Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam

Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam Second Largest Ayyappa Swami Temple In Telangana & First Largest Temple In Hyderabad

లోకాభిరామం రణరంగధీరంరాజీవనేత్రం రఘువంశనాథం |కారుణ్యరూపం కరుణాకరం తంశ్రీరామచంద్రం శరణం ప్రపద్యే||ధర్మ స్వరూపుడు, సత్యవాక్...
27/03/2026

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం |
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే||

ధర్మ స్వరూపుడు, సత్యవాక్పరిపాలకుడు అయిన ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ హృదయపూర్వక 'శ్రీరామ నవమి' శుభాకాంక్షలు.


నూతన సంవత్సరానికి నాంది పలికే ఈ పవిత్రమైన ఉగాది పర్వదినం ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి మనసుకు శాం...
19/03/2026

నూతన సంవత్సరానికి నాంది పలికే ఈ పవిత్రమైన ఉగాది పర్వదినం ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి మనసుకు శాంతి నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam



04/03/2026

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన హరిహర క్షేత్ర పంచాదశ వార్షికోత్సవం.



ఆదివారం రోజున శ్రీశ్రీశ్రీ హరిహర క్షేత్ర పంచాదశ వార్షికోత్సవం..Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam తేది:- మార...
28/02/2026

ఆదివారం రోజున శ్రీశ్రీశ్రీ హరిహర క్షేత్ర పంచాదశ వార్షికోత్సవం..

Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam

తేది:- మార్చి 1,2026, ఉదయం 8.01గంటలకు..
గణపతి పూజ, పుణ్యహవనచము సర్వతోభద్ర లింగతోభద్ర యంత్రస్థాపన మరియు కలశస్థాపన ప్రధాన దేవతల హోమాలు, మరియు రుద్ర సహిత చండీయాగము మహపూర్ణాహుతి, హోమరక్ష ఆశీర్వచనము తీర్థ ప్రసాద వితరన తదుపరి అన్న ప్రసాదం..

సాయంత్రం 6.30గంటలకు ఏకశిల పదునెట్టాంబడి మహా పడిపూజ మరియు రాత్రి 9.30లకు మహా హరతి, హరివరాసనం ప్రసాద వితరణ.

భక్తులు సాంప్రదాయ వస్త్రములు ధరించి ఈ 15వ బ్రహ్మోత్సవ మహోత్సవములో అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు..



22/02/2026

స్వామియేశరణం.. అయ్యప్ప శరణం అంటూ నిత్యం కర్మాన్ ఘాట్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయం మారుమోగుతుంది అంటూ దానికి కర్త, కర్మ, క్రియ వంగా మధు సూదన్ రెడ్డి గారే..

తెలంగాణ రాష్ట్రములోనే రెండవ అతి పెద్దదైన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం 2009 సంవత్సరంలో హస్తినాపురం డివిజన్ సాగర్ రింగ్ రోడ్డు బైరామల్గూడ, డిఫెన్స్ కాలనీలోని హరిహరక్షేత్రంను ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉండి ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దీక్షని 30సార్లు స్వీకరించి.. హైదరాబాద్ నుండి శబరిమలకి పాదయాత్రగా వెళ్లిన అయ్యప్ప ప్రియభక్తుడు వంగా మధుసూదన్ రెడ్డి గారు ఆలయ నిర్మాణం ప్రారంభించగా, హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యాభారతి స్వామి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణానికి అంకుర్పాణ జరిగింది. ఆలయ ధర్మకర్త వంగా మధుసూదన్ రెడ్డి గారు భక్తుల విరాళాలతో సుమారు రూ.20కోట్లకి పైగా వెచ్చించి ఆలయాన్ని రెండేండ్లలో సుందరంగా నిర్మించారు.

