శ్రీ విశ్వనాథ జ్యోతిష్యాలయం లక్షెట్టిపేట,కాగజ్ నగర

  • Home
  • India
  • Luxettipet
  • శ్రీ విశ్వనాథ జ్యోతిష్యాలయం లక్షెట్టిపేట,కాగజ్ నగర

శ్రీ విశ్వనాథ జ్యోతిష్యాలయం లక్షెట్టిపేట,కాగజ్ నగర కాగజ్ నగర్

కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేద్రంలోని శ్రీవాసవీ మాత ఆలయంలోమా విశ్వనాథ జ్యోతిషాలయం కాగజ్ నగర్ & లక్షెట్టి పేట య...
20/01/2026

కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేద్రంలోని శ్రీవాసవీ మాత ఆలయంలో
మా విశ్వనాథ జ్యోతిషాలయం కాగజ్ నగర్ & లక్షెట్టి పేట యాజ్ణీక బృంద ఆధ్వర్యంలో
ఆర్య వైశ్యుల కుల దేవత
శ్రీ వాసవీ కన్యకా మాత ఆత్మార్పణ రోజును పురస్కరించుకొని
102 గోత్రాలు, ఋషులను
పూజించి మూలవిరాట్టుకు అర్చన అభిషేకాలు

12/04/2025

బ్ర||శ్రీ|| ప్రణవ్ శర్మచే
సుందరకాండ ప్రవచనము

17/10/2024

పుణ్యస్య ఫలమిచ్ఛంతి పుణ్యం నేచ్ఛంతి మానవాః|
న పాప ఫలమిచ్ఛంతి, పాపం కుర్వంతి యత్నతః||

భావము. మానవులు పుణ్యఫలాన్ని కోరుకుంటారేగానీ, పుణ్యకార్యాచరణకు ఇష్టపడరు! పాపఫలాన్ని కోరరు గానీ, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటారు!

17/08/2024

*_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*
𝕝𝕝 శ్లో 𝕝𝕝 *స్తనదాత్రీ గర్భధాత్రీ భక్ష్యదాత్రీ గురుప్రియా ౹*
*అభీష్టదేవపత్నీ చ పితుః పత్నీ చ కన్యకాః ౹౹*
*సగర్భకన్యా భగినీ పుత్రపత్నీ ప్రియాప్రసూః ౹*
*మాతుర్మాతా పితుర్మాతా సోదరస్యప్రియా తథా ౹౹*
*మాతుః పితుశ్చ భగినీ మాతులానీ తథైవ చ౹*
*జనానాం వేదవిహితా మాతరః షోడశ స్మృతా ౹౹*
𝕝𝕝తా𝕝𝕝 *స్తన్యము నిచ్చునది, గర్భమున ధరించునది, తిండిపెట్టునది, గురువుయొక్క భార్య, ఇష్టదేవతయొక్క భార్య, సవతితల్లి, తన తోబుట్టువులగు స్త్రీలు, కోడలు, తన భార్య తల్లి (అత్తగారు), అమ్మమ్మ, నాయనమ్మ, సోదరుని భార్య, మేనమామ భార్య, మేనత్త, తల్లియొక్క అక్కా చెలెండ్లు, తన సోదరుల పుత్రికలు అను పదునారుగురు వేదవిహితమైన తల్లులు. _(బ్రహ్మ వైవర్త పురాణం)_ (సుభాషితరత్నకోశః)*

15/08/2024

*గాయంతి దేవాః కల గీతికాని*
*ధన్యాస్తు తే భారత భూమి భాగే*
*స్వర్గాపవర్గాస్పద మార్గ భూతే*
*భవంతి భూయః పురుషాః సురత్వాత్.*

ఓ భారత మాతా నీ బిడ్డలు గా పుట్టడం మా జన్మ జన్మల సుకృతం. నిన్ను గూర్చి దేవతలు గానం చేస్తున్నారు. స్వర్గ లోకమునకు, మోక్షమునకు నీవే మార్గము. సోపానమూ నీవే . ఎంతో పుణ్యము చేసుకొనిన ప్రాణికి మాత్రమే నీ సంతతిగా పుట్టే భాగ్యం లభిస్తుంది. అని విష్ణు పురాణం భరత మాతను ప్రశంసించింది.

