30/12/2021
తేదీ: 30-12-2021
పత్రిక ప్రకటన
*వివేకానంద విదేశీ విద్య పథకం క్రింద నూతన దరఖాస్తుల స్వీకరణ*
2022-23 సం.కి. గాను “వివేకానంద విదేశీ విద్య” పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుండి కొత్తగా దరఖాస్తులను తేదీ 05-01-2022 నుండి 04-02-2022 వరకు ఆన్ లైన్ ద్వారా ఆహ్వానించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు నిర్ణయించింది.
అర్హులైన విద్యార్థులు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు వెబ్ సైట్ (www.brahminparishad.telangana.gov.in) ను సందర్శించి, పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా చదివి, సరి అయిన ధృవ పత్రములు జతపరచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాల మేరకు గరిష్టంగా రూ.ఇరవై లక్షల కు మించకుండా బోథన రుసుము( ట్యూషన్ ఫీజు) పొందవచ్చు.ఈ సదుపాయము తేదీ 05-01-2022 నుండి 04-02-2022 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ అవకాశాన్ని అర్హులైన తెలంగాణ బ్రాహ్మణ విద్యార్థులందరూ వినియోగించుకోవలసిందిగా పరిషత్తు చైర్మన్ డా.కే వి రమణా చారి విజ్ఞప్తి చేసారు.
ఇట్లు
*కె.చంద్ర మోహన్*
(పాలనాధికారి)
Telangana Brahmin Samkshema Parishad