ఆలయంలో ఏకశిల పదునెట్టాంబడి (బంగారు మెట్లు) ఏర్పాటు కోసం నాగర్ కర్నూల్ జిల్లాలోని చారగొండ మండలం శిరుసనగండ్ల గుట్టలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఎంచుకోగా, గుట్ట నుంచి 160టన్నుల బండను తొలిచేందుకు శిల్పులు ఎనిమిది మాసాల పాటు శ్రమించి ఏకశిల పదునెట్టాంబడిని చెక్కారు. రాష్ట్రంలోనే ఏకశిల పదునెట్టాంబడిని ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించారు.

అయ్యప్ప స్వామి వారితో పాటు వినాయకుని, శివుని, దుర్గామాత, దత్తత్రేయ సుభ్రమణ్య స్వామి, ఆంజనేయు స్వామి మరియు సత్యనారాయణ స్వామి అలాగే నవగ్రహాలు మరియు మణికపురం మంజుమాత, నాగ దేవత ఆలయాలు సైతం ఇక్కడ కొలువుదిరేలా వంగా మధున్న నిర్మాణం చేపట్టడం జరిగింది..బంగారు కిరీటం , వెండి తలుపు మరియు 500 యార్డ్స్ లో గో -శాల మరియు 20 గృహాలని పూజరుల కోసం నిర్మించడం జరిగింది..

13 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 5రోజుల పాటు అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించడమే కాక 5రకాల హోమాలను అలాగే 5రకాల కళ్యాణోత్సవాలను నిర్వహిస్తూ..ప్రముఖ ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు గారు మరియు గరికిపాటి నరసింహరావు గారితో ప్రవచన సభలను సైతం ఏర్పాటు చేశారు..

అయ్యప్పస్వామి మహాపడి పూజా కార్యక్రమంలో ఏకశిల పదునెట్టాంబడిలో పడిని వెలిగించేందుకు స్వాములు పోటీ పడుతారు. నియమ నిష్టలతో అయ్యప్ప మాలాధరణ ధరించిన స్వాములు నిత్యం ఆలయంలో పడిపూజలు నిర్వహిస్తారు.

వంగా మధు సూదన్ రెడ్డి గారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో సౌకర్యాలు కల్పించి, భక్తులకు నిత్యం అన్నదానం ఏర్పాటు చేసారు. తన చివరి మజిలీలో సైతం మృత్యువుతో పోరాడుతూ నేను లేకపోతే నా ఆలయం ఏమైపోతుందో అని భార్య పిల్లల గురించి కంటే తాను నిర్మించిన గుడి గురించి ఆలోచించిన గొప్ప దైవభక్తి వంగా మధున్న సొంతం..

ఆ హరిహర సుతుడి ప్రియభక్తుడు మన నుండి గతించినా ఆయన రూపం మన గుండెల్లో పదిలం..

మహా శివరాత్రి పర్వదినాన ఆ పరమ శివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ...మీకు, మీ కుటుంబ ...
15/02/2026

మహా శివరాత్రి పర్వదినాన ఆ పరమ శివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ...మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.


మండల మరియు మకర జ్యోతి కాలం పాటు నెయ్యి అభిషేకంతో మెరిసి ఆభరణ ప్రియుడైన ఆ కేరళాకేళి విగ్రహం మళ్ళీ భస్మధారణతో మునిగి పరవశి...
21/01/2026

మండల మరియు మకర జ్యోతి కాలం పాటు నెయ్యి అభిషేకంతో మెరిసి ఆభరణ ప్రియుడైన ఆ కేరళాకేళి విగ్రహం మళ్ళీ భస్మధారణతో మునిగి పరవశించి ఉంది, శివోహం స్వామిశరణం🙏

మకరవిళక్కు మహోత్సవంలో భాగంగా ప్రాచీన వామ్మోళి సంప్రదాయాలతో నాయట్టు పిలుపు నిర్వహించబడుతుంది. మకరవిళక్కు దినం నుంచి వరుసగ...
16/01/2026

మకరవిళక్కు మహోత్సవంలో భాగంగా ప్రాచీన వామ్మోళి సంప్రదాయాలతో నాయట్టు పిలుపు నిర్వహించబడుతుంది. మకరవిళక్కు దినం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు నాయట్టు పిలుపు సన్నిదానంలో జరుగుతుంది.

