మన దేవాలయం- మన సంస్కృతి

మన దేవాలయం- మన సంస్కృతి మన దేవాలయాలు దర్శిద్దాం .. మన సంస్కృతి ని కాపాడుకుందాం 🙏

 #సుందరకాండశనిబాధలు తొలగించి అన్ని రకముల ధార్మిక ఫలితాలు ఇచ్చే త్రిపుర సుందరి సుందరకాండఅమల కనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షంసర...
22/05/2026

#సుందరకాండ
శనిబాధలు తొలగించి అన్ని రకముల ధార్మిక ఫలితాలు ఇచ్చే త్రిపుర సుందరి సుందరకాండ

అమల కనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదాసుప్రసన్నమ్
పటుతరఘనగాత్రం కుండలాలంకృతాంగం
రణజయకరవాలం రామదూతం నమామి

ఉపాసనాపరంగా ఆంజనేయుడు మంత్రాధిష్ఠాన దేవత

దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త స మే గురు:
నిత్య మనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా

సువర్ఛస్సు అనే విధంగా
సువర్చల మంచి వర్చస్సు అని అది సూర్యకళల్లో ఒక కళ.

పదాలలోనే హనుమంతుని యోగసాధన సూచితమైంది. మైనాక, సురస, సింహికా వృత్తాంతాలు గ్రంథి త్రయ భేదనాలకు నిదర్శనాలు. లంకా నగరమే మూలాధారం. సీతామాతకు వాడిన అనేక పదాలు ఆమె పరాశక్తికి, కుండలినీ శక్తికి ప్రతీక అని స్పష్టంగా చెబుతున్నాయి.

సుందరకాండ పారాయణ పద్ధతులు

మన అభీష్టాన్ని అనుసరించి తగిన కాలాన్ని ఎంపిక చేసుకోవాలి. సుందరకాండ 68 సర్గలతో నిండి ఉంటుంది. పారాయణ చేసే రోజులనుబట్టి రోజూ చేయాల్సిన సర్గలసంఖ్య ఆధారపడి ఉంటుంది.
2 రోజుల్లో పూర్తి చేయాలనుకునే వారు మొదటి రోజు 36వసర్గ వరకు పూర్తి చేసి, రెండవ రోజు మిగిలిన సర్గలు ముగించాలి.

3 రోజుల్లో అయితే... 1వ రోజు 27వసర్గ, 2వ రోజు 41వ సర్గల వరకు పూర్తిచేసి మూడోరోజు మిగిలిన సర్గలు చదవాలి.

5 రోజులకైతే... 1 వ రోజు 15వ సర్గ, 2వ రోజు 27వసర్గ. 3వ రోజు 38సర్గ, 4వ రోజు 54 సర్గ వరకు మిగిలినవి 5వనాడు పూర్తి చేయాలి.

8 రోజుల పారాయణ చేయాలనుకునే వారు శుక్రవారం నాడు ప్రారంభిస్తే' మంచిది. రోజూ 9 సర్గల చొప్పున 8వనాడు మిగిలిన 5 సర్గలు చదవాలి.

9రోజుల విధానంలో 1వ రోజు 5సర్గలు, 2వ రోజు 10 సర్గలు, 3వ నాడు ఐదు సర్గలు, 4వ రోజు 6 సర్గలు, 5వ నాడు 7సర్గలు, 6వ రోజు 7 సర్గలు, 7వ రోజు 12 సర్గలు, 8వ నాడు 8 సర్గలు, చివరినాడు మిగిలిన 8 సర్గలను పూర్తి చేయాలి.

సప్తసర్గ పారాయణ సర్వోత్తమమైనది. రోజుకు ఏడు సర్గల చొప్పున పారాయణ చేస్తూ పునరావత్తితో 68 రోజులపాటు చేయాలి. ఈ విధానంలో ఇంకా 10, 12, 14, 28, 41, 48,72, 476 రోజులపాటు కూడా పారాయణ చేయవచ్చు. 476 రోజులు పారాయణ చేస్తే సకల మనోభీష్టాలు నెరవేరతాయని ఉమాసంహిత పేర్కొంది.
పారాయణ విధానాలు

సుందరకాండ పారాయణలో సామాన్య పద్ధతి. సంపుటీకరణ పద్దతి అనే రెండు విధానాలున్నాయి. మొదటి శ్లోకంతో ప్రారంభించి వరుసగా చివరి వరకు చదవడం సామాన్యమైన పద్ధతి. ఎక్కువగా అందరూ ఈ విధానాన్నే అనుసరిస్తారు. తమ తమ కోరికలను అనుసరించి తత్ససంబంధమైన శ్లోకాన్ని ఒక్కో శ్లోకానికి ముందు-వెనకాల జతచేసి పారాయణం చేయడాన్ని సంపుటీకరణ విధానం అంటారు. దీనికి కొద్దిగా సమయం, ఓపిక, నేర్పు అవసరం. అయితే సామాన్య పద్ధతిలో చేసే పారాయణ కన్నా మూడింతల సమయం దీనికి అవసరమవుతుంది. ఫలితం కూడా అదే రీతిలో రెట్టింపు పద్దతిలో సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. త్రిజట స్వప్న వృత్తాంతం గాయత్రీ మంత్ర సంయుక్తం. రామాయణహారానికి. మణిపతకం లాంటిది. పీడకలలు వచ్చినప్పుడు స్వప్నవృత్తాంతం పారాయణ చేసుకోవాలి. వ్యాధులు, కారాగార బంధనాలు, గ్రహపీడలు, దారిద్ర్యం. సంకటాలు మొదలైనవన్నీ సుందరకాండ పారాయణ వల్ల నశిస్తాయి. ఉమాసంహిత, తత్వసంగ్రహం, బ్రహ్మాండ, పారాశర్య ఉపపురాణాలు సుందరకాండ పారాయణకు ప్రత్యేక విధానాలు పేర్కొన్నాయి. మొత్తం కాండనంతా పారాయణం చేయలేని వారు వారివారి అభీష్టానుసారం కేవలం కొన్ని శ్లోకాలు పారాయణ చేస్తే సరిపోతుంది. అలాగే సప్తసర్గ పారాయణ క్రమంలో కూడా

