18/02/2017
నాయన! శ్రీగురుపరమాత్మ మహాజ్ఞాని. తనయొక్క జ్ఞాన శక్తి సామర్థ్యము చేత తత్వమును సృజించి మరియు శ్రీగురుదేవుడు తాను సృజించిన ఈ తత్వమునుండి వేదములను తద్వారా ఉపనిషత్తులు, శాస్త్రములను జీవుల నుద్ధరింప తత్వమాలా విభూషితుడుగా ఈజగమునందు కీర్తింపబడు చున్నాడని మహాత్ములు, గురువుల ద్వారా స్పష్టమగు చున్నది.
1. వేదములు:- ఆయా దేశకాల వాతావరణముల ననుసరించి ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండగా స్థిరముగా సర్వకాలములయందును ఈజగమునందు జీవుల స్థితి గతులను చక్కగా నడిపించు విధముగా యున్నవి.
2.ఉపనిషత్తులు:- వేదములయందు చెప్పబడిన విషయములను ఈజగమునందు మహాత్ములు, గురువుల ద్వారా జీవులను పరివర్తనను కలిగించునవిగా యున్నవి.
3.శాస్త్రములు:- మహాత్ముల చేత ఉచ్చరింప (వివరింప) బడిన ఉపనిషద్విషయములను శాసనములుగాను వాటినే ప్రామాణికముగా జేసుకొని ఈజగమునందు జీవులను ఆచరణాత్మకముగా సన్మార్గమున నడిపించు విధముగా శాస్త్రములుగా యున్నవి.
ఈవిధముగా శ్రీగురుదేవుడు తనయొక్క తత్వ విజ్ఞానముచేత జీవుల నుద్ధరింప పరమ దయతో భుక్తిని, మరియు ముముక్షువులకు ముక్తిని ప్రసాదించు చున్నాడు.
కావున అటువంటి పరమ దయాళువైన శ్రీగురుదేవుని జీవులు/ సాధకులు/ శిష్యులు ఆయా మార్గముల ననుసరించి సేవించి తరించవలసి యున్నది.
శుభమస్తు నాయన.