సేకరణ
🕉️ *ప్రణవం* 🕉️

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

27/07/2024

శ్లో॥ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్ ।
హరం నరహరిం రామం గోవిన్దం దధివామనమ్ ॥

భక్త్యా చేమాని భద్రాణి దశనామాని యో జపేత్ |
శతకృత్వో భక్తి యుక్తో జప్త్వా నీరోగతాం వ్రజేత్ ॥
లక్షధా హి జపేద్యో హి బన్దనాన్ముచ్యతే ధ్రువమ్| జప్త్వా చ దశలక్షం మహావన్ద్యా ప్రసూయతే ॥
హావిష్యాశీ యతః శుద్దో దరిద్రో ధనవాన్ భవేత్ ॥
శతలక్షం చ జప్త్వా చ జీవన్ముక్తో భవేన్నరః
శుద్ధోనారాయణ క్షేత్రే సర్వసిద్ధిం లభేన్నరః॥

భక్తి పూర్వకముగ

"విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్ ।
హరం నరహరిం రామం గోవిన్దం దధివామనమ్"

అనునీ పది మంగళనామములను నూఱుపర్యాయములు జపించువారు రోగరహితులు కాగలరు.
ఈదివ్యనామమును ఒక లక్షపర్యాయములు జపించిన వారు బంధనములనుండి ముక్తులు కాగలరు.
పదిలక్షల పర్యాయములు జపించిన మహావంధ్య యైన స్త్రీ పుత్రుని ప్రసవింపగలదు.

శుద్ధుడై హవిష్యమును భుజించుచు ఈ దివ్యనామములను జపించినదరిద్రుడు ధనవంతుడు కాగలడు.

అలాగే శుద్ధముగ నీదివ్యనామములను కోటిపర్యాయములు జపించిన మనుష్యుడు జీవన్ముక్తుడు కాగలడు.

నారాయణ క్షేత్రములో పరిశుద్ధుడై యీదివ్యనామముల జపమొనరించిన మనుష్యునకు సర్వ సిద్ధులు సులభముగ లభింపగలవు.

- బ్రహ్మ వైవర్త పురాణం

22/07/2024

బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు

నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు. బహుశా పెద్ద మనవడేమో?" అంది మా ఆవిడ.

"అయుండొచ్చు"అన్నాను నేను కాస్త నిమ్మళించాక.

అన్నం తిని సోఫాలో కూచోగానే, చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను జ్ఞాపకం వచ్చింది. ఇప్పటిలా టేబుల్స్ లేవు గదా, ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం బావి దగ్గిరకు వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే, నేల పీటల మీద బాసింపట్టు వేసుకుని కూచుని భోంచేసేవాళ్ళం.

వంటకన్నీ ఇత్తడి గిన్నెలే ఉండేవి ఎక్కువగా. కంచాలు,గ్లాసులు మాత్రం స్టీలువి ఉండేవి. బొగ్గు కుంపట్ల మీదే వంటంతా...

అమ్మ పక్కనే కూచుని వడ్డిస్తూ ఉండేది.
"ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేసుకున్నావా" అంటూ అందరినీ కనుక్కుంటూ వడ్డించేది.

ఒకవేళ భోంచేస్తున్నప్పుడు ఎవరికైనా పొలమారితే గానీ, పచ్చడి కారానికి వెక్కిళ్ళు వస్తేగాని, పక్కనే కూచున్న అమ్మ కొన్ని నీళ్లు తీసుకుని వారి నెత్తి మీద జల్లి

"నీ పేరేంటి, ఏ ఊళ్ళో పుట్టావు చెప్పు?"
అని అడిగేది.

నేను అయితే అడ్డతీగల అని, మా అక్కయితే కాకినాడ అని చెప్పేవాళ్ళం. కాస్త స్థిమిత పడ్డాక నా పేరుకి, ఊరు పేరు కి, ఎక్కిళ్ళకి ఏమి సంబంధం అని ఆడిగితే, "ఏమో తెలీదు గానీ నీకు వెక్కిళ్ళు పోయాయా లేదా" అని తిరిగి ప్రశ్న వేసేది అమ్మ. నిజంగానే గమ్మత్తుగా వెక్కిళ్ళు ఆగిపోయేవి.

