23/05/2026
MATRU VANDANAM - message by Sri Madugula Naga Gurunatha Sarma
సనాతన ధర్మం అంటే మతతత్వం, ఛాందస వాదం కాదు, మానవత్వమే జీనవవేదం అనే సందేశంతో సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ప్రయత్నాన్ని సంగీతం మాధ్యమంగా, సాహిత్యం ఆయుధంగా కొనసాగించనుంది వేద విజ్ఞాన సమితి ట్రస్ట్.
వేదాలు, పురాణాలలోని నిగూఢమైన మంత్రాలు, శ్లోకాలను, వాటి సారాంశాన్ని సామాన్యులందరికీ చేరువ చేసే ఈ అద్వితీయమైన ప్రయత్నానికి వేద విజ్ఞాన సమితి ట్రస్ట్ 'మాతృవందనం' తో శ్రీకారం చుట్టింది. ఓ సుప్రసిద్ధ సినీకవి "అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి... అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి" అన్నట్లే ఈ ప్రయాణం అమ్మతోనే మొదలు పెడుతున్నాం.
ఈ ప్రయాణంలో ఎప్పటిలాగే మీ అందరి భాగస్వామ్యం, సంపూర్ణ సహాయ సహకారాలు కోరుతున్నాం.
– వేద విజ్ఞాన సమితి ట్రస్ట్