09/04/2026
నేడు త్రిసులేశ్వరుడు త్రివేణి సంగమం వద్ద వెలసివున్న సంగమేశ్వరుని వద్దకి పయనం.పురాణగాథ:
మనుబోలులో శ్రీ కామాక్షితాయిసమేత బ్రహ్మాహేశ్వరస్వామి దేవస్థానం ఉంది ,ఆ ఆలయాన్ని కామాక్షి దేవి మెట్టినిల్లు గాను ,బద్వేలు క్రాస్ రోడ్ లో ఉన్న శ్రీ కామాక్షితాయి సమేత సంగమేశ్వర ఆలయాన్ని పుట్టినిల్లు గాను ,మనుబోలు గ్రామాప్రజలు భావించి .
స్వామి వారికళ్యాణ నిమ్మితం శివునికి పెళ్లి పెద్దగా త్రిసులేశ్వరుడు (సులప్ప)ని గ్రామప్రజలు మనుబోలు నుంచి సంగమేశ్వర ఆలయం వద్దకి తీసుకెళ్లి ,అక్కడ ధ్వజారోహణ చేసి ..శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు..
ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు కి వారం,తిధి చూడరు ,ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉగాది తరువాత ,పాడి పంటలు చేతికి వచ్చిన తరుణం లో ఏప్రిల్ 9 నుంచి 17వరకు ఈ శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ .
పచ్చటి తోరణాలతో గ్రామ పొలిమేరలు అలంకరిస్తారు.. ఆ స్వాగత తోరణాలు ఈ శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు మొదలు గ్రామప్రజలు నమ్మకం..