03/09/2026
*॥ శ్రీమేధా దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ॥*
🦚🦢🌻🙏🌻🦢🦚
॥ శ్రీ గురుభ్యో నమః ॥
*కర్పూర దీపికాలోలః*
*కర్పూర రసచర్చితః ।*
*అవ్యాజ కరుణామూర్తి*
*స్త్యాగరాజః క్షపాకరః ॥*
🌹మిత్రులకు,బృహస్పతివాసర శుభోదయం.🌹
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
*ఈ రోజు గురువారం.* ఇంకొక పేరు బృహస్పతి వారం. బ్రహస్పతి ఎవరో కాదు. దేవతలకు గురువు. నవ గ్రహాలలోను ఒక్కరి వున్నారు. ఈయన సప్త ఋషులలో ఒకరైన అంగీరసుని పుత్రుడు. ఈయన భార్య పేరు తార. ఈయన నాలుగు వేదాలను ఔపొసనచే నాలుగు కాలాలను ఎరిoగిన మహాకాలజ్ఞాని. అనేక క్రతువులు, యాగాలు చేసి దేవతలకే గురు స్థానాన్ని అలంకరించిన వారు. వశిష్టీశ్వరుని అనుగ్రహం పొంది, నవగ్రహాలలో ఒకరిగా అంతస్తును పొందిన వారు. అందువలననే నవగ్రహాల లొనే రాజ గ్రహంగా పేరెన్నిక కన్నారు. వీరికి 18 పేర్లు కలవు. వీరి స్వగృహం ధనస్సు మరియు మీనం. వీరి అనుగ్రహం వలన మేధావులు, జ్ఞాన పరులు కాగలరు.
జ్యోతిష్య శాస్త్రం అనుసారం వీరి దృష్టి 5, 7, 9 అయిన వాటి పై ఉండును.
గురు అనుగ్రహం పొందిన వారు జ్ఞానం, మేధా సంపత్తులతో తుల తూగ గలరు. అజ్ఞామనే చీకటిని పారద్రోల శక్తి సంపన్నులు గురువు.
ప్రతి శివాలయములో గురు భగవానుడు మనకు దర్శనము ఇవ్వగలడు.
ఒక మారు గురు భగవానుడు భూలోకము నకు విచ్చేసి, శ్రీ మహా విష్ణువును దర్శించి, తపమాచరించి ఆయన కరుణను సంపాదించు కున్న స్థలం "వైగై" నదీ తీరమునకల పుణ్య క్షేత్రం "గురు వీట్రిరుంధ గురై" అని పిలువబడి కాలక్రమములో అదే క్షేత్రం "గురువిత్తురై" గా మారి ఇప్పుడున్నది. ఇక్కడి ఆలయం, పాండ్య, పల్లవుల రాజులచే జీర్ణోద్ధరణ కావింపబడి ఈ నాడు శోభాయమానంగా వెలుగొందుచున్నది. గురు భగవానుని అనుగ్రహం కోరు వారు ఈ క్షేత్ర దర్శనం గావించు కొనుటచే అత్యుత్తమ ఫలితాలను పొందగలరని విశ్వాశం. గురువిరుందా గురై అనగా గురువు ఉండిన ప్రదేశముగా పురాణము లలో పిలువబడినది. ఇక్కడి మూల విరాట్టును "చిత్ర రథ వల్లభ పెరుమాన్" అని పిలుస్తారు. గురు భగవాన్ పుత్రుడు కచుడు ఒక మారు మృత సంజీవిని విద్య నభ్యసించుటకై, ఆసురలోకానికి పోయి చాలాకాలం తిరిగి రాలేక అవస్థలు పడ్డాడు. గురు భగవానుడు నారదునితో ఆలోచన సలుపగా, నారదుల వారు తమ జ్ఞాన దృష్టితో వీక్షించి, ఆసుర లోకంలో కచునికి జరిగిన ఆపదలు గురించి వివరించారు. అందులకు పరిహారం అడుగగా, నారదులు వారు గురువును భూలోకం వెళ్లి, వెదవతి నది( అనగా వైగై నది) తీరంలో వేంచేసి ఉన్న శ్రేమత్ నారాయణుని గురించి, తపము చేయండి, ఆయన మీ బాధలను తీర్చగలరు అని సలహా నిస్తారు. అదే విధముగా గురుభగవానుడు వైగై నదీ తీరంలో తపము ఆచరించారు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై కచుని కాపాడి, గురుభగవానుడి కోరిక తీరుస్తారు. *(ఈ కథ వేరుగా వివరిస్తాను)*
గురుభగవానుడికి దర్శనం ఇవ్వటానికై విష్ణు భగవానుడు ఎన్నో చిత్రాలు చిత్రించ బడిన రథంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనం ఇచ్చినందులకు గాను ఆయనకు *"చిత్ర రథ వల్లభ పెరుమాళ్"* అన్న నామo ఏర్పడినది. ఈ నామo తోనే గురు భాగవానుడు స్వామిని పిలిచినట్లు స్థల పురాణం చెబుతుంది. తనను కరుణించినట్లుగానే సకల భక్తులను కరుణించమని, ఇక్కడే వెలయుమని కోరగా విష్ణువు అక్కడే గుడిలో కొలువు అయినారు.
ఈ ఆలయము ముందు భాగమున గురుభగవాన్ వుంటారు. విష్ణువు తూర్పు వైపు చూడగా, ఆయన చూస్తూ పడమర వైపుకు తిరిగి వుంటారు గురు భగవానుడు. ప్రక్కనే చక్రత్తాళ్వార్ వుంటారు. ఇక్కడి గురుభగవానుడు యోగ గురువులా వుంటారు. ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ శెన్బగవళ్లి. ఈ ఆలయం మధురై జిల్లాలో గురువిత్తురై గ్రామంలో కలదు.
🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
*ఇది తమిళం పురాణ గ్రoధo లో నుండి సేకరణ*
****************************