 సం||తపసుచేసిన స్థలం,...
ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది.

🕉️6.గాణగా పూర్
శ్రీ గురుడు 23 సం. నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీ గురుని నిజపాదుకలు కలవు, చూడవలసి స్థలం, బీమా అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.

🕉️7.ఔదుంబర్
శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడా మహరాష్ట్రులో ఉన్నది.
"చూడవలస స్థలం," బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.

🕉️8. మీరజ్
ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం కొల్హపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.

🕉️9.శ్రీశైలం
శ్రీ గురుడు అంతర్ధానమైన ప్రదేశం.
ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంట.. దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు.
ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.

🕉️10.మూడవ దత్తావతారం.
మాణిక్య ప్రభువులు
మాణిక్య నగర్ .. మూడవ దత్తావతారం, శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాది, ప్రభువుల వారి సంస్థానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.
తప్పక చూడవలసిన క్షేత్రము.

🕉️11.అక్కల్ కోట
నాలుగవ దత్తావతారం,
స్వామిసమర్ద (అక్కల్ కోటస్వామి ) సమాది మందిరం ఇది చెన్నయి ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు.
తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.

🕉️12 ఏక ముఖ దత్తుని ఆలయం
ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు.

🕉️13. నాసిక్
ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది.

ప్రముఖ దత్త క్షేత్రములు

🕉️14. గిరినార్
ఇచ్చట దత్తపాదుకలు కలవు
ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది, ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లబిస్తుందని భక్తుల నమ్మకం.

🕉️15. షేగాం
ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాది మందిరం ఇది నాగపూర్ పట్టణం నకు దగ్గరలో కలదు ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.

🕉️16. ఖేడ్గవ్
సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు. ఇది పూనా వద్ద కలదు.

🕉️17ఖాండ్వా
శ్రీ దున వాలా దాదా వారి సమాదిమందిరం ఉంది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.

🕉️18 మాన్ గవ్.....
శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలోఉంది
ఇది చూడదగ్గ క్షేత్రం.

🕉️19. గరుడేశ్వర్......
శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాది మందిరం కలదు గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది ఇది తప్పక చూడవలసిన క్షేత్రం

🕉️20. మౌంటు అబూ
ఇచట దత్త శిఖరము కలదు. రాజస్తాన్ రాష్ట్రములో కలదు..

🕉️పైన తెలుపబడిన దత్త అవతారముల అయిదు క్షేత్రములు మరియు ఈ 1నుండి 14 వరకు గల క్షేత్రములు దర్శించిన దత్త అనుగ్రహం తప్పక ఉండను. అవకాశము ఉన్నవారు మొత్తము చూడవచ్చను.

🕉️దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభా దిగంబర
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

దక్షిణామూర్తి స్తోత్రం🕉️దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక...
30/04/2026

దక్షిణామూర్తి స్తోత్రం

🕉️దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

🕉️బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

🕉️స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!

🕉️శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

🕉️మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా....

🕉️శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

🕉️ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

🕉️పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

🕉️చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

🕉️దక్షిణామూర్తి స్తోత్రం🕉️

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం 🙏     #కల్యాణమండపం
28/04/2026

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం 🙏

#కల్యాణమండపం

🕉️  #హనుమజయామంత్రము 🕉️🕉️ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగ...
28/04/2026

🕉️ #హనుమజయామంత్రము 🕉️

🕉️ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!!
మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి!!

🕉️ఇది #సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!

🕉️జయత్యతి బలో రామః
లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాభి పాలితః !!

🕉️దాసోహం కౌసలేంద్రస్య
రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!

🕉️నరావణ సహస్రం మే
యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః
పాదపైశ్చ సహస్రశః !!

🕉️అర్ధయిత్వాం పురీం లంకాం
మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి
మిషతాం సర్వ రక్షసాం !!

🕉️ #హనుమాన్ అంజనాసూనుః
వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ ఫల్గుణః స్సఖః
పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పహ.

🕉️ద్వాదశైతాని నామాని
కపీంద్రశ్చ మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం
యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయంన్నాస్తి
సర్వత్ర విజయీ భవేత్!!

🕉️(ఈ హనుమంతుని ద్వాదశనామాలను
విశేషించి యాత్రలకు వెళ్ళేటప్పుడు లేదా
ఏదైన ముఖ్యమైన పనులకోసం వెళ్ళేటప్పడు
పఠించండి సర్వత్రా విజయాన్ని పొందండి)

🕉️ #అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.

🕉️శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.

🕉️ఇది పఠించిన వారికి జయం తధ్యం !!
జయశ్రీ రామ!! శుభమ్ భూయాత్!!
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

 #దక్షిణామూర్తిస్తోత్రం🕉️దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొ...
23/04/2026

#దక్షిణామూర్తిస్తోత్రం

🕉️దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

🕉️బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

🕉️స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!

