Srisailam Updates

Srisailam Updates Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srisailam Updates, Hindu temple, Srisailam.
(1)

*సెల్ఫ్ సర్వీస్ కియోస్క్  మిషన్ల ఏర్పాటు* భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ కియోస్క్  మిషన్ల ఏర్పాటు...
28/04/2026

*సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్ల ఏర్పాటు*

భక్తుల సౌకర్యార్థమై దేవస్థానం పలుచోట్ల సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్ల ఏర్పాటు చేసింది. లడ్డూ ప్రసాదాల విక్రయకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్లు ఈ రోజు ( 28.04.2026) సాయంత్రం దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రారంభించారు.
ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా పూజాదికాలను జరిపి ఈ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లను ప్రారంభించడం జరిగింది.
ఈ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ ద్వారా భక్తులు దర్శనాలు, ప్రసాదాలు మరియు కేశఖండన టికెట్లను పొందవచ్చు. అదేవిధంగా దేవస్థాన వివిధ పథకాలకు వీటి ద్వారా విరాళాలను కూడా చెల్లించవచ్చు.
కాగా కేంద్ర విచారణ కార్యాలయం ( సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్), మల్లికార్జునసదన్, గంగాసదన్, కల్యాణకట్ట, పాత విరాళాల కేంద్రం మరియు గంగాధర మండపం వద్దగల కొత్త విరాళాల కేంద్రం వద్ద కూడా సెల్ప్ సర్వీస్ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తులకు సాంకేతికతో కూడిన మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగా ఈ కియోస్క్ మిషన్లను పలుచోట్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా భక్తులు ఆయా టికెట్లను ఎవరికివారు నేరుగా పొందవచ్చునన్నారు. ఈ ఏర్పాట్ల వలను భక్తులు ఆయా టికెట్లను సులభతరంగా పొందే అవకాశం కలుగుతుందన్నారు.
కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మనమిత్ర వాట్సప్ ద్వారా దేవస్థానమునకు సంబంధించిన 17 రకాల టికెట్లను ముందస్తుగా పొందే అవకాశం కల్పించబడింది.
అదేవిధంగా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www.srisailadevasthanam.org మరియు దేవదాయశాఖ వెబ్‌సైట్ www.aptemples.ap.gov.in ద్వారా కూడా దర్శనం, ఆర్జితసేవాటికెట్లను ముందస్తుగా పొందవచ్చును.
కాగా ఈ కియోస్క్ మిషన్లను కరూర్ వైశ్యబ్యాంకు వారు కార్పోరేట్ సామాజిక బాధ్యత క్రింద దేవస్థానానికి అందజేయడం జరిగింది.

*వైభవంగా స్వర్ణరథోత్సవం*         ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ రోజు (22.04.2026) శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథ...
22/04/2026

*వైభవంగా స్వర్ణరథోత్సవం*

ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ రోజు (22.04.2026) శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించబడింది.
కాగా ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి.
అనంతరం స్వర్ణరథోత్సవం జరిపించబడింది.
ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణానికాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయి.
అనంతరం భక్తుల శివనామస్మరణతో వేదమంత్రాల నడుమ ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా రథోత్సవంలో సంప్రదాయ నృత్యం, ఏర్పాటు చేయబడింది.
ఈ కార్యక్రమములో సహాయ కార్యనిర్వహణాధికారి కె. వెంకటేశ్వరరావు, అర్చకస్వాములు, పలువిభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీశైలం సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర -2026 🌿 తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన సలేశ్వరం లింగమయ్య స్వామి...
31/03/2026

శ్రీశైలం సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర -2026

🌿 తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన సలేశ్వరం లింగమయ్య స్వామి గుహాలయం ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం సంవత్సరం పొడవునా మూసి ఉండి, 3 రోజులపాటు మాత్రమే తెరవబడటం ప్రత్యేకత.

