Bhaskar Narsinga

Bhaskar Narsinga THE KINGDOM OF GOD

01/11/2022
Oh., Lord Jesus forgives all our sins..🙏ఒక పాపి క్రీస్తు యెదుట చేసిన రోదన.
24/05/2021

Oh., Lord Jesus forgives all our sins..🙏

ఒక పాపి క్రీస్తు యెదుట చేసిన రోదన.

దేవుని కృప ద్వారా అనుగ్రహించబడిన ఈ ఆల్బమ్ లోని అన్ని పాటలను మీరు విని మీ ఆధ్యాత్మిక జీవితంలో క్షేమాభివృద్ధిని ...

22/07/2020

*దురాశను బట్టియే* ...
ఆనాడు లూసీఫర్ పరలోకంలో దేవునికి విరుద్ధంగా పాపము చేసి ఆయన రాజ్యము నుండి వెల్లగొట్టబడినాడు.

*దురాశను బట్టియే* ..
ఆనాడు ఆదాము అవ్వలు ఎదోను తోటలో దేవునికి విరుద్ధంగా పాపము చేసి ఆ తోటలోనుండి వెల్లగొట్టబడినారు.

*దురాశను బట్టియే* ..
నేడును లోకములోని ప్రజలందరూ దేవునికి విరుద్దంగా పాపము చేసి ఆయన అనుగ్రహించు మహిమను పొందలేక నిత్యనరకానికి వెలుచున్నారు.

గమనించండి..!

*దురాశను బట్టియే.* .
పరలోకంలో దేవదూతలు
భూలోకంలో మనుషులు
పాపము చేసి దేవుని యొక్క తీర్పుకు శాపమునకు అప్పగించబడినారు.

దురాశ గర్భము ధరించి పాపమును కనగా
పాపము పరిపక్వమై మరణమును కనెను.

*దురాశయే* ..
పాపమునకును మరియు ఆత్మీయ మరణమునకును కారణమగుచున్నది.

అయితే., ఈ దురాశ నివసించే మన హృదయం దేవుని యొక్క సత్యవాక్యము వలన శుద్ధిచేయబడినట్లయితే

*మన ఆత్మను బ్రతికించు క్రీస్తును చూడగలుగుతాము*

కాబట్టి..,
సహోదరులారా
నీ హృదయమును మరియు
దానిలో నాటబడిన దురాశను
వివేచించు.

శుద్ధి చేయబడుటకు
పరిశుద్దాత్మకు అప్పగించుకో.

*హృదయశుద్ది గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు.*

30/04/2020

మన ప్రాణములోని స్వయము మనుషుల యొక్క మెప్పును కోరుకుంటే..,

మన ఆత్మలోని మనసాక్షి సృష్టికర్తయైన దేవుని యొక్క మెప్పును కోరుకుంటున్నది.

అయితే.,
సహోదరులారా..!

మనలో..
స్వయము బ్రతికియున్నదా.?
మనసాక్షి బ్రతికియున్నదా?

వివేచించుడి.

https://youtu.be/vsIZOSGK960
16/04/2020

https://youtu.be/vsIZOSGK960

for more information please visit Faith Home, Full Gospel Church of GOD, The Kingdom of GOD Gospel Ministries (www.thekingdomofgodgospel.org ) +91 99857 9983...

06/03/2020

మన ప్రాణములోని స్వయము మనుషుల యొక్క మెప్పును కోరుకుంటే..,

మన ఆత్మలోని మనసాక్షి సృష్టికర్తయైన దేవుని యొక్క మెప్పును కోరుకుంటున్నది.

అయితే.,
సహోదరులారా..!

మనలో..
స్వయము బ్రతికియున్నాదా.?
మనసాక్షిని బ్రతికియున్నాదా?

వివేచించుడి.

06/03/2020

ప్రస్తుత కాలంలో పుట్టుకొచ్చిన *కరోన వైరస్* నేడు ప్రపంచ ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పుగా మారి అంతటా అందరిని భయపెడుతోంది.

సహోదరులారా.,
గమనించండి...
ఈ వైరస్ కేవలం మనిషి యొక్క ప్రాణమును మాత్రమే చంపగలదు.

కానీ.,
6000 వేల సంవత్సరాల క్రితమే పాపము అనేది ఆదాము ద్వారా ఈ లోకములోనికి ప్రవేశించి ప్రపంచ ప్రజలందరి యొక్క ఆత్మను చంపి నిత్యనరకములోకి తీసుకెళ్తుంది.

ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆత్మ చచ్చిన స్థితిలోనే ఉన్నది.

మరి, దీనిని గూర్చిన భయముగాని, చింతగాని, ఆలోచనగాని ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు.

*ప్రాణాలు తీసే వైరస్ కోసం భయపడుతున్న ప్రజల్లో
ఆత్మను చంపిన పాపమును గూర్చిన భయమే లేదు.*

గమనించండి..!

