Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham

Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham Brahmarishi Dr.Umar Alisha current head (9th Head) of Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham
(374)

“వైశాఖ పౌర్ణమి జ్ఞాన మహాసభ - 2026”మానవుడు ఆచరించే ప్రతి మంచి పని ఆధ్యాత్మికతే అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అన...
05/05/2026

“వైశాఖ పౌర్ణమి జ్ఞాన మహాసభ - 2026”

మానవుడు ఆచరించే ప్రతి మంచి పని ఆధ్యాత్మికతే అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అనుగ్రహ భాషణ చేసారు. 1-5-26, శుక్రవారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ వైశాఖ పౌర్ణమి జ్ఞాన మహాసభను పీఠాధిపతి డా॥ఉమర్ ఆలీషా సద్గురువర్యులు జ్యోతి ప్రకాశనం చేసి, సభను ప్రారంభించారు. జ్ఞానము, యోగము ద్వారా మానసిక స్థిరత్వం, ఏకత్వం పొంది, మానవత్వపు విలువలు పరిరక్షించుకోమని పిలుపునిచ్చారు. విశేషించి స్త్రీమూర్తులు కాలాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. సమాజంలో తల్లి, తండ్రి, విద్య నేర్పిన గురువు, ఆధ్యాత్మిక గురువును తుది శ్వాస విడిచే వరకు మర్చిపోకుండా గౌరవించాలని అన్నారు. ఆధ్యాత్మికత ద్వారా మానసిక కల్మషం తొలగించుకుని, మానసిక వికాసం పొందాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎన్.వి. శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు, నాబార్డ్ డి.డి.ఎమ్. డా. సోము నాయుడు, బి.సి.ఎన్.ఎల్. ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ శ్రీ పలివెల రాజు, కోనసీమ సీవీడ్జ్ కంపెనీ అధినేత డా. రామరాజు, ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త శ్రీమతి యాళ్ళ పద్మలత ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

మున్సిపల్ కమిషనర్ శ్రీ కనకారావు గారు స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ని స్వామివారి అమృత హస్తముల ద్వారా ఆవిష్కరింప చేసి, పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతీ ఒక్కరూ ఈ యాప్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎన్.వి. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న పీఠం సేవలను కొనియాడారు. వ్యక్తి బాగుండాలి, సమాజం బాగుండాలి అని, స్వామివారిలో ఉన్న దివ్యమైన శక్తిని ప్రసరింప చేసి, మానవులలో ఉన్న స్వార్థం, అసూయ నిర్మూలించుటయే ఆధ్యాత్మికత అని అన్నారు. నాబార్డ్ డి.డి.ఎమ్. డా॥ సోము నాయుడు గారు మాట్లాడుతూ పీఠంలో ఉన్న వేలాది మంది మహిళల ఆర్థిక సాధికారత కోసం నాబార్డ్ ద్వారా సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందచేస్తామని, మహిళల ఉపాధి కోసం అనేక కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. మహిళా పారిశ్రామిక వేత్త శ్రీమతి యాళ్ళ పద్మలత మాట్లాడుతూ మహిళల సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్న పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా స్వామివారి సేవలు అభినందనీయం అని అన్నారు.

తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరింప చేసినవి. ముందుగా సభలో అవధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వర రావు సభ విశిష్టతను సభకు వివరించారు

హైదరాబాదు మహా నగరంలో 19.04.2026వ తేదీన (ఆదివారము) వైశాఖ మాస పర్యటనలో భాగంగా నవమ పీఠాధిపతి, బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆ...
20/04/2026

హైదరాబాదు మహా నగరంలో 19.04.2026వ తేదీన (ఆదివారము) వైశాఖ మాస పర్యటనలో భాగంగా నవమ పీఠాధిపతి, బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలిషా వారి అధ్యక్షతన వైశాఖ మాస జ్ఞాన సభ నిర్వహించబడినది.

13/04/2026

శారీరకంగా, మానసికంగాను ఆరోగ్యంగా ఉండాలంటే..?