📅 జాతర తేదీలు (2026):
👉 ఏప్రిల్ 1,2,3

⏰ దర్శన సమయం:
👉 ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు
👉 సంవత్సరంలో కేవలం 3 రోజులే దర్శనం అవకాశం

🚶 ప్రయాణ విధానం:
🌿 సుమారు 5 కి.మీ. అటవీ మార్గంలో ట్రెక్కింగ్ (నడక) చేయాలి
🌳 ప్రకృతి సోయగాలతో కూడిన ఈ ప్రయాణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది

📍 స్థలం:
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ

⚠️ ముఖ్య సూచనలు:
♻️ ప్లాస్టిక్ రహిత యాత్ర చేయాలి
🙏 అటవీ శాఖ మరియు ఆలయ కమిటీ నిబంధనలు తప్పక పాటించాలి
🌿 ప్రకృతిని కాపాడుతూ భక్తి భావంతో యాత్ర పూర్తి చేయండి.

*ముగియనున్న ఉగాది ఉత్సవాలు*   ఉగాది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు (20.03.2026) సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ, అమ్...
20/03/2026

*ముగియనున్న ఉగాది ఉత్సవాలు*

ఉగాది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు (20.03.2026) సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ, అమ్మవారికి భ్రమరాంబాదేవి నిజాలంకరణ కార్యక్రమాలు జరిపించబడుతాయి.

*అశ్వవాహనసేవ*
వాహనసేవలో భాగంగా శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడుతాయి.
అశ్వవాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన సమస్యలు తీరిపోతాయని, సంతానార్థులకు సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.

*నిజాలంకరణ*

ఉగాది మహోత్సవాలలో చేయబడుతున్న అలంకారాలలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని భ్రమరాంబాదేవి నిజాలంకరణ స్వరూపంలో అలంకరింపజేయడం జరుగుతుంది.
అష్టభుజాలను కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘ మొదలైన ఆయుధాలను ధరించి జగన్మాతగా దర్శనమిస్తుంది.
అమ్మవారి నిజాలంకరణ దర్శనం వలన సమస్యలన్నీ తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
కాగా పూజాదికాల తరువాతా ఆలయప్రాంగణములో ప్రదక్షణగా ఉత్సవమూర్తులకు ఆలయ ఉత్సవం నిర్వహించబడుతుంది.
ఈ సాయంకాలం జరుగనున్న ఆలయ ఉత్సవంతో ఉగాది ఉత్సవాలు పూర్తవుతాయి.

*పంచాంగ శ్రవణం*  ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు (19.03.2026) ఉదయం 10.00గంటలకు ఆలయ ప్రాంగణములోని  అక్కమహాదేవి ...
19/03/2026

*పంచాంగ శ్రవణం*

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు (19.03.2026) ఉదయం 10.00గంటలకు ఆలయ ప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో పంచాంగశ్రవణ కార్యక్రమము జరిపించబడింది.
జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ యం.శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పలువురు సిబ్బంది తదితరులు కార్యక్రమములో పాల్గొన్నారు.
దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ , రాజమండ్రి వారు పంచాంగ పఠనం చేసి పంచాంగ శ్రవణం చేయించారు.
పంచాంగ శ్రవణం కంటే ముందు లోక కల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.
ఈ సంకల్పంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
అనంతరం మహాగణపతిపూజ జరిపించబడింది. తరువాత లోకక్షేమం కోసం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలను నిర్వహించబడ్డాయి.
శ్రీస్వామిఅమ్మవార్ల పూజాదికాల తరువాత నూతన పంచాంగానికి కూడా పూజాదికాలు జరిపించబడ్డాయి.
అనంతరం జిల్లా కలెక్టర్, కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు ఆస్థాన సిద్దాంతి శ్రీ పండిత బుట్టేవీరభద్ర దైవజ్ఞ వారిని నూతన వస్త్రాలతో సత్కరించి, పంచాంగ పఠణానికై ఆహ్వానించారు.
తరువాత ఆస్థాన సిద్ధాంతి వారు శ్రీ పరాభవనామ సంవత్సర విశేషాలను వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం మంచివర్షాలు కురుస్తాయన్నారు. దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రజలు సుఖంగా ఉంటారన్నారు.
అదేవిధంగా గోవులు అధిక క్షీరాన్ని ఇస్తాయన్నారు. వరి,గోధుమ, చెరుకు పంటలు బాగా పండి అధిక దిగుబడిని ఇస్తాయన్నారు. ఆహారధాన్యములు దేశంలో సమృద్ధిగా ఉంటాయన్నారు. మన సైన్యం యొక్క పాటవము వృద్ధిపొందుతుందన్నారు. తెలుపుధాన్యాలు బాగా పండుతాయన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు. మంచి ధరలు ఉండడం చేత రైతులకు మంచి లాభాలు కలుగుతాయన్నారు. పెసరపంట దిగుబడి బాగా ఉంటుందన్నారు. అన్ని పంటలకు మంచి ధరలు ఉంటాయన్నారు. అన్ని రకాల ధాన్యాలు విరివిగా పండుతాయన్నారు. కొన్నిచోట్ల ఉరుములు, వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన ప్రజారంజకంగా ఉంటుందన్నారు.
ఈ సంవత్సరం భారతదేశంలో ఎటువంటి గ్రహణములు కనపడవన్నారు.
ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తాయన్నారు.

