Bhagavan Sri Venkaiah Swamy - Kammavaripalem

Bhagavan Sri Venkaiah Swamy - Kammavaripalem Sri Venkaiah Swamy is an Avadhutha in Sri Datta lineage. This temple has been a great religious spot for many devotees since 1998.

Swamy took birth to elevate spiritually starving people, protect needy, feed the hunger and uplift people of all classes.

28/10/2025

బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో .... (Chaganti discourses) ...

26/10/2025
19/08/2024

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 23 వ ఆరాధన మహోత్సవము నేడు...

Sri Venkaiah Swamy is an Avadhutha in Sri Datta lineage. Swamy took birth to elevate spiritually starving people, protect needy, feed the hunger and uplift people of all classes. This temple has been a great religious spot for many devotees since 1998.

ఓం నారాయణ - ఆది నారాయణ!భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి "23 వ ఆరాధనా మహోత్సవం" ది. 19 ఆగస్టు 2024 న సోమవారం నాడ...
15/08/2024

ఓం నారాయణ - ఆది నారాయణ!

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి "23 వ ఆరాధనా మహోత్సవం" ది. 19 ఆగస్టు 2024 న సోమవారం నాడు, కమ్మవారిపాలెం గ్రామం నందు జరుగుచున్నది.
భక్తులందరు విచ్చేసి స్వామి వారి దర్శనం చేసుకొని, అన్న ప్రసాదాన్ని స్వీకరించి, స్వామి వారి కృపానుగ్రహాలకు పాత్రులు కాగలరు. మరిన్ని వివరాలు కొరకు మరియు విరాళాల అందించ తలచిన వారు ఈ నంబరును +919908061600 సంప్రదించగలరు.

