05/05/2026
“వైశాఖ పౌర్ణమి జ్ఞాన మహాసభ - 2026”
మానవుడు ఆచరించే ప్రతి మంచి పని ఆధ్యాత్మికతే అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అనుగ్రహ భాషణ చేసారు. 1-5-26, శుక్రవారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ వైశాఖ పౌర్ణమి జ్ఞాన మహాసభను పీఠాధిపతి డా॥ఉమర్ ఆలీషా సద్గురువర్యులు జ్యోతి ప్రకాశనం చేసి, సభను ప్రారంభించారు. జ్ఞానము, యోగము ద్వారా మానసిక స్థిరత్వం, ఏకత్వం పొంది, మానవత్వపు విలువలు పరిరక్షించుకోమని పిలుపునిచ్చారు. విశేషించి స్త్రీమూర్తులు కాలాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. సమాజంలో తల్లి, తండ్రి, విద్య నేర్పిన గురువు, ఆధ్యాత్మిక గురువును తుది శ్వాస విడిచే వరకు మర్చిపోకుండా గౌరవించాలని అన్నారు. ఆధ్యాత్మికత ద్వారా మానసిక కల్మషం తొలగించుకుని, మానసిక వికాసం పొందాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎన్.వి. శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు, నాబార్డ్ డి.డి.ఎమ్. డా. సోము నాయుడు, బి.సి.ఎన్.ఎల్. ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ శ్రీ పలివెల రాజు, కోనసీమ సీవీడ్జ్ కంపెనీ అధినేత డా. రామరాజు, ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త శ్రీమతి యాళ్ళ పద్మలత ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు గారు స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ని స్వామివారి అమృత హస్తముల ద్వారా ఆవిష్కరింప చేసి, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతీ ఒక్కరూ ఈ యాప్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎన్.వి. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న పీఠం సేవలను కొనియాడారు. వ్యక్తి బాగుండాలి, సమాజం బాగుండాలి అని, స్వామివారిలో ఉన్న దివ్యమైన శక్తిని ప్రసరింప చేసి, మానవులలో ఉన్న స్వార్థం, అసూయ నిర్మూలించుటయే ఆధ్యాత్మికత అని అన్నారు. నాబార్డ్ డి.డి.ఎమ్. డా॥ సోము నాయుడు గారు మాట్లాడుతూ పీఠంలో ఉన్న వేలాది మంది మహిళల ఆర్థిక సాధికారత కోసం నాబార్డ్ ద్వారా సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందచేస్తామని, మహిళల ఉపాధి కోసం అనేక కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. మహిళా పారిశ్రామిక వేత్త శ్రీమతి యాళ్ళ పద్మలత మాట్లాడుతూ మహిళల సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్న పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా స్వామివారి సేవలు అభినందనీయం అని అన్నారు.
తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరింప చేసినవి. ముందుగా సభలో అవధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వర రావు సభ విశిష్టతను సభకు వివరించారు