ఎప్పుడెప్పుడు, ఎలా?.

చైత్ర, వైశాఖ, జ్యేష్ట, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక, మార్గశీర్ష, మాఘ, ఫాల్గుణ మాసాలలో పారాయణ చెయ్యడం ఉత్తమం. ఈ చేసినవారికి వరుసగా ధర్మవృద్ధి. సంపద. సర్వార్థసిద్ధి. కర్మవృద్ధి, సామాన్యఫలితం. ధనవృద్ధి, కీర్తివృద్ధి, అధికఫలం. ధార్మిక సంపద
లభిస్తుంది. తిథి వారాల విషయానికివస్తే పాడ్యమి. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథుల్లో పారాయణ చేయవచ్చు. ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారాలు విశేషమని పండితులు చెబుతారు. పూజామందిరాలు, తులసికోట, నదీ-సముద్ర తీరాలు, పవిత్ర తీర్థ క్షేత్రాలు, దేవాలయాల్లో పారాయణ చేయడం మంచిది. పరిశుభ్రమైన ఆసనం వేసుకుని ప్రశాంత చిత్తంతో పారాయణ చెయ్యాలి. ఆరంభానికి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. గోత్రనామాలతో సంకల్పం చెప్పుకుని ఏ కోరికతో పారాయణ చేయదలచామో

హనుమత్ ప్రార్థన

సుందరకాండ పారాయణ ఆరంభంలో... చంద్రబింబ సమాకారం నాంఛితార్థ ప్రదాయం

సీతా వియోగబాధతో కృశించి చంద్రునిలా తెల్లగా ప్రకాశించే వాడు. హనుమంతుడితో సేవలు పొందేవాడు. సమస్త కోరికలు తీర్చే వాడైన

శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తున్నాను అని దీని భావం. కాగా పారాయణ ముగించిన తరువాత పఠించాల్సిన శ్లోకమిది.

వాల్మీకి గిరిసంభూతా రామసాగర గామిని
శ్రీమద్రామాయణ గంగాపునాతు భువనత్రయమ్..

శ్లోకసార సమాకీర్ణం సర్గ కల్లోల సంకులం
కాండగ్రహ మహామీనం వందే రామార్ణవం

వాల్మీకి అనే పర్వతం నుండి పుట్టిన రామాయణం అనే మహానది ఈ భూమిని పునీతం చేసి, రాముడనే సముద్రంలో కలిసింది. రాముడనే సముద్రంలో చేపలు, మొసళ్లు, తిమింగలాలుగా శ్లోకాలు, సర్గలు, కాండలు రూపాంతరం చెందాయి. వాటిలో మహామీనం వంటి సుందరకాండకు నమస్కారం.

ఆ కోరికను స్మరించుకోవాలి. కోరికలు లేకుండా పారాయణ చేస్తే ఉత్తమం. హనుమంతునితో ఉన్న సీతారామలక్ష్మణుల చిత్రపటాన్ని ఉంచుకొని యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి. నిశ్చలమైన మనస్సుతో పారాయణ ప్రారంభించాలి. పారాయణానంతరం తిరిగి నివేదన. నీరాజనాలు సమర్పించి భక్తితో నమస్కరించాలి. చక్కెర కలిపిన ఆవుపాలను, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు. పారాయణ ఫలాన్ని రామచంద్రస్వామి శ్రీచరణాలకే అర్పించాలి. పారాయణ చేసినన్ని రోజులూ దీక్షా' నియమాలు పాటించాలి.
ఓంరోగాణాంవినిహంత్రేనమః
శ్లో"తప్తకాంచనసంకాశం నానారత్న విభూషితమ్
| ఉద్యద్బాలార్కదనంత్రినేత్రం కుండలోజ్జ్వలమ్||
రామానుగ్రహముతో మొదలైన సుందరకాండ పారాయణ
సుందరే సుందరో రామః
సుందరే సుందరీ కథ
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?
సేకరణ
మన సమస్యలకు
సుందరకాండ పరిష్కారాలు
సుందరకాండ అద్భుతమైన పారాయణం..!*

*ఎన్నో..! సమస్యలకు..! సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి..! ఎంతో మంది పరిష్కారం పొందారు..!*

*ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం…*
*సుందరకాండ మొత్తం పారాయణ చేయలేరు..! అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి..!*

*1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి:-*

**శ్లోకం.: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్*
*లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||*

*21 దినములు, రోజూ 108 సార్లు , శక్తి కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.*

*2. విద్యాప్రాప్తికి:-*
*ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను.*
*3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన.*

*3. భూతబాధ నివారణకు:*
*3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను.*
*1 కొబ్బరికాయ, అరటిపళ్ళు నివేదన.*