పద్దెనిమిదవ మెట్టుకి దిగువనున్న నిలపాట్తర నుండి దక్షిణ దిశగా చూస్తూ నాయట్టు పిలుపు నిర్వహిస్తారు. చివరి రోజు ఈ కార్యక్రమం శరంగత్తిలో జరుగుతుంది.

అయ్యప్ప స్వామికి కాపలాదారులైన భూతగణాలు మరియు మలదేవతలు మకరవిళక్కు మహోత్సవ సమయంలో శబరిమల నుంచి అడవుల్లోకి వెళ్తారని విశ్వాసం, వారిని అయ్యప్ప స్వామి స్వయంగా పిలిచి తిరిగి శబరిమలకి తీసుకొస్తాడని నమ్మకం ఉంది. అందుకోసమే నాయట్టు పిలుపు బృందం శరంగుత్తికి వెళ్తుంది.

పద్యరూపంలో చక్కగా రూపొందించిన అయ్యప్ప చరిత్ర ఇతిహాసాలను ద్రావిడ మలయాళ భాషలో తరతరాలుగా వామ్మోళి సంప్రదాయంగా అందిస్తూ వస్తున్న ఆచారమే నాయట్టు పిలుపు.

అయ్యప్ప స్వామి ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం 576 శీలాలు నాయట్టు పిలుపులో భాగంగా ఉంటాయి. శబరిమల దేవాలయ ప్రారంభ కాలం నుంచే కొనసాగుతున్న ఈ ఆచారంలో నాయట్టు పిలుపు చెప్పే వ్యక్తి ప్రతి శీలం ముగించిన వెంటనే అతనితో పాటు ఉన్నవారు ఈ హూయి అని ఘోషిస్తారు.

భగవాన్ అయ్యప్ప యొక్క మకరమాస మహోత్సవం జరుగుతోందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేయడానికే ఈ హూయి అనే పిలుపు. పద్దెనిమిదవ మెట్టుకి దిగువన ఉన్న అయ్యప్ప స్వామి, పైభాగంలోని శ్రీ ధర్మశాస్తాను దర్శించుకునే సందర్భం కూడా ఇదే నాయట్టు పిలుపుగా భావిస్తారు.

నాయట్టు పిలుపు బృందంలో నాయట్టు పిలుపు కురుప్పు సహా మొత్తం 12 మంది ఉంటారు. రాన్నీ – పెరునాడ్ ప్రాంతానికి చెందిన వెల్లాళ కులానికి చెందిన పున్నమూటిల్ కుటుంబానికి నాయట్టు పిలుపు చేసే వారసత్వ హక్కును పందళం రాజు అప్పగించినట్లు చెబుతారు. ప్రస్తుతం పున్నమూటిల్ పి.జి. మహేష్ నాయట్టు పిలుపులో శీలాలను ఉచ్ఛరిస్తున్నారు.

కష్టాలన్నింటికి కారణం మనిషికి ఉన్న అహంకారం. ఈ తుచ్చ అహంకారం ఎన్ని జరిగిన జరుగుతున్న ఈ మనిషిని వదిలిపోదా?! కూలిపోయిన ఇంటి...
15/01/2026

కష్టాలన్నింటికి కారణం మనిషికి ఉన్న అహంకారం.
ఈ తుచ్చ అహంకారం ఎన్ని జరిగిన జరుగుతున్న ఈ మనిషిని వదిలిపోదా?! కూలిపోయిన ఇంటి శిథిలాలనుంచి పాతబడిన ఇంటి గోడలనుంచి రావిచెట్టు పెరగటం చూసే ఉంటారు వాటిని ఎవరు పెంచి పోషించరు నీరుకూడా పోయరు, నేడు వాటిని నరికివేసిన రెండు మూడు రోజుల్లో మళ్ళీ మొలక రావటం చూడొచ్చు, అహంకారం విషయంలోను ఇదే జరుగుతుంది, ఒక గిన్నెలో వెల్లుల్లిని నలగకొట్టి ఆ తర్వాత కడిగిన కూడా దాని వాసన పోదు అది పోవాలంటే ఆ గిన్నెని వేడిచేయాల్సి ఉంటుంది అలాగే ఈ అహంకారం పోవాలంటే మనసుని తపస్సు జపం ధ్యానం భక్తి వంటి వాటితో వేడి చేయాల్సి ఉంటుంది అందుకు అయ్యప్పమాల వేసి మనం అన్నింటిని వదిలి స్వామి సేవలో తరించి ఆయన దర్శన భాగ్యంతో పునీతులవుదాం..

