AP State Jesus Believers Association

AP State Jesus Believers Association Vision
1. Unite & Serving Christian Community(Bishops, Pators, All Jesus Believers ) in the Andhra Pradesh State

Mission
1.

Associating with almost all Church heads of Main line churches, Large gathering Independent & churches, All Belivers in AP State.

ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా ఆస్తి పంచాలి – ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటిగుంటూరు జిల్లా చేబ్రోలు: ఆడపిల్లలకు కూడా మగ ...
08/03/2026

ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా ఆస్తి పంచాలి – ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి

గుంటూరు జిల్లా చేబ్రోలు: ఆడపిల్లలకు కూడా మగ పిల్లలతో సమానంగా తల్లితండ్రులు ఆస్తిని పంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప్రొఫెసర్ డా. జోసెఫ్ మోసిగంటి అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆయన ఒక ప్రకటన చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం సమాజంలో అనేక రంగాలలో స్త్రీలపై ఉన్న వివక్షతలు చాలా వరకు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. గతంలో సతీసహగమన వంటి దురాచారాలను నిర్మూలించేందుకు ప్రముఖ సంఘ సంస్కర్త మిషనరీ విలియం కేరి కృషి చేయగా, రాజా రామ్మోహన్ రాయ్ సహకారంతో ఆ దురాచారం నిషేధించబడిందని ఆయన గుర్తు చేశారు.

ఈ రోజుల్లో చాలా కుటుంబాలు మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివిస్తున్నప్పటికీ, ఆస్తి విషయంలో మాత్రం ఇంకా సమానత్వం కనిపించడం లేదని అన్నారు. చాలా మంది తల్లితండ్రులు ఆడపిల్లలను “వేరే ఇంటికి వెళ్లిపోయింది” అనే భావంతో చూసి ఆస్తి పంచడంలో వెనుకంజ వేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉద్యోగాలు, జీవన పరిస్థితుల కారణంగా మగ పిల్లలు కూడా తల్లితండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. అనేక కుటుంబాలలో ఆడపిల్లలకే తల్లితండ్రుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ, బాధ్యత ఉండి వారినే ఎక్కువగా చూసుకుంటున్నారని ఆయన తెలిపారు. అయినప్పటికీ కొంతమంది తల్లితండ్రులు కుమారులకే ఆస్తి ఇస్తున్నారని, ఈ పరిస్థితి కూడా మారాల్సిన అవసరం ఉందని సూచించారు.

క్రైస్తవ ధర్మంలో స్త్రీలకు సమాన ఆస్తి హక్కు ఉందని ఆయన అన్నారు. భారతదేశంలోనే తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించగా, అనంతరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆ చట్టాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం స్త్రీలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు సహా అన్ని రంగాలలో మగ పిల్లలకంటే ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అయితే కొంతమంది స్త్రీలు స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని కుటుంబాలలో విభేదాలు సృష్టిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు తయారవ్వాలన్నా, కుటుంబాలు మరియు సమాజం బాగుండాలన్నా స్త్రీ పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

స్త్రీలు వ్యక్తిత్వంలోనూ, అన్ని రంగాలలోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

పలనాడు జిల్లాలోని మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో సమావేశంప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప...
20/02/2026

పలనాడు జిల్లాలోని మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో సమావేశం
ప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు పల్నాడు జిల్లాలోని, నరసరావుపేటలో జూపల్లి సెంటర్ వద్ద గల బెర్షెబా ప్రార్ధనా మందిరం లో నిర్వహించిన పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో 19వ తారీకు గురువారం ఉదయం 9.30 గంటల నుండి 4.30 గంటల వరకు నిర్వహించిన సమావేశం చాలా ఘనముగా జరిగినది, పల్నాడు జిల్లాలోని మండలాల నుంచి 60 మంది క్రైస్తవ నాయకులు అటెండ్ అయ్యారు, ప్రొఫెసర్ జోసెఫ్ గారు వారి సమస్యలు విని, చాలా వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచించారు, మిగిలిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, క్రైస్తవ నాయకులందరూ మతసామరస్యముతో ఉంటున్నారని, స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ సాధనలో భాగస్వామ్యంలో అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా అన్ని జిల్లాలలోని మండల ఫెలోషిప్ నాయకులతో మీటింగ్ పెడుతున్నామని, పలనాడు జిల్లాతో మొదలుపెట్టామని ప్రొఫెసర్ జోసెఫ్ తెలియజేశారు, లోకల్ గా క్రైస్తవ నాయకులు అందరూ కలిసి ప్రొఫెసర్ జోసఫ్ గారు, రాష్ట్ర క్రైస్తవ సమాజానికి చేస్తున్న సేవలను బట్టి, శాలువాతో సత్కరించారు.