*4. సర్వ కార్య సిద్దికి:-*
*64 వ సర్గ నిష్ఠతో రోజూ 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను..!*

*5. శత్రు నాశనముకు:-*
*51 వ సర్గ అతినిష్ఠతో రోజూ 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.*

*6. వాహనప్రాప్తికి:-*
*8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు చొప్పున 27 దినములు పారాయణ చేయవలెను.*
*శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను..!*

*7. మనశ్శాంతికి:-*
*11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.*

*8. స్వగృహం కోరువారికి:*
*7వ సర్గ ఏకాగ్రతతో రోజూ 1 సారి
40 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.*

*9. యోగక్షేమాలకు:*
*13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.*

*10. ఉద్యోగప్రాప్తికి.:*
*63 వ సర్గ నిష్ఠతో రోజూ 5 సార్లు*
*21 దినములు పారాయణ చేయవలెను..!*
*శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.*

*11. రోగ నివారణకు:-*
*34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము,*
*21 దినములు పఠించవలెను. శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.*

*12. దుఃఖనివృత్తికి:*
*67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా రోజూ 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.*

*13. దుస్వప్న నాశనానికి:*
*27వ సర్గ ఏకాగ్రతతో రోజూ 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.*

*14. దూరముగా ఉన్న ఆప్తుల క్షేమమునకు:*
*33 నుండి 40 వ సర్గ వరకు రోజూ 1 సారి , 21 దినములు నిష్ఠతో పఠించవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.*

*15. ధనప్రాప్తికి:*
*15వ సర్గ ఏకాగ్రతతో రోజూ 1 సారి 40 దినములు పఠించవలెను*
*అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 32 వ సర్గ 1 సారి,*
*40 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య, పరాశర, ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).*

*16. దైవాపచార ప్రాయశ్చిత్తం:-*
*38 వ, సర్గ ఏకాగ్రతతో రోజూ 3 సార్లు 27 దినములు పఠించవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.*

*17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు:*
*19 వ, సర్గ అతినిష్ఠతో..!*
*రోజుకు ఒకసారి చొప్పున..!*
*1 సంవత్సరము పఠించవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.*

*18. ఏలిననాటి శని దోష పరిహారమునకు:-*
*సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో రోజూ 1సారి 68 రోజులు చదువవలెను..!*
*నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫలితమునిచ్చును..!*

*19. కన్యా వివాహమునకు:-*
*9 దినములలో ఒకసారి పూర్తిగా 68 దినాలలో పఠించవలెను.* *సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించవలెను.*
*అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను..!*

*20. విదేశీ యానమునకు:-*
*1 వ, సర్గ ఏకాగ్రతతో రోజుకు..!*
*5 సార్లు..!*
*30 దినములు పఠించవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.*

*21. ధననష్ట నివృత్తికి:*
*55వ సర్గ నిష్ఠతో 3 సార్లు 30 దినములు పఠించవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.*

*22. వ్యాజ్యములో విజయమునకు:-*
*42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు, 21 దినములు పఠించవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.*

*23. వ్యాపారాభివృద్ధికి:-*
*15వ, సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను..!*

*24. పుత్ర సంతానానికి:*
*ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు, కొబ్బరికాయ, నివేదన చేయవలెను.*
*శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.*

*25. ఋణ విముక్తికి:-*
*28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను.*
*శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను..!*.🙏🌹

శ్రీ నృసింహ జయంతి ........!!*సెకను సెకను కీ భేధం ఉంటుంది....*నిమిష నిమషానికీ భేధం ఉంటుంది....*పగలు సాయంత్రంకి భేధం ఉంటుం...
29/04/2026

శ్రీ నృసింహ జయంతి ........!!
*సెకను సెకను కీ భేధం ఉంటుంది....
*నిమిష నిమషానికీ భేధం ఉంటుంది....
*పగలు సాయంత్రంకి భేధం ఉంటుంది....
*రాత్రికి పగలుకి భేధం ఉంటుంది....
*ఈరోజుకి రేపటికి భేధం ఉంటుంది.....
*శుక్ల పక్షానికి కృష్ణపక్షానికి భేధం ఉంటుంది.....
*నెలకి నెలకి భేధం ఉంటుంది.....
*ఉత్తరాయణ దక్షిణాయణాలకి భేధం ఉంటుంది
కానీ....

*భేధం లేని భగవంతుడు నృసింహుడు ఒక్కడే
ఆయన తన శత్రువు కోరిన విధంగా నరమృగ రూపుడై వచ్చాడు.....

భక్తుడు నమ్మిన విధంగా స్థంభం నుండి వచ్చాడు
తన అవతార అవిర్భావంలో ఇద్దరినీ "భేధం" లేకుండా ఛూసాడు....

*ఉదయం కాదు రాత్రి కాదు రెండిటికీ ఆ భేధ సమయాన సాయంకాలన ఉధ్భవించాడు.....

*నరుడు కాడు మనిషి కాడు నరమృగాలను ఆభేధంగా చూసే నరసింహుడైనాడు.....

*ఇంట కాదు బయట కాదు గుమ్మనా ఉంచి చంపాడు అంటే ఇల్లైన బయటైన తన దృష్టిలో ఒకటే అని చాటేందుకే.....

