18/10/2025
గురు ద్వాదశి.
నేడు 18-10-2025 శనివారం
ఆశ్యయుజ కృష్ణపక్ష ద్వాదశి. గురు ద్వాదశి .(కలియుగ మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు కురువపురమునందు కృష్ణ నదిలో దిగి అంతర్హితులైన దినము)
1320-1350.
కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి. వీరు గోదావరి ప్రాంతంలోని పిఠాపురం లో అప్పలరాజు శర్మ, సుమతి మహారాణి దంపతులకు జన్మించారు. ఈ దంపతులు దత్తాత్రేయ స్వామికి పరమ భక్తులు. వారికి పుట్టిన బిడ్డలందరూ చనిపోయి, ఒక కుంటి, గ్రుడ్డి వారు మాత్రమే మిగిలారు. అయినా ఆ దంపతులు అచంచల భక్తి విశ్వాసాలతో, బిక్షకు వచ్చిన వారిని శ్రీ దత్త స్వరూపులుగా భావించి ఆదరించేవారు. ఒక ఆమాస్య రోజున వారి ఇంట్లో శ్రాద్ధ కర్మ జరుగుచుండగా అతిథులు భుజించక ముందే వారి ఇంటికి ఒక యతీశ్వరుడు భిక్షకు వచ్చాడు.
ఆమె సంకోచించక ఆ యతీశ్వరుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని తలచి భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంతోషించి ఆయన యథార్థ స్వరూపమైన దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చి ఆమెను వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె "స్వామీ నీవు నన్ను తల్లి అని సంభోదించావు. కనుక ఆ మాట నిలుపుకో చాలు"అని తన బిడ్డగా జన్మించమని వరం కోరుకున్నది.
ఆ తరువాత కొంతకాలానికి సుమతీదేవి గర్భం ధరించి భాద్రపద శుక్ల చతుర్ధి నాడు కాలాతీతుడు, పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి జన్మనిచ్చింది.
ఆయనలో దివ్య చిహ్నాలు చూసి ఆయనకు శ్రీపాద శ్రీ వల్లభుడని పేరు పెట్టారు. శ్రీపాదునికి ఏడవ సంవత్సరం రాగానే ఉపనయనం చేశారు. వేద పురుషుడైన ఆయన ఉపనయం కాగానే వేదం చెప్పారు. తరువాత వారి శిష్యులకు వేద వేదాంత శాస్త్రాలను బోధిస్తూ 16వ సంవత్సర వరకు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఇంటి వద్దనే ఉన్నారు. ఆయనకు వివాహము చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నము ఆరంభించారు. కానీ స్వామి తాను సన్యాసి అయి తపస్సు చేసుకుంటానని తెలిపార�
అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎంతో బాధతో" నీ అన్నలు అవిటి వారు. నిన్ను చూసుకొని గర్భ శోకం మరిచిపోయాం. నీవైనా వివాహం చేసుకొని సంతానాన్ని ఉద్ధరించుకుంటే ఎలాగా?"
వృద్ధాప్యంలో మాకు అండగా ఎవరుంటారు? అని వాపోయారు.
శ్రీపాదుల వారు వారి అన్నలను సృజించగా వారి అవిటి తనము
పోయింది. ఆయన తమ నిజరూపమైన దత్తాత్రేయ స్వరూపము దర్శింపజేసి"మీరు ఈ రూపాన్ని ధ్యానించండి. నా సాయుజ్యం పొందుతారు. ఈ కొడుకులిద్దరూ మిమ్మల్ని సేవిస్తారు అని చెప్పి తల్లి అనుమతి పొంది ఆయన సన్యసించ లోకొద్దరణ కోసం పాద చారి అయి బయలుదేరారు. కురువపురంలో ఒక సద బ్రాహ్మణుని భార్య అంబికకు ఎందరో పిల్లలు పుట్టినా కూడా కొద్దికాలంలోనే చనిపోతుండేవారు. ఆమె నోములు వ్రతాలు చేశాక ఒక పిల్లవాడు కలిగాడు. కానీ అతడు బుద్ధిహీనుడు జడుడు, అయ్యాడు.