స్వామియే శరణం అయ్యప్ప🙏🙏

తిరువాభరణం ఊరేగింపు పందలం మరియు వలియ కోయిక్కల్ ఆలయంలో తిరువాభరణం ఊరేగింపుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఊరేగింపు మార్గంలో 11 ...
13/01/2026

తిరువాభరణం ఊరేగింపు పందలం మరియు వలియ కోయిక్కల్ ఆలయంలో తిరువాభరణం ఊరేగింపుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఊరేగింపు మార్గంలో 11 ప్రదేశాలలో భక్తుల దర్శనం కోసం అలంకార పెట్టెలను తెరుస్తారు అవి..

కులనాడ భగవతి ఆలయం, ఉల్లన్నూరు దేవి ఆలయం, కురియానపల్లి దేవి ఆలయం, పంపాడిమోన్ అయ్యప్ప ఆలయం, అయిరూర్ పుతియకావు దేవి ఆలయం, తిరువాభరణప్పర, ఇడక్కుళం అయ్యప్ప ఆలయం, వడసెరిక్కర చెరుకావు దేవి ఆలయం, ప్రయార్ మహావిష్ణు ఆలయం, రాజరాజేశ్వరి మండపం, రాజరాజేశ్వరి మండపం. మూడవ రోజున సన్నిధానం చేరుకొంటుంది.

పండలం నుండి ఊరేగింపు మధ్యాహ్నం 1:15 - మణికండనల్తారలో మొదటి రిసెప్షన్.

కైప్పుళ శ్రీ కృష్ణ స్వామి ఆలయం - మధ్యాహ్నం 1:30 గంటలకు

కులనాడ భగవతీ ఆలయం - మధ్యాహ్నం 2:00గం

ఉల్లన్నూర్ భద్రాదేవి ఆలయం - మధ్యాహ్నం 3:00 గంటలకు

పరయంకర గురుమందిరం మధ్యాహ్నం 3:20గం

కురియానిపల్లి దేవి ఆలయం - మధ్యాహ్నం 3:30గం

కవుంపడి ఆలయం - సాయంత్రం 4:00 గంటలకు

కిడంగన్నూర్ జంక్షన్ - సాయంత్రం 4:30

నల్క్కలికల్ స్కూల్ జంక్షన్ - సాయంత్రం 5:00 గంటలకు

అరన్ముల కిజక్కెనాడ - సాయంత్రం 5:30గం

పొన్నంతోట్టం ఆలయం - సాయంత్రం 5:45

పంపడిమోన్ – సాయంత్రం 7:00 గంటలకు

చెరుకోల్పుళ దేవాలయం - రాత్రి 8:30గం

అయిరూర్ పుతియకావు దేవి ఆలయం - రాత్రి 9:30

* రెండవ రోజు..

పుతియకావు దేవి ఆలయం నుండి ఊరేగింపు తెల్లవారుజామున 2:00 గంటలకు బయలుదేరుతుంది:

మూక్కన్నూర్ – ఉదయం 3:40

ఇడప్పవూర్ – ఉదయం 3:50

పేరూర్చల్ - ఉదయం 4:00 గంటలకు

అయిక్కప్పర – ఉదయం 4:15

ఇడక్కుళం అయ్యప్ప ఆలయం - ఉదయం 4:30గం

వడసెరిక్కర చెరుకావు ఆలయం - ఉదయం 8:00 గం

ప్రయార్ మహావిష్ణు దేవాలయం - ఉదయం 9:30గం

మాడమన్ రిషికేశ ఆలయం ఉదయం 10:30

పూవతుమూడు ఉదయం 11:00 గంటలకు

కూడక్కవు - మధ్యాహ్నం 12:00 గంటలకు

కొట్టరథిల్ – మధ్యాహ్నం 12:30 గంటలకు

పెరునాడ్ కక్కట్టు కోయిక్కల్ ఆలయం - మధ్యాహ్నం 1:30 గం

పెరునాడు రాజేశ్వరి మండపం మధ్యాహ్నం 3:30గం

లాహా అటవీ శాఖ విశ్రాంతి గృహం - రాత్రి 8:00 గంటలకు (విశ్రాంతి)