* నమ్మి కొలవాలే గాని తనకి స్త్రీ పురుష భేదం లేదని ఆర్తితో పిలవాలే గాని ఏనుగైన(జంతువు) శంకారాచార్యులైన(మనిషైన) ఒకటేనని తెలిపే మహిమాన్విత అవతారం నరసింహ అవతారం....

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రెండు జరిపి చెడునంతం చేసీ మంచికి పట్టాభిషేకం చేసి తన ఖ్యాతిని చాటిన విశిష్ట అవతారం నరసింహా అవతారం....

వేల సంవత్సరాలు హిరణ్యకశిపుడు తపస్సు చేసి నరుడు కాదు మృగము కాదు అలాంటి రూపం కావాలని కొరితే అలానే వచ్చి అతని తపస్సుకు సార్థకత చేకూర్చాడు.....

(ఈ సృష్టిలో ప్రతీది తన సృష్టే అయినపుడు శత్రువు వరం కూడా తీర్చిన మహిమాన్విత అవతారం నారసింహ అవతారం)......

నృసింహస్వామి ఆరాధించి ధన్యులుకండి
☆ఓం నమో నారసింహాయ☆.

|| జయజయ నృసింహ సర్వేశ |
భయహర వీర ప్రహ్లాద వరద ||....🙏🌹

గురువారం (30/04/26) నృసింహ జయంతి సందర్భంగా భక్తులందరూ తప్పక పఠించవలసిన "ప్రహ్లాదోపాఖ్యానము ~  నృసింహావతార కథ" 🙏క|| ఇందు ...
29/04/2026

గురువారం (30/04/26) నృసింహ జయంతి సందర్భంగా భక్తులందరూ తప్పక పఠించవలసిన "ప్రహ్లాదోపాఖ్యానము ~ నృసింహావతార కథ" 🙏

క|| ఇందు గల డందు లేడని,
సందేహము వలదు , చక్రి సర్వోపగతుం,
డెం దెందు వెదకి చూచిన ,
నందందే కలడు , దానవాగ్రణి ! వింటే.
తండ్రీ ! శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా? ఎక్కడ ఎక్కడ వెతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు.వ్యాపకత్వము చేత అన్నిటి యందు నిండి నిబిడీకృతమై ఉంటాడు అన్నాడు.ఓహో! అలాగా ఈ స్తంభములో ఉంటాడా అన్నాడు? ఇప్పుడు వస్తున్నది నరసింహావతారము.పిల్లవాడు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు.హిరణ్యకశిపుడు మూడు వేళ్ళు ముడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు.ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడనుండి పైకి రావాలి.రాకపోతే తనని నమ్ముకున్న భక్తుని మాట వమ్ము అయిపోతుంది.రావడము అంటూ జరిగితే శంఖ , చక్ర , గద , పద్మములు పట్టుకున్న శ్రీమన్నారాయణునిగా వచ్చి హిరణ్యకశిపుని సంహారము చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చిన వరము ప్రతి బంధకము ఆయన ఎన్ని వరములు ఇచ్చాడో అన్ని వరములకు మినహాయింపుగా రావాలి.అన్ని వరములకు మినహాయింపుగా ఎక్కడనుండి రావాలో తన చేతిలో లేదు.హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆపితే అక్కడనుండి రావాలి.

మ|| ' హరి సర్వాకృతులం గలం ' డనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై ' యెందును లేడు లే ' డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానాజంగమస్థావరో
త్కరగర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్