Location: https://goo.gl/maps/FDxb1qETUFapNEYC6,

06/06/2024

🙏 *ఓం నారాయణ ఆదినారాయణ ఈ మీద ఇనుప దూలాలతో గుళ్ళు కట్టేవాళ్ళు వస్తుండ్లయ్యా*🌺 తిప్ప కింద నుండి పైకి 500 అడుగులు ఎత్తులో ఉన్నది పెన్నా బద్వేల్ తిప్ప ఈ తిప్ప చుట్టూ రెండు వైపులా పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది చుట్టూ పంట పొలాలు తిప్ప పైన శ్రీ స్వామి వారి చిన్న గుడి శ్రీ స్వామి వారు నాటిన మర్రిచెట్టు తప్ప ఇంకా ఎలాంటి వసతులు లేవు ఇది ఆనాటి పరిస్థితి అయితే 50 అడుగుల పొడవు 23 అడుగుల వెడల్పుతో భక్తుల వసతిగృహం నిత్యాగ్నిహోత్ర నిర్మాణము సంకల్పించి ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ స్వామివారితో సన్నిహితంగా ఉన్న కొంతమంది పెద్దలు స్వామి భవిష్యత్తులో ఇక్కడ ఇనప దూలాలతో గుళ్ళు కట్టేవాళ్ళు వస్తుండ్లయ్య అని అన్నారని వారు చెప్పారు అన్నా ఆ వాక్కు నిజమైనది ఈ మహోన్నత యజ్ఞం లో భక్తులైన మీరందరూ సహృదయంతో సహకరించారు ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా జలం అవసరం కనుక దీనికి కీర్తిశేషులు పుట్టా రామకోటయ్య గారు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శ్రీ వెంకట రత్నమ్మ గారు పెన్నా నది నుండి తిప్ప మీదకు నీటిని తెప్పించుట కొరకు వారి వంతు 25000 సమర్పించారు (మాచవరం డౌన్ విజయవాడ) ఇంకొక అజ్ఞాత భక్తురాలు పేరు చెప్పవద్దు అని చెప్పారు ఆవిడ 15 వేల రూపాయలు సమర్పించారు ఇక పనులు ప్రారంభించాము అనేకమంది అనేక రూపాలలో ఇచ్చారు వారందరికీ స్వామి కృతజ్ఞతలు ఆశీస్సులు ఇచ్చారు స్వామివారు *అయ్యా ఈ పెన్నా బద్వేల్ తిప్పను 32 కోట్ల చూపుతో చూస్తే అన్ని కరుకులు వజ్రాలు రసవజ్రాలే కదయ్యా అన్నారు ఆ చూపుతో చూసే శక్తి ఎవరికీ ఉన్నది అక్కడ ఎంత శక్తి ఉన్నది అన్నది ఆయనకే తప్ప ఎవరికీ ఎరుక మరల అయ్యా ఈ నీళ్లు తులం మున్నూరు కోట్ల పుణ్యఫలం వస్తుందయ్యా అన్నారు అలాగే ఆ జల యజ్ఞం చేసిన తరువాత జలయజ్ఞంలో వచ్చిన తపోధనం ఉట్టిమీద ఉట్టిగట్టి బద్వేలు తిప్ప పైన పెట్టాం అయ్యా* అని చెప్పారు కాబట్టి ఈ తిప్పపైన సంతానం లేని వారు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఉద్యోగం లేని వారు కుటుంబ కలహాలతో కుమిలిపోతున్నవారు వ్యాపార వ్యవహారములతో నష్టపోతున్నవారు ఇంకా అనేక బాధలు పడుచున్నవారు ఎవరైనా ఈ పెన్నా బద్వేల్ తిప్ప పైన ఉన్న శ్రీ స్వామివారిని సేవించి నిద్రించినవారు పుణ్యఫలం పొంది తక్షణమే సర్వ శుభాలు చేకూరతాయి అలాంటి తపోవదనం ఉన్న స్థలంలో చేసిన నామమైన ధ్యానమైన నిత్యాగ్నిహోతరునికి చేసిన సేవ అయినా ఊరికే పోదు అక్కడున్న తపోవదనం మీ సమస్యలకు సర్దుకుంటుంది మీరు స్వస్థులై తిరిగి వస్తారు ఇది అక్షర సత్యం అని బైన బోయిన స్వామి వారు మాకు తెలియజేశారు ఓం నారాయణ ఆదినారాయణ గురు దేవుని పాదాలకు శరణం శరణం శరణం రేపు మరలా కలుద్దాం సేకరణ ఓరుగంటి నాగరాజు🙏🪷 శుభం భూయాత్ అందరికీ వెంకయ్య స్వామి వారి ఆశీస్సులతో

21/04/2024

🔥ఓం నారాయణ ఆదినారాయణ🔥

ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ వెంకయ్యస్వామి సచ్చరిత్ర
రచన : శ్రీవారి పాదరేణువు గురుదేవులు శ్రీ మాకాని వెంకట్రావు స్వామి వారు.

ఈ మూడునాళ్ళ ముచ్చటలో జీవి పదిలోకములలో మాయాబద్ధుడి సంచరించుచుండును. శైశవమునకు ముందు

మొదటి లోకము :- మాతృ గర్భలోక నివాసము. ఈ లోకము నందు సృష్టిని అనుభవించును. తదుపరి

రెండవ లోకము :- జననము - ఇది రెండవ లోకము. ఇందు జీవి కేవలము సమాధి అవస్థను పొంది లోక వాసనలచే పీడింపబడుచూ మాతృసంరక్షణ యందు నిశ్చింతగా నిద్రించుచుండును. తరువాత

మూడవలోకము: బాల్యము అనునది మూడవలోకము, ఈ లోకము నందు మానవుడు కల్ల కపటములు లేక సత్యము అసత్యము అనునవి తెలియక ఉన్నది ఉన్నట్లు చూచుచూ చూచిన దానిని పలుకుచూ అందువలన కలుగు సుఖదుఃఖములను అనుభవించుచుండును.

