11/02/2026
శ్రీ దుర్గా పాపనాశేశ్వర, వీరభద్ర దేవాలయము
లేపాక్షి - 515 331, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్
మహాశివరాత్రి కళ్యాణ, రుద్ర, చండీయాగ, బ్రహ్మరథోత్సవ ఆహ్వాన పత్రిక
తేది 14-2-2026 నుండి 18-2-2026 వరకు జరుగును
భక్తమహాశయులారా......
భారతదేశంలో అతి పెద్ద నంది విగ్రహముగల దేవాలయము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా, లేపాక్షి మండలం లేపాక్షి గ్రామములో ఉండటం బహు విశేషం. ఈ దేవాలయము 15వ శతాబ్దములో విజయనగర చక్రవర్తుల కాలములో శ్రీ విరూపణ్ణ, వీరణ్ణ అనే సహెూదరులచే నిర్మించబడినది. ప్రాచీన శిల్ప, చిత్ర కళలకు క్షేత్రమైనది. దేశ విదేశాలలో లేపాక్షి చీరలు, డిజైన్స్ బార్డర్లకు విశేష ఆదరణ పొందినది. ఈ దేవాలయము నందు శ్రీ వీరభద్రస్వామి, శ్రీ పాపనాశేశ్వర స్వామి, శ్రీ రఘునాథస్వామి, శ్రీ దుర్గాదేవి మున్నగు దేవతలు ఒకే స్థలమునందు ఉండటం చాలా విశేషమైనది. ఇటువంటి దేవాలయాన్ని కేంద్ర పురాతత్వ శాఖవారు విమాన గోపురాలు, ప్రాకారాదులు, సుందరమైన తోటలు నిర్మించి దేవాలయాన్ని అతి సుందరముగా తీర్చి దిద్దుచున్నారు.
ఇటువంటి క్షేత్రమునందు శ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు,
శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘ బహుళ ద్వాదశి శనివారం 14-2-2026 నుండి 18-2-2026 బుధవారం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు...!
భక్తులందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము
#లేపాక్షి