బ్రహ్మాండము అంతా నారసింహము అయిపోయి విష్ణు తత్వము అన్నిటిలోకి చేరిపోయింది నరసింహావతారముగా.అన్నిటా నిండిన నారసింహతత్వము ఎలా ఉంటుందో ఊహించాలి. హిరణ్యకశిపుడు వేలు తిప్పుతూ స్తంభమును చూపించి ఇందులో ఉన్నాడా? అన్నాడు.అంటే మళ్ళీ అదేమాట అడగవద్దు అంతటా ఉన్నాడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్నా అన్నాడు అయితే పిలవమని అన్నాడు.కొడుకు మాట కాదని నిరూపించాలి.కొడుకు మాట నిలపెట్టాలి అని పరమేశ్వరుడు.ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యముగా ఉన్నాడు పరమేశ్వరుడు అంటు మాట్లాడుతున్నాడు.అతని మాట నిలపెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహము అయిపోయింది.ఆ స్తంభమును ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులోనుండి అన్నాడు.అలా అనడముతోనే పెళపెళా శబ్దములు చేస్తూ ఆ స్తంభము బద్దలు అయి అందులో నుండి విస్ఫులింగములు పైకి వచ్చి పెద్ద కాంతిమండలము కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటికి వచ్చింది.అందులోనుండి పట్టుపుట్టము కట్టుకుని స్వామి నిలబడ్డారు.భయంకరమైన గర్జన చేస్తు ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన వేగమును వత్తిడినీ తట్టుకోలేక వేయి పడగలు కల ఆదిశేషుడు సార్వభౌమము మొదలైన దిగ్గజములు కూడా భూమియొక్క బరువుని ఓర్చలేక తలలు వంచాయి.ఆయన పాదములలో శంఖ , చక్ర , పద్మ రేఖలు , నాగలి , అమృతభాండము మొదలైన దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి.బలిష్ఠమైన మోకాళ్ళు , ఐరావతము యొక్క తొండము వంటి బలిష్ఠమైన తొడలు , సన్నటి నడుము , దానికి పెట్టుకున్న మువ్వల వడ్డాణము , చప్పుడు చేస్తున్న గంటలు , మెడలో వేసుకున్న హారములు , నృసింహాకారము పైన సింహము యొక్క ముఖము పెద్ద దంష్ట్రలు భయంకరమైన వాటిని తెగకోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి.అదిరి పడిపోతున్న పెదవులు.మంధరపర్వత గుహలను పోలినటువంటి నాసికా రంధ్రములు.పుట్టలోనుండి పైకి వచ్చి కోపముతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలుక.కోటి సూర్యుల ప్రకాశముతో గురి చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు.నిక్క పొడుచుకున్న వెంట్రుకలు.పెట్టుకున్న పెద్ద కిరీటము.అనంతమైన బాహువులయందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగుతీసి అడుగు వేస్తు వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇటు అటూ ఊపితే కేసరములు కదలి విమానములో వెడుతున్న దేవతలు భ్రంశమై విమానములనుండి కిందపడిపోయి , ఆ మేఘములు అన్నీ కొట్టబడి , పర్వతములు అన్నీఘూర్ణిల్లి , సముద్రములన్నీ పొంగిపోయి , భూమండలము అంతా కలత చెంది స్వామి
నరసింహావతారము వచ్చింది ఇప్పటివరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వమును పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నృసింహావతారమై వచ్చాడని లోకము అంతా భీతిల్లిపోతే 33 కోట్లమంది దేవతలు ఆకాశములో నిలబడి స్థోత్రము చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండముతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్ళి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు రాత్రి కాదు ప్రదోషవేళ , ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని , పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు.అదొక శాస్త్రము.ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు , ఆయుధము కాదు , అస్త్రము శస్త్రము కాదు , రాక్షసులు దేవతలు కాదు , యక్షులు , గంధర్వుల , కిన్నెరలు ,కింపురుషులు , నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద , పగలు రాత్రి కాదు ప్రదోషవేళ , ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని , పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు.అదొక శాస్త్రము.ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు , జంతువుకాదు , పాముకాదు , ఆయుధము కాదు , అస్త్రము శస్త్రము కాదు , రాక్షసులు దేవతలు కాదు , యక్షులు , గంధర్వుల , కిన్నెరలు ,కింపురుషులు , నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపి చీల్చి గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్ష:స్థలములో ఉన్న ఉర: పంజరములోని ఎముకలు అన్నిటినీ కోసేసి పటపట విరిచి పేగులు తీసి మెడలో వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోసిళ్ళతో పట్టి త్రాగి ఒళ్ళు , బట్ట , కేసరములు అన్నీ నెత్తుటితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షసగణములన్నిటినీ చంపి పెద్ద శబ్దము చేస్తూ డొల్ల బడిన హిరణ్య కశిపుని శరీరముని విసరివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్థోత్రము చేసారు. ఏమి నారసింహ అద్భుత అవతారము? ఇంతమంది స్థోత్రము చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు.ఉగ్ర భావనతో ఊగిపోతున్నాడు.లక్ష్మీదేవిని చూసి అమ్మా నీవు నిత్యానపాయినివి ఆయన వక్ష:స్థలములో ఉంటావు.నిన్ను చూస్తే ప్రసన్నుడౌతాడు తల్లీ దగ్గరకు వెళ్ళమని అన్నారు.

ఆమె నా భర్త ముఖము పూర్ణచంద్రబింబములా ఉంటుంది.ఇంత కోపముగా నేను ఎప్పుడూ చూడలేదు నేను కూడా దగ్గరకు వెళ్ళను అన్నది.శ్రీమహావిష్ణువు అవతారములలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారము నరసింహావతారమే.అందరూ భయపడుతుంటే ప్రహ్లాదా! నీ గురించి వచ్చినదే ఈ అవతారము నీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్నుని చెయ్యమని అన్నారు.చిన్న పిల్లవాడు అయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదములను పట్టి నమస్కరించి పైన సింహముగా కింద నరుడిగా వచ్చి , పెద్దనోరుతో , గోళ్ళతో , గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది లోకములో ఉన్నది దాని పేరు సంసారము.దానికి భయపడతాము గాని నీకు భయపడతామా ? అన్నాడు.బ్రహ్మాది దేవతల తలమీద పెట్టని చెయ్యి , లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి , పరమ భక్తుడిని అని పేరుపెట్టి ఏమీతెలియని అర్భకుడిని అయిన నాతల మీద చెయ్యిపెట్టి నాకోసము పరుగెత్తుకు వచ్చి నా మాట నిలపెట్టడానికి స్తంభమునుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయములో ఎంత కారుణ్యము ఉన్నదో నాకు తెలియదు అనుకుంటున్నావా? అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా పరమేశ్వరా నీకు నమోవాక్కములు అని స్థోత్రము చేసాడు. పరవశించిననరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుని నీ భక్తికి పొంగిపోతున్నాను ఏమి వరముకావాలో కోరుకోమని అన్నాడు.అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు వరాలు? నాకు ఎందుకు కోరికలు? ఏకోరికా లేదు. నీపాదములయందు నిరతిశయ భక్తి కలిగి ఉంటే చాలు.నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బతికాడు ఆయనకు ఉత్తమగతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే ఏనాడు పట్టుకుని పైకి ఎత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నావంక చూసి స్తబ్దుడైనాడో నా గోళ్ళతో చీల్చి నెత్తురు తాగానో , ఆనాడు నీ తండ్రే కాదు అంతకుముందు 21 తరములు తరించాయి.ప్రహ్లాదా నీవు బెంగపెట్టుకోవద్దు.నీకు ఆశీర్వచనము చేస్తున్నాను.దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరి పాలించి పరమ భాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు.నీకధ ఎక్కడ చెప్పబడుతుందో , ఎక్కడ వినపడుతుందో, అక్కడ నేను ప్రసన్నుడను అవుతాను.ఎంతో సంతోషిస్తాను. సభామంటపములోని వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది.దాని వలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యానమునకు శ్రీ మహావిష్ణువే ఫలశృతి చెప్పారు.