🕉️శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

🕉️మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా....

🕉️శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

🕉️ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

🕉️పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

🕉️చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

🕉️దక్షిణామూర్తి స్తోత్రం🕉️

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

కోనసీమ ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య దర్శనం.🙏ఓం శ్రీ మాత్రేనమః🙏జయ జయహే, జగదoబే, భక్తవత్సలే, పరాత్పరే, పరమపావని, ...
22/04/2026

కోనసీమ ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య దర్శనం.
🙏ఓం శ్రీ మాత్రేనమః🙏
జయ జయహే, జగదoబే, భక్తవత్సలే,
పరాత్పరే, పరమపావని, లోకజనని,
విశ్వాపుజితే, కల్యాణ హేతవే, హర:
అంబా పాహి, జగదాంబా పాహి,
దేవి పాహి, నూకాలమ్మ పాహి,
మాతా పాహి, జగన్మాత పాహి,
జయదుర్గే జయదుర్గే జయదుర్గే.

శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్దానం.
గూడపల్లి , మలికిపురం మండలం.
Follow for More updates :-
FB:- https://tinyurl.com/srinukalamma
IG:- https://tinyurl.com/srinukaalamma
YT:- https://tinyurl.com/sreenukalamma
WC:- https://tinyurl.com/SriiNukalamma

 #శివాలయం లో వున్న నందికి ఎందుకంత ప్రత్యేకత🕉️శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. క...
21/04/2026

#శివాలయం లో వున్న నందికి ఎందుకంత ప్రత్యేకత

🕉️శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా? ఆయన చరిత్ర ఒకసారి ఆ నందీశ్వరుని తల్చుకుందాం..

🕉️పూర్వం శిలాదుడనే రుషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా… పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతానభాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్లూ ఊళ్లూ గడిచిపోయాయి, ఎండావానా వచ్చిపోయాయి… కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. ఆతని ఒంటినిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేళకు శిలాదుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు పరమశివుడు. నాకు అయోనిజుడయిన ఒక కుమారుడిని కలుగచేయి అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు..

🕉️శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా, ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నoది అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట! బాలుని జననంలాగానే అతని మేథ కూడా అసాధారణంగా ఉండేది. పసివాడకుండానే సకలవేదాలన్నీ ఔపోసన పట్టేశాడు. ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్భవ అని అశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు..

🕉️నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాథేయపడిన తరువాత నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భివిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొణకలేదు, బెణకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి, దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు` అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకి మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్షు గురించో, ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ` అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా! అందుకే నందిని వృషభరూపంలో తన వాహనంగా ఉండిపొమ్మంటూ అనుగ్రహించాడు.

🕉️ఆనాటి నుంచీ శివుని ద్వారాపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ, ఆయన ప్రమథగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ, తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామిభక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. ఉదా॥ క్షీరసాగరమథనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు, దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్నీ ఆరగించేశాడు. మహామహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా, నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు..

🕉️నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే, ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్యభక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగినవానిగా, జ్ఞానిగా, ప్రథమగురువులో ఒకనిగా భావిస్తారు. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి, మైసూర్‌ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి (అనంతపురం), మహానంది (కర్నూలు) వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలమూ, ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటూ ఉండదు !
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

*నృసింహ చందనం* 🕉️ప్రసిద్ధ పుణ్యస్థలిగానే కాక భారతీయ చరిత్రకు, సంస్కృ తికి అద్దంపట్టే క్షేత్రం- సింహాచలం. మహావిష్ణువు దశా...
18/04/2026

*నృసింహ చందనం*

🕉️ప్రసిద్ధ పుణ్యస్థలిగానే కాక భారతీయ చరిత్రకు, సంస్కృ తికి అద్దంపట్టే క్షేత్రం- సింహాచలం. మహావిష్ణువు దశా వతారాల్లోని వరాహ, నరసింహ రూపాలు రెండూ ఉగ్ర మూర్తులే! సింహాచలంలో గల వరాహ నరసింహమూ ర్తిది విలక్షణ తత్వం. భక్తులకు ఆయన చందన స్వరూ పుడై గోచరిస్తాడు. పిలిచిన వెంటనే పలికే దైవంగా నృసింహస్వామిని వారు కొలుస్తారు.

🕉️దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో పాటు, సర్వాంతర్యామిత్వాన్ని చాటి చెబుతుంది- నరసింహావతారం. ఇది అత్యద్భుత మైన ఆవేశపూరిత రూపం. దీన్ని శివ, విష్ణుతత్వాల కలయికగా భావిస్తారు. విష్ణువు నరరూపం స్థితిని కలి గిస్తుంది. లయకారకుడైన శివుడిది ఉగ్రరూపం. ఈ రెండూ సమైక్యమై నరసింహ రూపం ఏర్పడిందని విజ్ఞుల భావన.