* మూడవ రోజు..

ఈ ఊరేగింపు తెల్లవారుజామున 2:00 గంటలకు లాహా నుండి బయలుదేరుతుంది:

ప్లాపల్లి - ఉదయం 5:00 గంటలకు

ఎలవుంకల్ - ఉదయం 6:30

నీలక్కల్ ఆలయం - ఉదయం 9:00 గంటలకు

అట్టతోడ్ – ఉదయం 10:00 గంటలకు

కొల్లమూళి - ఉదయం 10:30 గంటలకు

ఒలియనపుజ – ఉదయం 11:30

వాలియానవట్టం – మధ్యాహ్నం 12:30 గంటలకు

చెరియానవట్టం – మధ్యాహ్నం 1:00 గంటలకు

నీలిమల – మధ్యాహ్నం 2:30 - 4 గం.

శరంకుతి - సాయంత్రం 5:30 గంటలకు

సన్నిధానం - సాయంత్రం 6:00 గంటలకు

సాయంత్రం 6:30 నుండి 7:00 గంటల వరకు టిడిబి వెలిగించే మకర విలక్కును భక్తులు వీక్షించవచ్చు. పండలం వలియ తంబురాన్ పూర్వ భూస్వాముల ప్రతినిధిగా ఆయన పల్లకీలో ప్రయాణించి పంపాలో బస చేస్తారు. మూడవ రోజు ఆయన పవిత్ర కొండను అధిరోహిస్తారు.

18వ తేదీన పందలం కుటుంబ సమర్పణలో కలభాభిషేకం జరుగుతుంది, మరియు 19వ తేదీన పండలం ప్రతినిధి సమక్షంలో గురుతి నిర్వహిస్తారు. 19వ తేదీ రాత్రి వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. 20వ తేదీ ఉదయం 6:00 గంటలకు ఆలయం మూసివేయబడుతుంది, ఆ తర్వాత ఊరేగింపు తిరువాభరణంతో దిగి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది.

ఈ సంవత్సరం, తిరువాభరణం పేటిక మోసే జట్టుకు గురుస్వామిగా మరుతువన కె.ఎన్. శివన్ కుట్టి నియమితులయ్యారు. ఆయన 40 సంవత్సరాలుగా ఈ బృందంలో ఉన్నారు. 20 సంవత్సరాలుగా గురుస్వామిగా సేవలందించిన కులత్తినాల్కు చెందిన గంగన్ పిళ్లై వృద్ధాప్యం కారణంగా ఉపసంహరించుకున్న తర్వాత ఈ నియామకం జరిగింది.

* ప్రధాన పేటికలోని ఆభరణాలు..

ప్రధాన పేటికలో అతి ముఖ్యమైన ఆభరణాలు ఉన్నాయి వాటిలో తిరుముఖం అయ్యప్ప విగ్రహాన్ని అలంకరించేందుకు అనువైన ఇంద్ర నీలం రత్నంతో అమర్చబడిన ముఖ ఆభరణం, నవరత్న ఉంగరం, మణి మాల, షరప్పోలి మాల, ఎరిక్కింపుమాల, బాకు, కత్తి, బంగారు పళ్ళెం, ప్రభమండలం మరియు ఏనుగు, పులి మరియు లక్ష్మీ స్వరూపం యొక్క బంగారు ప్రతిరూపాలు.

ప్రతినిధి ఈ ప్రధాన పేటిక నుండి కత్తిని పట్టుకుని పాతినేట్టంపడి (18 పవిత్ర మెట్లు) పైకి ఎక్కుతాడు.