ఈ జ్ఞాన సంహిత అనే పేజీని సృష్టించింది అమూల్యమైన , అపూర్వమైన , అద్భుతమైన లీలలను , చిత్రాలను , స్తోత్రాలను నేను తెలుసుకున్నవి , సేకరించినవి నలుగురికీ తెలియజేసే ప్రయత్నంలో భాగమే.అందరికీ ఉపయోగపడితే అదే సత్ఫలితంగా భావిస్తాను , అందరినీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయాలనే నా ప్రయత్ననం.మనలో చాలామందికి పురాణ , ఇతిహాసాలు తెలియకపోవచ్చు , శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు , మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు , మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు , అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు , కానీ నేర్చుకుని , ఆచరించడానికి వయోపరిమితి లేదు , తెలుసుకోవాలన్న తృష్ణ , జిజ్ఞాస ఉంటే చాలు , అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి , మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే , ఏదీ ఆలస్యం కాదు ,
అందరమూ తెలుసుకుని , ఆచరించే ప్రయత్నం చేద్దాం , మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను , నాకు తెలిసినవి , నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను , మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ🙏🌹

(30/04/26) నృసింహ జయంతి శుభాకాంక్షలు 🙏🌹
29/04/2026

(30/04/26) నృసింహ జయంతి శుభాకాంక్షలు 🙏🌹

రామాయణ విశేషాలు  !!అశ్వమేథయాగము పూర్తిగావించి, పుత్రకామేష్టి చేశాడు దశరథుడు. పయస్సు లభించింది. చైత్రమాసంలో, నవమినాడు, పు...
23/04/2026

రామాయణ విశేషాలు !!

అశ్వమేథయాగము పూర్తిగావించి, పుత్రకామేష్టి చేశాడు దశరథుడు. పయస్సు లభించింది.
చైత్రమాసంలో,
నవమినాడు,
పునర్వసు నక్షత్రంలో,
ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో నుండగా(మేషంలో సూర్యుడు, మకరంలో కుజుడు, కర్కాటకంలో బృహస్పతి, మీనంలో శుక్రుడు, తులలో శని),
కర్కాటక లగ్నంలో,
బహస్పతి చంద్రునితో కలసియున్న సమయంలో
కౌసల్య సర్వలోకపూజ్యుడైన జగన్నాథుని కన్నది.



"దశరథుడు - పుత్త్రకామేష్టి - పయస్సు - కౌసల్య - రాముడు" ఇచ్చే సందేశం.

దశరథుడు: పది ఇంద్రియములు గల్గిన దేహము.

పుత్త్రకామేష్టి:
పుత్ = ఒక నరకము,
త్ర = రక్షించునది,
కామ = కోరిక,
ఇష్టి = పని,
నరకాన పడకుండా రక్షించబడాలనే కోరికతో చేసే పని "పుత్త్రకామేష్టి". అంటే ధర్మాచరణ.

ఇష్టి చేస్తే దైవశక్తి పాయసంగా వచ్చింది. అంటే ధర్మాచరణతో దైవానుగ్రహం కల్గుతుంది.

పాయసంలో సగం కౌసల్యకిచ్చాడు. అంటే దైవశక్తివలన వచ్చిన జ్ఞానం ద్వారా బుద్ధి సరియైన నిర్ణయం తీసికోవడం.
కౌసల్య అంటే కుశలత్వం.

ఆ కౌసల్య రాముని కన్నది. అంటే కుశలత్వంతో బుద్ధి సరియైన నిర్ణయం తీసికోవడం ద్వారా ఆనందం కలుగుతుంది.

రామః : యోగులు దేనియందు రమిస్తారో అది.
"రమన్తే యోగినః అస్మిన్ ఇతి రామః"

యోగులు జ్ఞానం ద్వారా ఆనందిస్తారు. అది గొప్పది.

కాబట్టి సాధకుడు,
- ఇంద్రియాలతో కూడిన దేహం ద్వారా,
- ధర్మాచరణచేస్తూ, తద్వారా వచ్చే
- దైవబలాన్ని,
- బుద్ధి కుశలతకి ఉపయోగించి,
- జ్ఞానానందం పొందటమే అంతరార్థం. 🙏🌹

కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు .................!!♦ లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి...
22/04/2026

కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు .................!!
♦ లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. కనకధారా స్తోత్రాన్ని రోజూ రెండు సార్లు పఠించినంతనే నిరుపేదలైనా కుబేరులుగా మారతారు. అటువంటి కనకధారా స్తోత్రం పఠించే వారు కొన్ని సూచనలను పాఠించాలి.

♦ కనకధారా స్తోత్రాన్ని ఉత్తర ముఖంగా ఉండి పఠించాలి.

