02/25/2021
విష్ణు సహస్ర నామావళి లో వున్న వెయ్యి నామాలలో ఒక నామము “ఓం న్యగ్రోధాయ నమః “
అనగా .. మఱ్ఱిచెట్టు (వటవృక్షం) రూపంగా, మనకు రక్షణ ఇచ్చే వాడు దేవాది దేముడు ఆ విష్ణుమూర్తి అని అర్ధం.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయిక కలిగిన వృక్షం " వట వృక్షం " మాత్రమే.
స్వయానా శ్రీ మన్నారాయణుడు సృష్టి ప్రళయ కాలం లో వటపత్ర సాయి గా అవతరిస్తూవుంటాడు. ఆ స్వామి ఆధారం గా చేసుకున్న దేవతా వృక్షం వటవృక్షం.
సతీ సావిత్రి తన ఐదోతనాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ల రూపమైన ఈ వటవృక్షం ను ప్రార్థించి తన మాంగల్యాన్ని తిరిగి పొందింది. అని పురాణం గాథ.
ఈ కలియుగం లో శ్రీ లక్ష్మీ నారాయణుడే స్వయంభు గా వెలసిన అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.
ఆపత్బాంధవుడిగా భక్తుల కు కొంగు బంగారమయ్యే ఆ శ్రీనివాసుడే తన మహిమతో భక్తుల సంరక్షణకై స్వయంగా వట వృక్షం రూపం లో వెలసిన దివ్య స్థలం మల్లాది.
గుంటూరు జిల్లా అమరావతి కి 7 కి మీ దూరంలో వున్న మల్లాది గ్రామంలో పరమ రామ భక్తుడు శ్రీ బొత్తినేని బోల్లయ్య గారు పెంచిన వటవృక్షము, 1977 వ సంవత్సరం లో దివి సీమ తుఫానుకి నెలకొరిగినది. ప్రభుత్వం వారు పాటకి పెట్టి రోడ్కి అడ్డం గా వున్న చెట్లను నరికించారు. అందులో భాగంగా ఈ వట వృక్షాన్ని సగానికి పైగా నరికిన తరువాత ఎటువంటి ప్రయత్నం చేసినా నరుకుటకు చేతకాక నేలకొరిగిన మిగిలి చెట్టుని ఆలా వదిలివేసి వెళ్లారు.
ఒక పవిత్ర శుభదినాన ఆ శ్రీనివాసుడి దివ్య మహిమతో ఆ వటవృక్షం ఫెళ ఫెళ ధ్వనులతో, పెద్ద గాలులతో తన అంతటా తానుగా లేసి యధా స్థానం లో ప్రతిష్ఠాపన చేసుకుని నిలబడినది.
ఆ సమయంలో తూమాటి నరసింహయ్య అనే వ్యక్తి ఒక్కడే అక్కడ వుంది స్వయంగా చూసిన వ్యక్తి.. అదే సమయంలో మల్లాది గ్రామంలో భక్తులకు స్వామి వారి వంటిమీదకి వచ్చి ఆ సంఘటన తన మహిమతోనే జరిగినది అని వాక్ ఇచ్చినారు
అలనాటి నుంచి ఆ దేవాలయం దినదినాభివృద్ధి కాంచుతూ, ఆ స్వామి వారు భక్తులని కాపాడుతూ వున్నారు .
కీ శే బుల్లి కోటయ్య గారు, ఏలూరి పార్ధసారధి గార్లు ఆ దేవాలయమునకు ఎనలేని కృసుషీ చేసి వున్నారు. వీరి ఆలోచన మేరకు.. స్వామి వారి ఆశీస్సులతో, నిత్యం ఆ తిరుమలలో స్వామి వారి కైంకర్యాలు చేసే తిరుమల తిరుపతి దేవస్థాన పండితుల స్వహస్తాలతో 2004 ఫిబ్రవరి 29 న విగ్రహ రూపం గా స్వామి వారిని ప్రతిష్టించారు.
ఇప్పుడు ఏలూరి మంగాయమ్మ గారు మరియు వారి కుమారుల ఆద్వర్యం లో దేవాలయం మానెజ్మెంట్ జరుగుచున్నది.
స్వామి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అందులో మచ్చుకు కొన్ని::
* ప్రతి శనివారం కల్యాణం
* అన్నదానం
* గోశాల
* తులసి వనం
* సుదర్శన హోమం
* ఉచిత విద్య
గోశాల:: గత 15 సంవత్సరాల క్రితం నుండి దేవస్థానం లో గోసేవ ప్రారంభం అయినది, అప్పటినుండి గోశాల నిర్మాణం చేసుకుని , గో పోషణ చేయుచున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మా పాదాభి వందనాలు.
దేవస్థానం ఎదురుగా ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని, దానికి ఫెన్స్ వేసి, ఆవులను ఉదయం పూట మేత కి స్వేచ్ఛగా వదలటం జరుగుతుంది. సాయంత్రం వేళకి అవి పక్కనే దేవాలయం లో వున్న గోశాల లోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి. పచ్చ గడ్డితో పాటు, ఎండు గండి కూడా ఖరీదు చేసి కొనటం జరిగింది. అలానే పోషక విలువలు కలిగిన ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నాము.
వీటి సంరక్షణకు రక్షకుడుని ఏర్పాటు చేసాము. ఇతను 24 గంటలు దేవస్థానం లో ఉంటూ పూర్తి స్థాయిలో గో సంరక్షుడుగా ఉంటున్నాడు.
ప్రతి శనివారం జరిగే ఈ కళ్యాణం లో, స్వామి వారి నక్షత్ర హారతి లో అవకాశం ఉన్నవారు తప్పకుండా పాల్గొనండి.
వారంలో ఒక సారి అయినా దేవాలయ దర్శనం చేయండి. హిందూ ధర్మాన్ని పాటించండి.
మరింత సమాచారం కోసం :
---------------------------------
ఏలూరి నారాయణ మూర్తి : 91770 50094 ( India )
ఏలూరి సీతారామయ్య : 92478 00053 ( India )
శ్రీనివాస ఏలూరి : +1 469 463 7791 ( USA )
[email protected]