Mallavaram sri venkateswara swamy temple

Mallavaram sri venkateswara swamy temple WONDERFUL PLACE TO VISIT!!!:)

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కొండపై వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి.
ఈ ప్రాచీన ప్రసిద్దిగాంచిన పుణ్యకెత్రం విజయవాడ చెన్నై జాతీయ రహదారి కి నాలుగు కిలో మీటర్ ల దూరంలో ఉంది. 12 వ శతాబ్దం లో రెడ్డి రాజుల కాలంలో నిర్మితమైన ఆలయం చాల ప్రసిద్ది గాంచినది . స్వామి పాదాల ముందర నుండి గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంది . ఆలయం ఉత్తర ఈశాన్య దిక్కున పెద్ద జలాశయం చూపరులను వివెశముగా అక్కట్టు కొంటుంది. ఆలయ ప్రాంతం పర్యాటకులకు చూడడానికి చాల బాగుంటుంది

27/05/2026
27/05/2026

మల్లవర గిరి ప్రదక్షిణ మహోత్సవం

ఒక వైపు వెంకన్న సన్నిధి మరోవైపు పర్యాటక ప్రదేశం(గుండ్లకమ్మ జాలాశయం, వివిధ పార్కులు)మధ్యలో పచ్చని చెట్ల మధ్య భక్తులు గిరి ప్రదక్షిణ. 🙏 మల్లవరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం లో భక్తులు సంఖ్య పెరగడం శుభపరిణామం. గత అక్టోబర్ నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమం మల్లవరం లో కూడా ప్రారంభించడం అందరికి తెలిసిందే. ఆలయం శ్రీవారి వనం కమిటీ అధ్యక్షులు మరియు
దేవస్థాన పాలకవర్గ సభ్యులు శ్రీ మార్నెని కృష్ణారావు గారు
ఇతర సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం
జరిగింది

మల్లవర గిరి ప్రదక్షిణ మహోత్సవం ఒక వైపు వెంకన్న సన్నిధి మరోవైపు పర్యాటక ప్రదేశం(గుండ్లకమ్మ జాలాశయం, వివిధ పార్కులు)మధ్యలో...
26/05/2026

మల్లవర గిరి ప్రదక్షిణ మహోత్సవం

ఒక వైపు వెంకన్న సన్నిధి మరోవైపు పర్యాటక ప్రదేశం(గుండ్లకమ్మ జాలాశయం, వివిధ పార్కులు)మధ్యలో పచ్చని చెట్ల మధ్య భక్తులు గిరి ప్రదక్షిణ. 🙏 మల్లవరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం లో భక్తులు సంఖ్య పెరగడం శుభపరిణామం. గత అక్టోబర్ నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమం మల్లవరం లో కూడా ప్రారంభించడం అందరికి తెలిసిందే. ఆలయం దగ్గర శ్రీవారి వనం కమిటీ ద్వారా అద్భుతమైన పనులు భక్తులు కొరకు చేసాము. అందులో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ఘనంగా జరగడం కొరకు దాతలచే వాగుపూడ్చి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసాము. అదేవిదంగా ప్రతి నెల ఆటోలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం లో పాల్గొనమని ప్రచారం చేస్తున్నాము. మల్లవరం గోవింద నామ బృందం చొరవ తో చాలా బాగా జరుగుచున్న ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాలనుంది భక్తులు రాక రాను రాను పెరుగుతుంది. భవిష్యత్ లో వేలాదిమంది భక్తులు పాల్గొనాలానేది మా కమిటీ సంకల్పం. కాబట్టి దయచేసి అశేష భక్తులు ముందుకు రావాలని కమిటీ తరుపున కోరుకుంటున్నాను. 🙏

26/05/2026

_వజ్ర కవచం 1000 కోట్ల కథ_

_శ్రీవారి అత్యంత ఖరీదైన ఆభరణం_

_వజ్ర కవచం అంటే:_
స్వామివారి శరీరాన్ని పూర్తిగా కప్పే బంగారు కవచం. దీనిపై 28000 పైగా వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగి ఉంటాయి. మొత్తం బరువు సుమారు 30 కేజీల బంగారం. ఇప్పటి విలువ 1000 కోట్లకు పైనే.

_ఎవరు చేయించారు:_
1930లలో మైసూర్ మహారాజు నాలుగవ కృష్ణరాజ వడయార్ భక్తితో చేయించారు. ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు అయింది.

