శ్రీ కామాక్షితాయీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్తానం ,మనుబోలు, నెల్లూరు జిల్లా

  • Home
  • India
  • Nellore
  • శ్రీ కామాక్షితాయీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్తానం ,మనుబోలు, నెల్లూరు జిల్లా

శ్రీ కామాక్షితాయీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్తానం ,మనుబోలు, నెల్లూరు జిల్లా Sangam Jatara:Sangam Jathara is one of the many jatharas that take place annually in Nellore District. In the Manubolu mandal of Nellore District, Sangam

Sangam Jathara is known for its uniquesness of hundreads of people carrying the wheel less chariot Lord Shiva and Parmeswari from Manubolu to Sangam for the Kalyanostavam, a distance of 8 Kilometers literally on their shoulders. Its a thrilling witness of people's faith.

నేడు త్రిసులేశ్వరుడు త్రివేణి సంగమం వద్ద వెలసివున్న సంగమేశ్వరుని వద్దకి పయనం.పురాణగాథ:మనుబోలులో  శ్రీ కామాక్షితాయిసమేత  ...
09/04/2026

నేడు త్రిసులేశ్వరుడు త్రివేణి సంగమం వద్ద వెలసివున్న సంగమేశ్వరుని వద్దకి పయనం.పురాణగాథ:
మనుబోలులో శ్రీ కామాక్షితాయిసమేత బ్రహ్మాహేశ్వరస్వామి దేవస్థానం ఉంది ,ఆ ఆలయాన్ని కామాక్షి దేవి మెట్టినిల్లు గాను ,బద్వేలు క్రాస్ రోడ్ లో ఉన్న శ్రీ కామాక్షితాయి సమేత సంగమేశ్వర ఆలయాన్ని పుట్టినిల్లు గాను ,మనుబోలు గ్రామాప్రజలు భావించి .
స్వామి వారికళ్యాణ నిమ్మితం శివునికి పెళ్లి పెద్దగా త్రిసులేశ్వరుడు (సులప్ప)ని గ్రామప్రజలు మనుబోలు నుంచి సంగమేశ్వర ఆలయం వద్దకి తీసుకెళ్లి ,అక్కడ ధ్వజారోహణ చేసి ..శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు..
ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు కి వారం,తిధి చూడరు ,ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉగాది తరువాత ,పాడి పంటలు చేతికి వచ్చిన తరుణం లో ఏప్రిల్ 9 నుంచి 17వరకు ఈ శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ .
పచ్చటి తోరణాలతో గ్రామ పొలిమేరలు అలంకరిస్తారు.. ఆ స్వాగత తోరణాలు ఈ శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు మొదలు గ్రామప్రజలు నమ్మకం..

06/04/2026
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||     పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ క...
02/10/2025

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||

పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ

మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. పాహిమాం అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే!
ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది.

మహిష మస్తక నృత్త వినోదినిస్ఫుట రణన్మణి నూపుర మేఖలా జనన రక్షణ మోక్ష విధాయినిజయతి శుంభ నిశుంభ నిషూదనిదేవీ నవరాత్రులలో అత్య...
30/09/2025

మహిష మస్తక నృత్త వినోదిని
స్ఫుట రణన్మణి నూపుర మేఖలా జనన రక్షణ మోక్ష విధాయిని
జయతి శుంభ నిశుంభ నిషూదని

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.

"ఓంకార పంజర శికీ ముననిష దుద్యాన కేళికల కంఠీమ్ !ఆగమ విపిన మయూరీ మర్యామంతర్విభావ యే గౌరమ్ !!భక్త్యాస్నాత్యాత్ర మల్లీశం దుర...
29/09/2025

"ఓంకార పంజర శికీ ముననిష దుద్యాన కేళికల కంఠీమ్ !
ఆగమ విపిన మయూరీ మర్యామంతర్విభావ యే గౌరమ్ !!
భక్త్యాస్నాత్యాత్ర మల్లీశం దుర్గం దుర్గారి నాశినీం
దృష్ట్యా పాపాత్ ప్రముచ్యేత్ దేవలోకే వసేత్సాదా"

దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం, వరుణినిచేత శంఖం, అగ్నిచేత బల్లెం, వాయువుచేత బాణాలు అంబులపొది, ఇంద్రునిచేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమాల, సూర్యునిచేత కిరణాలు, శివుని చేత సింహ వాహనం పొందింది. స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి వున్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లలితాత్రిపురసుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి...

ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహాచిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరిశ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ...
26/09/2025

ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి

శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత. "..

లలితా త్రిపుర సుందరి:       త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి )రూపాలలో ఒక మహా విధ్...
25/09/2025

లలితా త్రిపుర సుందరి:

త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి )రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు.
త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.

ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది. * స్థూల (భౌతికం): ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది. * సూక్ష్మ (సున్నితం): మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది. * పర (మహోన్నతం): అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది..

గజలక్ష్మి దేవి     :-గజలక్ష్మి (ఏనుగులతో ఉన్న లక్ష్మి) లక్ష్మీదేవి కి గల అష్ఠలక్ష్మి అంశాలలో ఒక రూపం. ఈ రూపంలో ఆమె కమలం ...
24/09/2025

గజలక్ష్మి దేవి :-

గజలక్ష్మి (ఏనుగులతో ఉన్న లక్ష్మి) లక్ష్మీదేవి కి గల అష్ఠలక్ష్మి అంశాలలో ఒక రూపం. ఈ రూపంలో ఆమె కమలం మీద పద్మాసన భంగిమలో కూర్చొని ఉంటుంది. ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి. ఆమెకు గల పై చేతులలో కమలాలను పట్టుకొని ఉంటుంది.

జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే

రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే

జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్..

గాయత్రిదేవి.                                        ఓం భూర్భువస్వః |తత్స వితుర్వరేణ్యం |భర్గో దేవస్య ధీమహి |ధియోయోనఃప్రచ...
23/09/2025

గాయత్రిదేవి.

ఓం భూర్భువస్వః |
తత్స వితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి |
ధియోయోనఃప్రచోదయాత్ || సకల వేద స్వరూపం గాయత్రిదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి...

మహేశానన్తాద్య త్రిగుణరహితామేయవిమల స్వరాకారాపారామితగుణగణాకారినివృతే | నిరాధారాధారామరవర నిరాకార పరమ ప్రభాపూరాకారావర పర నమో...
12/04/2025

మహేశానన్తాద్య త్రిగుణరహితామేయవిమల
స్వరాకారాపారామితగుణగణాకారినివృతే |
నిరాధారాధారామరవర నిరాకార పరమ
ప్రభాపూరాకారావర పర నమో వేద్య శివ తే ...

శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు లో భాగంగ నిర్వహించిన నంది వాహన సేవ అందరిని ఆకట్టుకుంది ,తీన్మార్ తప్పట్లు వాయీ వాయధ్యల నడుమ ఉత్సవం కొనసాగింది...
శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది.. పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత
నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు .

Address

Nellore
524405

Telephone

+919676757433

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ కామాక్షితాయీ సమేత సంగమేశ్వర స్వామి దేవస్తానం ,మనుబోలు, నెల్లూరు జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category