Hanumath Jyotishyalayam

Hanumath Jyotishyalayam Sri Hanumath Jyotishyalayam is a place where the people can find there solutions and Advice`s for their problems in a spiritual manner.

05/06/2023
24/10/2018

(ఎడమభుజంపై ఉత్తరీయం వేసుకుని పూజచేయాలి)ఇపుడు చదవండి..

* ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు .

సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది? ఇంక దానిమీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి.

పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.

ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి.

చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు.

యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు.
ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి.

మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.

‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు.

దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.

పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

11/05/2018

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?
-
ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.

కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా?

కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి?

"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.

అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!

అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.

తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.

కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.👌 అందరికి పంపించండి🙏🏼🙏🏼

10/05/2018

*ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...*

రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ, కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా.. వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...

మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...

శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !

ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం )

తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు...

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కాసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి.....

🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

10/05/2018

నేటికాలం_పెళ్లిళ్లు ఎవరో చెప్పినట్టుగా పెద్ద తంతుగా తయారు అయ్యాయి. అందరు చేస్తున్నారు, మనం అలాగే చేసేయ్యాలి. చెయ్యక పొతే నామోషీ.. ఇది నేటి రీతి .
"ఎందుకు చేస్తున్నామో తెలియకుండా గుడ్డిగా మనం పాటించేవాటినే "తంతు" అంటారు"

మరి కొన్ని గంటల్లో వేదం మంత్రాలూ చదవ బోతున్న స్టేజి పైకి అందరూ షూస్ /చెప్పులతో ఎక్కడం .
ఆ షూస్ ఎక్కడెక్కడ తొక్కి వచ్చిందో .ముహుర్తాలు దాటిపోయాక చెప్పులు వేసుకొని, పోనీ ఆచారం సంగతి పక్కన పెట్టండి కనీసం ఆరోగ్య సూత్రాల రీత్యా మంచిదేనా ?
ఆ స్టేజి పైన కొన్ని గంటల పాటు వధూవరులు కూర్చొంటారు కదా ? ఆలోచిస్తారా ?...
పోనీ పెద్దలైనా చెబుతారా అదీ లేదు !...ప్చ్

పెళ్లి మొదలయ్యేటప్పటికి ఒకచోట జాతరను మించి జనాలు ఉంటే మరోచోట పట్టున యాభై మంది ఉండరు. నిర్మానుష్యంగా పెళ్లి హాల్. పెళ్ళికొచ్చిన వారికి, కూర్చున్న వారికైనా పెళ్లి జరిపే దృశ్యం కనిపిస్తుందా అంటే జస్ట్ నో ఛాన్స్ .
ముగ్గురు కెమెరా వాళ్లు.. ఇద్దరు విడియోగ్రాఫేర్స్ .. లైట్ మోసేవాడు .
పెళ్లి మంటపం మొత్తం కవరయ్యేటట్టుగా ఒక్కో ఫొటోగ్రాఫర్ రెండేసి తెల్లబట్ట గొడుగులు
ఇదేందయ్యా అంటే.. మల్లి మల్లి చేసుకుంటారా సార్ స్టిల్స్ సరిగ్గా రావొద్దా ?..అనే జవాబు
ఇక ఫొటోలు ఠెసె సమయూరంలో పెయిన్ మంటం దగ్గర కూర్చున్న వాళ్ళను ఎవరెవరిని ఎన్నిసార్లు తొక్కుతారో ఆ భగవంతునికే తెలుసు !
మనం చూసేదీ పెళ్ళితంతు కానే కాదు, వీడియో /.ఫొటోగ్రాఫర్ల పిఱ్ఱల దివ్యదర్శనం చేసుకోవలసిందే.

మంటపంలో వధూవరులు అస్సలు కనిపించరు,,,వచ్చిన జనాలకి వధూవరులకు మధ్యన ఈ ఫొటోగ్రాఫర్లే ...వాళ్ళు దయతలచి కొద్దిగా పక్కకు జరిగితే ఆహ్వానితులుచూసి తరిస్తారు అప్పుడు వారు ధన్యులే ...