_ఎప్పుడు తొడుగుతారు:_
సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే శుక్రవారం నాడు. దీన్నే "వజ్ర కవచ అలంకారం" అంటారు. ఆ రోజు స్వామి దర్శనం మహా అద్భుతం.

_విశేషం:_
1. వజ్రం ఇంద్రుడి ఆయుధం. ఈ కవచం వల్ల స్వామి శక్తి వంద రెట్లు పెరుగుతుందని నమ్మకం.
2. ఈ కవచాన్ని ఎప్పుడూ తూకం వేయరు. లెక్క పెట్టరు.
3. మిగతా రోజుల్లో 6 లాకర్ల భద్రతలో TTD ఖజానాలో ఉంటుంది.

_ఉత్సవమూర్తికి:_
మలయప్ప స్వామికి కూడా చిన్న వజ్ర కవచం ఉంది. దాన్ని గరుడ సేవ రోజు తొడుగుతారు.

_గమనిక:_
వజ్ర కవచ అలంకారంలో ఉన్న స్వామి ఫోటోలు TTD వెబ్‌సైట్‌లో చూడవచ్చు. గర్భగుడి దీపాల కాంతి వజ్రాలపై పడి గుడి అంతా వెలిగిపోతుంది.

_ఓం నమో వెంకటేశాయ_ 🙏

🟡🟢🔴🔵🙏🔵🔴🟢🟡

మహానంది - నవనందీశ్వర క్షేత్రం.మహా నందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి.నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయకం.🙏🙏🙏శ్రీ శైలమ...
19/05/2026

మహానంది - నవనందీశ్వర క్షేత్రం.

మహా నందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి.

నందీశ్వర నమస్తుభ్యం
సాంబానందప్రదాయకం.

🙏🙏🙏

శ్రీ శైలము, మహానంది జంట దేవాలయాలు. జంటగా చెప్పుకుంటాము.

అంటే ప్రక్కప్రక్కనే వున్నాయనికాదు. రెండూ కర్నూలు జిల్లాలో ఒకదానికొకటి 175 కిలోమీటర్ల దూరంలో వుంటాయి.

నల్లమల అడవులలో శ్రీ శైలం కొండమీద వుంటే, మహానంది దిగువన నంద్యాల పట్టణ సమీపంలో వుంటుంది.

కానీ....

శ్రీ శైలం అనంగానే మహానంది, మహానంది అనంగానే శ్రీశైలం మన మనోఫలకం మీద తళుక్కుమంటాయి.

బహుశా శివయ్య, ఆయన వాహనం నంది కదూ అందుకనేమో.

ఒకసారి నందికి తన పేరుతో శివక్షేత్రం ఏర్పడాలని మనసులో కోరిక కలిగిందట.

తత్ఫలితమే....

మహానంది క్షేత్ర ఆవిర్భావం. పేరులోనే వున్నది మహా...నంది.

సుమారు1500 ల సంవత్సరాల నాటి ఆలయం.

నంద్యాలలో దిగి మహానంది వెలుతుంటే దారి పొడుగునా అరటితోటలు, చుట్టు అలముకున్న నల్లమల అడవులు, సెలయేరుల గలగల, ఆహ్లాదకర వాతావరణం... ఇప్పుడు అప్పుడు అనిలేదు అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది.

ఆలయం దరిదాపులకు రాంగానే రండి రండి ఇదే ఆలయం అని చెప్తూ పెద్ద నల్లరాతి నంది నేరుగా ఆలయాన్ని, ఆలయంలోని పరమశివుని చూస్తూ ఆలయం ముందే వుంటుంది.

కోనేరులు, రాజ గోపురం, ఆలయం, దాని వెనుక భాగాన కనిపించే ఎత్తైన కొండలు.

ప్రకృతి సౌందర్యమంతా ఇక్కడే వుంటుంది.

ఆలయ స్థలపురాణానికి వస్తే .......

నందన మహారాజు గోశాలలో "కపిల" అనే గోవు వుండేది.

మిగిలిన ఆవులతో కలసి అరణ్యంలోకి మేతకు వస్తున్న కపిల రోజూ ఆ దాపున వున్న పుట్టలోకి క్షీరాన్ని వదులుతూ వుండేది.

అది గమనించిన గోపాలకుడు ఒకరోజు చాటుగా వచ్చి అక్కడ ఏమున్నదో చూడాలని కుతూహలంతో ఇంకా ఇంకా దగ్గరకు వస్తాడు.

