02/10/2025
శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఈ రోజు విజయదశమి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు మంగళమైన దర్శనమిచ్చారు. అమ్మవారి విశేష అలంకార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
విజయదశమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం విశేషం. classical సంగీతం, నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.