ఫొటోగ్రాఫర్లు .. బ్రాహ్మణుడిని పెళ్లి సరిగ్గా చేయనియ్యరు ,
వధూవరులని ప్రతీ ఘట్టంలో ఆపి, ఇటువైపు చుడండి ...
ఆ .. నవ్వండి! ఇలా పట్టుకొనుండండి!... పోజులకోసమా ఈ పెండ్లి ? ... సుమూర్థాలెక్కడా ?
బ్రాహ్మణుడు తాళి కట్టే ముందు అమ్మయ్యి మేనమామ ని పిలిచి మంగళ సూత్రాలు చేతిలో బెట్టి వచ్చిన పెద్దల ఆశీర్వాదాలు చేయించుకురమ్మని ఆజ్ఞాపిస్తే ...స్టేజీ దిగకముందే ,ఒక పెద్ద మనిషి అడ్డుగా వచ్చి ... చాల్లేవయ్యా ఇప్పుడు టైం ఎంతయ్యిందో చూశావా ?...పైనుండే అందరికీ చూపించి తీసుకెళ్లి బాపడి చేతిలో పెట్టు అన్నాడు ..వాహ్ వా ఎంత ఎదిగిపోయార్రా ...

అట్ఠిట్ఠా కిందా మీదా పది బాపడు పెళ్లి తంతు ముగించేశాడూ, అందరూ ఆశార్వాదాలు ఇవ్వడానికి స్టేజీపైకి వస్తారు .అది కూడా షూస్ తో సహా దీవించి ..
వయసులో చిన్న వారు అయిన కాబోయే దంపతులు స్టేజి పై నిల్చుంటారు . వారి ని ఆశీర్వదించడకోసం లేదా గ్రీట్ చేయడం కోసం పెద్ద వారు క్యూ లో నిలబడుతారు .
అంటే మనం పెద్ద వారికి ఇచ్చే గౌరవం ఇదన్న మాట . క్యూ చేంతాడంత ఉంటుంది .
ఎప్పుడెప్పుడు స్టేజి పైకి వెళ్లే ఛాన్స్ వస్తుందా అంటూ వాచ్ చూసుకొంటూ లైన్ లో నిలబడుతారు . చివరికి ఛాన్స్ వస్తుంది . ఫోటో కోసం ఒక కృత్రిమ నవ్వు . వాళ్ళను ఆశీర్వదించడం ..

పెళ్లి అయ్యింది. ఇక అందరూ భోజనం హాల్ లోకి ,ఇక పరుగో పరుగు. అక్కడ అది భోజనశాలో లేక అంగడి మార్కెట్టో అర్ధమే కాలేదు ,దోష ,పెసరట్టు, పానీ పురీ, మిర్చీ ,సమోసా ఇలా రకరకాలు. అక్కడ తోపులాట . తిండికి మొఖం వాచిన వారిలా తోసుకొంటూ వెళ్లి ప్లేట్ పట్టుకొని "భవతి భిక్షందేహీ" అని నిల్చుంటే
ఇక అక్కడ వాడు చేతికి ప్లాస్టిక్ కవర్ వేసుకొని, భిక్షం వేసినట్టుగా మొఖం పెట్టుకొని వడ్డిస్తాడు

అక్కడ ఎన్ని పదార్థాలు వున్నాయి అనేది స్టేటస్ సింబల్. కనీసం 30 అయినా లేక పొతే అవమానం ఒక్కో సారి నూటయాభై దాకా ఉంటాయి . వాటిలో సగం పదార్థాలు పేర్లు జీవితంలో కనీ.. విని ఉండం

పర్ ప్లేట్ లెక్కన కేటరింగ్ వాడికి ఇచ్చివుంటారు . అవి చూడడానికే బాగుంటాయి .
తింటే జీవితంపై విరక్తి పుట్టిస్తాయి .. అంతా రోగాలొచ్చినవారికి వన్డే వంటలే ఉప్పు ఉంటె సరిగ్గా కారం ఉండదు .
అందరూ ప్లేట్లల్లో ఆగడుకొద్దీ పెట్టించుకోవడం తీసి చెత్త బుట్టలో పడేయడం, ఏదో, ఐదో, పదో పదార్థాలు రుచి చూసి ఇక జనాలు బయట పడుతారు
పెద్ద ఎత్తున ఆహారం వృధా . కడుపునిండా తిన్న వాడు ఉండడు. ఒక్క ఐటెం అయిన రుచిగా ఉంటుంది అనే భరోసా లేదు . అదో పెద్ద తంతు .