గోపాలకుని చూసిన గోవు తొట్రుపడి కదులుతుంది.

దాని కాళ్లు పుట్ట మీద పడి పుట్ట కొద్దిగా చీలుతుంది. గిట్టల ముద్ర పడుతుంది.

పుట్టలో కూచుని రోజూ కపిల గోవు ఇస్తున్న క్షీరాన్ని తాగుతున్న శివయ్య అదే పుట్టరూపంగా మారి పోతాడు.

ఇదీ టూకీగా ఈ ఆలయ చరిత్ర.

నేటికీ మనం చూసే శివలింగం మీద ఆవు గిట్టల ముద్రలు వుంటాయి.

చిన్న శివలింగం. స్వయంభువు.

ప్రతిరోజూ ఉదయము, సాయంకాలమూ 6:00 నుంచీ 6:30 వరకూ మహా మంగళ హారతి సమయంలో నిజరూప దర్శనం వుంటుంది.

అప్పుడు పుట్ట ఆకారంతో వెలసిన స్వామిని మనం కళ్లారా చూడవచ్చు.

అలంకారం అయిన తరువాత రజత నాగాభరణంతో పుష్పాలంకారాలతో పుట్ట కనిపించదు.

శివలింగం మీద ఆవు గిట్టల ముద్రలు వున్నట్లు కనబడతాడు.

గర్భాలయంలోని శివలింగం కిందనుంచీ ఐదు జలధారలు ఉద్భవించి నిరంతరం నీరు ఊరుతూ వుంటుంది.

స్పర్శ దర్శన సమయంలో శివలింగాన్ని స్పృశించినపుడు మన చేతులకు తడి తగులుతుంది.

ఇదీ గర్భాలయంలో వుండే స్వామి వారి దర్శనం.

ఇహ ఆలయం విషయానికి వస్తే.....

ఆలయం లోపలికి వస్తూనే రెండు పుష్కరిణిలు. బ్రహ్మ గుండం, విష్ణు గుండం.

అవి దాటి లోపలి ప్రాకారంలోకి వెలితే రుద్ర గుండమని మరో పుష్కరిణి.

ఇదే అసలయిన కోనేరు. ఈ ఆలయ ప్రత్యేకత కూడా ఇదే.

గర్భాలయంలో స్వామివారి పీఠభాగంలోనుంచీ వచ్చే ఐదు జలధారలూ అంతర్వాహినిగా వచ్చి నందిముఖంలోనుంచీ ఈ గుండంలోకి వస్తాయి.

ఇందులోని నీరు క్లిష్టర్ క్లియర్ గా వుంటాయి. చిన్న గుండుసూది పడినా కనిపించేటంత స్వచ్చంగా వుంటాయి.

ఈ కోనేరులో స్నానం చేయటం బాగుంటుంది.

కోనేరులోని నీటి ఉష్ణోగ్రత కాలానుగుణంగా మారుతూ వుంటుంది. ఎండాకాలం చల్లగానూ. చలికాలం గోరు వెచ్చగానూ వుంటాయి.

ఏటెల్లకాలమూ కోనేరులో నీరు సరిగ్గా ఐదు అడుగుల లోతు వుంటాయి.

ఏ కాలమూ ఏ మార్పు వుండదు.

పుష్కరిణి మధ్యలో వసంతమండపమని ఒక చిన్న మండపం అందులో ఐదు శివలింగాలు వుంటాయి.

నందిముఖంగా నీరు రుద్ర గుండంలోకి వస్తే, రుద్ర గుండంలోని నీరు రెండు వేపులా రెండు కాలువల ద్వారా రాజగోపురం బయట వున్న బ్రహ్మ గుండం, విష్ణు గుండాలలోకి వచ్చేలా ఏర్పాటు చేశారు. అక్కడ నుంచీ బయటకు వెళతాయి.

అలా వెళ్లిన నీరు నేటికీ 10,000 ఎకరాల ముక్కాల సాగుకు ఉపయోగపడుతుందట.

మహానందీశ్వరాలయానికి ఈ కోనేరులే ప్రత్యేక ఆకర్షణ.

ఉదయం 5:30 నుంచీ రాత్రి తొమ్మిది గంటల వరకూ నిర్విరామంగా మహానందీశ్వరుని దర్శనం వుంటుంది.

గర్భాలయంలో మహానందీశ్వరుని చూచి బయటికి వస్తే అమ్మవారి ఆలయం. కామేశ్వరీ సన్నిధి.