పలనాడు జిల్లాలోని మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో సమావేశంప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప...
20/02/2026

పలనాడు జిల్లాలోని మండల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో సమావేశం
ప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి గారు పల్నాడు జిల్లాలోని, నరసరావుపేటలో జూపల్లి సెంటర్ వద్ద గల బెర్షెబా ప్రార్ధనా మందిరం లో నిర్వహించిన పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల పాస్టర్ ఫెలోషిప్ నాయకులతో 19వ తారీకు గురువారం ఉదయం 9.30 గంటల నుండి 4.30 గంటల వరకు నిర్వహించిన సమావేశం చాలా ఘనముగా జరిగినది, పల్నాడు జిల్లాలోని మండలాల నుంచి 60 మంది క్రైస్తవ నాయకులు అటెండ్ అయ్యారు, ప్రొఫెసర్ జోసెఫ్ గారు వారి సమస్యలు విని, చాలా వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచించారు, మిగిలిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, క్రైస్తవ నాయకులందరూ మతసామరస్యముతో ఉంటున్నారని, స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ సాధనలో భాగస్వామ్యంలో అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా అన్ని జిల్లాలలోని మండల ఫెలోషిప్ నాయకులతో మీటింగ్ పెడుతున్నామని, పలనాడు జిల్లాతో మొదలుపెట్టామని ప్రొఫెసర్ జోసెఫ్ తెలియజేశారు, లోకల్ గా క్రైస్తవ నాయకులు అందరూ కలిసి ప్రొఫెసర్ జోసఫ్ గారు, రాష్ట్ర క్రైస్తవ సమాజానికి చేస్తున్న సేవలను బట్టి, శాలువాతో సత్కరించారు.

క్రైస్తవులకు ప్రత్యేకంగా 90.11 కోట్ల బడ్జెట్ కేటాయింపుచంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం,ఆర్థిక ఒత్తిళ్లు మధ్య కూడా, క్రైస్...
16/02/2026

క్రైస్తవులకు ప్రత్యేకంగా 90.11 కోట్ల బడ్జెట్ కేటాయింపు

చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం,
ఆర్థిక ఒత్తిళ్లు మధ్య కూడా, క్రైస్తవ సమాజానికి గత ఏడాది బడ్జెట్ కంటే ఎక్కువగా ఈసారి, ఉమ్మడి మైనార్టీ బడ్జెట్ కాకుండా క్రైస్తవ సమాజానికి ప్రత్యేకంగా మొత్తం 90 కోట్ల 11 లక్షలు బడ్జెట్ కేటాయించడం పట్ల ప్రొఫెసర్ జోసెఫ్ హర్షం వ్యక్తం చేశారు.
పాస్టర్స్ గౌరవ వేతనం రాబోయే సంవత్సరమునకు మరియు నాలుగు నెలల బకాయిలకు కలిపి సుమారు 68 కోట్లు కేటాయించారు

క్రైస్తవ యువత స్వయం ఉపాధి కల్పనకు 21 కోట్లు,

జెరూసలేం యాత్రకు 1.5 కోట్లు కేటాయించారని తెలిపారు.

పల్నాడు జిల్లాలోని క్రైస్తవ సమస్యలపై నాయకులతో చర్చవివిధ అంశాలపై అవగాహన కార్యక్రమ సమావేశంతేదీ: 19-02-2026,       స్థలం: న...
14/02/2026

పల్నాడు జిల్లాలోని క్రైస్తవ సమస్యలపై నాయకులతో చర్చ

వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమ సమావేశం

తేదీ: 19-02-2026,
స్థలం: నరసరావుపేటలో
టైం: 9.30 AM to 4.30 PM
రిజిస్ట్రేషన్ తప్పనిసరి :
https://jbac.in/entry
లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

గమనిక: 16 వ తారీకు సోమవారం సాయంత్రం లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి ఫోన్ కి సమావేశ స్థలం వివరాలు పంపుతాము, భోజనం ఏర్పాటు చేయ బడుతుంది, ఎటువంటి కానుకలు ఇవ్వబడవు, దారి ఖర్చులు.

ఎవరు పాల్గొనచ్చు: పల్నాడు జిల్లా క్రైస్తవ నాయకులు, మాజీ & ప్రస్తుత మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ మెంబెర్స్, క్రైస్తవ విద్యార్థులు, విశ్వాసులు, సమస్యలు ఎదుర్కొనేవారు, రాజకీయ పార్టీ బేధం లేదు, కుల డినామినేషన్ భేదం లేదు, మండల్ లెవెల్ నుంచి రాష్ట్ర లెవెల్ వరకూ మైనారిటీ కి వున్న700 నామినేటెడ్ పోస్ట్ ల తో, సమాజానికి సేవ చేయటానికి క్వావాలి అనుకునేవారు అందరు రావచ్చు.