పెళ్లి సందర్భంగా నలుగురు అనాధ పిల్లలకు భోజనం పెట్టొచ్చుగా ? వారికి మేము మీ బంధువులు అని చెప్పొచ్చుగా ? అసలు ఆ ఫుడ్ ఏంటి ?... ఆ వృదాచేయడం ఏమిటి ? అర్ధం అవ్వట్లేదు,
ఒకరు చేస్తున్నారు కదా అనీ మీరూ చేయకండి !.....
క్రతువు ముఖ్యం కెమెరాల ఫోజులు కాదు, ముహూర్తం ముఖ్యం మందిమార్బలం కాదు, ఆచరణ ముఖ్యం వచ్చినవారికి కడుపునిండా 2,3 కూరగాయలతో మంచి రుచిగా పప్పన్నం భోజనం పెడితే చాలు !!

10/12/2016

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు . . . ఇవే.

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!

10/12/2016

వేప ఆకులు:
వేప ఆకుల్లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉన్నాయి. సూక్ష్మ క్రిముల ప‌ట్ల వేప అద్భుతంగా ప‌ని చేస్తుంది. ఈ క్ర‌మంలో వేప ఆకును ఇంట్లో కాల్చి పొగ వేస్తే దాంతో ఇంట్లో ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు నాశ‌న‌మ‌వుతాయి. అంతే కాదు వేప ఆకుల‌ను ఇంట్లో మండించ‌డం వ‌ల్ల వాస్తు దోషం కూడా పోతుంద‌ట‌.
అగ‌ర్‌బ‌త్తీలు:
హిందువులు ఎవ‌రైనా దేవుడికి పూజ చేసిన‌ప్పుడు మాత్ర‌మే అగ‌ర్ బ‌త్తీల‌ను వెలిగిస్తారు. లేదంటే ఎవ‌రైనా చ‌నిపోయిన‌ప్పుడు వారిని ఖ‌న‌నం చేసేందుకు తీసుకెళ్లిన‌ప్పుడు కూడా వీటిని వెలిగిస్తారు. అయితే అగ‌ర్ బ‌త్తీల‌ను మామూలు స‌మ‌యంలో కూడా వెలిగించ‌వ‌చ్చు. దాంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది. అయితే అగ‌ర్‌బ‌త్తీల‌ను ఎప్పుడు వెలిగించినా బేసి సంఖ్య‌లో స్టిక్స్‌ను వెలిగించాలి.
ఫ‌ర్నిచ‌ర్‌:
కుర్చీలు, టేబుల్స్‌, సోఫాలు, మంచాలు: ఇలా ఇంట్లో ఉన్న ఫ‌ర్నిచ‌ర్‌ను అప్పుడప్పుడు తీసి వేరే దిశ‌లో పెట్టి మళ్లీ య‌థావిధిగా అమ‌ర్చుకోవాల‌ట‌. దీంతో నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంద‌ట‌. దీన్ని గురించి ఫెంగ్ షుయ్ వాస్తులో వివ‌రించారు.

ఉప్పు:

రెండు చిన్న‌పాటి గిన్నెల‌ను తీసుకుని వాటిలో కొంత ఉప్పు వేయాలి. అనంత‌రం ఆ రెండు గిన్నెల‌ను ఇంట్లో ఈశాన్య‌, నైరుతి దిశ‌ల్లో ఉంచాలి. ఇలా చేస్తే నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.
కిటికీలు:
కిటికీల‌ను ఎల్ల‌ప్పుడూ తెర‌చి ఉంచాలి. వాటి వ‌ద్ద కుండీల్లో ఏవైనా మొక్క‌ల‌ను ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ బ‌య‌టికి వెళ్లి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. దాంతో ఇంట్లోని అంద‌రికీ మంచే జ‌రుగుతుంది.

