28/10/2025
జై శ్రీమన్నారాయణ🙏
క్రాంతి నగర్ లో వేంన్చేసిన పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాబోయె ఈ కార్తీకమాసమున జరుగు విశేష ఉత్సవాలలో పాల్గొన తలచిన భక్తులు తమ గోత్రనామాలను ముందుగా నమోదుచేయుంచు కొనగలరని మనవి:-
1. ది.22.10.2025 (బుధవారం) నుండి ప్రతిరోజు సాయంకాలం 6.45 గం.లకు ఆకాశ దీపారాధన నిర్వహించబడును. కార్తీకమాస గోత్రనామాలకు (రుసుము ₹.1116/-).
2. కార్తీకమాస ప్రతి ఆదివారం (ది.26.10.2025; 2.11.2025 & 9.11.2025) ఉదయం 8.45 గం.లకు సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహించబడును (రుసుము ₹.1516/-).
3. కార్తీకమాస పౌర్ణమినాడు (5.11.2025/బుధవారం) ఉదయం 6.45 గం.లకు లక్షతులసి అర్చన నిర్వహించబడును (రుసుము ₹.365/-). సాయంకాలము 7.00 గం.లకు సహస్ర దీపాలంకరణ, థాత్రి నారాయణ పూజ (రుసుము ₹.116/-).
4. కార్తీకమాస చిలుకు ద్వాదశి (ది.2.11.2025/ఆదివారం) సాయంకాలము 6.45 గం.లకు తులసీ కళ్యాణం (రుసుము ₹.516/-).
కావున భక్తులు గమనించి పైవిశేష కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్నికి పాత్రులు కాగలరని మనవి. మరిన్ని వివరాలకు ఆలయంలో ప్రసాదరావు గారిని సంప్రదించగలరు. (9312889074)
ఇట్లు,
ఆలయ పాలక మండలి.