09/06/2026
వి.కోట మండలంలోని తొటికనుమ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస దేవరికి మండలాభిషేకం సందర్భంగా 45వ రోజు పవమాన హోమం నిర్వహించి, 108 కలశాలతో అభిషేకం చేయబడింది.ఆదివారం 07/06/2026 ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన గోపాలరావు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేసి 48 రోజుల పాటు ఘనంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ గ్రామస్తులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 1000 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో గోపాల్రావు కుటుంబ సభ్యులు, ఎంపీటీసీ హరి, రోకనాథం, విశ్వనాథ్, మంజునాథ్, చిట్టి, రమ్య, ఇతర భక్తులు పాల్గొన్నారు.