Dtv Networks

Dtv Networks dtv Networks

15/02/2026

రెండు వారాల్లో ఎన్నికలు.. నేడు నిర్ణయం!తెలంగాణ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఇక MPTC, ZPTC ...
14/02/2026

రెండు వారాల్లో ఎన్నికలు.. నేడు నిర్ణయం!

తెలంగాణ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, పరిషత్ ఎన్నికల నిర్వహణపైనా చర్చించనున్నారు. మరో రెండు వారాల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు

రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ మనవరాలి బారసాల వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డి
14/02/2026

రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ మనవరాలి బారసాల వేడుకకు హాజరైన రేవంత్ రెడ్డి

రాజేంద్రనగర్‌: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు హత్య చేసి పరారయ్యారు. సు...
14/02/2026

రాజేంద్రనగర్‌: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు హత్య చేసి పరారయ్యారు. సులేమాన్‌ నగర్‌లోని తన ఆఫీసులో ఉన్న ఖదీర్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. పలుమార్లు పొడవడంతో ఘటనాస్థలిలోనే అతడు మృతి చెందాడు. ఖదీర్‌ మరణించినట్లు ధ్రువీకరించుకున్న దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ విభేదాల కారణంగా ఖదీర్‌ బావమరుదులే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ .. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మాజీ ప్రధాని ఖాలిదా...
14/02/2026

బంగ్లాదేశ్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ .. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బీఎన్‌పీ ఛైర్మన్‌ తారిఖ్‌ రెహమాన్‌ దేశ నూతన ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాల నేతలను ఆహ్వానించాలని ఆ పార్టీ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాసియా దేశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఒకవేళ మోదీ హాజరైతే.. భారత్‌-బంగ్లా సంబంధాల్లో ఇదొక కీలకమైన పరిణామంగా మారనుంది. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంలో హసీనా ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక సలహా మండలి బంగ్లా పాలనను పర్యవేక్షిస్తూ వచ్చింది. ఆ సమయంలో రెండు దేశాలు దౌత్యపరమైన ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. బీఎన్‌పీ విజయంపై ఇప్పటికే భారత్‌ నుంచి సందేశం వెళ్లింది. రెహమాన్‌ కు మోదీ ఫోన్ చేసి అభినందించారు. ఆయన నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికలు నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై మోదీకి బీఎన్‌పీ ధన్యవాదాలు తెలిపింది.

12/02/2026
12/02/2026
12/02/2026
12/02/2026
12/02/2026
12/02/2026
12/02/2026

Address

Hyderabad

Telephone

+919014204599

Website

Alerts

Be the first to know and let us send you an email when Dtv Networks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share