♦ మహాలక్ష్మీదేవి పటాన్ని కానీ మహాలక్ష్మీ యంత్రాన్ని కానీ ఎదురుగా పెట్టుకుని పారాయణ చేయాలి

♦ ప్రతి రోజూ ఉదయం 6:00 నుండి 7:00 గంటల మధ్య, సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య పారాయణ చేయాలి.

♦ కనకధారా స్తోత్రాన్ని పూర్ణిమ తిథి లేదా పౌర్ణమి రోజున ఉపదేశం పొందాలి

♦ కనకధారా స్తోత్ర పారాయణకు వయసు లింగ భేదాలు లేవు.

♦ ఎటువంటి కారణంతో అయినా పూజ చేసే సమయాలలో నలుపు, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజించకూడదు

♦ ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయకూడదు

♦ పట్టువస్త్రం లేదా ఎరుపు, నలుపు లేని వస్త్రాలను ధరించి శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠించి కులదేవతకు పూజ చేస్తే ఋణ బాధలు ఉండవు, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందుతారు.

♦ మగవాళ్ళు ప్రతి రోజూ శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే అసలు అప్పులపాలు కారు.🙏🌹

ఒక రూపాయి నాణెంఎనిమిదేళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్‌లోని ఒక దుకాణానికి వెళ్లి, దుకాణదారుడికి ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడి...
21/04/2026

ఒక రూపాయి నాణెం
ఎనిమిదేళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్‌లోని ఒక దుకాణానికి వెళ్లి, దుకాణదారుడికి ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:
“మీ దుకాణంలో దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఆయనను ఇస్తారా?”

దుకాణదారు కోపంగా ఆ నాణెాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి, అతడిని వెళ్లగొట్టాడు. బాలుడు నాణెాన్ని తీసుకుని, ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ, “ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడా?” అని అడుగుతూనే ఉన్నాడు.

చాలా మంది దుకాణదారులు అతడిని తోసివేశారు. కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు.

చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్లి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతడిని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై . . అప్పుడే వెళ్లిపోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.

ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి, తన ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:
“మీ దగ్గర దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఇస్తారా?”

ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు:
“నేను ఒక రూపాయికి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే, ఆయనతో ఏమి చేస్తావు?”

బాలుడు సమాధానమిచ్చాడు:
“నా అమ్మ నాకు అన్నీ. ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాటలు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. డాక్టర్లు ‘దేవుడే ఆమెను కాపాడగలడు’ అన్నారు. అందుకే ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను.”

ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు:
“నీకు ఒక రూపాయికి దేవుడు కావాలా? నేను ఇస్తాను.”

అతడు ఒక లేఖ రాసి, కవర్లో పెట్టి బాలుడికి ఇచ్చాడు.
“నీ అమ్మ ఉన్న ఆసుపత్రికి వెళ్లి, ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్‌కి ఇవ్వు,” అని చెప్పాడు.

బాలుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్‌కు ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.

కొన్ని రోజుల తరువాత, అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు—అదే ఆసుపత్రి స్థాపకుడు—ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడడానికి వచ్చాడు.

తల్లి ఆసుపత్రి ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతోంది.

ఆ ధనవంతుడు ఆమెను ధైర్యం చెప్పాడు:
“మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావాల్సిన మొత్తం చెల్లించాడు.”

అది విన్న తల్లి ఆశ్చర్యపోయి, తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది.

ఆయన మరలా అన్నాడు:
“వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకు వినియోగిస్తాను.”

తల్లి భావోద్వేగానికి లోనై, “మీరు ఇది ఎందుకు చేస్తున్నారు?” అని అడిగింది.

ఆయన సమాధానం ఇచ్చాడు:
“మీ కుమారుడి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పమే ఈ సేవకు కారణం.”

హృదయంలో విశ్వాసం ఉండి, దృఢమైన సంకల్పం ఉంటే — ఫలం పత్రం తోయం పుష్పం.....ఒక రూపాయికైనా దేవుడు దొరుకుతాడు. 🙏🌹

సనాతన ధర్మాన్ని ఉద్ధరించి, భారతీయ సంస్కృతికి పునర్జీవం పోసిన మహనీయుడు ఆది శంకరాచార్యులు. ..సాక్షాత్తు ఆ పరమశివుడే సనాతన ...
21/04/2026

సనాతన ధర్మాన్ని ఉద్ధరించి, భారతీయ సంస్కృతికి పునర్జీవం పోసిన మహనీయుడు ఆది శంకరాచార్యులు. ..

సాక్షాత్తు ఆ పరమశివుడే సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి శంకరుల రూపంలో అవతరించారని భక్తుల నమ్మకం. ..

శంకరులు మూడు సంవత్సరాల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. ఐదు సంవత్సరాలకే ఉపనయనం జరిగి, ఏడు సంవత్సరాలకే వేదాలను క్షుణ్ణంగా అభ్యసించిన ఏకసంధాగ్రాహి ఆయన. .....

శంకరులు బాల్యంలోనే సన్యాసాన్ని స్వీకరించి, సనాతన ధర్మ ప్రచారం కోసం దేశాటన ప్రారంభించారు. ....

అహం బ్రహ్మాస్మి" (నేనే బ్రహ్మను) అనే సూత్రంతో జీవాత్మ, పరమాత్మ ఒక్కటేనని చాటిచెప్పారు. ఇది మానవులందరిలో దైవత్వాన్ని గుర్తించే ఉన్నతమైన ఆలోచనా విధానం.