నాల్గవ లోకము :-

శైశవము - అనునది నాల్గవ లోకము. ఈ లోకము నందు తల్లిదండ్రులను గురువులుగ గ్రహించి వారు చూపిన మార్గమును అనుసరించి విద్యను అభ్యసించి జ్ఞానమును సంపాదించుకొనును. ఇంతవరకు దైవమానములో ఒక రోజు గడచిపోవును.

అయిదవలోకము :-

యుక్తవయస్కుడైన జీవి తన స్థితిని తెలుపుకొనుటకు ప్రకృతి ధర్మముననుసరించి గృహస్థుడై లోకధర్మములను నిర్వహించుచూ విషయ లోకమున సంచరించుచుండును. ఇది అయిదవ లోకము. ఈ లోకమునందు జీవి విషయాసక్తుడై పూర్వ జన్మ సుకృత దుష్కృత కర్మల ఫలముల ననుసరించి స్వార్ధ పూరితుడుగా గాని త్యాగమూర్తిగ గాని తనను తాను మలచుకొనును. దీనితో రెండవ రోజు పూర్తి అగును.

🔥ఓం నారాయణ ఆదినారాయణ🔥

08/04/2024

🔥ఓం నారాయణ ఆదినారాయణ🔥

ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ వెంకయ్యస్వామి సచ్చరిత్ర
రచన : శ్రీవారి పాదరేణువు గురుదేవులు శ్రీ మాకాని వెంకట్రావు స్వామి వారు.

"ఊరిలో అన్నము తింటే ఉండే జబ్బులు పోతాయయ్యా (గురుదేవుల ప్రవచనము)

జగన్నాథుడైన గురుదేవులు తన దర్శన సేవా తపనలో యుండు భక్తులను సర్వకాల సర్వావస్థల యందును కాపాడుదురనుట త్రికాల సత్యము.

గురుదేవులు ఆదినుండి ఆచరించుచూ వచ్చిన ఆచరణను ఈనాటికిన గురుదేవుల దేవస్థానములందు ఆశ్రమములందు కొనసాగించుచున్నారు. ఈనాటికి కూడ లక్షలాది జనావళికి అన్నదాత వెంకయ్యస్వామి ఆహారమును ఆశ్రమ దేవస్థానములందు సమకూర్చుచున్నారు. గురుదేవుని ఆశ్రమం దేవస్థానములందు నియమానుసారము మధుకరమును (భిక్షాన్నము) తీసికొనివచ్చి ఆ ఆహారమును అన్నపూర్ణరాశిలో కలిపి ఆశ్రితులకందరకు పరమాత్ముని ప్రసాదముగా ప్రసాదించుచున్నారు. పరమాత్ముని ప్రసాదము పవిత్రము. పవిత్రముగా గైకొనిన ఆ ప్రసాదముతో ఆశ్రితులు శారీరక మానసిక రుగ్మతలను నివర్తింపజేసికొని మాయను వదలుకొని ప్రశాంతతను పొందు చున్నారు. అమృతమూర్తి గురుమూర్తి ప్రసాదముతో పరలోకప్రాప్తికి పరితపించు పరమ భక్తులకు పరమేశుని దయానుగ్రహములు లభించుట తధ్యము. ఆ భోజనము ఆశ్రమ భోజనము కాదు. అమృతమూర్తిచే ప్రసాదించబడినది గావున ఆ పవిత్ర ఆహారము నిజముగా అమృతమే. ఆ భావనతో స్వీకరించినవారు. తప్పక అమృతమయులగుదురు. ఇందుకు సాక్షీభూతముగా గురుభగవానులు పరమోన్నత ప్రవచనములను ప్రపంచమునకు చాటుట విధ్యుక్త ధర్మము.

