25/08/2026
బెంగాల్ గొప్పతనాన్ని హింసతో మసకబార్చకండి!
ఈ మధ్య బెంగాల్లో చర్చిలు, క్రైస్తవ ప్రార్థనా స్థలాలు మరియు క్రైస్తవులపై జరుగుతున్న కొన్ని దాడులు తీవ్రంగా ఖండించదగినవి .
బెంగాల్ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు.
అది విద్యకు, సాహిత్యానికి, కళలకు, సంస్కృతికి, మేధస్సుకు, మానవతా విలువలకు ప్రసిద్ధి చెందిన నేల. రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, రాజా రామమోహన్ రాయ్ వంటి మహనీయుల ఆలోచనలకు జన్మనిచ్చిన నేల.
అలాంటి బెంగాల్లో మత స్వేచ్ఛను అణచివేయడం, ప్రార్థనా స్థలాలపై దాడి చేయడం, క్రైస్తవులను భయపెట్టడం బెంగాల్ యొక్క గొప్ప సంస్కృతికి ఏమాత్రం ప్రతినిధ్యం వహించదు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారా?
ఎవరైనా రాజకీయ శక్తులు ఇలాంటి చర్యలను ప్రేరేపిస్తున్నాయా?
అయితే ప్రజాస్వామ్య సమాజం దీనిపై ప్రశ్నించాలి, నిజాలను వెలికి తీయాలి.
దాడి చేసే వ్యక్తి ఏ మతానికి చెందినవాడైనా — దాడి తప్పే.
బాధితుడు ఏ మతానికి చెందినవాడైనా — న్యాయం అతని హక్కే.
క్రైస్తవులపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
బెంగాల్కు హింస కాదు — విద్య, సాహిత్యం, సంస్కృతి, మానవత్వం మరియు సహజీవనమే నిజమైన గుర్తింపు.
✝️ చర్చిపై దాడి అంటే కేవలం ఒక భవనంపై దాడి కాదు; అది ప్రార్థనా స్వేచ్ఛపై దాడి.
మత స్వేచ్ఛను కాపాడుదాం.
హింసను ఖండిద్దాం.
విద్వేష రాజకీయాలను తిరస్కరిద్దాం.
న్యాయం కోసం స్వరం వినిపిద్దాం.