అమ్మ దర్శనం కూడా అయ్యాక క్షేత్రపాలకుడు కోదండరామస్వామి ఆలయం.

తెల్లని పాలరాతి సీతారామలక్ష్మణులు, ఆంజనేయస్వామివారల విగ్రహాలు వుంటాయి.

ఆ ప్రక్కనే పంచ పాండవులు ప్రతిష్టించిన ఐదు శివలింగాలు. వాటికి చిన్న చిన్న ఆలయాలు వుంటాయి. ఎక్కడ చూసినా శివమయం. దేని ప్రాముఖ్యత దానిదే.

నవగ్రహాలు.

రాహుకేతులకు ప్రత్యేక మండపం. ఇక్కడ రాహుకేతు గ్రహ శాంతి పూజలు జరుగుతాయట.

"వినాయక నందీశ్వరుడు" ఆలయం . నవ నందులలో ఒకటి.

మహానంది చుట్టూ సుమారు పదిహేను కిలోమీటర్ల పరిధిలో 'నవనందులు' అని తొమ్మిది ఈశ్వరాలయాలు వున్నాయి.

అందులో ప్రధానమైనది మహానంది.

రెండవది వినాయక నందీశ్వరుడు.

ఈయనే ఆలయ ప్రాకారంలో వున్న వినాయక నందీశ్వరుడు.

ఈ ఆలయంలో శివలింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించాడట.

గరుడ నంది.

మహానందీశ్వరాలయానికి సుమారు అర కిలోమీటరు దూరంలో వుంటుందీ గరుడ నందీశ్వరాలయం.

తల్లి వినతను దాస్యవిముక్తురాలిని చేయటం కోసం బయలుదేరిన గరుత్మంతుడు ఇక్కడ ఈశ్వరుని గురించి తపస్సు చేశాడట.

గరుత్మంతుడు ప్రతిష్టించటాన గరుడ నందీశ్వరునిగా పిలుస్తారు.

అతి పురాతనమైన ఆలయమట.

తరువాత సూర్యనంది.

గరుడనంది నుంచీ సుమారు 11 కిలోమీటర్ల దూరంలో నంద్యాల వెళ్లే మార్గంలో తమ్మడపల్లి గ్రామంలో సూర్యనందీశ్వరాలయం వస్తుంది.

సూర్యుడు శివుని గురించి తపస్సు చేసి ప్రతిష్టించిన లింగం.

అమ్మవారు శ్రీ గౌరీ పరమేశ్వరిదేవి.

ఈ ఆలయం చూసుకుని నంద్యాల చేరితే....

ప్రథమ నంది - నంద్యాల పట్టణంలో చామ కాలువ ఒడ్డున" ప్రథమ నంది" ఆలయం ఉన్నది.

బ్రహ్మదేవుని కోరిక మేరకు పరమేశ్వరుడు తనకు తానుగా వెలసిన చోటు ప్రథమ నంది.

గర్భాలయంలో 'కేదారేశ్వర లింగం' అమ్మ వారు 'కేదారేశ్వరి మాత'.

నాగనంది - నంద్యాల ఊరిలో ఆర్టీసీ బస్టాండుకు దగ్గరలో ఉన్న శ్రీ ఆంజనేయ కోదండ రామాలయం ముఖమండపంలో నాగ నందీశ్వరుడు ఉంటాడు.

సోమనంది - నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో శ్రీ సోమ నందీశ్వరాలయం వున్నది.

చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం. అమ్మవారు సోమేశ్వరి దేవి.

శివనంది - నంద్యాలకు సుమారు 14 కిలోమీటర్లు దూరంలో కడమ కాల్వ గ్రామంలో "శివ నందీశ్వరాలయం" ఉంది.

ఆలయంలో స్వామి రుద్ర నందీశ్వరుడు. అమ్మవారు పార్వతిదేవి.

చివరిగా విష్ణునంది. దీనినే కృష్ణనంది అనికూడా అంటారు.

శివనందీశ్వరస్వామి ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో ప్రకృతి అందాల మధ్య "విష్ణు నందీశ్వరాలయం" ఉంది.

విష్ణునందీశ్వరుడు, అమ్మవారు భవానీ మాత.

దేవాలయం చుట్టూ పురాతన కాలం నాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలు ఉన్నాయి.

ఆలయానికి సమీపంలో చక్కని సెలయేరు.

ఈ తొమ్మిది నందులను ఒకరోజు సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం లోపు చూడటం విశేషమట.

