Pagudakula Balaswamy VHP

Pagudakula Balaswamy VHP politician

10/02/2025
22/09/2024

పరమ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రతపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. లడ్డు ప్రసాదంలో నెయ్యి కి బదులు జంతువుల కొవ్వులను కలిపి తయారుచేయడాన్ని VHP తీవ్రంగా ఖండిస్తోంది. అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. హిందువుల మనోభావాలను.. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలను గాయపరిచిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

19/09/2024
05/07/2023

RSS ప్రచారక్ కేశవ్ హెగ్డే మరణం
హిందూ సమాజానికి తీరని లోటు..

@ గుండెపోటుతో VHP బెంగళూరు క్షేత్ర సంఘటన మంత్రి కేశవ్ హెగ్డే మృతి

@ తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుబంధం

@ ఆకారపు కేశవ రాజు గారు వెళ్లిన తరువాత.. ముడుపు యాదిరెడ్డి గారు వచ్చేదాక తెలంగాణకు హెగ్డే సేవలు

@ దాదాపు నాలుగేళ్ళు తెలంగాణ వ్యవహారాల పర్యవేక్షణ

@ అత్యంత సాదాసీదా వ్యవహారం

@ పనిచేసే కార్యకర్తలకు వెన్ను తట్టే ప్రోత్సాహం

@ వారి స్వగ్రామం కర్ణాటక రాష్ట్రం హుబ్లీ సమీపంలోని సిరిసి లో రేపు అంత్యక్రియలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ శ్రీ కేశవ్ హెగ్డే మరణం బాధాకరం. గుండెపోటుతో బుధవారం (5-7-2023) మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బెంగళూరులోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వారు కన్నుమూయడం అత్యంత బాధాకరం. ఆయన మరణ వార్త వినగానే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కర్ణాటక రాష్ట్రాల్లోని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిచయం ఉన్న సంఘపరివార్ కార్యకర్తల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ సమీపంలో గల శిరసి అనే గ్రామానికి చెందినవారు కేశవ్ హెగ్డే. రేపు ( 6-7-2023) వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ప్రస్తుత భాగ్యనగర్ క్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం తో పాటు కర్ణాటకలోని రెండు ప్రాంతాలు కలిపి మొత్తం నాలుగు రాష్ట్రాలకు సంఘటన మంత్రిగా శ్రీ కేశవ్ హెగ్డే గారు విశ్వహిందూ పరిషత్ కు సేవలందించారు. నిరంతరం చిద్విలాసంగా నవ్వుతూ కలకలలాడే కేశవ్ గారు కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. పనిచేసే కార్యకర్తలను అమితంగా ఇష్టపడేవారు. కార్యకర్త మనసును తెలుసుకొని మసులుకునేవారు. చిరు నవ్వు తప్ప.. ఏనాడూ ఆగ్రహం ఎరుగని వ్యక్తిత్వం వారిది. 2015 లో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం కోటిలో వారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటికి వారు కర్ణాటక రాష్ట్ర సంఘటన మంత్రి. ఆ తర్వాత 2017 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు బెంగళూరు క్షేత్ర సంఘటన మంత్రిగా వ్యవహరించేవారు. ఆ సమయంలో ప్రాంత సహ ప్రచార ప్రముఖ్ గా ఉన్న నాకు అన్ని విధాలా సహకరించేవారు. అత్యంత ఆత్మీయంగా చూసుకునేవారు. కర్ణాటకలో ఉన్నప్పటికీ భాగ్యనగర్ లో ఏదైనా పని ఉందంటే బాలస్వామిని కలవండి అని చెప్పేవారు. ప్రత్యేకంగా కన్నడ లో నడుపుతున్న విశ్వహిందూ పరిషత్ మాసపత్రికకు నన్ను అడ్వర్టైజ్మెంట్ వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా చాలాసార్లు సూచించారు. ప్రత్యేకంగా రెండుసార్లు బెంగళూరు పిలిపించి అందుకు సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేశారు బెంగళూరు VHP కార్యాలయంలో.

తెలంగాణ ప్రాంతానికి చాలా కాలం పాటు సంఘటన మంత్రి లేకపోయినా అన్ని వారే చూసుకునేవారు. 2019 లో నాలుగు ప్రాంతాలు, మూడు రెవెన్యూ రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ) ప్రచార ప్రముఖుల సమావేశం నిర్వహించడానికి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ప్రచార ప్రముఖులను భాగ్యనగర్ కు పంపించారు. ఈ సమావేశానికి అఖిల భారత ప్రచార ప్రముఖ్ విజయశంకర్ తివారి గారు హాజరయ్యారు. ప్రతి విషయంలో నేను చేసే పనులకు ఆశీర్వాదం అందించడంతోపాటు ఆటంకాలు ఏవైనా ఉంటే అడ్డు తొలగించేవారు.