గురుదేవుల ప్రవచనము వివరణ

ఊరిలో :- గ్రామములలోనైననూ పట్టణములలోనైననూ

అన్నము తింటే :- మధుకరమును (భిక్షను) ఆహారముగ స్వీకరించినచో

ఉండే జబ్బులు :- మానసిక శారీరక రుగ్మతలు.
ప్రోతాయయ్యా : మటుమాయమయిపోవును

విశేష వివరణము :
ఊరిలో : ఊరు అనగా
పంచభూతాత్మకమైన ప్రకృతి.
ఈ ప్రకృతి యందు సర్వేశ్వరుడు సర్వత్రా వ్యాపించి యుండును.

అన్నము :అన్నము అనగా పరబ్రహ్మము. తినుట అనగా పరబ్రహ్మమును మననము చేయుట - తాను పరబ్రహ్మ స్వరూపుడు అని తెలిసికొనుట అని అర్ధము.

ఉండే జబ్బులు : అనగా కామ క్రోధ లోభమోహమద మాత్సర్యము (అరిషడ్వర్గము)లను జబ్బులు

పోతాయి :అనగా నశించిపోవును. :

భావము :- ఈశ్వరుడు ప్రకృతిలోని సర్వప్రాణులయందు సర్వత్రా ఎల్లప్పుడు వ్యాపించి యుండును. కనుక అట్టి ప్రకృతి నుండి ఆహారమును అనగా పరబ్రహ్మ స్వరూపమును గ్రహించినచో మానవుని యందున్న పతన హేతువులగు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములనెడు అరిషడ్వర్గము - నశించి మానవునకు ముక్తి మార్గము లభించును . కనుక గురుదేవులు నిరంతరము శ్రద్ధాసక్తులతో నియయముగా ఈ ప్రక్రియను ఆచరించి తన భక్తులచే నని ఆచరింపజేసి మానవుల కర్మ విమోచనమునకు మార్గమును ఉపదేశించినారు. గురుదేవులు నిరంతరము నియమానుసారముగా నిర్వర్తించిన ఈ ప్రక్రియలోని పరమార్ధమును ప్రపంచమునకు ప్రబోధించుచున్నారు. పైకి సామాన్యముగా కచ్పించు గురుదేవుని వాక్యములో ఈ మహోన్నత సత్యప్రభోధము ఇమిడిఉన్నది. విక్షేషించి గ్రహించినపుడే అందలి పరమార్ధము అవగతమగును.

🔥ఓం నారాయణ ఆదినారాయణ🔥

28/03/2024

🔥ఓం నారాయణ ఆదినారాయణ🔥

ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ వెంకయ్యస్వామి సచ్చరిత్ర
రచన : శ్రీవారి పాదరేణువు గురుదేవులు శ్రీ మాకాని వెంకట్రావు స్వామి వారు.