06/04/2026

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది జ్ఞాన మహాసభ దృశ్యాలు । 19-3-26, పిఠాపురం

Follow the path of truth, courage & righteousness like Lord Rama and Sita 🏹🔥Jai Shri Ram 🙏🏹✨
27/03/2026

Follow the path of truth, courage & righteousness like Lord Rama and Sita 🏹🔥Jai Shri Ram 🙏🏹✨

Ramzan Mubarak 🌙   ً
21/03/2026

Ramzan Mubarak 🌙

ً

ఉగాది మహాసభ 19-3-26త్రయీసాధన అనే విశ్వ సాధన ద్వారా మానవత్వమును పరిమళింప చేసుకొని ఈశ్వరత్వాన్ని సాధించవచ్చు అని పీఠాధిపతి...
19/03/2026

ఉగాది మహాసభ 19-3-26

త్రయీసాధన అనే విశ్వ సాధన ద్వారా మానవత్వమును పరిమళింప చేసుకొని ఈశ్వరత్వాన్ని సాధించవచ్చు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేసారు. 19-3-26, గురువారం ఉదయం పిఠాపురం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పరాభవ నామ సంవత్సర ఉగాది జ్ఞాన మహాసభను పీఠాధిపతులు డా॥ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభకు హాజరైన వేలాదిమందికి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ప్రముఖ గీతావధాని, అష్టావధాని శ్రీ యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావుగారు పంచాంగ పఠనం చేసి, రాశి ఫలాలను వివరించారు. తాత్త్విక బాలవికాస్ ద్వారా శిక్షణ పొందుతున్న చిన్నారులు ఉమా చంద్ర శేఖర్, ఉమా శ్రీ రమ్య, యశస్వి నాగ ఉమా ప్రసంగాలు సభ్యులను అలరింప చేసాయి. తాత్త్విక యువవికాస్ ద్వారా కుమారి కట్రెడ్డి అజీమున్నిషా స్వానుభవం వివరించారు.

గిరిజన సంక్షేమ కార్యక్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కట్టా లక్ష్మి వివరించారు. తదనంతరం లంబాడా తెగకు చెందిన గిరిజన మహిళ శ్రీమతి బాణావతు బాపనమ్మ సోనీ కీర్తన ఆలపించారు. కోయ తెగకు చెందిన కుమారి సోదేం మంగమ్మ, శ్రీమతి కాకి వెంకట లక్ష్మిగార్లను స్వామి శాలువాలు కప్పి, మొక్కలు బహూకరించి సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ డా. సునీల్ కుమార్ యాండ్ర పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా స్వామివారి సేవలను స్తుతిస్తూ వ్రాసిన సన్మాన పత్రాన్ని స్వామి వారికి బహూకరించడం జరిగింది. సంగీత విభావరి కార్యక్రమంలో శ్రీమతి ఉమా ముకుంద బృందం పాడిన కీర్తనలు సభికులను ఆనందింప చేసినవి.

ఈ సందర్భంగా పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా స్వామివారు మాట్లాడుతూ తల్లి తండ్రులను గౌరవంగా చూసుకుంటూ, సమాజంలో మానవత్వపు విలువలతో నడుచుకుంటూ, గురు తత్త్వాన్ని ఆచరిస్తూ, సుఖం, సంతోషం, తృప్తి, శాంతిని పొందాలని అనుగ్రహ భాషణ చేసారు. సమస్యలు, కష్టాలు అధిగమించాలంటే ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానం అనే ఔషధం ద్వారా మనశ్శక్తి, మనో ధైర్యం పెంపొందించుకుని, భవిష్యత్తును ఉజ్జ్వలంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. తదనంతరం మురమళ్ళ శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధంతిగారు స్వామివారికి శాలువా కప్పి, గజమాలతో సత్కరించి, నూతన సంవత్సర పంచాంగాన్ని బహూకరించారు.