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ లోపల కర్ణాటక ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకురావాలని చెప్పేసి నేను ప్రతిపాదన పంపడంతో, వెంటనే వారు స్పందించారు. ఈ ఏడాది జనవరి నెలలో నన్ను ప్రత్యేకంగా బెంగళూరు పిలిపించి.. అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాకు అటాచ్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు.
గత సంవత్సరం జనవరిలో బెంగళూరు కార్యాలయానికి వెళ్లిన నన్ను "ఇక మీరు ఇదే చివరిసారి.. మరోసారి ఈ కార్యాలయానికి రావడానికి వీల్లేదు "అని అన్నారు సీరియస్ గా... కంగుతిన్న నేను.. ఎందుకు ? అని తిరిగి ప్రశ్నించాను.
" ఎందుకు అంటే .. ఈ కార్యాలయాన్ని కూల్చివేసి, కొత్త కార్యాలయం నిర్మాణం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడకి మన అధికారులు ఎవరూ రాలేరు" అని చమత్కరించారు.
అత్యంత చలాకిగా.. హుషారుగా ఉండే కేశవ్ హెగ్డే గారు బెంగళూరు వెళ్లిన సమయంలో రకరకాల హోటళ్లు తిప్పి రుచి చూపించేవారు. టిఫిన్ కు ఏ హోటల్ ప్రసిద్ధి.. భోజనానికి ఏ హోటల్ ప్రసిద్ధి అనే విషయం చెప్పి అన్ని హోటల్లో తినిపించేవారు.

బెంగళూరు, ఉడిపి, కర్ణాటకకు సంబంధించిన చాలామంది ప్రముఖులు భాగ్యనగర్ లో ఉద్యోగము, వ్యాపారం చేస్తున్నారు. వారందరినీ కలిసే క్రమంలో చాలా తోడ్పాటు గా ఉండేవారు. ఇటీవల రాయపూర్ లో జరిగిన విశ్వహిందూ పరిషత్ సమావేశాల సందర్భంగా కూడా అక్కడ జరిగే ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించారు. వారం క్రితం రాయపూర్ లో ఉండగా మాట్లాడినవే వారితో చివరి మాటలు. వారు చూపిన వాత్సల్యం.. కార్య దక్షత జీవితాంతం మరచిపోనివి. "సంఘ కార్యం చేయడంలో ఎన్ని అడ్డంకులు అయినా ఎదుర్కోవాలి.. విపక్షం నుంచే కాదు, స్వ పక్షం నుంచి కూడా ఎదుర్కొని సంఘం పనిచేయాలి" అని సూచించేవారు. ఇంతటి అటాచ్మెంట్ ఉన్న వారు.. లేరు అనే వార్త వినగానే కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళులో సుడులు తిరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలో నాతో అత్యంత ఆత్మీయంగా మెలుగుతూ సంఘం విషయంలో అనేక మెలుకువలు నేర్పిన మహనీయులు కేశవ్ హెగ్డే గారు.
ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణకు అనాధికారిక సంఘటన మంత్రిగా సేవలందించారు. కేశవరాజు గారు వెళ్లిన తర్వాత .. యాది రెడ్డి గారు వచ్చేంతవరకు కేశవ్ హెగ్డే గారు తెలంగాణ సంఘటన మంత్రిగా ప్రతి విషయంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలబడ్డారు. వారి సేవలు కర్ణాటక కే కాదు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి.
VHP తెలంగాణ కార్యాలయంలో ఉంటూ చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో వారితో పాల్గొన్నాను.

అత్యంత పవర్ ఫుల్ పోస్టులో ఉండి కూడా ఏ రోజు తన పవర్ ను ఉపయోగించింది లేదు. కార్యకర్తలను ఏ రోజు మనసు నొప్పించింది లేదు.. బాధ పెట్టిందీ లేదు. ఏ రోజు కూడా కటువుగా మాట్లాడింది లేదు.. మనసు బాధ పెట్టిందీ లేదు.

కలిసి నిర్వహించిన సమావేశాలు.. కలిసి ప్రయాణించిన జ్ఞాపకాలు పదిలంగా మిగిలాయి. ప్రతి మాటలో ప్రతి సందర్భంలో ప్రశాంతత తప్ప టెన్షన్ కనపడని తత్వం.

ప్రచార విషయానికి వస్తే.. బాలస్వామి ఆదర్శం అంటూ అందరికీ చెప్పేవాడు. నేను చాలా కాలంగా ప్రచార సహ ప్రముఖ్ గా ఉన్నానండి.. నా బాధ్యత మార్చండి అని చెప్పిన్నప్పుడల్లా.. ఓ నవ్వు నవ్వేవారు. సహ ప్రముఖ్ అయినా ప్రముఖ్ అయినా అదే పని అని భుజం తట్టేవారు. వారి జ్ఞాపకాలు.. వారితో కలిసి నడిచిన అనుభూతులు చిరస్మరణయం. మాటలకందని విషాదం.