కార్తీక పౌర్ణమి నాడు స్ధానికులు, చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు పాద యాత్రగా నవనందులను దర్శిస్తూ 'నంది మండలం' ప్రదక్షిణ చేస్తారట.

ముందుగా నంద్యాల బస్టాండు సమీపంలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని ఆలయంలోని సాక్షి గణపతికి విన్నవించుకుని ప్రదక్షిణ మొదలు పెడతారట. నవనందీశ్వరాలయాలన్నీ చూసి తిరిగి మల్లిఖార్జున స్వామి ఆలయానికి చేరుతారట.

అంతటితో యాత్ర పూర్తి అవుతుంది.

ఎలాగబ్బా ఇన్ని ఆలయాలు వెతుక్కుంటూ వెళ్లాలా అనుకోనవసరం లేదు. ఇక్కడే ఆటోలు, టాక్సీల వాళ్లు వుంటారు. నవనందులను చూపించాలని మాట్లాడుకుంటే వాళ్లే తీసుకు వెళతారు. సుమారు 1000 నుంచీ 1500 ల రూపాయల వరకూ తీసుకుంటారు.

స్పర్శ దర్శనానికి, నిజరూప దర్శనానికి టికెట్టు వుంటుంది. 100, 50 అనుకుంటా. అభిషేకానికి 500.

ఈ నవనందీశ్వరులలో మహానంది, సూర్యనంది, సోమనంది, శివనంది, విష్ణునంది ఆలయాలు ఉదయం 6 గంట నుంచీ రాత్రి 8 గంటల వరకూ ఎపుడయినా దర్శనం చేసుకోవచ్చు.

రోజు మొత్తం దర్శనం వుంటుంది.

మిగిలిన వాటికి మధ్యాహ్నం విరామం వుంటుంది.

టైములు చూసుకుని ఆ ప్రకారం ప్లాన్ చేసుకుంటే సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం లోపు తేలికగా నవనందులనూ దర్శించుకోవచ్చు.

మన రాష్ట్రంలోనే మనకు కూతవేటు దూరంలో వున్న సుప్రసిద్ధ శివాలయం మరి...

ఏదీ మిస్సవకుండా అన్నీచూడండేఁ....

కర్నూలు జిల్లా నంద్యాల నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో వున్నదీ మహానంది.

నమః శివాభ్యాం
వృష వాహనాభ్యాం
విరించి విష్ణ్వింద్ర సుపూజితాభ్యాం
విభూతి పాటీర విలేపనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యాం !!

🙏🙏🙏🙏🙏@

13/05/2026

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం తదితర సదుపాయాలను కల్పిస్తోంది.

భక్తులు దర్శనానికి ముందు స్నానమాచరించి పవిత్రంగా స్వామివారి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ కావడంతో, భక్తుల ఆచారాలు మరియు మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల, తిరుపతిలో అనేక వసతి గదులు మరియు యాత్రికుల వసతి సముదాయాలను టీటీడీ నిర్మించింది.

గదుల కేటాయింపు విధానం

తిరుమలలో వసతి గదులు పొందదలచిన భక్తులు సీఆర్వో జనరల్ కౌంటరులో ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం కేటాయించబడిన గది నంబరు, ఆ ప్రాంత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా భక్తులకు పంపబడతాయి.

భక్తులు సంబంధిత ఉప విచారణ కార్యాలయంలో యూపీఐ/కార్డు ద్వారా చెల్లింపు చేసి గదిని పొందవచ్చు.

తిరుమలలో స్థలాభావం కారణంగా 7800 వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నందున, కుటుంబాలతో వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదుల కేటాయించబడవు.

వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు నమోదు చేసి ఉచిత లాకర్లు మరియు ఇతర సౌకర్యాలను పొందవచ్చు.

పీఏసీ-1

సీఆర్వో సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 4 హాళ్లు, 1256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నప్రసాదం సౌకర్యం కలదు.

పీఏసీ-2 (మాధవ నిలయం)

బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 12 హాళ్లు, 3300 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రం, విశ్రాంతి సదుపాయాలు కల్పించబడ్డాయి.

పీఏసీ-3

జీఎన్సీ టోల్ గేట్ నుండి రాంభగీచా బస్ స్టాండ్కు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న ఈ భవనంలో 9 హాళ్లు, 1420 లాకర్లు ఉన్నాయి. తలనీలాలు సమర్పించే సదుపాయం మరియు విశ్రాంతి సౌకర్యం కలదు.