ఇలాగే ఇంకో కిటుకు ఉండేది అమ్మ దగ్గిర. "మీ ఫ్రెండ్ రాము గాడి సైకిల్ పోయిందిట గదా" అనో "పక్కింటి పిన్నిగారు ఇంట్లో బిందె ఎవరో ఎత్తుకుపోయారుట" అంటూ ఏవో వింత వార్తలు చెప్పేది.

"నిజమా??"అంటూ మన దృష్టి అటు వెళ్ళేది. ఈ లోపల వెక్కిళ్ళు, పొలమారడం తగ్గిపోయేవి ఆశ్చర్యంగా.

అమ్మ నవ్వేసి " ఊరికే...నీ దృష్టి మళ్ళిద్దామని"అనేది నవ్వుతూ

అలాగే అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడవద్దు అనేవారు పెద్దలు. మాట్లాడుతూ తింటే అన్నం వంటికి పట్టదుట.

అన్నం తింటూ మధ్యలో కంచం దగ్గిరనుంచి లేవకూడదు అనేవారు.

కంచంలో ఏమీ వదిలేయకుండా తినాలి, వృధా చేయకూడదు, కంచంలో చేయి కడగకూడదు అని చిన్నప్పటినుంచే తెలుసుకున్న తరం మనది.

మనతో కూచున్న అందరూ అన్నం తినడం అయ్యాకే లేచి చేయి కడుక్కునేవాళ్ళం.

అమ్మ మాత్రం అందరం తిన్నాక,
నాన్నగారు తిన్న పళ్ళెంలోనే తానూ
తినేది.

రాత్రిపూట ఉప్పు అని అడిగేవారు కాదు పెద్దవాళ్ళు. ఎందులోనైన ఉప్పు తగ్గినా, మజ్జిగ లోకి కావలసి వచ్చినా, "కాస్త చవి చూపించు" అనేవారు. కంచములో ఒక పక్కకి వేసేవారు గానీ చేతిలో వేసేవారు కాదు.

అలాగే రాత్రి పూట ఉసిరికాయ పచ్చడి నిషేధం. తినకూడదు అనేవారు.

వడియాలు పెట్టాలంటే ఆ బూడిద గుమ్మడికాయ మీద మగవాళ్ల చేతికి కత్తి ఇచ్చి ఒక చిన్న గాటు పెట్టించే తరవాత ఆ కాయని ముక్కలు చేసేది అమ్మ

చీకటి పడితే చెట్టు మీద చేయి వేయవద్దు అనేవారు. పూలు గానీ పళ్ళు గానీ , కరివేపాకు గానీ, సూర్యాస్తమయం ముందే కోయాలి అనేవారు.

పసిపిల్లలు ఉయ్యాలలో లేనప్పుడు ఖాళీ ఉయ్యాల ని ఊపవద్దు అనేవారు.

ఆడపిల్లలు బియ్యం తింటుంటే నీ పెళ్లి సమయానికి పెద్ద వాన వస్తుంది అని భయపెట్టి ఆ అలవాటు మానిపించేవారు.

ఉరుములు,మెరుపులు, పిడుగులతో వర్షం వస్తుంటే ఉరిమినప్పుడల్లా "అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి" అని అంటూ దండం పెట్టుకుని మమ్మల్నీ అలా చేయమనేది అమ్మ.

వినాయకచవితి నాడు సాయంత్రం చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్లి ఆ ఇంటి వినాయకుడిని చూసి రమ్మనేవారు. ఎంతమంది వినాయకులకు మొక్కితే అంత బాగా చదువు వస్తుంది అనేవారు.

నాన్నగారూ ఏదైనా పని మీదో, లేక ఏదైనా ఊరి కో ప్రయాణమవుతుంటే శకునం చూసి మరీ
రోడ్ ఎక్కేవాళ్ళు.