*శరీరము ఎంత పుష్టిగా ఆరోగ్యముగా ఉన్నా దేవుడు దాని దినములు లెక్కించాడు గాని.,
మానవ ఆత్మ యొక్క దినములు దేవుడు లెక్కిపలేదు.*

శరీరం కేవలం నిష్ప్రయోజనము.
ఆత్మ యుగయుగములు ఉంటుంది.

శరీరమును చంపు వైరస్ కోసం మందు ఉన్నట్టుగానే..
ఆత్మను చంపిన పాపనునుండి రక్షించడానికి యేసుక్రీస్తు జీవముగా ఈ లోకానికి వచ్చాడు.

అయితే.,
నీ ఆలోచన భయము దేనిపైన ??

శరీరముకోరికా.?
ఆత్మకొరకా..?

*మందుకోసం పరుగెడుతున్న మానవుడా.,
క్రీస్తులోని జీవముకోసం పరుగెత్తి ఆత్మను కాపాడుకో..!*

వివేచించు..!

28/02/2020

ఈ రోజుల్లో చాలామంది.,
ఏసుక్రీస్తును గూర్చి తెలుసుకొని ఆయన ద్వారా కొన్ని భూసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని

పొందుకున్నవారి యొక్క సాక్షము గూర్చియు
ఇచ్చిన యేసుని యొక్క నామమును ఘనపరచుటకు ఇష్టపడుచున్నారు గాని.,

ఆదాము యొక్కయు తమ వ్యక్తిగత పాపమును బట్టి సమస్త మానవులు.,
తమలో కోల్పోయిన దేవుని యొక్క మహిమను మరియు ఆయన యొక్క రూపములోనికి మార్చబడుటకు ఇష్టపడుటలేదు.

వివేచించుడి.,
లోక ఆశీర్వాదము కన్న
దేవుని రూపమే మిన్న.

14/02/2020

అభివృద్ధి పేరుచెప్పుకొనుచు దేశ ప్రధానులు, అధికారులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులు లక్ష్యల కోట్లు డబ్భును ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు తెచ్చి దేశాన్ని, రాష్టాలను ప్రజలకు తెలియకుండానే అమ్మివేస్తున్నారు.

ఈ విషయముపై నేటి మతోన్మాదులు దృష్టి పెట్టకుండా క్రైస్తవ్యాన్నీ అడ్డుకుంటున్నారు.

సహోదరులారా...
వివేచించండి..,

ఆనాడు బ్రిటీషు వారు భారతదేశమును పరిపాలించియున్నారు.
అది రాజుల కాలము.
ఆ రోజుల్లో వారికి పాస్పోర్ట్ వీసాలు ఏమి అవసరం లేదు. కాబట్టి వారు సులువుగా దేశాలను దాటియున్నారు. ఆక్రమించుకున్నారు. దోచుకున్నారు.
ప్రజలు వారికి విరుద్ధముగా తిరుగుబాటు చేసి యుద్దాలు చేసి వారిని తమ దేశాల నుండి వెల్లగొట్టారు మరియు స్వాతంత్ర్యమును పొందుకున్నారు.

ఆ తరువాత దేశములో రాజుల పరిపాలన ముగిసి ప్రజాస్వామ్యము నాయకుల పాలన ప్రారంభించబడినది. మరియు దేశ పాలనకొరకు రాజ్యాంగము, హక్కులు, చట్టాలు మరియు న్యాయవిదులు మొదలగునవి అమల్లోకి వచ్చాయి.
ఇప్పుడు ఎవరి దేశాన్ని వారే పరిపాలించుకుంటున్నారు. అంతమాత్రమే కాకుండా ప్రభుత్వం యొక్క పెర్మిషన్ లేకుండా సరిహద్దులు కూడా దాటలేని సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనము జీవిస్తున్నాము.

అయితే..,
నేడు దేశములోనున్న క్రైస్తవులను బట్టి క్రైస్తవ దేశాల వారు మరల భారతదేశమును ఆక్రమించుకుంటారేమో అని నేటి భారత మతోన్మాదులు భయపడుచున్నారు. వారి స్వాతంత్ర్యమును కోల్పోతామేనని దిగులుచేందుచున్నారు.
అందుకే వీరు క్రైస్తవ్యాన్ని అనిచివేయాలని అల్లరులు, గొడవలు చేస్తున్నారు.
వారి ప్రార్థనలు మీటింగులను అడ్డుకుంటున్నారు.

దీని విషయముమై మేము ధైర్యముగా చెప్పుచున్నాము.

దేశప్రజలను దేశాలను రాష్ట్రాలను పన్నుల ద్వారావస్తున్న ధనమును ప్రపంచ బ్యాంకు నుండి అప్పుగా తెచ్చున అసలుకు ఇంట్రెస్టు మాత్రమే చెల్లిస్తూ ఇతర దేశాలకు ప్రపంచ బ్యాంకుకు మరల బానిసలుగా చేస్తూ అమ్మివేస్తున్నది దేశ నాయకులే తప్ప క్రైస్తవులు ఎంతమాత్రము కాదు.

