10/11/2025
*ఓం శరవణ భవః*
*శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అద్దంకి వారి 11వ కళ్యాణ మహోత్సవం.*
26.11.2025 బుధవారం శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భముగా ప్రతి సంవత్సరం జరుపుకొను విధముగా స్వామి వారికి “పంచామృతములతో” విశిష్ట రుద్రాభిషేకము, తదుపరి స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు. కావున అందరూ పాల్గొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావలసినది గా కోరడమైనది.
*మనవి*:
1. కళ్యాణం లో పాల్గొన దలచిన కుటుంబ సభ్యులు/ ఇతర భక్తులు 24.11.2025 సాయంత్రం లోపు Rs.1116/- చెల్లించి రశీదు పొందవలసినది గా మనవి.
2. కళ్యాణమునకు రాదలచిన వారు ముందుగా తెలిపిన యెడల తగిన ఏర్పాట్లు చేయుటకు వీలుగా ఉంటుంది.
3. అభిషేకం కచ్చితంగా ఉదయం 7 గంటలకు, తదుపరి కళ్యాణ కార్యక్రమం 10 గంటలకు మొదలవుతుంది. గమనించగలరు.
4. ఈ సారి కళ్యాణం ప్రతిసారి కంటే ఘనంగా చేయదలచాము కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు తప్పని సరిగా హాజరు కావలసినది గా కోరటం అయినది.
ఇట్లు
*శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం,అద్దంకి.*
Devasthanam, *Whatsapp / Phonepay / Contact - 9492201047*