(పద్మనాభ నిలయం)

బాలాజీ బస్ స్టాండ్ లోపల ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 3 హాళ్లు, 960 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి, లాకర్, స్నాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

పీఏసీ-5 (వేంకటాద్రి నిలయం)

భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ ఆధునిక సముదాయాన్ని 2025 సెప్టెంబర్ 25న భారత గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. CRO వెనుక భాగంలో ఉన్న ఈ భవనంలో 16 హాళ్లు, 2400 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పణ, ప్రథమ చికిత్స, విశ్రాంతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

భక్తులకు అందుబాటులో 9336 ఉచిత లాకర్లు

తిరుమలలోని ఈ ఐదు యాత్రికుల వసతి సముదాయాలన్నింటిలో కలిపి మొత్తం 9336 లాకర్లు భక్తులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమ విలువైన వస్తువులను భద్రపరచుకోవడానికి వీటిని వినియోగించుకోవచ్చు.

ఈ కేంద్రాలలో ఉచిత వేడి నీటి స్నాన గదులు, మరుగుదొడ్లు, చాపలు, రగ్గులు, అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం భక్తులు లాకర్లు ఖాళీ చేసి, తీసుకున్న చాపలు, రగ్గులు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.

భక్తులు ఈ యాత్రికుల వసతి సముదాయాలను వినియోగించుకుని స్వామివారి దర్శనాన్ని సుఖసంతోషాలతో పూర్తి చేసుకోవాలని, దర్శనం అనంతరం గదులు మరియు లాకర్లు వెంటనే ఖాళీ చేసి ఇతర భక్తులకు కూడా అవకాశం కల్పించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

11/05/2026
హనుమాన్ జయంతిమే 12 మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా...డైలీ విష్ వీక్షకులకు ఈ ప్రత్యేక శీర్షిక...శ్రీ హనుమాన్ జయంతిహనుమంతున...
11/05/2026

హనుమాన్ జయంతి

మే 12 మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా...

డైలీ విష్ వీక్షకులకు ఈ ప్రత్యేక శీర్షిక...

శ్రీ హనుమాన్ జయంతి

హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.

*🌺🌸🌺 జననం 🌺🌸🌺*

పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది.

హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.

అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది.

అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.

ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది.

ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.

ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.

భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది.

హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.

*♦🔔♦ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది: ♦🔔♦*

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.

1. ప్రసన్నాంజనేయస్వామి.
2. వీరాంజనేయస్వామి.
3. వింశతిభుజాంజనేయ స్వామి.
4. పంచముఖాంజనేయ స్వామి.
5. అష్టాదశ భుజాంజనేయస్వామి.
6. సువర్చలాంజనేయ స్వామి.
7. చతుర్భుజాంజనేయ స్వామి.
8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
9. వానరాకార ఆంజనేయస్వామి

తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!

దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.

*💠💠💠 ఆయన అష్టసిద్ధులు 💠💠💠*

1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.

2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.

3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.

4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.

5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.

6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.

7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.

8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.

*🌀🌀🌀 హనుమంతుని ప్రదక్షిణాలు 🌀🌀🌀*

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.

'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'

శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం

శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి

''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''

అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

05/05/2026

రమణీయం... కళ్యాణ # # మహోత్సవం

05/05/2026

అశ్వావాహనం పై కళ్యాణ వెంకటేశ్వరుడు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు
మొక్కిన వారికి దిక్కు నీవు
అడిగినవారికి ఆపద్బాంధవు నీవు
పిలిచిన వారికి పరమాత్మవూ నీవు
ఆర్తి కలిగిన వారికి అంతరాత్మ నీవు
ముక్తి కోరేవారికి గమ్యం నీవు
అన్నిటికి నీవే కదా దిక్కు గోవిందా
ఒకనాడు నిన్ను దైవంగా కొల్చాను
మర్నాడు నిన్ను సర్వంగాభావించాను
నేడు నా తండ్రిగా నిలుపుకున్నాను
ఆ బంధం కన్నా గొప్ప బంధం ఏముంది #స్వామి #గోవింద
ఆపదమొక్కులవాడు
అడుగడుగున దండాల వాడు
ఏడుకొండలస్వామి నమో నమః గోవింద హరి గోవిందా

Address

Mallavaram, Maddipadu
Addanki
523263

Alerts

Be the first to know and let us send you an email when Mallavaram sri venkateswara swamy temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category