Trimurthi Seva Samstha. త్రిమూర్తి సేవా సంస్థ

  • Home
  • India
  • Hyderabad
  • Trimurthi Seva Samstha. త్రిమూర్తి సేవా సంస్థ

Trimurthi Seva Samstha.                   త్రిమూర్తి సేవా సంస్థ ఆబ్దికం : ఇద్దరు కర్తలకి, ఇద్దరు భోక్తలకి Rs.5,500

శాస్త్రోక్తంగా ఆచార వ్యవహారాలు పాటిస్తూ శ్రద్ధగా నిష్టగా అబ్దీక, సంవత్సరీక పితృ కార్యక్రమాలు నిర్వహించబడును. వివరాలకు సర్వేశ్వర శర్మ గారిని సంప్రదించ గలరు.

05/09/2025
19/04/2025
కొత్త ప్రాంగణం, సర్వ సదుపాయాలతో.. ఆనందనగర్ రోడ్డు నంబర్ 4 లో పునః ప్రారంభం అయింది.. 💯🙏🏽
06/01/2025

కొత్త ప్రాంగణం, సర్వ సదుపాయాలతో.. ఆనందనగర్ రోడ్డు నంబర్ 4 లో పునః ప్రారంభం అయింది.. 💯🙏🏽

 #ఎవరికివారు_బతికుండగానే_పిండం_పెట్టుకోవచ్చా?        చాలామంది అది కూడదని, అలా పెట్టుకుంటే వారు లోకవ్యవహారాలకు  పనికిరారన...
01/08/2024

#ఎవరికివారు_బతికుండగానే_పిండం_పెట్టుకోవచ్చా?

చాలామంది అది కూడదని, అలా పెట్టుకుంటే వారు లోకవ్యవహారాలకు పనికిరారని, కొంతమంది గురువులను, పెద్దలను ఉదహరిస్తూ కామెంట్ చేయడం జరిగింది. దీనిపై శాస్త్రాభిప్రాయం ఏమిటో మీముందు ఉంచే ప్రయత్నమే ఈ వ్యాసం.
ఏ పని చేయవచ్చు? ఏ పని చేయకూడదు? అనే విషయంలో శాస్త్రమే మనకు ప్రమాణమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లో తెలియచేస్తూ
#తస్మాచ్ఛాస్త్రం_ప్రమాణం_తే_కార్యాకార్యవ్యవస్థితౌ అని (16అ-24శ్లో) పేర్కొనడం జరిగింది. దీనికి శంకర భగవత్పాదులు తమ గీతాభాష్యంలో "కర్మాధికారభూమి ప్రదర్శనార్థమ్" - అని ఆశ్లోకంలోని "ఇహ" అనే పదాన్ని వివరించారు. అనగా ఏయే కర్మలు చేయడానికి అధికారమున్నదో తెలుసుకోవడానికి శాస్త్రమే మనకు దిక్కు అని చెప్పకనే చెప్పడం జరిగింది.

ఇదే విషయంలో కాశీలో కొన్ని దశాబ్దాల క్రితం పండితులమధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి. అనంతరం మహామహోపాధ్యాయ, ఆహితాగ్ని, కాశీహిందూవిశ్వవిద్యాలయం లోని ధర్మశాస్త్ర విభాగాధ్యక్షులు అయిన పం.ప్రభుదత్తజీ శాస్త్రి గారు #జీవచ్ఛ్రాద్ధపద్ధతి పేరుతో గ్రంథం కూడా రాయడం జరిగింది. అనంతరం జీవచ్ఛ్రాద్ధపద్ధతి అందరికీ ఆమోదయోగ్యమైనదేనని మహామహోపాధ్యాయ పం. శివకుమారమిశ్రా గారు, జ్యోతిర్వింద్వాంసులైన గణేశదత్త శాస్త్రి, ప్రియానాథ, గౌరీదత్త, కుబేర శర్మ గార్లు దీనికి ఉపాదేయత కల్పించడం జరిగింది.

ఇవన్నీ సరే, పెట్టవచ్చా? కూడదా? పెట్టవచ్చునంటే పెట్టుకున్నవారు ఎవరైనా ఉన్నారా? అని అడుగుతారేమో..

#నిరభ్యంతరంగా_జీవశ్రాద్ధము_అందరూ_చేసుకోవచ్చు.

