16/06/2026
కంచికామకోటి పీఠం ...
***
రాజమండ్రి కొంతమూరు-కాతేరు రోడ్డులో వేద పాఠశాల దగ్గర
యోగాంబా సమేత శ్రీ కామకోటీశ్వర స్వామి దేవాలయంలో..
శిఖర జీవధ్వజ నవగ్రహ సహిత పంచాయతన ప్రతిష్ఠా మహోత్సవాలు జూన్ 21 నుండి 24 వ తేదీ వరకు ....
******
*శ్రీ కంచి కామకోటి పీఠం నిర్వహణలో, శ్రీ కంచి కామాక్షిదేవి అమ్మవారి అనుగ్రహంతో రాజమండ్రి సమీపంలోని కొంతమూరు-కాతేరు రోడ్డులో శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం దగ్గర శ్రీ యోగాంబా సమేత శ్రీ కామకోటీశ్వర స్వామి, గణపతి, శ్రీ సూర్యనారాయణ మూర్తి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, దక్షిణామూర్తి, నాగేంద్ర, ఆది శంకరాచార్య, నవగ్రహమూర్తులతో పాటు మినీ కళ్యాణమండపంతో కూడిన పంచాయతన దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలు జూన్ 21 వ తేదీ ఆదివారం నుంచి 24వ తేదీ బుధవారం వరకు జరుగుతాయి.
జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య అనుగ్రహంతో జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీశ్రీశ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వార్ల దివ్య ఆశీస్సులతో 24వ తేదీ బుధవారం ఉదయం 07.47 ని.లకు శ్రీ యోగాంబా సమేత శ్రీ కామకోటీశ్వర స్వామి దేవాలయంలో శిఖర జీవధ్వజ నవగ్రహ సహిత స్థిర ప్రతిష్ఠ జరుగుతుంది.
స్వర్గీయ డాక్టర్ నూకల వెంకట్రావు, శ్రీమతి సూకల మాణిక్యాంబ గార్ల దంపతులు, వారి కుమారులు, కుమార్తె, కుటుంబ సభ్యులు కల్సి ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ కంచి కామకోటి పీఠానికి ధారాదత్తం చేసారు.
శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రతిష్ఠా మహోత్సవాల్లో భక్తమహాశయులంతా పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమానికి సహకరించే దాతలు, వదాన్యులు ఈ క్రింది ఖాతాకు జమచేయగలరు.
ACCOUNT NO 50100877924011 savings account
Ifsc HDFC0004259
AP KANCHIKAMAKOTI CHARITABLE TRUST
CURRENCY NAGAR BRANCH
VIJAYAWADA