Happy International Women's Day! 👭 ✨
08/03/2026

Happy International Women's Day! 👭 ✨

“మానవత్వమే మతము - మానవత్వమే ఈశ్వరత్వము”ప్రేమ, శాంతి, తృప్తి ద్వారా మానవత్వమే ఈశ్వరత్వమని గ్రహించవచ్చు అని, దానిని త్రయీ ...
04/03/2026

“మానవత్వమే మతము - మానవత్వమే ఈశ్వరత్వము”

ప్రేమ, శాంతి, తృప్తి ద్వారా మానవత్వమే ఈశ్వరత్వమని గ్రహించవచ్చు అని, దానిని త్రయీ సాధన ద్వారా అనుభవంలో గ్రహించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేశారు. తుని పట్టణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెనేషా వలీ సద్గురువర్యుల దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్వమత సమ్మేళన సదస్సుకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అధ్యక్షత వహించగా, హిందూ మత ప్రతినిధి డా. శ్రీపాద సీతామహాలక్ష్మి సత్యవతి పేరమాంబ, ఇస్లాం మత ప్రతినిధిగా షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ మత ప్రతినిధిగా ఎస్. బాల శౌరి, బౌద్ధ మత ప్రతినిధిగా మహోదయ ఎన్. పెద్దిరాజు, పీస్ ఫౌండేషన్ విజయవాడ శ్రీ అహ్మద్ పాషా వారలు మత సమరస్య సదస్సులో పాల్గొని, ప్రసంగించి, అనంతరం చెయ్యి చెయ్యి పైకెత్తి, దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి కోసం పాటు పడతామని ప్రతిజ్ఞ చేసారు.

ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ 250 సంవత్సరాల క్రితం చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెనేషా వలీ సద్గురువర్యులు ఈ దర్గా ప్రాంగణంలో ఉండి, భిన్నత్వంలో ఏకత్వం తెలియచేయు ఆర్ష సూఫీ తత్త్వం ప్రబోధించుటయే కాక, కల్కి భాగవతం అనే గ్రంథం దరువు కీర్తనల రూపంలో రచించారు అని అన్నారు. ఆ కీర్తనల రూపంలో ఉన్న తత్వాన్ని అవగాహన చేసుకొంటే ఈశ్వరత్వం మానవత్వ రూపంగా తెలియబడి అదే విశ్వమానవ మతం అనే ఆధ్యాత్మిక భావం ఏర్పడుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు వివిధ మత ప్రతినిధులను సత్కరించగా, స్వామివారిని తుని కమిటీ సభ్యులు సత్కరించారు. స్వామి వారు జ్యోతి ప్రజ్వలన చేసి, మత సామరస్య సదస్సును ఆవిష్కరించారు. ముందుగా పీఠం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, సాహిత్య, సేవా కార్యక్రమాలు తెలియచేసే ఫోటో ఎగ్జిబిషన్ మరియు ఉచిత మజ్జిగ చలివేంద్రమును ఆవిష్కరించారు.

నోబెల్ ఐటిఐ కరెస్పాండెంట్ శ్రీ గోసుల వీర వెంకట సత్యనారాయణ 2026 నివేదికను తెలియజేశారు. పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు పీఠ చరిత్రను వివరించారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ మత ప్రతినిధులు తమ మతాల విశిష్టత, శాంతి, నీతి, సన్మార్గం గురించి సందేశాలు అందించారు. పీస్ ఫౌండేషన్ అధినేత శ్రీ అహ్మద్ పాషా మత సమరస్య సదస్సును అభినందించారు. మిర్జా మజ్దూర్ అహ్మద్ రచించిన “వరల్డ్ క్రైసిస్ - పీస్” గ్రంథాన్ని డా. ఉమర్ ఆలీషా స్వామివారు ఆవిష్కరించి మత ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో భారీగా ప్రజలు పాల్గొని సర్వమత సామరస్య సందేశాన్ని గ్రహించారు.


Address

11-3-42, Pithapuram
East Godavari
533450

Alerts

Be the first to know and let us send you an email when Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham:

Share