Mahanandi devasthanam

Mahanandi devasthanam This page is run by local devotees

మహానంది క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
07/03/2024

మహానంది క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న మహానంది క్షేత్రం.
06/03/2024

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతున్న మహానంది క్షేత్రం.

25/07/2022

ఓం నమః శివాయ 🙏🙏🕉️🕉️

మహానందిలో పోటెత్తిన భక్తులు,భక్త జన సంద్రం గా మారిన "క్షేత్రం తీర్థం" కలగలిసిన మహనంది క్షేత్రం.అద్భుతం అద్వితీయం మహనందీశ...
03/03/2022

మహానందిలో పోటెత్తిన భక్తులు,భక్త జన సంద్రం గా మారిన "క్షేత్రం తీర్థం" కలగలిసిన మహనంది క్షేత్రం.అద్భుతం అద్వితీయం మహనందీశ్వరుని రథోత్సవం.🙏🙏🕉️🕉️

మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారు.మంగళవారం సాయం...
22/02/2022

మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారు.

మంగళవారం సాయంకాలం మహాశివరాత్రి సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రం లో కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారు,మహానందీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు మహానంది తహసిల్దార్ జనార్ధన శెట్టి గారు,రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేంద్రుడు,ఎంపీడీవో కార్యాలయం ఈ.ఓ.ఆర్.డి నాగ జ్యోతి లతో కలిసి పరిశీలించారు.

మహానంది క్షేత్రంలో గత రెండు సంవత్సరాలుగా కోవిడ్-19 సందర్భంగా 2020 మార్చిలో మూసి వేసిన (నంది తీర్థం) రుద్రగుండం కోనేరును ...
21/02/2022

మహానంది క్షేత్రంలో గత రెండు సంవత్సరాలుగా కోవిడ్-19 సందర్భంగా 2020 మార్చిలో మూసి వేసిన (నంది తీర్థం) రుద్రగుండం కోనేరును ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్ గారి అనుమతితో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి,చైర్మన్ మహేశ్వర రెడ్డి గార్లు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తుల పుణ్యస్నానాలకు అనుమతి ఇచ్చారు.

ఈరోజు ఉదయం మహానంది క్షేత్రంలో ఆలయ ఈవో, చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించిన...
21/02/2022

ఈరోజు ఉదయం మహానంది క్షేత్రంలో ఆలయ ఈవో, చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు.అనంతరం మహానంది లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్ల ఆహ్వాన పత్రిక ను,గోడ పత్రిక ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గారు.అనంతరం శ్రీ కామేశ్వరి అమ్మ వారికి తాళి బొట్టు గొలుసు మరియు పంచ లోహాలతో తయారు చేసిన పాదుకలు మరియు సింహ వాహనాన్ని బహుకరించిన దాతలను ఆలయ సంప్రదాయం ప్రకారం సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

2022 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఈరోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్ల వద్ద ఉంచి పూజ చేసి అనంతరం స్థానిక ఎమ్మ...
20/02/2022

2022 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఈరోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్ల వద్ద ఉంచి పూజ చేసి అనంతరం స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి,నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గార్లకు సాంప్రదాయం ప్రకారం ఆలయ కార్య నిర్వహణాధికారి,చైర్మన్,వేదపండితులు వేదాశీర్వచనం చేసి అందజేయడం జరిగింది.

కుటుంబ సమేతంగా మహానందీశ్వరుణ్ణి సేవించుకున్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్.
19/02/2022

కుటుంబ సమేతంగా మహానందీశ్వరుణ్ణి సేవించుకున్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్.

నిన్నటి రోజున మహానందీశ్వరుణ్ణి దర్శించుకున్న తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి సభ్యులు టి.మారుతి ప్రసాద్ గారు.స్వాగత...
13/02/2022

నిన్నటి రోజున మహానందీశ్వరుణ్ణి దర్శించుకున్న
తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి సభ్యులు టి.మారుతి ప్రసాద్ గారు.స్వాగతం పలికిన ఆలయ అధికారులు.స్వామి అమ్మవార్ల పూజ కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు.వీరి వెంట మహానంది మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కేతేపల్లి గోపాల క్రిష్ణ మూర్తి గారు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం చైర్మన్ మహేశ్వర రెడ్డి గారు,పాలకమండలి సభ్యులు వెంకటేశ్వర్లు,మల్లికార్జున,కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ రమణయ్య మరియు భూమా గోపాల్ గారు పాల్గొన్నారు.

మహానంది దేవస్థానం నూతన ఈవో గా కే.చంద్రశేఖర్ రెడ్డి గారు శనివారం బాధ్యతలు స్వీకరించారు.ముందుగా క్షేత్రంలో వెలసిన శ్రీ కామ...
13/02/2022

మహానంది దేవస్థానం నూతన ఈవో గా కే.చంద్రశేఖర్ రెడ్డి గారు శనివారం బాధ్యతలు స్వీకరించారు.ముందుగా క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహనందీశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దేవస్థానం కార్యాలయంలో ఈఓ గా బాధ్యతలు స్వీకరించారు.

మహానంది క్షేత్రం లో 07-10-2021నుండి15-10-2021వరకు వైభవంగా జరుగుతాయి.దసరా శరన్నవరాత్రి ఉత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కా...
03/10/2021

మహానంది క్షేత్రం లో 07-10-2021నుండి15-10-2021వరకు వైభవంగా జరుగుతాయి.

దసరా శరన్నవరాత్రి ఉత్సవముల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
07-10-2021న శైలపుత్రి 08-10-2021న బ్రహ్మచారిణి
09-10-2021న చంద్రఘంట
10-10-2021న కూష్మాండ
11-10-2021న స్కందమాత
12-10-2021న కాత్యాయని
13-10-2021న కాళరాత్రి
14-10-2021న మహాగౌరి
15-10-2021న సిధ్ధి దాత్రి అలంకారములో శ్రీ కామేశ్వరీ అమ్మవారు దర్శనమిస్తారు.

ప్రతిరోజూ శతచండీయాగము,నవకలశ పూజలు,సహస్ర దీపాలంకరణ సేవ, గ్రామోత్సవం,చిన్నారుల భరతనాట్యములు,గానములు, సామూహిక సహస్ర కుంకుమార్చనలు, కూష్మాండ బలులతో పాట శ్రీ కామేశ్వరీ అమ్మవారి మూలమూర్తికి ప్రాతఃకాల విశేషాభిషేకము, శ్రీచక్రార్చన లతో అంగరంగ వైభవంగా జరుగుతాయి.
కావున ప్రజలు నవరాత్రులలో విశేషంగా మహానంది క్షేత్రానికి తరలి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

Address

Mainroad
Mahanandi
518502

Opening Hours

Monday 5am - 9:30pm
Tuesday 5am - 9:30pm
Wednesday 5am - 9:30pm
Thursday 5am - 9:30pm
Friday 5am - 9:30pm
Saturday 5am - 9:30pm
Sunday 5am - 9:30pm

Telephone

+918514234726

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahanandi devasthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category