పరమాత్ముని పాదస్పర్శతో పవిత్రమయిన పుడమిలో, శ్రీవారి అడుగు జాడలను అనుసరించు శిష్యపరివారము, సర్వకాల గురుపాదసేవా భాగ్యములో తన్మయులయి,ఆ తన్మయత్వముతో తండ్రి వెంట తిరుగుచుండెడివారు. అవ్విధముగ తన్మయులైన ఆ తనయులు అనందమయుడైన గురుదేవునికి అంకితమైన సేవ, తమ, జన్మ జన్మల పుణ్యఫలిత భాగ్యమేనను ఆనందోత్సాహములతో ఉప్పొంగి పోతూ యుండెడివారు. శ్రీవారి సంచారములు సదా కని పెట్టుకొని యుండు శిష్యులకే గాదు, గురుదేవులు ఎచ్చోట తమ పాద కమలముల ధూళితో ఏ ప్రదేశమును పునీతము చేయుదురో, అచ్చోటికి, ఆపరమాత్మ స్వరూపుని దర్శనార్ధమై పరుగులిడు ప్రజానీకమునకు, శ్రీవారి ఆశీస్సులకై అరుగుదెంచు అదృష్టశాలురకు, భక్త్యావేశముతో బయలుదేరిన భక్తులకు, తదితర ఆశ్రిత సమూహమునకు, పట్టణమైననూ, పల్లె అయినను – అడవి అయిననూ, ఆ ప్రాంతమే ప్రాంతమయినను సరే సమయా సమయములతో - నిమిత్తము లేక, సర్వులకు, సర్వేశ్వరుడు, చక్కగా అన్నపానీయములను అమర్చు చుండెడివారు. ఆ జనసమూహములో ఏ ఒక్కరైనా ఆకలిబాధతో యుండిన అన్నదాత గురుస్వామి ఒప్పుకొనరు గదా! ఆ సమయమున అచ్చోట అందరకు ఆశ్చర్యముగా ఆహారమెలా సమకూరుతున్నదో, అదియే అంతుబట్టని ప్రశ్న ఆ గురుదేవుల శక్తి సామర్థ్యములు తెలిసిన శిష్య బృందము, అంతుబట్టని, ప్రశ్నకు తగు సమాధానమును, గురుముఖముగా తెలిసికొన ఉత్సాహముతో నుండి, వారిలో వారు మధనపడు చుండిరేగాని, పరమాత్మునెవ్వరు ప్రశ్నించలేకపోయిరి

🔥ఓం నారాయణ ఆదినారాయణ🔥

06/02/2024

*ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏

*గ్రంథం:* స్మృతిమాత్రప్రసన్నాయనమః , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్

*శ్రీ స్వామివారి దివ్య లీల*

నెల్లూరులోని ఇరగా శ్రీదేవమ్మగారి మూడు సంవత్సరముల బిడ్డకు జ్వరం వచ్చి రెండు కాళ్ళు చచ్చుబడి ముడుచుకు పోయాయి. మద్రాసు డాక్టర్లు అది పోలియో జబ్బని కరంటు వైద్యాలు చేసినా వేల రూపాయలు ఖర్చు పెట్టినా కాళ్లకు స్పర్శ రాలేదు. ఈ దుఃఖ పరిస్థితిలో వారి అన్నగారింట్లో శ్రీ స్వామి వారి పటం వద్ద ఆ బిడ్డను పడేసి ఆ తల్లి ఎంత సేపో ఏడ్చి, "స్వామి! నేను కడు బీదరాలను. నా బిడ్డ తిరిగి నడిస్తే స్వామివారి పటాలన్నిటికి పూలమాలలు సమర్పించి, 28 కిలోల బియ్యం, ఒక వంద విస్తరాకులు సమర్పించుకుంటానని ఎలాగైనా నన్ను కరుణించమని” వేడుకున్నారు.

స్మృతిమాత్ర ప్రసన్నులైన శ్రీ స్వామివారు ఆ తల్లికి మరుసటి రోజు రాత్రి స్వప్నంలో ఒక డాక్టరుగా కన్పించి సూది తీసుకొని ఆ బిడ్డ యొక్క రెండు అరికాళ్ళులోను అనేక సార్లు పొడిచి మందులు పెట్టె తీసుకుని వెళ్ళిపోయినట్లు స్వప్న దర్శనమిచ్చారు. తెల్లవారి వారి బిడ్డ నిద్రమంచం నుండి లేచి నడిచాడు. *పోలియో వ్యక్తికి కాళ్ళు తిరిగిపని చేయడం ఎంత గొప్ప వింతో చూడండి.*

*ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

Address

Main Street, Kammavaripalem
Chilakaluripet
522616

Opening Hours

Monday 5am - 10pm
Tuesday 5am - 10pm
Wednesday 5am - 10pm
Thursday 5am - 10pm
Friday 5am - 10pm
Saturday 4:30am - 11pm
Sunday 5am - 10pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhagavan Sri Venkaiah Swamy - Kammavaripalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category