రెండవ పేటికలో కలభాభిషేకం కోసం బంగారు పాత్ర, వెండితో కట్టబడిన శంఖం మరియు ఆచార పాత్రలు ఉన్నాయి.

మూడవ పేటికలో శబరిమల వద్ద ఉత్సవ ఊరేగింపుకు ఉపయోగించే ఆభరణాలు ఉన్నాయి, వాటిలో అరయన్ జీవితం, నెట్టి పట్టం, తలప్పర, మరియు ఉడుంపర కొండల జెండాలు ఉన్నాయి.

ఇదిగోండి, శని దేవుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఒక ప్రసిద్ధ పౌరాణిక కథ:శని దేవుడికి నువ్వుల నూనె ఎందుకు ఇష్టమో తెలుసా? ...
10/01/2026

ఇదిగోండి, శని దేవుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఒక ప్రసిద్ధ పౌరాణిక కథ:
శని దేవుడికి నువ్వుల నూనె ఎందుకు ఇష్టమో తెలుసా? 🕉️🖤
త్రేతాయుగంలో, రావణాసురుడు తన శక్తితో నవగ్రహాలను బంధించి లంకలో ఉంచాడు. ముఖ్యంగా శని దేవుడిని తన సింహాసనం కింద తలక్రిందులుగా వేలాడదీశాడు, తద్వారా శని దేవుని వక్ర దృష్టి తనపై పడకుండా చూసుకున్నాడు 👹.
సీతాదేవి ఆచూకీ కోసం హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు, అక్కడ బంధించబడి ఉన్న శని దేవుడిని చూశాడు. వెంటనే హనుమంతుడు శని దేవుడిని రావణుడి చెర నుండి విడిపించాడు 🐵🙏.
శని దేవుని పరీక్ష:
విడుదలైన తర్వాత శని దేవుడు హనుమంతునితో, "హనుమా! నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు. కానీ నా ధర్మం ప్రకారం నా దృష్టి ఎవరిపైనైనా పడాల్సిందే. నీపై కూడా నా ప్రభావం (సాడే సతి) చూపించాలి" అన్నాడు. అప్పుడు హనుమంతుడు, "సరే, నా తల మీద కూర్చో" అని అనుమతినిచ్చాడు.
ఆ తర్వాత హనుమంతుడు రామకార్యంలో భాగంగా, రాక్షసులతో యుద్ధం చేస్తూ పెద్ద పెద్ద బండరాళ్లను, పర్వతాలను తన తల మీద ఎత్తుకున్నాడు 🏔️💪. ఆ రాళ్ల బరువు తల మీద ఉన్న శని దేవుడికి తగిలి, భరించలేనంత నొప్పి కలిగింది.
హనుమంతుని వరం:
నొప్పి తాళలేక శని దేవుడు హనుమంతుని కాళ్ళ బేరానికి వచ్చాడు. "ఆంజనేయా! నీ బలం ముందు నా ప్రభావం పని చేయదు. దయచేసి నన్ను కిందకు దించు" అని వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు, "నా భక్తులను ఎప్పుడూ పీడించనని మాటిస్తేనే దించుతాను" అన్నాడు. శని దేవుడు దానికి అంగీకరించాడు.
ఆ తర్వాత, గాయపడిన శని దేవుడికి హనుమంతుడు ఉపశమనం కోసం నువ్వుల నూనె రాశాడు. ఆ నూనె రాయగానే శని దేవుడికి నొప్పి తగ్గింది. అప్పటి నుండి శని దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసే వారి కష్టాలు తొలగిపోతాయని వరం ఇచ్చాడు 🛢️✨.
అందుకే శనివారాల్లో శని దేవుడికి నువ్వుల నూనె దీపం పెట్టడం లేదా అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుక...
01/01/2026

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🌟🎉

Address

Kharmanghat, Champapet, LB Nagar
Kachiguda

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Hari Hara Kshetra Ayyappa Swamy Devastanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category