ఈ సమావేశం లో చర్చించే అంశాల కొరకు పామ్ ప్లేట్ చూడండి

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రతి జిల్లా క్యాపిటల్ సిటీలో క్రైస్తవ సమస్యలపై జిల్లాలో ఉన్న క్రైస్తవ నాయకులతో చర్చ వివిధ...
13/02/2026

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రతి జిల్లా క్యాపిటల్ సిటీలో క్రైస్తవ సమస్యలపై జిల్లాలో ఉన్న క్రైస్తవ నాయకులతో చర్చ వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి, గుంటూరు జిల్లాలోని, చేబ్రోలు లో గురువారం ఒక ప్రకటన చేస్తూ, రాష్ట్రంలో మతసామర్స్యత దెబ్బతినకుండా, గ్రౌండ్ లెవెల్ లో క్రైస్తవ విద్యార్థులు, విశ్వాసులు, క్రైస్తవ సమాజం యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం, నాయకుల , అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లా క్యాపిటల్ సిటీ లో, ఆ జిల్లాలోని ప్రతి మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రస్తుత మరియు మాజీ కమిటీ నాయకులనందరిని సమకూర్చి ఉదయకాల సమావేశంలో చర్చిస్తామని భోజన విరామం తర్వాత చర్చి నిర్మాణానికి అనుమతులు, ట్రస్ట్ రిజిస్ట్రేషన్, 12A, 80G కి సంబంధించిన విషయాలు, క్రైస్తవులకు ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కులు మరియు వారికి ఉన్న ప్రభుత్వ సంస్థలు గురించి, మండలం లెవెల్ నుంచి నియోజకవర్గము, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లలో రాజకీయంగా వారికున్న పదవులు గురించి, పెద్దగా చదువుకోని పాస్టర్స్ కూడా టెక్నాలజీని ఉపయోగించి వారి సేవలు సమర్థవంతంగా, సులువుగా, సురక్షితంగా ఎలా వాడాలో సూచనలు, ఒకవేళ కొత్తవారికి పాస్టర్స్ గౌరవ వేతనం కొరకు అవకాశం ఇస్తే అవసరమైన పత్రాలు గురించి, అలాగే సైబర్ క్రైమ్ వంటి నేరగాళ్ల చేతిలో పడకుండా జాగ్రత్తలు తెలియజేస్తాం, వీటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, రాష్ట్రంలో క్రైస్తవ సమాజానికి ఉచిత సేవలు కూడా ఇవ్వబోతున్నట్లు ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి వెల్లడించారు. లెంట్ డేస్ ప్రారంభమయ్యే భస్మ బుధవారం ఈనెల 18వ తారీఖున పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రారంభిస్తున్నామని, ఏ జిల్లాలో ఏ రోజో తెలుసుకొనుటకు ఈ ఫోన్ నెంబర్ 9281506386 కి హలో అని వాట్స్ ఆప్ కి మెసేజ్ చేస్తే వివరాలు వస్తాయని, డినామినేషన్, కుల, రాజకీయ భేదాలు లేకుండా ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రతి క్రైస్తవ నాయకుడు ఉపయోగించుకుని, వారి నాయకత్వంలోని పాస్టర్స్ ను సమాయత్తం పరచి తద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు.

28/01/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సమాజానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన మేలు జ్ఞప్తికి తెచ్చుకునే చిన్న ప్రయత్నం

ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి
B.Tech, M.Tech, Ph.D
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు &
మాజీ డైరెక్టర్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజస్ గుంటూరు

AmitShah AmitShah

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సమాజానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన మేలు జ్ఞప్తికి తెచ్చుకునే చిన్న ప్రయత్నంప్...
27/01/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సమాజానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన మేలు జ్ఞప్తికి తెచ్చుకునే చిన్న ప్రయత్నం

ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి
B.Tech, M.Tech, Ph.D
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు &
మాజీ డైరెక్టర్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజస్ గుంటూరు

https://www.facebook.com/share/v/1AucrWoFNF/





నారా లోకేష్ గారు తన నియోజకవర్గంలోని అన్ని మతాల వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు, ఇది మిగిలిన అన్న...
26/01/2026

నారా లోకేష్ గారు తన నియోజకవర్గంలోని అన్ని మతాల వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు, ఇది మిగిలిన అన్ని నియోజకవర్గాలకు ఆదర్శం.
కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటిస్తే ప్రభుత్వం చేసే మంచిని క్రైస్తవ సమాజంలోనికి సమర్థవంతంగా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది
ప్రొఫెసర్ జోసఫ్ మోసిగంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ నాయకుడు
మాజీ డైరెక్టర్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజస్ గుంటూరు

Address

3-241/1, Shalem Nivas, Madhura Nagar, S Achutapuram
Kakinada
533004

Alerts

Be the first to know and let us send you an email when AP State Jesus Believers Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share