భారతదేశం నాలుగు దిక్కుల్లో నాలుగు పీఠాలను స్థాపించి, ధర్మ పరిరక్షణకు శాశ్వత ప్రాతిపదికను ఏర్పరిచారు.
శృంగేరి శారదా పీఠం (దక్షిణం - కర్ణాటక)
ద్వారక శారదా పీఠం (పశ్చిమం - గుజరాత్)
గోవర్ధన పీఠం (తూర్పు - పూరీ, ఒడిశా)
జ్యోతిర్మఠం (ఉత్తరం - బదరీనాథ్, ఉత్తరాఖండ్....

విభిన్న దైవారాధనల మధ్య ఉన్న వైరుధ్యాలను తొలగించి, శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సూర్యుడు మరియు కుమారస్వామి ఆరాధనలను ఏకం చేస్తూ 'షణ్మత' పద్ధతిని ప్రవేశపెట్టారు శంకరులు....

ఉపనిషత్తులు, భగవద్గీత, మరియు బ్రహ్మసూత్రాలకు (ప్రస్థానత్రయం) అద్భుతమైన భాష్యాలు (వ్యాఖ్యానాలు) రాసి, వేద జ్ఞానాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చేశారు.

భజ గోవిందం, కనకధారా స్తోత్రం వంటి అనేక భక్తి రచనల ద్వారా సామాన్య ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించారు...

కేవలం 32 ఏళ్ల స్వల్ప జీవిత కాలంలోనే భారతదేశమంతటా కాలినడకన పర్యటించి, పండితులతో వాదించి వారిని సనాతన ధర్మ మార్గంలోకి తెచ్చారు...

ఈరోజు శంకరుల జయంతి..

జయజయ శంకర హరహర శంకర.🙏🌹

 #విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి "చందనోత్సవం" (నిజరూప దర్శన...
19/04/2026

#విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి "చందనోత్సవం" (నిజరూప దర్శనం)ఏప్రిల్ 20, 2026న జరగనుంది. ఈ విశేష పర్వదినం గురించి పూర్తి వివరాలు మీ కోసం:
చందనోత్సవం 2026: ముఖ్య సమాచారం
తేదీ:ఏప్రిల్ 20, 2026 (సోమవారం)
తిథి:వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)
దర్శన సమయం: తెల్లవారుజామున సుమారు 3:00 గంటలకు ధర్మకర్తల తొలి దర్శనంతో ప్రారంభమవుతుంది. సామాన్య భక్తులకు తెల్లవారుజామున 4:00 గంటల నుండి దర్శనాలు లభిస్తాయి.

#నిజరూప దర్శనం ప్రత్యేకత ఏమిటి?
ఏడాది పొడవునా స్వామివారు చందన లేపనంతో (లింగం ఆకారంలో) భక్తులకు దర్శనమిస్తారు. కానీ కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామివారి శరీరంపై ఉన్న చందనాన్ని తొలగిస్తారు.

#నిజరూపం: చందనం తీసివేసిన తర్వాత స్వామివారి అసలు రూపం - వరాహ ముఖం, నరసింహ శరీరం మరియు సింహపు తోకతో** కూడిన అరుదైన విగ్రహం భక్తులకు కనిపిస్తుంది.
#చందన సమర్పణ:అదే రోజు రాత్రి స్వామివారికి మళ్ళీ కొత్తగా చందనం సమర్పణ (తొలి విడత) జరుగుతుంది. ఇలా ఏడాదికి నాలుగు విడతలుగా మొత్తం 12 మణుగుల చందనాన్ని స్వామివారికి పూస్తారు.
పురాణ నేపథ్యం
#హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుని రక్షించే క్రమంలో స్వామివారు ఉగ్రరూపంతో ఇక్కడ వెలిశారు. ఆ ఉగ్రత్వాన్ని తగ్గించడానికి మరియు స్వామివారి శరీరం చల్లబరచడానికి దేవతలు చందనంతో లేపనం చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

#భక్తుల కోసం సూచనలు: ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, దేవస్థానం వారు చలువ పందిళ్లు మరియు తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
మీకు కేటాయించిన ప్రకారమే దర్శనానికి వెళ్లడం మంచిది.
దర్శనానికి వెళ్లేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు వెంట ఉంచుకోవడం మర్చిపోకండి.

#అప్పన్న నిజరూప దర్శనం భక్తులందరికీ ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం!

రేపే అక్షయ తృతీయ. _*బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?*_.🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపి...
19/04/2026

రేపే అక్షయ తృతీయ.
_*బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?*_.
🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃🦃

మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి, ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము.
అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే
అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

*నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా ! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి?*

అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని , ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది.జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి.

అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందనీ , జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి , ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో , అప్పుచేసో, తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.

అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు.

*'వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతా*
*దుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా''*

మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా , జపమైనా , దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.పుణ్యకార్యా చరణతోవచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది.అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున ఏ శుభ కార్యాన్నైనా వారం , వర్జ్యం , రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు.
ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం , పుస్తకావిష్కరణ , పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.

ఇంకా గృహ నిర్మాణం , ఇంటిస్థలం కొనడం , బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరు తాయని విశ్వాసం.

అలాగే అక్షయ తృతీయనాడు
శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో , ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసినా సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి🙏🌹

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when మన దేవాలయం- మన సంస్కృతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category