ఇప్పటికైనా ..
దేశములో మతకల్లోలాలు రేపుచున్న మతోన్మాదులు తమ కన్నులను తెరచి ఈ విషయమును గ్రహించాలి.

ఎవరు ఎవరిని ఎవరికి బానిసలుగా చేస్తున్నారో కాస్త గుర్తించాలి.

నేటి నిజ క్రైస్తవులు ...
దేశమును ఇతర దేశాలకు అమ్మివేయాలని ఎన్నటికిని ఆలోచించలేరు.
ఎందుకంటే వారు క్రీస్తును నమ్ముకొన్నది ఆయన ద్వారా దొరికిన నిరీక్షణతో కనిపెడుచున్నది పైనున్న పరలోకం కొరకే గాని.,
క్రిందున్న భూమికొరకు కాదు.

వారి సంపద సహవాసము దేవుని రాజ్యముతోనే తప్ప భూమిపైనా కాదు.

నిత్యము వారు చేస్తున్న ఆత్మీయ యుద్ధము..
క్రీస్తు పోలికలోనికి వారు మార్చడకుండా పరలోకమును చేరకుండా పాపపు శక్తితో తమతో యుద్ధము చేస్తున్న మతోన్మాదులకు కనిపించని సాతాను సామ్రాజ్యాముతోనే ఉన్నది గాని మనుషులతో ఎన్నటికిని కాదు.

వారు ఈ పాపపు ప్రపంచాన్ని భూమిని, తమకు కలిగియున్నవి చివరికి ప్రాణమును సైతం విడచి నిత్యత్వములోనికి ప్రవేశించాలనే గురితోనే ఉన్నారు తప్ప ఏ దేశముతోను ప్రజలతోను సంది చేసుకోలేరు.

కాబట్టి.,
One world,
One rulling,
One currency,
One religion
లాంటివి స్థాపించుటకు కలిగిన ఉద్దేశముతో క్రీస్తువిరోది తన రాజ్యమును స్థాపించుటకు
భూమిపైన జరుగుచున్న యుద్దాలకు వారు కారకులే కాదు.

ప్రపంచ ఉగ్రవాదమును అణచి శాంతియుత సామ్రాజ్యమును స్థాపించుటకు మోసపూరితమైన అబద్ధపు మాటలు, నెరవేర్చలేని వాగ్దానాలతో ప్రపంచ దేశాలతో సంది చేస్తూ
ఇప్పుడు కట్టబడుచున్న క్రీస్తువిరోది రాజ్యమును విడచి క్రీస్తు రాజ్యములోనికి ప్రవేశించడమే క్రైస్తవుల యొక్క ముఖ్యమైన గురి.

ఒక్క మాటలో చెప్పాలంటే..,
వారు భూసందులు కారు పరసంబందులే..!
ఇక్కడ వారు ఆస్తులు దంపాదించుట కాదు ఉన్నవి విడిచిపెట్టువారే.

కాబట్టి క్రైస్తవులు ప్రజలకు ఆటంకము కాదు వారిని అడ్డగిస్తున్న సాతాను రాజ్యానికే..!

ఈ విషయాన్ని నేటి భారతీయ సహోదరులు గ్రహించాలి.
మరి ముఖ్యముగా అంబేత్కరిజమును అనుసరిస్తున్న వారు గ్రహించాలి.

సహోదరులారా..!
ఈ మాటలు రాసింది దేశములోను ప్రపంచములోను జరుగుచున్నది తెలుసుకోవాలని, గ్రహించాలని అందరిలో ఒక ఆలోచన ఉద్బవించాలనే భావన తప్ప ఇది వ్యక్తిగతముగా ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు.

చదివినవారు వివేచిస్తారని నమ్ముచూ..!

మీ సహోదరుడు.
Br. Bhaskar Narsinga

https://www.youtube.com/watch?v=vWKnYsAGytA
20/11/2019

https://www.youtube.com/watch?v=vWKnYsAGytA

for more information please visit Faith Home, Full Gospel Church of GOD, The Kingdom of GOD Gospel Ministries (www.thekingdomofgodgospel.org ) +91 99857 9983...

https://www.youtube.com/watch?v=Tkky2DWDkZY
20/11/2019

https://www.youtube.com/watch?v=Tkky2DWDkZY

for more information please visit Faith Home, Full Gospel Church of GOD, The Kingdom of GOD Gospel Ministries (www.thekingdomofgodgospel.org ) +91 99857 99833

Address

Chitkul
Hyderabad
502307

Alerts

Be the first to know and let us send you an email when Bhaskar Narsinga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Bhaskar Narsinga:

Share