ప్రయాగలోని " శ్రీ హరిరామగోపాలకృష్ణ సనాతనధర్మ సంస్కృత మహావిద్యాలయం" లోని రిటైర్డ్ ప్రిన్సిపాల్
పండిత శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు, కాశీలో తమకుతామే శ్రాద్ధం పెట్టుకున్నారు. చేయించినవారు "శ్రీజోషణ్ రామ్ జీ పాండేయ్" గారు. జీవచ్ఛ్రాద్ధం పెట్టుకున్న రామకృష్ణ శాస్త్రి గారిని - ఆ విధానమంతా పుస్తకరూపంలో అందించమని గీతా ప్రెస్, గోరఖ్పూర్ వారు అడగడం, ఆయన రాసి ఇవ్వడం, దానిని గీతాప్రెస్ వారు అచ్చువేయడంకూడా జరిగింది.

హేమాద్రి, వీరమిత్రోదయం లాంటి ధర్మశాస్త్ర గ్రంథాలు అయితే అలా పెట్టుకోమని ఆజ్ఞాపించాయి.
#జీవన్నేవాత్మనః_శ్రాద్ధంకుర్యాత్_అన్యేషుసత్స్వపి
( హేమాద్రి - 1710పేజీ , వీరమిత్రో.శ్రాద్ధప్ర.363పేజీ)

కొడుకులు ఉన్నవారు కూడా తమకు తాము శ్రాద్ధం పెట్టుకోవాలని దానర్థం.
లింగ పురాణం, ఆది పురాణం, ఆదిత్య పురాణం, బౌధాయనగృహ్యశేషసూత్రాలు, కృత్యకల్పతరు ఇత్యాది గ్రంథాలు కూడా ఈ శ్రాద్ధమును తెలిపాయి. ఇక సందేహాలు-సమాధానాలు చూద్దాం........

1. అలా పెట్టుకున్నవారు లోకవ్యవహారాలకు పనికొస్తారా?

సమాధానము :- చక్కగా పనికి వస్తారు. పనికిరారనేది ఒక భ్రాంతి మాత్రమేనని పండితులు తెలియజేసారు. అదీగాక, లింగపురాణం అయితే, దంపతులు జీవచ్ఛ్రాద్ధం ఆచరించాక పిల్లలు కలిగితే, పిల్లవాడు బ్రహ్మవేత్త అవుతాడని, ఆడపిల్ల పుడితే సాక్షాత్తు పార్వతీదేవి వలె విలసిల్లుతుందని తెలియజేస్తోంది. వారికి జాతకర్మాది సంస్కారాలను ఆ తల్లిదండ్రులు అందరువలెనే ఆచరించవచ్చునని కూడా లింగ పురాణం తెలిపింది.

2. తాను పెట్టుకుంటే భార్య విధవ అయినట్లేనా ?

సమాధానం:- ముందు భార్యకి చేసి, అనంతరం తాను చేసుకున్నట్లయితే ఆ శంక కూడా ఉండదు కదా!

3. తనకి పెట్టుకునే శక్తి లేనట్లయితే, వేరే వారిచే పెట్టించవచ్చా?

సమాధానం :- నిరభ్యంతరముగా పెట్టించవచ్చు.

4. పెట్టుకున్న వారికి అశౌచాదులు ఉంటాయా?

సమాధానం :- అశౌచం, సూతకం ఉండవు. స్నానంతో శుద్ధి

5. ఎక్కడ పెట్టుకోవాలి?

"పర్వతే వా నదీతీరే వనే వాయతనేऽపి వా
జీవచ్ఛ్రాద్ధం ప్రకర్తవ్యం మృత్యుకాలే ప్రయత్నతః "
అని లింగ పురాణ వచనం. అనగా పర్వతములయందు గానీ, నదీతీరమునందుగానీ, అడవియందుగానీ, ఇంటియందుగానీ ఈ జీవచ్ఛ్రాద్ధం ఆచరించాలి.

6. అలా పెట్టుకున్నవారు ఇక చనిపోయినట్లే లెక్కా?

సమాధానం :- కాదు. ఆ భావన తప్పు. ఎందుకంటే వారికి శ్రాద్ధప్రక్రియ లో "ప్రేత" శబ్దం వాడ వద్దని, జీవ శబ్దమే వాడమని శ్రాద్దమయూఖము, శ్రాద్ధ పద్ధతి అనే గ్రంథాలు చెబుతున్నాయి.