*రథోత్సవం* ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్ల రథోత్సవం జరిపించబడుతుంది.  రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథ...
19/03/2026

*రథోత్సవం*

ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్ల రథోత్సవం జరిపించబడుతుంది.
రథోత్సవంలో సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి, కార్యక్రమాలు జరిపించబడుతాయి.
రథాంగబలిలో వసంతంతో నింపిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నరాశి) సాత్వికబలిగా సమర్పించబడుతాయి.
తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపించబడుతుంది.
ఈ రథోత్సవ దర్శనం వలన సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది.
కాగా రథోత్సవం సందర్భంగా రథానికి విశేషంగా పుష్పాలంకరణ చేయబడుతోంది.
రథోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గొరవనృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయి

*ఉగాది మహోత్సవాలు*  ఉగాది మహోత్సవాల సందర్భముగా మూడవ రోజైన నేడు (18.03.2026)  *అగ్నిగుండ ప్రవేశం*  ఈ రోజు రాత్రి గం.10.00...
18/03/2026

*ఉగాది మహోత్సవాలు*

ఉగాది మహోత్సవాల సందర్భముగా మూడవ రోజైన నేడు (18.03.2026)

*అగ్నిగుండ ప్రవేశం*

ఈ రోజు రాత్రి గం.10.00లకు శివదీక్షా శిబిరాల వద్ద కన్నడ భక్తులచే అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. వీరాచార సంప్రదాయాన్ని అనుసరించి జరిపే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అగ్నిగుండ ప్రవేశానికి ముందు వీరాచార విన్యాసాలు జరుగనున్నాయి.
కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్రవచనాలను పఠిస్తూ, ప్రత్యేక వేషధారణలతో, వివిధ వాయిద్యాల నడుమ విన్యాసాలు చేయనున్నారు. వీరిని పురవంతులు అని పిలుస్తారు

*ఉగాది మహోత్సవాలు**నందివాహన సేవ* ఈ మహోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు నంది...
18/03/2026

*ఉగాది మహోత్సవాలు*

*నందివాహన సేవ*
ఈ మహోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ జరిపించబడుతుంది.
ఈ సేవలో శ్రీస్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను నందివాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి, తరువాత గ్రామోత్సవం జరిపించబడుతుంది.
నందివాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన చేపట్టిన పనులలో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పబడుతోంది.

*మహాసరస్వతి అలంకారం*

ఉగాదిమహోత్సవాలలో చేయబడుతున్న అలంకారాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం అమ్మవారి ఉత్సవమూర్తిని మహాసరస్వతి స్వరూపంలో అలంకరింపజేయడం జరుగుతుంది.
చతుర్భుజాలు కలిగి ఉండి, వీణ, అక్షమాల పుస్తకాన్ని ధరించిన ఈ దేవిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది.