"పాలమ్మాయి వస్తోంది. మంచిది వెళ్ళిరండి"అని అమ్మ అనేది. ఎవరూ ఎదురు రాకపోతే అమ్మ గానీ, అక్క గానీ అటు వెళ్లి ఇటు ఇంట్లోకి శకునంగా రావడం కూడా జరిగేది మధ్యేమార్గంగా.

గడప మీద కూచోకూడదు అని చెప్పేవారు. ఏదైనా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా గడప దాటి చేయమనేవారు.

ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని ఉండకూడదు అనేవారు.

దొడ్లో కాకి ఆగకుండా కావు కావుమంటుంటే చుట్టాలు వస్తారు అనుకునేవాళ్ళం. అలాగే ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వస్తే "రండి రండి" అని సంతోషంగా ఆహ్వానిస్తూనే "పొద్దున్న కాకి అరచినప్పుడే అనుకున్నా ఎవరో ఇంటికి వస్తారని..." అనేవాళ్ళం.

ఒక కాకి చనిపోతే దాని చుట్టూ పది కాకుల గుంపు చేరి కావు కావుమంటూ వాటి సంఘీభావమో, సంతాపమో తెలియచేస్తే వాటి స్నేహాభావాన్ని మెచ్చుకున్నాము. ఆబ్దికాలలో కాకి పిండం తిన్న కాకులను మన పితృదేవతలలాగా భావించి శిరస్సు వంచి మరీ దండం పెట్టేవాళ్ళం.

ఇప్పటి తరానికి ఇవన్నీ చాదస్తాలు, పిచ్చి నమ్మకాలు లాగ అనిపించవచ్చు గానీ ఇవన్నీ వింటూ, చూస్తూ, ఆచరిస్తూ పెరిగిన తరం మనది. ఎందుకు అని ఎదురుతిరగలేదు,
ఇప్పటివారిలా వితండవాదం చేయలేదు, చాదస్తాలు అని కొట్టి పారేయ్యలేదు.
పెద్దల మాట చద్దిమూట అనుకుంటూ ఆచరించాము.హాయిగా ఆనందంగా పెరిగాము...

కాదంటారా???

21/07/2024

భాగవత పద్యాలు!
(పోతనామాత్యుడు)
"చేతులారంగ శివుని బూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబులోనుగా దలపడేని
గలుగనేటికి దల్లుల కడుపు చేటు!

11/07/2024

గోపికలు ప్రియునిగా తలచి
ద్రౌపత్యాదులు బంధు భావన చేత
ఉద్దవాదులు సాన్నిహిత్యం చేత
అర్జునాదులు సఖ్యం చేత
శిశుపాలాదులు వైరిభావం చేత
యశోదాదులు వాత్సల్యం చేత
ప్రహ్లాదాదులు స్మరణ చేత
నారదా నీవు కీర్తన చేత
సదా సర్వవ్యాపక నారాయణుని తలవడం‌చేత
నాకు ప్రీతి పాతృలై మోక్షాన్ని పోందుతారు........
ఈ మాటలు నేనన్నవి కావు
స్వయంగా నారాయణుడు నారదునికి చెప్పినవి
భాగవతం లో
ఇలా ఏది ఏమైనా
ఆయనను తలిచామా లేదా????
అన్నదే ప్రధానం
కనుక
ఎలా తలచినా ఆయన వద్దకే వెళ్ళడం
తలవక పోతేనే సమస్య

09/07/2024

భగవద్గీత 9-22
“ అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || ”

కొన్నేళ్ళ క్రితం మన దేశంలో ఒక ఆయుర్వేదవైద్యుడు వుండేవారు. పేద డాక్టరు . భగవద్గీత లో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూవుండేవాడు. ఒకరోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు. [ నన్ను నమ్మి , అహంకారం వదలి , నాకు శరణాగతి చేసుకొన్న వారి బాగోగులు నేనే చూసుకొంటాను - అనన్యాశ్చింతయోమా ...యోగక్షేమం వహామ్యహం - 9 వ అధ్యాయం , 22 వ శ్లోకం] ] ఉదాహరణకు రోజుకు 80 రూ. కావాలి. ఎనిమిదిమంది పేషెంట్లు వచ్చారు , 80 రూ. వచ్చింది. అంతే . తొమ్మిదవ పేషెంటు దగ్గర డబ్బు తీసుకోడు. ఉచితం. ఎప్పుడూ దైవ చింతనలో వుండేవాడు.ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాల్నో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు [ ఫీజు రూపంలో ] రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా ? అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా ? వాసుదేవమితి సర్వం .