🕉️నరసింహస్వామిని యోగమార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్యమండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రా నికి ప్రతీకగా విశ్వసిస్తారు. భూతత్వానికి, మూలాధారానికి, విశ్వచైతన్య మూలానికి ప్రతీకాత్మక రూపం వరాహస్వామి. సముద్రమట్టానికి పలు అడుగుల ఎత్తున గల తూర్పు కనుమల్లో, ప్రకృతి సౌందర్యం నడుమ నెలకొని ఉంది సింహాచలం, సింహాచలస్వామి పరిపూర్ణ పరిమళ స్వరూపుడు. చందన గంధం, సంపెంగ వాసనతో పాటు పనస ఫలాల పరిమళం ఈ క్షేత్ర ప్రత్యేకతలు.

🕉️మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ని వధి స్తాడు. నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ని సంహరి స్తాడు. ఆ తరవాత ప్రహ్లాదుడి కోరికపై వరాహ నృసిం హుడిగా వైశాఖ శుద్ధ తదియనాడు అవతరించి, పూజలం దుకుంటున్నాడు. స్వామిని ప్రహ్లాదుడు సేవిస్తున్న కాలం లోనే- బ్రహ్మ, మహేశ్వరుడితో పాటు ఇంద్రాది దేవతలం దరితోనూ సింహగిరికి చేరతాడు. గిరి ప్రాంతంలోనే ఆయన బ్రహ్మోత్సవాలు జరిపించా. ఉంటాయి పురాణాలు.

🕉️ఇది కృతయుగంనాటి గాధ. షట్చక్రవర్తుల్లో ఒకడైన పురూరవుడు ఒకరోజు ఊర్వశితో సహా విహారా నికి పయనమవుతాడు. సింహగిరి వద్ద వారి విమానం నిలిచిపోతుంది. పురూరవుడికి స్వప్నంలో స్వామి సాక్షాత్కరిస్తాడు. పర్వతం పక్కన పుట్టలో ఉన్నానని, దానిమీద మాల తీలత ఉందని, ఆ పక్కనే గంగధార పేరిట పవిత్ర జలాలు ఉంటాయని చెబుతాడు. తనను బయటకు తీసి సేవించాలంటాడు. పురూరవుడు మరునాడు ఉదయమే స్వామిని కనుగొని, గంగధారతో పంచామృతా లతో అభిషేకించాడని పురాణ కథనం. పుట్ట నుంచి ఎంత మట్టిని తొలగించారో, అంతే బరువు గల శ్రీచందనాన్ని స్వామి ఆదేశానుసారం వేశారని స్థలగాథ చెబుతుంది.

🕉️భూమికి 'గంధవతి' అని పేరుంది. అందువల్ల స్వామి- పుట్ట మన్నుకు బదులు గంధాన్ని సమ 3 ర్పించాలన్నాడని ప్రతీతి. హిరణ్యకశి పుడి వధానంతరం, ఉగ్రనరసిం హుణ్ని చల్లబరచడానికి దేవతలే చందనం పూశారనీ ఒక కథ ప్రచా రంలో ఉంది. ఏడాది పొడవునా స్వామి దేహానికి చందనం ఉంటుంది. తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని పూస్తారు. అనంతరం వైశాఖ పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ రోజుల్లో మూడేసి మణుగుల చందనం సమర్పిస్తారు.

🕉️వైశాఖ శుద్ధ తదియ- అక్షయ తృతీయ- గంధం ఒలుపు- ఇదే స్వామి నిజరూప దర్శనం! కేవలం సింహాద్రి నాథుడికే జరిగేది- చందనోత్సవం. ఈ తిథికి 'విష్ణుప్రీతి దివసం' అని పేరు. ఇదే ఆల యంలో గిరి ప్రదక్షిణ, మకర వేట, తెప్పోత్సవం, డోలో త్సవం, కామదహనం వంటి వేడుకలు జరుగుతాయి.

🕉️ఈ ఆలయంలోని కప్ప స్తంభం విశిష్టమైనది. సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠించినందువల్ల, దీని స్పర్శతో లక్ష్యసిద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. వాస్తు శాస్త్రరీత్యా ఈ ఆలయం అసమానమని తలుస్తారు. ఇది వివిధ వాస్తు సంప్రదాయాల మిశ్రమం. గోడలపై చాళుక్య, గంగరాజుల శాసనాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణ దిగ్విజయ యాత్రను సూచించే మూడు శాసనాలు స్తంభాలపై అలరారుతుంటాయి.
శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం
*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

18/04/2026

ఓం నమో వేంకటేశాయ నమః

శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యదర్శనం..  #శ్రీనూకాలమ్మ    #అమ్మవారు
16/04/2026

శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యదర్శనం.. #శ్రీనూకాలమ్మ #అమ్మవారు

Address

Gudapalli
Razole
533254

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీనూకాలమ్మ అమ్మవారి దేవస్థానం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share