*ఉగాది మహోత్సవాలు*  ఉగాది మహోత్సవాల సందర్భముగా మూడవ రోజైన నేడు (18.03.2026)  శ్రీస్వామిఅమ్మవార్లకు  సాయంత్రం 5.30గంటలకు ...
18/03/2026

*ఉగాది మహోత్సవాలు*

ఉగాది మహోత్సవాల సందర్భముగా మూడవ రోజైన నేడు (18.03.2026) శ్రీస్వామిఅమ్మవార్లకు సాయంత్రం 5.30గంటలకు సాయంకాల పూజలు,జపానుష్ఠానములు జరిపించబడుతాయి.

*ప్రభోత్సవం*
ఉగాదిమహోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం గం.5.30లకు శ్రీస్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం నిర్వహించబడుతుంది.
రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు బంతి, చేమంతి, గులాబీ, సుగంధాలు, కనకాంబరాలు మొదలైన 11 రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేయడం జరుగుతుంది.

*శ్రీశైలంలో ఉగాది మహోత్సవములు ప్రారంభం* *భృంగివాహనసేవ*  ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ జ...
16/03/2026

*శ్రీశైలంలో ఉగాది మహోత్సవములు ప్రారంభం*

*భృంగివాహనసేవ*

ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ సాయంకాలం స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ జరిపించబడుతుంది. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనసేవపై వేంచేబు చేయించి విశేషంగా అలంకార మండపములో పూజాదికాలు జరిపించబడుతాయి. తరువాత గ్రామోత్సవం నిర్వహించబడుతుంది.
భృంగివాహనాధీశులైన శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించడం వలన పనులలో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలు హరించబడుతాయని చెప్పబడుతోంది.

*మహాలక్ష్మీ అలంకారం*

ఉత్సవాలలో భాగంగా ఈ రోజు (16.03.2026) శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి మహాలక్ష్మీ అలంకారం గ్రామోత్సవం జరుగనున్నాయి.

*చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయద్వారాలు మూసివేత*•  *చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయద్వారాలు మూసివేత.*•  *...
03/03/2026

*చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయద్వారాలు మూసివేత*
• *చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయద్వారాలు మూసివేత.*
• *రాత్రి గం. 7.30లకు ఆలయద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ, పూజాదికాలు*
• *రాత్రి గం. 9.00లకు శ్రీస్వామిఅమ్మవార్లకు మహామంగళహారతులు*

ఈ రోజు (03.03.2026) చంద్రగ్రహణం కారణంగా ఉదయం గం. 6.00ల నుండి ఆలయద్వారాలు మూసివేయబడ్డాయి.
తిరిగి రాత్రి గం. 7.30లకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాదికార్యక్రమాలు నిర్వహించి రాత్రి గం.9.00లకు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు జరిపించబడుతాయి. అవకాశం మేరకు మహామంగళహారతుల సమయం నుంచే అనగా రాత్రి గం.9.00ల నుండి రాత్రి గం. 10.00ల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించబడుతాయి.
కాగా ఈ రోజు ఉదయం గం. 3.00లకు ఆలయద్వారాలు తెరచి మంగవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత: కాలపూజలు, మహామంగళహారతులు జరిపించబడ్డాయి. మహామంగళ హారతులు సమయం నుంచే అనగా గం. 4. 30ల నుంచి గం. 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించబడింది.
గ్రహణం కారణంగా ఆలయప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు మరియు సాక్షిగణపతి, హాఠకేశ్వరం – ఫాలధార పంచధార మరియు శిఖరేశ్వరం మొదలైన ఉపాలయాల ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి.
గ్రహణం కారణంగా ఈ రోజు అన్నప్రసాదవితరణ కూడా నిలుపుదల చేయబడింది.

Address

Srisailam

Website

Alerts

Be the first to know and let us send you an email when Srisailam Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category