7. ఈ ప్రక్రియను సంక్షిప్తంగా వివరించగలరా ?

ఈ జీవచ్ఛ్రాద్ధపద్ధతి ని ఏ నెలలోనైనా కృష్ణద్వాదశి నాడు మొదలుపెట్టి శుక్లప్రతిపత్ నాటితో పూర్తి చేయాలి. మొత్తం 5 రోజుల కార్యక్రమం ఇది. పరిశీలించండి.......

#మొదటిరోజు :- అధికారప్రాప్తికై ప్రాయశ్చిత్తానుష్ఠానము, దాని పూర్వాంగ,ఉత్తరాంగ కృత్యాలు, దశమహాదానాలు, అష్టమహాదానాలు, పంచధేనుదానము మొదలైనవి

#రెండవరోజు :- సాలగ్రామ పూజ, జలధేనుస్థాపన-పూజ, వసురుద్రాదిత్యపార్వణశ్రాద్ధము , రాత్రి జాగరణ మొదలైనవి.

#మూడవరోజు :- పుత్తలనిర్మాణము , షట్పిండదీనములు, పుత్తలదాహము, దశగాత్రపిండదానము, శయనాదులు.

#నాల్గవరోజు :- మధ్యమషోడశీ, ఆద్యశ్రాద్ధము, శయ్యాదానం, వృషోత్సర్గం, వైతరణీగోదానం, ఉత్తమషోడశశ్రాద్ధము మొదలైనవి.

#ఐదవరోజు :- సపిండీకరణశ్రాద్ధము, అనంతరం గౌరీ-గణపతులకు పూజ, కలశ పూజ, శయ్యా-పద దానములు, బ్రాహ్మణభోజనాదులు.

అందువలన ఈ ప్రక్రియను అందరూ నిరభ్యంతరంగా ఆచరించుకొనవచ్చునని తెలియజేస్తూ , దీనిని ఖండించే వారెవరైనా ఉంటే, దానికి సంబంధించిన శాస్త్ర ప్రమాణములతో కామెంట్ చేయమని ప్రార్థిస్తూ.....

🙏 సర్వం శివసంకల్పమస్తు 🙏

06/10/2023
04/10/2023

మహాలయ పక్షంలో తెలుసుకొనవలసిన మంచి విషయం .. పెద్దలకు పిండ ప్రదానం గురించి.. అసలు మనిషి మరణం తర్వాత ఎలా పయనియిస్తారు.. ఎటు వెళతారు 😕

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది.కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది. అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ''చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదిలస్తే వారు కూడా వెళ్ళవచ్చు'' అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి వెళిపోయారు. ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా? అంటే చర్మచక్షువులతో చూడలేము. కేవలం జ్ఞానచక్షువులు, వ్యాసాది మహర్షులిచ్చే దివ్యచక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసే వారు ఎక్కువయ్యారు. వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. చాలా మందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.

వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.

బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు. మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.

మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.

నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.

పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండికరణం తరువాత తన ముం దున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది. పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.

మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.

ఇవన్నీ సమాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి. ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు.

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి. అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి.

ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి. వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి. వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు.

మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు,సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి,స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు.

మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.

దివ్యాత్మస్వరూపులారా!

ఇప్పటి వరకూ స్వధానామసాధన, స్వధాస్తోత్రపఠనం చేసిన సాధకులకు ఇదిసాధనలో రెండో సోపానం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు చెప్పగా వ్యాసభగవానుడు ప్రసాదించిన దివ్యమైన పితృస్తోత్రం అందిస్తున్నాము.దీన్ని చదువుకున్న వారి సర్వపాపాలూ పితృదేవతైన తండ్రి తొలగిస్తాడు. ఇది మూడు కాలాలలో లేదా రెండు కాలాలలో లేదా కనీసం రోజుకు ఒక సారి అయినా చదువుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయి. సకల కష్టాలూ తొలగిపోతాయి.సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది.సకల దేవతలూ సంతోషించి సకల కోరికలూ తీరుస్తారు.

Address

Beside : Chandi Amma Temple, Indraprastha Colony, GSI BANDLAGUDA NAGOLE
Hyderabad
500068

Website

Alerts

Be the first to know and let us send you an email when Trimurthi Seva Samstha. త్రిమూర్తి సేవా సంస్థ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share