జాతీయ స్థాయికి ఎదిగి విశ్వహిందూ పరిషత్ కు, హిందూ ధర్మానికి సేవ చేయాల్సిన ఉజ్వలమైన భవిష్యత్తు వారికి ఉండింది. కానీ అనుకోని రీతిలో అకస్మాత్తుగా గుండె పోటుతో కన్నుమూయడం మాటలకందని విషాదం. మొత్తంగా హిందూ సమాజానికి, కర్ణాటక విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు తీరని లోటు. వారు చెప్పిన మార్గంలో నడుస్తూ.. హిందూ కార్యం పెంచడమే వారికి నిజమైన నివాళి.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. శ్రీరాముడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. కేశవ్ మరణానికి కన్నీటి నివాళి అర్పిస్తున్నాను. కేశవ్ హెగ్డే ఆత్మకు సద్గతులు కలగాలని.. భగవంతుని కోరుకుంటూ..
..ఓం శాంతి..

భవదీయ

పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010

29/06/2023

గో అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా: డీజీపీ

@ పకడ్బందీగా పోలీసులు తనిఖీ చేయాలి : VHP

@ తూతూ మంత్రంగా వాహనాలు వదిలేయడం సరికాదు

@ గోరక్షకు ప్రయత్నం చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయం

@ బజరంగ్ దళ్ కార్యకర్తలను బైండోవర్ పేరుతో భయభ్రాంతులను సృష్టించడం చట్ట విరుద్ధం

@ మజిలీస్ పార్టీ ఆగడాలను కట్టడి చేయలేక పోతున్న రాష్ట్ర ప్రభుత్వం

@ ఓల్డ్ సిటీలో గొర్రెల మందల్లా.. నిలిపి ఉన్న ఆవుల మందలను గోశాలలకు తరలించాలి

@ డిజిపిని కలిసిన VHP రాష్ట్ర బృందం

రాష్ట్రంలో గో నిషేధ చట్టాలు ఏమాత్రం అమలు కావడం లేదని.. ఇష్టారాజ్యంగా వధించేందుకు గోవులను తరలిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ గారిని కలిసి విశ్వహిందూ పరిషత్ బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది. చట్ట విరుద్ధంగా గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గోవులను తరలిస్తున్న వారి వివరాలను పోలీసులకు తెలుపుతున్న బజరంగ్దళ్ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని.. చేయడం చట్ట విరుద్దమని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్ళింది. కబేలాలకు తరలిస్తున్న గోవుల విషయాలను పోలీసులకు తెలియజేస్తున్న కార్యకర్తలపై పోలీసులు బెదిరింపులకు దిగడం సమంజసం కాదని సూచించింది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసేలా కారణంగా బజరంగ్దళ్ కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కేసులు పెట్టి వేధింపులకు దిగడం పై స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల తో పాటు ముఖ్యంగా భాగ్యనగర్ శివారు ప్రాంతాలలో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ల వద్ద ఎంఐఎం నేతలు పోలీసులకు దంకీ ఇస్తున్నారని VHP నేతలు సూచించారు. చుట్టాలను ఉల్లంగించి పోలీసులపై దుర్భాషలాడుతున్న కూడా పట్టించుకోవడంలేదని వివరించారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను నిలిపివేయడంతో, పోలీసులను బెదిరించి వాటిని తరలించుకు వెళ్తున్నారని సూచించారు. ఇలాంటి వ్యవహారంలో ఎంఐఎం కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు నేరుగా భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు. పట్టుకున్న ఆవులను వెంటనే గోశాలలకు పంపించాలని.. చట్ట విరుద్ధంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. గోరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్న కూడా వాటిని అమలు చేయకపోవడం దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిపిని కలిసిన వారిలో విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి తోట భాను ప్రసాద్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర బజరంగ్ దళ్ ప్రముఖ్ శివ రాములు, న్యాయవిభాగం ప్రముఖ్ శివ ప్రసాద్ ఉన్నారు.

ఈ సందర్భంగా డిజిపి అంజని కుమార్ గారు మాట్లాడుతూ.. గోవుల అక్రమ రవాణా పై చట్టపరమైన చర్యలు తీసుకొనేలా అధికారులను ఆదేశిస్తానన్నారు. భాగ్యనగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలను పకడ్బందీగా గోరక్షణ చేయాలని సూచిస్తానని డిజిపి చెప్పారు.

భవదీయ

పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వ హిందూ పరిషత్
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010

Address

Hyderabad

Telephone

+919912975753

Website

Alerts

Be the first to know and let us send you an email when Pagudakula Balaswamy VHP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Pagudakula Balaswamy VHP:

Share