క‌ర్పూరం, ల‌వంగాలు:
ఉద‌యం, సాయంత్రం వేళ్ల‌లో కొద్దిగా క‌ర్పూరం తీసుకుని వెలిగించి దాంట్లో కొన్ని ల‌వంగాల‌ను కూడా వేయాలి. ఇలా రెండింటినీ మండించ‌డం వ‌ల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషం పోతుంది. అంద‌రికీ అదృష్టం క‌ల‌సివ‌స్తుంది. ఆర్థిక సమ‌స్య‌లు ఉంటే పోతాయి.
ప‌సుపు ఆవాలు, గుగ్గుళ్లు:
న‌లుపు రంగువి కాక‌, పసుపు రంగులో ఉండే ఆవాలు, గుగ్గుళ్ల‌ను క‌లిపి ఇంట్లో రోజూ మండిస్తున్న‌ట్ట‌యితే నెగెటివ్ ఎన‌ర్జీ మాయ‌మ‌వుతుంది.
గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్‌:
వారానికి ఓ సారి ఇంట్లో గుగ్గుల్ ఇన్‌సెన్స్ స్టిక్స్‌ను మండించాలి. దీని వ‌ల్ల ఇంట్లోని వారి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. శారీర‌క ఆరోగ్యం, మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతాయి. నెగెటివ్ ఎన‌ర్జీ తొల‌గిపోతుంది.

08/12/2016

ఇలా చేస్తే మీ జాతకం మంచిగా మారుతుంది .

1. మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు, బయట లోపల లక్ష్మి దేవి ఫోటో ఉంచండి, ఆ లక్ష్మి దేవి వెనుక రెండు ఏనుగులు బంగారపు కలశాలతో లక్ష్మి దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచినట్టైతే మీ ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.

2. పిలక ఉన్న కొబ్బరికాయపై చుట్టూ 7 సార్లు, 7 దారాలు, చుట్టి, మీ చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. పైనుంచి కిందకి clock wise- గా తిప్పుకోవాలి. ఒక మంచి రోజు , అలాచేస్తే మీ అదృష్ట సమయములలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి

3. లక్ష్మి దేవికి 7 శుక్రవారాలు, 7 ముత్తైదువులకు, ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి ( కుంకం, పసుపు, చందనం, తాంబూలం, వీలు అయితే ఎరుపురంగు జాకెట్టు గుడ్డ,దక్షిణ ) కానుకగా ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి మంచి ని తప్పక లక్ష్మి దేవి చేకూర్చుతుంది.

4. ప్రతినెలా వచ్చే అమావాస్య నాడు ఇంటి అంతటిని సుభ్రపరచండి.

5. మీ ఇంటి లో ఉండే దేవుని మందిరం లో,ఒక మంచి రోజు, ఒక కుంకుమ భరిణలో “గోమతి చక్రం” అనేది కుంకుమ భరిణలో ఉంచి మూతపెట్టి, కదిలించకుండా, దేవుని మందిరం లో ఉంచండి , దానికి పూజాది కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాసం ఉన్నది.( గోమతి చక్రం- పూజా సామగ్రి దొరికే దుకాణం లో దొరుకును ).

6. గోమతి చక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి,ఒక మంచి రోజు, ఇంటి ముందర చల్లండి. మీ ఆర్ధిక బాధలు తొలగిపోవును .

7. సాయంత్రం , ఉదయం లైటు వేసిన తరువాత ఇల్లు చిమ్మరాదు .

8. మూత లేకుండా “డస్ట్ బిన్” ఉండకూడదు, పగిలిన అద్దము ఉండకూడదు ఇంటిలో.

23/09/2016

HariOme - The Abode of Indian Culture and Traditions

13/09/2016

దేవునుకి వివిధ ఫలాల నైవేద్యం వాటి వలన కలిగే ఫలితములు మరియు ప్రసాదం నివేదన చేయు విధానము

29/08/2016

Jai Hanuman Jai Sri Ram Jai Bajrangbali

Address

Rajendranagar
Hyderabad
500001

Telephone

9399326026

Website

Alerts

Be the first to know and let us send you an email when Hanumath Jyotishyalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category