ఒక రోజు ఆసుపత్రి [ చిన్న గది] ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి , డాక్టరు దగ్గరికొచ్చి ' నన్ను గుర్తుపట్టారా ? '' అని అడిగాడు. '' క్షమించాలి , లేదు , '' అన్నాడు డాక్టరు. అపుడు ఆయన ఇలా చెప్పాడు : '' 15 ఏళ్ళ క్రితం ఒక రాత్రి ఈ వూరిగుండా వెళుతున్న నేను , ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేరు చేస్తున్నాడు. అపుడు మీరు వచ్చి ' లోపలికి రండి ' అన్నారు. గదిలోకొచ్చి కూర్చొన్న నన్ను చూసి ' మీరు ఏదో దిగులు పడుతున్నారు , ఆరోగ్యం సరిగాలేదా ? ' అన్నారు. అపుడు మీ టేబిల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళు వుండే ఒక చిన్న పాప మిమ్మల్ని ' నాన్నా , ఇక ఇంటికి వెళదాం , రండి ' అని పిలిచింది. ' కాసేపు ఆగమ్మా , కారు వెళ్ళాక మనం ఇంటికివెళదాం ,' అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను ' , నేను ఇంగ్లాండులో వుంటాను. మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప వుండాలని మాకు ఎంతో కోరిక , కానీ తీరలేదు. ఇపుడు ఈ పాపను చూస్తే , నా బాధ గుర్తుకొచ్చింది ,'' అన్నాను. మీరు రెండు పొట్లాల ఔషధం తయారుచేసి ' మీరు , మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున తీసుకోండి 'అన్నారు. నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి ? అని అడుగుతుంటే అపుడు మరో పేషెంటు వచ్చి తన జబ్బు చెప్పి మీదగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ , నాదగ్గరకొచ్చి ' ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో , ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు ' అని అంటూ వెళ్ళిపోయాడు. కారు రిపేరు అయ్యింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. దిల్లీ వెళ్ళి అక్కడినుండి ఇంగ్లాండు వెళ్ళాం. ఇంగ్లాండు డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తరువాత కూడా , మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం ,వృత్తిపట్ల మీ అంకిత భావం , మీ వ్యక్తిత్వం చూసాక నమ్మకం కలిగి నేను , రాధిక ఔషధం తీసుకొన్నాం. ఇపుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు. పుత్తడిబొమ్మల్లావుంటారు. మీరు మాకు దేవుడితో సమానం.

అప్పటినుండీ మీ ఋణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్ లో ఒక అక్కగారు వున్నారు . దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డుప్రమాదం లో మరణించారు. వాళ్ళకో కూతురు. ఆమె పెళ్ళి బాధ్యత నేనే తీసుకొన్నాను. అపుడు నాకు 15 ఏళ్ళక్రితం ఈగదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇపుడు పెళ్ళి వయసుకు వచ్చివుంటుంది. ఆమె పెళ్ళికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈనెల 24 న మా అక్క కూతురి పెళ్ళి . మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్దతిలో లెక్కవేసి ఈడబ్బు తెచ్చాను.మీరు డబ్బు కోసం ఎవరిదగ్గరా అప్పు చేయకండి. నేనున్నాను.ఇది మీరు తీసుకోవాలి '' అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబిల్ మీద పెట్టాడు. అపుడు డాక్టరు తన జేబులోంచి ఈ రోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆరోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టు ను అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా వ్రాసివుంది : ' ఈనెల 22 న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు. ఆలోచించండి.'

“ వేరే ఆలోచనలు లేకుండా నిత్యమూ తనను తానే నమ్ముకొని, తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే వుంటూ, తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. ”

Address

Luxettipet
504215

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ విశ్వనాథ జ్యోతిష్యాలయం లక్షెట్టిపేట,కాగజ్ నగర posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category