ఉపనయమయ్యాక అనుష్టానం కూడా చేయలేకపోయేవాడు. ఆ దిగులుతోనే ఆయన తండ్రి మరణించాడు. అతను, అతని తల్లి బిచ్చమెత్తుకొని జీవించేవారు. కానీ గ్రామస్తులు పవిత్రమైన భిక్షావృత్తికి నీ వంటి వాడు కి తగదు. నీ బ్రతుకు వ్యర్థం అని నిందిస్తుంటే ఆ అవమానము భరించలేక వారిద్దరూ ఆత్మహత్య చేసుకోదలిచి కృష్ణా నదికి వెళుతున్నారు. శ్రీపాద స్వామి అది చూచి ఆత్మహత్య మహాపాపం అని చెప్పి వారించి, ఆమెతో నీవు జీవితాంతము శివ పూజ చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుడే కలుగుతాడని వరమిచ్చి అతని తలపై తమ హస్తముంచి ప్రణవము ఉచ్చరించగానే అతడు మహా పండితుడైనాడు ఆమె సంతోషించి తన జీవితమంతా శివ అర్చనలో గడిపింది. ఒక చాకలివాడు నిత్యము శ్రీపాద స్వామిని శ్రద్ధగా సేవించేవాడు. ఒకనాడు అతడు నదికి వెళ్లి అక్కడ జలకాలాడుతున్న ఒక రాజును, అతని వైభవమును ,చూచి "ఇతడు ఎంత అదృష్టవంతుడు ఎంతటి భక్తితో, గురు సేవ చేశాడో?
నా కట్టి వైభవము లభించడం కల
గానే మిగిలిపోతుంది."అని అనుకున్నాడు. తరువాత ఆయన శ్రీపాద స్వామి�
తరువాత ఆయన శ్రీపాద స్వామిని దర్శించగానే, నీ మనసులో రాజు అవ్వాలని కోరిక కలిగింది కదా అని వచ్చే జన్మలో వైడూర్య నగరంలో యవన కుమారుడిగా జన్మిస్తావని వరమిచ్చారు. అతడు నమస్కరించి ,స్వామీ ! నాకు మీపై భక్తి వృద్ధి చెందేలాగా అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు స్వామి మేము నృసింహ సరస్వతి అన్న యతి రూపంలో అవతరించవలసి ఉన్నది. అప్పుడు నిన్ను మా చెంతకు చేర్చుకుంటానని అభయమిచ్చారు. తరువాత స్వామి అంబికకు ఇచ్చిన మాటను అనుసరించి ఆమె పుత్రుడిగా అవతరించ దలచి
ఆశ్యయుజ మాసం, కృష్ణ ద్వాదశి హస్తా నక్షత్రం నాడు శ్రీపాద శ్రీ వల్లభులు కృష్ణానదిలో దిగి అంతర్హితులై మరొక చోట అవతరించారు. అయినప్పటికీ తమ భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. వల్లభేసుడను అను బ్రాహ్మణుడు తనకు వ్యాపారంలో లాభం వస్తే కురువపురం దర్శించి
వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని శ్రీపాద స్వామికి మొక్కుకున్నాడు. స్వామి దయవల్ల అతని కోరిక నెరవేరింది.
అతను డబ్బులు తీసుకొని కురువపురం వెళుతుంటే దారిలో నలుగురు దొంగలు అతన్ని చంపి ఆ డబ్బు దొంగలించారు. కానీ అతడు చనిపోయే ముందు" శ్రీపాద
శ్రీ వల్లభా! అని కేక పెట్టాడు. స్వామి జడలు, భస్మము, శూలము
ధరించి ప్రత్యక్షమై ఆ దొంగలను సంహరించారు. తరువాత ఒక సాటి ప్రయాణికునికి విభూతిని ఇచ్చి వల్లభేశుని శరీరంపై చల్లమని చెప్పి అతనిపై తమ అమృత దృష్టిని సారించి అంతర్ధానమయ్యారు. కొంతసేపటికి వల్లభేసుడు తిరిగి బ్రతికాడు. జరిగిన లీల తెలుసుకొని సంతోషించి కురువ పురం చేరి, శ్రీపాద స్వామిని పూజించి నాలుగు వేల మందికి సంతర్పణ చేశాడు.